22, జూన్ 2025, ఆదివారం

శృంగార భాగవతము*

 *శృంగార భాగవతము*


          "లలితస్కంధము కృష్ణమూలము" అనే భాగవత పద్యాన్ని పోతనగారు శ్లేషలో రచించారు. ఆ విషయము చర్చించే

ముందు ఈ పద్యము లాంటి పూర్వరచనలను కొన్నిటిని పరిశీ లింతము...

శ్లో"

ధృతిప్రవాళః, ప్రసహాగ్ర్య పుష్ప,  

స్తపోబల,శ్శౌర్య నిబద్ధమూలః రణేమహాన్ రాక్షసరాజ వృక్ష,

స్సమ్మర్థితో రాఘవమారుతేన|| -వాల్మీకి రామాయణము.

ఇది యుద్ధకాండలో రావణుడనే రాక్షసవృక్షాన్ని రాఘవుడనే

మారుతము సమ్మర్దించడం గురించి చెప్పబడిన శ్లోకము.

         ఈ సందర్భాన హుళక్కిభాస్కరకవి ఇలా చెప్పాడు..


సారాస్కంధము, శౌర్యమూలము, విరాజద్బాహుశాఖంబు, దు

ర్వారోదార ధృతి ప్రవాళ,మతిదీవ్యత్కోప పుష్పంబు, బా

పారంభైక ఫలంబునై పరగు దైత్యాధీశ వృక్షంబు,దా

నీ రూపంబున రామహస్తి విఱిచెన్ హేలాసముల్లాసియై. -భాస్కరరామాయణము.


      వీటి సంగతి అలా స్మరణలోఉంచుకుందాము. నన్నయ భట్టు భారతాన్ని పారిజాత తరువుతో పోలుస్తూ ఇలా చెప్పాడు-

అమితాఖ్యానకశాఖలం బొలిచి వేదార్థామలచ్ఛాయ మై

సుమహావర్గచతుష్కపుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునో

త్తమ నానాగుణకీర్తనార్థ ఫలమై ద్వైపాయనోద్యాన జా

త మహాభారత పారిజాత మమరున్ ధాత్రీసురప్రార్థ్యమై.

                                           -భారత,ఆదిపర్వ,౧.౬౬

పైన చెప్పినవి వృక్షాలతో పోల్చి చెప్పిన వర్ణనలే.

బమ్మెరవారుకూడా భాగవతాన్ని కల్పవృక్షంతో పోలుస్తూ ఈ

పద్యము చెప్పారు- లలితస్కంధము కృష్ణమూలము శుకా లాపాభిరామంబు మం జులతాశోభితమున్ సువర్ణ సుమన స్సుజ్ఞేయమున్ సుందరో

జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబు నై వెలయున్భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్ద్విజ శ్రేయమై -భాగవతం ౧.౨౦

        పై పద్యానికి పూర్వవ్యాఖ్యాతలు శ్లేషార్థాలు చెప్పారు.

కల్పవృక్షాన్ని భాగవతంతో పోల్చి చెప్పిన పద్యం ఇది. దీనికి

లలితాత్రిపురసుందరీ పరంగాకూడా అర్థం ఉందని విన్నాను.

ఈ పద్యానికి శృంగారపరమైన అర్థం చెప్పినవారూ ఉన్నారు.

  కల్పవృక్షం కామితఫలాన్నిస్తుంది. భాగవతకల్ప వృక్షము కోరిన ఫలరసాలను అందిస్తుంది.

  భావుకుడు శృంగార రస ఫలాన్ని భావిస్తే దాన్నే ప్రసాదిస్తుంది బమ్మెరవారి భాగవతాఖ్య కల్పతరువు.

            శృంగారపరంగా పై పద్యాన్ని ఇలా సమన్వయించవచ్చు. (ఈ సమన్వయానికి డా.యం.భానుప్రకారావు గారి సిద్ధాంత గ్రంథము ఆధారము)..

భాగవతాఖ్య కల్పతరువు= భాగవతమనే కల్పవృక్షము,

లలితస్కంధము= కామోత్కంఠితలైన గోపికాది స్త్రీజన కళా స్థానాలుగ పరిగణించబడే అంస భాగాలుకలదీ,

కృష్ణమూలము= ఆ గోపికలకు శ్రీకృష్ణుడు ఆలంబనంగాకలదీ,

శుకాలాపాభిరామంబు= ఉద్దీపన విభావాలయిన శుకపికాల కలస్వనాలతో అందగించినదీ,

మంజులతా శోభితమున్= నాయికా సదృశమైన పూలతీవలతో సుమనోజ్ఞంగా విరాజిల్లుతున్నదీ,

సువర్ణ సుమనః= మంచి రంగు కలిగినవీ, మన్మథబాణాల వంటివీ అయిన పూలు కలిగినదీ,

సుజ్ఞేయమున్= పై ఆలంబన ఉద్దీపనాలతో ఆస్వాదించతగినదీ,

సుందరోజ్జ్వలవృత్తంబు= ఆదరణీయమైన,

శృంగారరస నిర్భరమైన కథ కలిగినదీ,

మహిఫలంబు= అఖండ రసానందమే ఫలముగా కలిగినదీ,

విమలవ్యాసాలవాలంబునై= స్వచ్ఛమైన శృంగార రస భేదాలకు నిలయమైనదై,  

సద్ద్విజశ్రేయమై= సహృదయులకు మేలు కలిగించేదిగా,

ఉర్విన్=జగత్తులో/భూమిపై

వెలయున్= విరాజిల్లుతుంది.


బమ్మెరవారు భాగవతాన్ని పరిచయం చేసిన పద్యములోనే హృద్యంగా మార్మికంగా శృంగార రసాన్ని సూచించారు.


            బమ్మెరపోతనవారికి చందన మందార వందనాలు

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి.)

.

యవీయానాత్మనః పుత్రః

శిష్యశ్చాపి గుణోదితః 

పుత్రవత్తే త్రయశ్చిన్త్యా 

ధర్మశ్చేదత్రకారణమ్

(వా.రా. 4.18.14)


*అర్థం:*

తమ్ముడు, కుమారుడు, సద్గుణవంతుడైన శిష్యుడు - వీరు ముగ్గురు కూడా పుత్రులే అని భావించాలి. ఇది ధర్మం.


'శ్రీ గాయత్రీ అష్టకం' స్తోత్రం తో శుభోదయం.

*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష* 

ధర్మో రక్షతి రక్షితః

జ్ఞానప్రసూనాలు

 *🌄 జ్ఞానప్రసూనాలు🔥*


*17/06/2025*




1.పొందినవాడికి చెప్పే అవసరం లేదు. పొందనివాడికి విన్నా ప్రయోజనం లేదు.


2.శరణాగతి బుద్ధిని కూడా భగవంతుడు ప్రసాదించవల్సిందే. వేణే మార్గం లేదు.


3.తాను ఈశ్వరుడు అయ్యి కూడా

ఈశ్వరుణ్ణి కానేమో అనుకుని ఈశ్వరుడు కావడానికి తాను చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన అయ్యింది.


4.భక్తికి, భయానికి తేడా ఏమంటే-'నీ ఇష్టం' అని సంతకం పెట్టేసి స్థిమితంగా ఉండడమే శరణాగతి (భక్తి) సంతకం పెట్టకపోతే అది భయం.


5.మనం తినే ఆహార పదార్థాలలో మేలైన ఆహార పదార్ధంగా దేవుణ్ణి భోంచేయాలని చూస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే 'నవ విధ భక్తులు' ఏర్పడ్డారు. అట్లా కాకుండా తానే ఓ ఆహార పదార్ధంగా భగవంతుని ముందు నిలబడేవాడే నిజమైన భక్తుడు.


6.ప్రియురాలిగా ఉన్నప్పుడే కవిత్వాలుగాని పెళ్లామయ్యాక ఇక కవిత్వాలు ఉండవండి. దేవుణ్ణి పొందే వఱకే కీర్తనలు, స్తోత్రాలుగాని దేవుణ్ణి పొందేక ఇక మాటలు ఉండవండి.


7.ప్రసాదం అంటే -మొత్తం తానుంచుకుని కొద్దిగా దేవునికి ఇవ్వడం కాదు. మొత్తం దేవునికి ఇచ్చివేసి అందులో కొద్దిగా తాను తీసుకోవడం.


8.నేను ప్రపంచంలోకి వచ్చాను, ఉంటాను, తిరిగి ఈ ప్రపంచం నుండి నిష్క్రమిస్తాను" అని ఉన్న అనుభవవంలో నుంచి "నాలో ఈ ప్రపంచం పుట్టింది, ఉంటుంది,

తిరిగి నాలో కలిసిపోతుంది" అన్న అనుభవంలోకి మారటమే ఆధ్యాత్మిక ముఖ్య ప్రయోజనం.


9.తన శరీరంలో తన ప్రమేయం లేకుండా శ్వాసాది క్రియలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. కేవలం తాను 'ఉంటాడు'. అలానే దేవునిలో కూడా ఆయన ప్రమేయం లేకుండా సృష్టి స్థితి లయాలనేవి నిరంతరం జరుగుతూ ఉంటాయి. కేవలం తాను 'ఉంటాడు'. జీవుడికైనా దేవుడికైనా 'ఉండటం' అనేదే స్వరూపం. దేవుడు కర్తగా అనిపించడమే గాని, కర్త కాడు. అయస్కాంతం యొక్క సన్నిథి మాత్రము చేతనే ఇనుప ముక్కల్లో కదలిక కలిగినట్లు దేవుని సమక్షంలో జగత్తు చైతన్యవంతమై ప్రవర్తిల్లుతోంది.


10.నిద్ర అనేది బ్లాక్ హోల్ లాంటింది. తనతో సహా సర్వ ప్రపంచం అందులోకి వెళ్లి లయమై పోతోంది. తిరిగి మేలుకొన్నాక కనబడే ప్రపంచం, నిద్రలోకి వెళ్లేముందు ఉన్న ప్రపంచం మాత్రం కాదు. నిద్రపోయి, లేచిన ప్రతిసారీ నీవు చూచేది మరో క్రొత్త ప్రపంచాన్నే.


11.వ్యక్తిని తూస్తే ఎంత తూకమో వ్యక్తి + జగత్తు కూడా అంతే తూకం. వ్యక్తి + జగత్తు + ఈశ్వరుడు కూడా అంతే తూకం. ఈమూడు లేకపోయినా కూడా ఉండేది అంతే తూకం. ఈతూకమే దైవం

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి) 

జ్యేష్ఠో భ్రాతా పితా చైవ 

యశ్చ విద్యాం ప్రయచ్ఛతి

త్రయస్తే పితరో జ్ఞేయా 

ధర్మ్యే చ పథి వర్తినః


(వా.రా.4.18.13)

*అర్థం:*

అన్నగారు, జన్మనిచ్చిన తండ్రి, విద్యనిచ్చిన గురువు, ఈ ముగ్గురు తండ్రులే అని ధర్మ మార్గంలో నడిచే ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి.


శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం తో శుభోదయం 


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః

లోభం వలన

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝 *లోభాత్క్రోధః ప్రభవతి*

              *లోభాత్కామః ప్రవర్తతేl*

              *లోభాన్మోహశ్చ మాయా చ*

              *మానః స్తంభః పరాసుతాll*


         *_మహాభారతం - శాంతి పర్వమ్_*


తా𝕝𝕝 *లోభం వలన కోపం కలుగుతుంది. లోభం వల్లనే కామం ఏర్పడుతుంది. ఈ లోభం వల్లనే మోహం, మాయ, అభిమానం, తీవ్రత, పరాధీనత మొదలైన దోషాలు సంభవిస్తాయి.*

                

 ✍️VKS ©️ MSV🙏

భద్రపరుచుకోండి

 *ఇవి కాపీ చేస్కుని భద్రపరుచుకోండి .. మీకు కావాల్సిన వాటిపైన క్లిక్ చేస్తే సమాచారం క్షణాల్లో ఓపెన్ అవుతుంది* 

☎️దేవాలయాలలో వసతి సౌకర్యం కోసం : https://goo.gl/gDaGJ4

🕉️ఎ పి లో జిల్లాల వారి దేవాలయాల వివరాలు : https://goo.gl/Qzhzis

🕉️రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం : https://goo.gl/VnNaj5

🕉️జ్యోతిర్లింగాల క్షేత్రాల వివరాలు : https://goo.gl/X9NBUe

🕉️శక్తిపీఠాలు సమాచారం : https://goo.gl/LtvStS

🕉️గ్రూప్ టెంపుల్స్ : https://goo.gl/N9xD8M

🕉️ఆరుపడైవీడు క్షేత్రాల కోసం : https://goo.gl/HqGR8P

🕉️పంచారామ క్షేత్రాల వివరాలు : https://goo.gl/ygX5hW

🕉️పంచభూత క్షేత్రాల వివరాలు : https://goo.gl/pqtgxj

🕉️తిరుమల గురించి : https://goo.gl/mb2DGD

🕉️శ్రీకాళహస్తి గురించి : https://goo.gl/UJbxmF

🕉️కాశి గురించి : https://goo.gl/DZzKa1

🕉️రామేశ్వరం గురించి : https://goo.gl/yyH424

🕉️అరుణాచలం గురించి : https://goo.gl/eFbKNE

🕉️మదురై గురించి : https://goo.gl/1Ntthd

🕉️శ్రీశైలం గురించి : https://goo.gl/ZUfFHo

📀కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి : https://goo.gl/A5UU7v

🕉️ప్రసిద్ధ శైవ క్షేత్రాలు : https://goo.gl/mn2K3y

🕉️మహాభారతం పుస్తకాలూ : https://goo.gl/v1XuqV

🕉️భాగవతం పుస్తకాలూ : https://goo.gl/9fMcDp

🕉️టెంపుల్ క్విజ్ ఆడండి : https://goo.gl/nrhsBK


➡️అందరికి షేర్ చేయండి 🙏

కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది..*

 *నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది..*

Namasthe కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.కృష్ణుడిరాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. 


ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగామారి కృష్ణుడిని నిలదీస్తాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి వందమంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.


. "ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించినవాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్చిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్చిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని అంటాడు. 


ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి "ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని శెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు. 


మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడు అంతరార్థం. 

*- మహాభారతం*

విశ్వేశ్వరా

 శు భో ద యం 🙏


విశ్వేశ్వరా!!


శా.

నీ విన్నాణము చిత్రమే, మకుటరత్నీభూతజైవాతృకా!/

గ్రైవేయీకృతకాద్రవేయ! గళరుద్రాక్షీభవద్బాడబా!/

సేవాస్వీకృత భూత రాక్షస పిశాచీప్రేత! నేత్ర ప్రభా/

శ్రీవిన్యస్త కృశాను! పార్వతమృగాక్షీదార! విశ్వేశ్వరా!

23

     -కవిసామ్రాట్. విశ్వనాధసత్యనారాయణ.


        మనం నేడు విశ్వనాధ వారి విశ్వేశ్వర శతకంలోని ఈపద్యం పరిశీలిద్దాం

       చిత్రవిచిత్రమైన ఊహలకు వ్యంగ్య

మర్యాదలకు ఆటపట్టైన శతక మిది.

విశ్వప్రతిభకు ముకురాయమానం.

          

               "కిరీటంలో తురాయిగా చంద్రుని అలంకరించుకోవటం.కంఠ హారంగా వాసుకిని అలంకరించుకోవటం,

మెడలో రుద్రాక్షగా గరళాన్ని నిలుపుకోవటం, సేవక సముదాయంగా

భూతప్రేత పిశాచములను నియమించటం, తృతీయ నేత్రంగా ఫాలభాగాన అగ్నినిధరించటం, కోయపిల్ల పార్వతిని భార్యగా స్వీకరించటం, ఏవిటయ్యా?ఈతిక్కపనులు?

        అంటూ హేళన జోడించి వ్యంగ్యంగా విశ్వరుని మహిమలను నుతించటం ,విశ్వనాధకుదక్క ,మరెవరికి సాధ్యం?

    మహాకవీ! నీకూ, నీప్రతిభకూ,

శత సహస్ర వందనాలు!!


                       స్వస్తి !!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఆరోగ్య చిట్కాలు

 *సంస్కృతంలో ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి*


*


*1. అజీర్ణే భోజనం విషం.*


గతంలో తీసుకున్న భోజనం జీర్ణం కాకపోతే.. రాత్రి భోజనం తీసుకోవడం విషం తీసుకున్నట్లు అవుతుంది. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణమైందని సూచించే ఒక సంకేతం


*2. అర్ధరోగహరీ నిద్రా.*


సరైన నిద్ర సగం వ్యాధులను నయం చేస్తుంది..


*3 ముద్గదాలి గదవ్యాలి.*


అన్ని పప్పుధాన్యాలలో, పచ్చ పెసర్లు ఉత్తమమైనవి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇతర పప్పుధాన్యాలు అన్నీ ఒకటి లేదా మరొక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. 


*4. భగ్నాస్థి-సంధానకరో లశునః.*

 వెల్లుల్లి విరిగిన ఎముకలను కూడా కలుపుతుంది.. 


 *5. అతి సర్వత్ర వర్జయేత్.*

 రుచిగా ఉన్నంత మాత్రాన ఏదైనా అతిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా ఉండండి. 


 *6. నాస్తి మూలమనౌషధం.*

 శరీరానికి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు లేవు. 


 *7. న వైద్యః ప్రభురాయుషః ।*

 ఏ వైద్యుడూ దీర్ఘాయువు ఇవ్వలేడు. (వైద్యులకు పరిమితులు ఉన్నాయి.) 


 *8. చింతా వ్యాధి ప్రకాశాయ ।*

 ఆందోళన అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.. 


 *9. వ్యామశ్చ శనైః శనైః.*

 ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి.

 (వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు.) 


 *10. అజవత్ చర్వణం కుర్యాత్.*

 మీ ఆహారాన్ని మేక లాగా నిదానంగా నమలండి.

 (ఎప్పుడూ తొందరపడి ఆహారాన్ని మింగకండి. 

 లాలాజలం జీర్ణక్రియలో మొదట సహాయపడుతుంది.) 


 *11. స్నానం నామం మనఃప్రసాధనకరందుః స్వప్న-విధ్వంసనం ।*

  స్నానం కుంగుబాటు(డిప్రెషన్‌) ను దూరం చేస్తుంది.

  చెడు కలలను దూరం చేస్తుంది.. 


 *12. న స్నానమాచరేద్ భుక్త్వా.*

 ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయ కూడదు. (జీర్ణక్రియ ప్రభావితమవుతుంది). 


 *13. నాస్తి మేఘసమం తోయం.*

 స్వచ్ఛతలో వర్షపు నీటికి ఏ నీరు సరిపోదు.. 


 *14. అజీర్ణే భేషజం వారి.*

 అజీర్ణం ఉన్నప్పుడు సాధారణ నీటిని తీసుకోవడం వల్ల ఔషధంలా పనిచేస్తుంది.


 *15. సర్వత్ర నూతనం షష్టం, సేవకాన్నే పురాతనే ।*

 ఎప్పుడూ తాజాగా ఉండేవాటికే ప్రాధాన్యత ఇవ్వండి.. అయితే అన్నం మరియు సేవకుడు మాత్రం పెద్ద వయస్సులో ఉన్నప్పుడు మాత్రమే మంచివి.


 *16. నిత్యం సర్వ రస భక్ష్యః ।।*

 మొత్తం షడ్రుచులు (ఆరు) రుచులు ఉన్న ఆహారాన్ని తీసుకోండి. (అనగా: ఉప్పు, తీపి, చేదు, పులుపు, వగరు (ఆస్ట్రింజెంట్) మరియు ఘాటు (పంజెంట్). 


 *17. జఠరం పూరయేదర్ధమన్నాత్, భాగం జలేన చ ।*

 *వాయోః సంచరణార్థాయ చతర్థమవశేషయేత్ ।।*

 మీ కడుపులో సగభాగాన్ని ఘనపదార్థాలతో నింపండి, పావు వంతు నీరు మరియు మిగిలిన దానిని ఖాళీగా ఉంచండి.


 *18. భుక్త్వా శతపథం గచ్ఛేత్ యదిచ్ఛేత్ చిరజీవితమ్ ।*

 ఆహారం తీసుకున్న తర్వాత ఎప్పుడూ ఖాళీగా కూర్చోవద్దు. కనీసం అరగంట పాటు నడవండి. 


 *19. క్షుత్సాధుతాం జనయతి ।*

 ఆకలి ఆహారం యొక్క రుచిని పెంచుతుంది..

 ఇంకా చెప్పాలంటే, ఆకలిగా ఉన్నప్పుడే తినండి.. 


 *20. చింతా జరా నామం మనుష్యాణాం* 

 ఆందోళన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.. 


 *21. శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్ ।*

 ఆహారం కోసం సమయం వచ్చినప్పుడు, 100 పనులను కూడా పక్కన పెట్టండి (ఫోనుతో సహా). 


 *22. సర్వధర్మేషు మధ్యమామ్.*

 ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి. ఏదైనా విషయంలో అతిగా వెళ్లడం మానుకోండి


 *ఇవి మన ఋషులచే సంస్కృతంలో చెప్పబడిన సువర్ణ జ్ఞాన పదాలు.*

వర పూజ

 శు భో ద యం 🙏


వర పూజ

----------------

                   మనం యీరోజు ఆదికవి నన్నయ భట్టారకుని పద్యం చవిచూద్దాం!


             చం: " అతి రుచిరాగతుండయిన యాతనికిన్ హృదయ ప్రమోద మా


                       తతముగ నవ్వనంబున లతాలలనల్ మృదులాని లాప వ


                       ర్జిత కుసుమాక్షతా వళులు సేసలు పెట్టిన యట్టులైరి సం


                       పత దళినీ నినాద మృదుభాషల దీవెన లొప్పనిచ్చుచున్;


                      ఆం- భారతము- దుష్యంతోపాఖ్యానము- నన్నయ్య; 


                          ఆదికవి నన్నయ భారతం ఆదిపర్వంలో దుష్యంతో పాఖ్యానంలో ఈపద్యం ద్వారా దుష్యంతునకు వరపూజ 

నిర్వహింప బూనుకోవటం ఆచ్చెరువును కలిగిస్తుంది. 


                    నన్నయ కవితా గుణాలు మూడు . అవి అక్షర రమ్యత ,ప్రసన్నకథ , లోనారయుట,లు యీమూడు కవితా గుణాలలో

చివరిదియైన లోనారయుట ద్వారా మనమీ వరపూజను తిలకించాలి. దానికి మనలోచనాలు పనికిరావు. సులోచనాలున్నా దండగే!

ఆలోచనా లోచనాలు కావాలి. మరి ఉన్నాయా? యెందుకుండవు ? మనస్సు నటుత్రిప్పి మనోలోచనంతో తిలకించుదాం. ఇంక ప్రకృతం!


కఠిన పదాలకు అర్ధం:- అతి-మిక్కిలి; రుచిరాగతుడు- అందంగా వచ్చినవాడు( చూడ ముచ్చటయైన వాడు) హృదయ ప్రమోదము-హృదయానందము; ఆతతముగ- విరివిగ; లతాలలనల్- ఆడపిల్లలవంటి తీగెలు; మృదులానిల--చిరుగాలి;అపవర్జితము-రాల్చుట; కుసుమాక్షతావళి-పూవులనే అక్షతలు; సేసలు-దీవెనలు; అళినీ నినాదము- తుమ్మెదలధ్వని; మృదుభాషలన్-మెత్తనిమాటలతో;


భావము; పెళ్ళికొడుకులా అందంగా ఆకర్షణీయంగా వచ్చుచున్న దుష్యంతుని తీగెలనే వనితలు స్వాగతిస్తున్నాయి.చిరుగాలులతో పూలురాల్చి, అక్షతలుజల్లి దీవిస్తున్నాయి. తుమ్మెదల ఝంకారాలతో మంగళప్రదమైన పాటలు పాడుతూ తీయనిమాటలతో స్వాగతం పలుకు తున్నాయి. ఇదీభావం!


                   విశేషములు:- దుష్యంతుడు వేటకు వచ్చాడు వేటాడి అలసిపోయాడు.కొంచెం సేదతీర్చుకుందామని కణ్వాశ్రమానికి వస్తున్నాడు. మహా రాజుగదా అందంగా అలంకరించు కొన్నాడు.వయసులో ఉన్నాడు. నిత్య పెళ్ళికొడుకులా ఉన్నడన్నమాట!

రాజానాం బహువల్లభాః అన్నారు. కాబట్టి యెప్పుడంటే అప్పుడే పెళ్ళికి సిధ్ధం!


                       కణ్వాశ్రమంలో ప్రకృతి చాలా హృదయంగమంగా ఉంది.లతలుగాలికి ఊగుతున్నాయి.పూలురాలుతున్నాయి. తుమ్మెదలు ఝంమ్ఝమ్మని గానం చేస్తున్నాయి. ఈమనోహరమైన ప్రకృతిని కవి వరపూజ గా వ్యంగ్యంగా తీర్చిదిద్దాడు. ముందుముందు శకుంతల దుష్యంతులకు వివాహం కానున్నది.పనిలోపనిగా వరపూజ జరిపించేయాలను కున్నాడు. ఒక రూపకాలం కారం సాయంతో ఆకాస్తా జరిపించేశాడు.


                           లతలు గాలికి ఊగుతోంటే అందమైన మగువలు చేతులూపుతూ స్వాగతిస్తూన్నట్లున్నవట! పూలురాలుతుంటే అది సేసలు జల్లుతున్నట్లున్నదట. మరి మంగళకరమైన పాటలో?తుమ్మెద గీతాలే! అవే మధురమైన స్వాగత వచనాలు!ఇంతకీ పెళ్ళికొడుకు? యింకెవ్వరు అందంగా పెళ్ళికొడుకులాఉన్నదుష్యంతుడే! 


                              పెళ్ళి కూతురు శకుంతల సిధ్ధం గానే ఉందిగదా! సరిపోయింది;


ఇదే దర్శనం -ప్రదర్శనం.


                                      ఇదీ నన్నయ గారి లోనారయుట!


                                                          స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

తొలకరి సందడి*

 *తొలకరి సందడి*


తొలకరి సందడించె నిక తొయ్యలి! పూనుము విత్తనంబులన్


తిలలును జొన్నలున్ తమిద దేశిరకంబులు నాటగా వలెన్


వలచిన యట్లు మేఘములు వర్షము నిచ్చుచు నున్న వేళలో 


పలుకరె స్వాగతంబులను పల్లెను రైతులు సంభ్రమంబుతో.


అల్వాల లక్ష్మణ మూర్తి.

కాలం విలువ*

 *కాలం విలువ*


సమయాన్ని లెక్కించాల్సింది గడియారంతో కాదు, అనుభూతితో. సంవత్సరాలు మారాల్సింది అభివృద్ధితో. ఒక బ్యాంకులో ఏరోజుకారోజు ఉదయమే మన ఖాతాలో 86,400 రూపాయలు జమ అవుతాయను కుందాం. మొత్తం ఆరోజే ఖర్చు పెట్టాలి. మిగిలింది ఆ రాత్రికల్లా రద్దయిపోతుంది. అప్పుడేం చేస్తాం. 


డబ్బు విలువ తెలుసు కనుక పైసా మిగల్చకుండా వాడేసుకుంటాం. *అలాంటి బ్యాంకే అందరికీ ఉంది. దాని పేరు కాలం*. ప్రతి రోజూ 86,400 సెకండ్లు జమ అవుతాయి. వాడుకున్నది వాడుకోగా మిగిలింది రాత్రికల్లా చేజారిపోయినట్లే. ఆ ఖాతాని ఎవరికి వారే నిర్వహించుకోవాలి. 


కాలం అందరికీ సమంగానే ఉంటుంది. టైమ్ లేదు అని చెప్పారంటే నిజంగా సమయం లేదని కాదు, ఆ పని చేయాలనే ఉద్దేశం ఉందా.... లేదా అన్నది ముఖ్యం.


కదిలిపోయే ప్రతి క్షణం కొన్ని జ్ఞాపకాలను, విలువలను, శక్తులను మన పేరున కూడబెడుతూంటుంది. ఆ నిధి చివర్లో మన కళ్లముందు కదలాడు తుంది. జీవితాన్ని ఎలా జీవించామో చెబుతుంది. అప్పుడు అయ్యో అనుకోకుండా తృప్తిగా ఉండాలంటే మన ఖాతాని మనం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. 


*ఒక రచయితో, చిత్రకారుడో తాను చేసిన పనిని తరచి చూసుకుంటూ*, చేయబోయేదాన్ని సరిచేసుకుంటూ ఎలా ముందుకెళ్తాడో అలా వెళ్లాలి. 


అప్పుడే నిరుటి కన్నా ఈ ఏడాది మరింత మెరుగవుతుంది. 'కాలం ఎగిరి పోతుందన్నది చెడ్డవార్త. దానిని నడిపే సారథివి నువ్వే అన్నది శుభవార్త' అంటారు ఒక అమెరికన్ రచయిత. అశుభం శుభం ఎప్పుడవుతుందంటే కొత్త సంవత్సరాన్ని వేడుకగా మాత్రమే కాక ఒక గొప్ప అవకాశంగా చూసినప్పుడు. ఈరోజు ఒక మంచి పనికి శ్రీకారం చుడితే, 365 రోజుల తరవాత ఒక మంచి ముగింపునూ సృష్టించగలం. ఒక కొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, కెరీర్లో ఒక లక్ష్యాన్ని చేరుకోవచ్చు, అర్థవంతమైన బంధాలను కలుపుకోవచ్చు. 


కాలాన్ని కొలవడానికే గడియారం కానీ జీవితం సాగేది హృదయాన్ని అనుసరించే. ఏం సాధించాలని నిర్ణయించుకుంటారో దానికి తగ్గట్టుగా కాలాన్ని ఉపయోగించుకుంటారు జ్ఞానులు.


కాలం కష్టసుఖాలను మోసుకొస్తుందనుకుంటాం. వాస్తవానికి సమస్య కాలంతో ముడి పడిలేదు. ద్వంద్వాలకు నిలయమైన ఈ ప్రపంచంలో ఉంది. ఉష్ణం శీతలం, సుఖం దుఃఖం, జయం అపజయం. ఇలాంటివన్నీ ఉన్న ప్రపంచమిది. కాబట్టి ఆనందాన్ని అన్వేషించడం ఆపి, ఆధ్యాత్మిక సంతృప్తిని వెతుక్కోమని, అదే శాశ్వతమని, దానికి భక్తి యోగం మార్గమని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. 


మనిషిని ఆలోచన నిలబెట్టగలదు, పడేయనూగలదు. భవిష్యత్తు దాని శక్తి మీదే ఆధారపడి ఉంది. విలువైన కాలాన్ని సద్వినియోగపరిచేది ఆ ఆలోచనే. సహనం, సమయాలను మించిన యోధులు లేరు అని అంటారు.


  *సేకరణ*

మల్లాది_రామకృష్ణ* *శాస్త్రిగారు*

 *మల్లాది_రామకృష్ణ* *శాస్త్రిగారు* 

🙏

(జూన్ 16, 1905 - సెప్టెంబర్ 12,1965)

-----------------------------------------

తను తెలుగు వాడిగా — తెలుగు వ్రాయగలవాడిగా — పుట్టడం మన అదృష్టం అన్న గర్వంతో మనసు పులకరిస్తుంది ఆయన పేరు వింటే.


మనం తెలుగు వాళ్ళుగా — అంతో ఇంతో తెలుగు చదవగలిగిన వాళ్ళుగా — పుట్టడం మన అదృష్టం అన్న స్పృహతో వళ్ళు గగుర్పొడుస్తుంది ఆయన రచనలు చదివితే.


పానగల్ పార్కులోని పేరు లేని చెట్టును తక్షశిల, నలందా, వారణాశి విశ్వ విద్యాలయాలంత “ఎత్తు”కు పెంచిన కులపతి — పుంభావ సరస్వతి — ఆయన.


రూపాయ చేసే సెకెండు హ్యాండు పుస్తకాన్ని “విలువ” తెలిసి రెండున్నర పెట్టి కొనుకున్న జోహారి — మేలిమి వజ్రాల బేహారి —ఆయన.


తన రచనలు వేరొకరి పేరుతో చెలామణీ అయినా తనకు అందాల్సిన శ్రీ యశః కీర్తులు వేరొకరి పరమయినా చిరునవ్వే సమాధానంగా కూర్చున్న గుప్తదానపథ సంచారవర్తి — సాక్షాత్ శిబి చక్రవర్తి — ఆయన.


సంగీతం కాదు — స్వరం కాదు — గాయనీ గాయకుల కంఠస్వర ప్రతిభా పాటవం అంతకన్నా కాదు — కేవలం — అదునూ పదునూ ఎరిగి ఆయన వేసిన అందమైన మల్లె పూరేకులవంటి మాటల తేటలు చాలు — సినిమా పాటలో మాధుర్యం ఊటలై ఉప్పొంగటానికి.


తెలుగు చిత్ర గీతాలకు సాహితీ పరిమళాలద్దిన రచయిత

తెలుగు సాహితీ లోకంలో కథాసుదలు చిలికన కవితామూర్తి

అచ్చ తెలుగు... జాను తెలుగు... పదహారణాల స్వచ్చమైన తెలుగుకి చిరునామా

ఆ మహానుభావుడు, మరెవరో కాదు…

చిగురాకు పదాలతో —

చలనచిత్ర సాహితీ భారతి పాదాలకు —

చిరకాలం నిల్చిపోయే —చిరువేకువ సిరివెల్గుల పారాణి పూసిన —


వచన రచనాశిల్ప మేస్త్రి - “మేష్టారు” మల్లాది రామకృష్ణ శాస్త్రి!!


భాషా పరశేషభోగి


సంస్కృతాంధ్ర అంగ్లాలతో పాటు…

— తమిళ కన్నడ మలయాళముల వంటి ప్రాంతీయ భాషలూ…

— అస్సామీ, బెంగాలీ, ఒరియా, మరాఠీ, గూజరాతీ, తుళు, ఉర్దూల వంటి జాతీయ భాషలూ…

— అరబ్బీ, పారశీ, జర్మన్, ఇటాలియన్, ఫ్రెంచి, చైనీసు, గ్రీకు, లాటిను, జాపనీసు వంటి పాశ్చాత్య విదేశీ భాషలు…ఇవ్వన్నీ వ్యాకరణాలంకార సహితంగా ఔపోశన పట్టిన అగస్త్యులవారు శాస్త్రి గారు.


తెలుగు పలుకుబడులను రచనలలో పొదిగిన మల్లాది రామకృష్ణశాస్త్రి....తెలుగు సాహితీ లోకంలో ఆయనెప్పుడూ చిరంజీవి......


మాటలతో గమ్మత్తులు చేస్తూ, చమత్కారాలు, సామెతలు, నానుడిలు ఉపయోగిస్తూ సినిమాలకు చక్కని మాటలు, పాటలు కూర్చారు మల్లాది రామకృష్ణ శాస్త్రి. కొన్ని పాటలలో ఆయన పలికించిన భావాలు వల్ల భావకవి అనీ అనిపించుకుంటారు. సినిమాలో, మాటలు, పాటలు రాయడానికి ముందు, పలు పత్రికల్లో వ్యాసాలు, కథలు రాశారు. నవలలు, నాటకాలు రాసి పేరు తెచ్చుకున్నారు.


1945, మార్చి 24న మద్రాసులో అడుగుపెట్టారు. మద్రాసులోని పానగల్ పార్కులో పగలంతా ఒక చెట్టు క్రింద ఉండే రాతిబల్లపై కూర్చుని వచ్చినవారికి మదన శాస్త్రం నుండి మంత్ర శాస్త్రం వరకు బోధించేవారు. ఎంతో మంది వర్ధమాన కవులకు సందేహ నివృత్తి చేసేవారు.


ప్రముఖ రచయిత సముద్రాల సీనియర్‌కి అసిస్టెంట్‌గాను పనిచేశారు. ఘోస్ట్‌ రైటర్‌గానూ వ్యవహరించారు. ఆయన శైలిని గుర్తుపట్టి ఇది మీరే రాశారా'' అని అడిగితే పాట మీద, లేదా సినిమా టైటిల్స్‌లో తన పేరుంటే తను రాసిందే అని అనేవారట. 


మీరు రాసిన పాటకు సముద్రాల పేరు పడిందేమిటి అని మల్లాదిని ఆరుద్ర అడిగితే ఆరుద్రని ఈ రకంగా ప్రశ్నించారట.


నీ అసలు పేరేంటి ?

భాగవతుల శంకరశాస్త్రి.

ఆరుద్ర అని ఎందుకు పెట్టుకున్నావు ?

నా కలం పేరు.

నేనూ అంతే. నా పేరు మల్లాది రామకృష్ణ శాస్త్రి, కలం పేరు సముద్రాల, అంతే - అని చెప్పి ఆరుద్రని అప్రతిభుడని చేసారని మహారథి పేర్కొన్నారు.


మల్లాది రాసిన ఏరు నవ్విందోయ్‌ వూరు నవ్విందోయ్‌ పాటని, ఆరుద్ర రాసినట్లుగా 'పల్లె పడుచు' చిత్రంలో, ఈ చిత్రానికి మాటలు మిగతా అన్ని పాటలు, ఆరుద్ర రాయడంతో ఆరుద్ర పేరే టైటిల్స్‌లో వేశారట. ఈ విషయం తెలిసి మల్లాది నవ్వుకున్నారట కూడా అయితే గ్రామఫోన్‌ రికార్డుపైన వినోదా ప్రొడక్షన్‌ సౌజన్యంతో రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి అని ఉందని వి.వి.కె. రంగారావు పేర్కొన్నారు.


'దేవదాసు' చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుపై చిత్రీకరించిన 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌' పాటకు మల్లాదిని దాని అర్థం ఏమిటని ఆరుద్ర అడిగితే తాగుబోతుల పాటకు అర్థమేమిటి? అని తేలిగ్గా అనేసారని, పాట ఎన్నిసార్లు వింటే అన్ని రకాల అర్థాలు వస్తాయని ఆరుద్ర ఒకసారి అన్నారు. ఈ పాట కూడా మల్లాది రామకృష్ణ శాస్త్రి రాశారని అంటారు.


మహారథి ముచ్చట్లలో మల్లాది గురించి ఇంకో విషయం కూడా వివరించారు. మల్లాది కాళ్లకు వేసుకునే చెప్పులు ఎంత పాతవి అయిపోయినా, రింగు వగైరా ఊడిపోతూ వున్నా, వాటిని తిరిగి కుట్టించుకుంటూ; బాగు చేయించుకుంటూ అవే తొడుక్కుని తిరిగేవారు. ''ఆర్థిక స్థోమత ఉన్నా ఎందుకు పాతవాటితో అవస్థ పడటం'' అని మహారథి ప్రశ్నిస్తే ''చెప్పులు కుట్టే వాడికి పని పెట్టాలి కదా! అతడికి దానం చేస్తే తీసుకోడు మనం ఇవ్వకూడదు. పని చేయించుకుని ఏదైనా ముట్ట చెప్పాలి. కొత్త చెప్పులు కొనుక్కుంటే అతడి బతుకెలా గడుస్తుంది. రిపేరు చేయటం నా వల్లకాదు అని అతగాడు అన్నప్పుడే కొత్తవి కొంటాను'' అనేవారట.


ఘోస్ట్‌ రైటర్‌గా రచనలు చేసేటప్పుడు కూడా ''నాకు డబ్బు అవసరం. ఆయన ఇచ్చాడు. రాయమన్నాడు రాశాను. ఎవరికి కావలసింది వారికి దక్కింది. అంతే'' అని అర్థం వచ్చేట్టు మాట్లాడేవారే తప్ప ఏయే రచనలు అలా చేశారో మాత్రం చెప్పేవారు కాదట. అయితే మల్లాది వారి రచనాశైలి తెలిసిన వారికి మాత్రం ఆయన రాసిన వాటిని వెంటనే గుర్తు పట్టేవారు అని రావి కొండలరావు వివరించారు బ్లాక్‌ అండ్‌ వైట్‌లో.


తన చదువేదో చదువుతూ, పత్రికలకు కథలు, వ్యాసాలు రాస్తూ, సీనియర్‌ సముద్రాల (సముద్రాల రాఘవాచార్యులు) కి సహాయపడుతూ తద్వారా సినిమా రచనలోని మెళుకువలు తెలుసుకున్నారు మల్లాది. మల్లాదివారు రాసిన వాటికి తన పేరు టైటిల్స్‌లో పడేదనే విషయం సీనియర్‌ సముద్రాల కూడా అంగీకరించేవారని చెప్పేవారు.


ఘంటసాల బలరామయ్య ప్రతిభా బ్యానర్‌పై రూపొందించిన 'చిన్న కోడలు' చిత్రానికి స్క్రిప్టు రాయడంతో సినిమా టైటిల్స్‌లో పేరుపడి మల్లాదిగారి ఫిలిం కెరీర్‌ ప్రారంభం అయింది. ఈ చిత్రానికి 11 పాటలు రాశారు మల్లాది. పిల్లనగ్రోవి పాటకాడ, 'రారాదో రాచిలుక చేర', పరువే బరువాయెగా, ఈ చదువింతే కద, ఆశలు బంగారు అందలాలెక్కాయి వంటి పాటలు నచ్చాయి చాలామందికి. జయసింహ చిత్రంలో నడిరేయి గడిచేనే చెలియా' అనే పాట రాశారు. 'కన్యాశుల్కం' చిత్రానికి 'చిటారు కొమ్మన మిఠాయి పొట్లం', బికారి రాముడు చిత్రానికి 'వాడేనే చెలి వాడేనే', రంగేళి లీలల నా రాజా, 'టాక్సీ రాముడు' చిత్రం కోసం రావోయీ రావోయీ మనసైన రాజా - వంటి పాటలు రాశారు.


'చిరంజీవులు' చిత్రంకి మల్లాది వారు రాసిన 11 పాటల్లో ఏ గీతానికి ఆ గీతం చెప్పకోదగ్గది. ఇందులో హిట్‌ సాంగ్స్‌ చాలా వున్నాయి. రేచుక్క చిత్రానికి 8 పాటలు రాశారు.


శ్రీ గౌరీ మహాత్మ్యం, శ్రీకృష్ణ రాయబారం, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, మోహినీ రుక్మాంగద, శ్రీశైల మహాత్మ్యం, వీరాంజనేయ వంటి పౌరాణిక చిత్రాలకు పాటలు పద్యాలు రాశారు.


ఎప్పుడూ నవ్వుతూ, గ్లాస్కోపంచె, సిల్కులాల్చీ ధరించి, చేతిలో సిగరెట్ల టిన్నుతో కనిపించేవారని చెప్పులు కుట్టేవాడిని వతనుగా కుదుర్చుకున్నట్టే, రిక్షావాలా కూడా వతనుగా మల్లాదికి వుండేవాడని చెబుతారు.


ఆంధ్ర సాహిత్యానికి మహాభారతం రాసిన నన్నయ, తిక్కన, ఎర్రన కవిత్రయం అయితే తెలుగు చలన చిత్ర సాహిత్యానికి కవిత్రయం సముద్రాల, పింగళి, మల్లాది అని రచయిత వెన్నెలకంటి పేర్కొన్నారు.


మల్లాది పలుకుల్లోంచి అమృతం పుట్టింది. అది తెలుగు సినిమా పాటని చిరంజీవిని చేసిందని వేటూరి చెప్పారు.


సినిమా పాటకి కావ్య గౌరవం కల్పించిన మహాకవి మల్లాది అని ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు పేర్కొన్నారు.


బాపు రమణలైతే వచన రచనకు మేస్త్రి రామకృష్ణ శాస్త్రి అన్నారు. తక్కువ సినిమాలకు రాసినా విశిష్ఠ రచనలే ఎక్కువ చేశారాయన.


“అర్థం అవుతుంది! అర్థం చేసుకోవాలి!! తెలియక పోతే అడిగి తెలుసుకోవాలి. భాషా, సాహిత్యమూ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి సినిమా కూడా ఒక సహాయకారి కావాలి” – ఈ మాటలు అన్నది సినిమా కవులందరూ సాహో అని కీర్తించిన మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు. సినిమా పాట ద్వారా కూడా చక్కటి భాషా, కవిత్వమూ కుదిరినప్పుడల్లా ప్రదర్శించవచ్చు అని “మల్లాది స్కూల్” కవుల భావన.


ఈ “మల్లాది స్కూల్” కి చెందిన కవే వేటూరిగారు. ఈయన అందరి కంటే ఒక అడుగు ముందుకు వేసి, కుదిరినప్పుడు మాత్రమే కాక, కుదరనప్పుడు కూడా మథురమైన భాషా, లోతైన కవిత్వమూ ఒలికించారు. పాటల్లో తెలుగు సంస్కృతీ విశేషాలు చొప్పించారు. తెలిసి, తెలిసీ “తప్పులు” చేసిన అసాధారణ ప్రతిభాశాలి! సినిమా పాటకు తగ్గట్టు తను మారకుండా, తనకు తగ్గట్టు సినిమా పాటనే మార్చిన ఘనుడు! అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు – “వేటూరి వెండి తెరను నల్ల పలకగా మార్చి తిరిగి మనందరిచేతా ఓనమాలు దిద్దించాడు”


అంతే కాదు ఆయనకు పాళీ, పైశాచీ, ప్రాకృతాల వంటి ప్రాచీన జీర్ణ భాషల్ని మధించిన అనుభవం కూడ ఉంది — అట — అని జనాలు చెప్పుకోవడమే గానీ ఏనాడూ తనను గురించి తాను చెప్పుకోలేదు ఆయన.


అయినా ఎవరో చెప్పినట్టు (ఆరుద్ర గారు ?) శాస్త్రి గారిని అగస్త్యునితో పోల్చడం సరి కాదు. అగస్త్యులవారు తాము ఔపోశన పట్టిన సాగరాన్ని మళ్ళీ వదిలి వేస్తే శాస్త్రిగారు మాత్రం తాము త్రాగిన సాహిత్య మహాంబుధులన్నీ తమలోనే భద్రంగా నిక్షిప్తం చేసుకొన్న విజ్ఞాన ఖని. తరగని గని.


“అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి ఆపలేరు” — ఇది గోడలపై, కొండొకచో ఉడుకు నెత్తురు కుర్రాళ్ళ పుస్తకాలపై, కనిపించే ఒక విప్లవ నినాదం. సర్వ “శాస్త్రి” గారి విషయంలో మాత్రం ఇది పచ్చి నిజం.


ఎంత దాచినా… ఆయా భాషల, విద్యల, శాస్త్రాల సారం శాస్త్రిగారి రచనలో అక్కడక్కడా తొంగి చూస్తూనే ఉంటుంది — వివరం ఎఱిగి చూచే వారిని చిలిపిగా పలుకరిస్తూనే ఉంటుంది.


ఐతే, ఎన్ని భాషలు నేర్చినా ఆయన కథ, కవిత, పాట, పలుకు మాత్రం… అచ్చ తెలుగు వెచ్చదనపు ఊపిర్లు పీలుస్తుంటాయ్.


ఓరోజు మిట్ట మధ్యాహ్నం పూట పడక్కుర్చీలో కూర్చుని పరిచితులతో కబుర్లాడుతున్నప్పుడు ఎవరో అడిగారుట “శాస్త్రి గారు, తమరికెన్ని భాషలొచ్చు ?” అని.


చేతనే ఉన్న తాటాకు విసనకర్ర పై ఆయన రేకుకొక్క భాషలో సంతకం చేస్తుంటే చోటు చాలక విసనకర్ర వెనక్కి త్రిప్పవలసి వచ్చిందట (తాటాకు వీవెనలు చూడని పట్నవాసులకు : లెఖ్కకు దాదాపు ముప్ఫై భాషలకు పైమాటే)!


రామకృష్ణ శాస్త్రిగారు సముద్రుడి కన్నా గొప్పవాడు. తనలో ఎన్నో నిధి నిక్షేపాలున్నా గొప్పవాడినంటూ సముద్రుడిలా ఘోష పెట్టడు. రామకృష్ణ శాస్త్రిగారు అగస్త్యుడికన్నా గొప్పవాడు. అగస్త్యుడు సాగరాలను పుక్కిట పట్టి వదిలి పెట్టేశాడు. శాస్త్రిగారు భాషా సముద్రాలను తనలోనే నిలబెట్టుకున్నారు.

............. మల్లాది వారి గురించి ఆరుద్రగారి మాటలవి.


ప్రౌఢ వాక్యాల తెరల మరగున దోబూచులాడీ.....ముగ్ధ భావాలతో.......

వన్నెలాడిలా...కన్నేలేడిలా...

వయ్యారాలు పోయే తేనె మాటల...తెలుగు మాటల...

రంగుల హోరంగులతో తెలుగువాడి జీవిత

జూమూతాన్ని ఒత్తిగించి....

తెల్లని...చక్కని...చిక్కని...కథాశరశ్చంద్రికలు వెలయించి...

పడుచు గుండెలు గుబగుబలాడించి

మనసుకందని అందాలను భాషకు దించి, భాషలో...కైతలో....

బయోస్స్కోపులో అచ్చరలచ్చల పచ్చ చమత్కారాలు పండించుకుంటూ

అలనాటి పాండురంగ విభుని పదగుంభనలా పాండిబజారు దర్బారులో 

నిలిచి... ఎవరన్నా ! మహానుభావకులు ?

ఓహో ! వచన రచనకు మేస్త్రి 

సాహో ! రామకృష్ణ శాస్త్రి


- మల్లాది వారి రచనా వైభవాన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారు వర్ణించిన విధమది.


జీవిత విశేషాలు 

వచన రచనకు మేస్త్రీ - మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఆయన విశ్వమానవుడు. వసుధైక కుటుంబకం అనే భావన మదినిండా బలీయంగా కలిగిన మహనీయులు. మల్లాది రామకృష్ణశాస్త్రి 1905, జూన్ 16న కృష్ణా జిల్లా, చిట్టిగూడూరు గ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో కనకవల్లి, నరసింహశాస్త్రి దంపతులకు జన్మించారు. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. యడవల్లి సుబ్బావధాన్లుగారి దగ్గర వేద విద్యను, నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి దగ్గర మహాభాష్యాన్ని, శిష్ట్యా నరసింహ శాస్త్రిగారి దగ్గర బ్రహ్మసూత్రాలను అభ్యసించారు. నాట్యకళలో, చిత్ర లేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది. మొదట మచిలీ పట్నంలోనే స్థిర నివాసం. తర్వాత కొంతకాలం పాటు గుంటూరులో కాపురం. 15వ ఏట పురాణం సూరిశాస్త్రి గారి కుమార్తె వెంకటరమణతో వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కొడుకులిద్దరికీ ఒకరికి తండ్రిపేరు (మల్లాది నరసింహ శాస్త్రి), మరొకరికి మామగారి పేరు పెట్టుకున్నారు. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు కొంతకాలంపాటు గుంటూరులో పాములపాటి వెంకట కృష్ణయ్యచౌదరి నడిపే దేశాభిమాని పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశారు. చిన్నతనంనుంచే వీరు రాసిన వ్యాసాలు, కథలు పలు పత్రికల్లో అచ్చయ్యాయి. శాస్త్రిగారు రాసిన పలు నాటకాలు, నవలలు వారికి చిరకీర్తిని ఆర్జించిపెట్టాయి. కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటి యుద్ధం’ సినిమా రచనకు సంబంధించి సలహాలకోసం శాస్త్రిగారిని మద్రాసుకు ఆహ్వానించారు. అలా 1945, మార్చి 24న మద్రాసులో అడుగుపెట్టిన రామకృష్ణ శాస్త్రిగారు తర్వాతి కాలంలో తెలుగు చలన చిత్ర సీమకు సరికొత్త భాషాపరమైన సొబగుల్ని మాటలు, పాటల ద్వారా పరిచయం చేసి కొత్త ఒరవడికి నాందీ పలికారు. మద్రాసులో చాలాకాలం పాటు సముద్రాల రాఘవాచార్యకూ మల్లాది రామకృష్ణ శాస్త్రికీ చక్కటి సాన్నిహిత్యం ఉండేది. రామకృష్ణ శాస్త్రి చాలాకాలం పాటు తెలుగు సినీ పరిశ్రమలో "ఘోస్ట్ రైటర్" గా ఉన్నారు. 1952కు ముందు సినిమాల్లో చాలావాటిల్లో వీరి పేరు ఉండేది కాదని పలువురు సినీ ప్రముఖులు చెబుతారు. చిన్న కోడలు చిత్రంతో శాస్త్రిగారు అజ్ఞాతవాసాన్ని వీడి తెరమీదికొచ్చారు. తన సొంత పేరుతో 39 చిత్రాలలో 200కు పైగా పాటలను రాశారు. మద్రాసులోని పానగల్లు పార్కులో ఓ చెట్టుకింద ఉన్న రాతిబల్లమీద కూర్చుని సాయంత్రం వేళ్లలో విద్వత్సభలను నడిపేవారు. ఈ సభల్లో అనేక శాస్త్రాలకు సంబంధించి, అనేక విషయాలకు సంబంధించి, అనేక రంగాలకు సంబంధించి, భాషకు, భావానికీ, అభివ్యక్తికీ సంబంధించి అనర్గళంగా మాట్లాడేవారు. ఎందరో వర్థమాన కవులకు, రచయితలకు సందేహాలను నివృత్తి చేసేవారు. అదిమాత్రమే కాక ఆ సమావేశాలకు హాజరైనవారిలో, పానగల్లు పార్కుకు వచ్చి శాస్త్రిగారిని కలిసిన వారిలో ఆకలిగొన్నవారికి తన బ్యాగులో ఉన్న హోటల్ భోజనం టిక్కెట్ల కట్టలోంచి ఓ టిక్కట్టును చింపి ఇచ్చి వారి కడుపు నింపిన వెన్నలాంటి కన్నతల్లి మనసు ఆయనది. కేవలం ఇలా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టించడంకోసమే ఆయన తన చేతికి డబ్బు రాగానే పాండీ బజార్ లో ఉన్న హోటల్ కి వెళ్లి ప్రత్యేకంగా భోజనం టిక్కెట్ల పుస్తకాన్ని కొనుక్కొచ్చేవారని ఆయన్ని బాగా ఎరిగినవారు చెబుతారు. అందరినీ తనవాళ్లుగా భావించి ఆదరంగా చూసుకునే మంచి మనసు ఆయనది. రామకృష్ణ శాస్త్రిగారు దాదాపు వందకి పైగా భాషల్లో పండితులని ప్రతీతి. సినీ రచయిత, కవి ఆరుద్ర మద్రాసులో మల్లాది రామకృష్ణ శాస్త్రిగారింటికి తరచూ వెళ్లి అనేక విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తిని కనబరిచేవారు. ఓ రోజున ఆరుద్ర నేరుగా "గురువుగారూ మీకసలు ఎన్ని భాషలు తెలుసును ?" అని అడిగారు. దానికి సమాధానంగా శాస్త్రిగారు జాబితా రాసుకోమని చెబితే, అప్పుడు ఆరుద్ర "అలా కాదు. మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో, అన్ని భాషల్లోనూ ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకుమీద ఒక్కో సంతకం చొప్పున ఆయా భాషల్లోనే చేసివ్వండి" అంటూ తాటాకు విసనకర్రను, ఇంకు పాళీ కలాన్ని ఆయన చేతికి ఇచ్చారు. అప్పుడు శాస్త్రిగారు ఒక్కో ఆకుమీద ఒక్కో భాషలో సంతకం చేస్తూపోతే మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి. ఇది స్వయంగా రామకృష్ణ శాస్త్రిగారి పెద్ద కుమారుడు మల్లాది నరసింహశాస్త్రిగారు చెప్పిన విషయం. కనుక రామకృష్ణ శాస్త్రిగారికి వందకు పైగా భాషల్లో కవిత్వం చెప్పగలిగిన పాండిత్యం ఉండేదని నిష్కర్షగా చెప్పొచ్చు.


రచనలు


మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు కృష్ణా పత్రికలో ఛందోబద్ధమైన కవిత్వం రాశారు. ఈ పత్రికలోనే చలువ మిరియాలు పేరుతో ఆయన రాసిన వ్యంగ్య వ్యాసాలకు అశేషమైన పాఠకాదరణ లభించింది. తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. అహల్యా సంక్రందనం, హంసవింశతి గ్రంథాలకు అమూల్యమైన పీఠికలు వ్రాశారు.


సంకలనాలు

చలవ మిరియాలు


నవలలు


కృష్ణాతీరం

తేజోమూర్తులు

క్షేత్రయ్య


నాటికలు

గోపీదేవి

కేళీగోపాలం

బాల

అ ఇ ఉ ఱ్

సేఫ్టీ రేజర్


సినీ సాహిత్యం

‍బాలరాజు (1948)

చిన్న కోడలు (1952) (గీత రచయితగా తొలిచిత్రం)

కన్యాశుల్కం (1955) (గీత రచయిత)

రేచుక్క (1955) (గీత రచయిత)

చిరంజీవులు (1956) (గీత రచయిత)

కార్తవరాయని కథ (1958) (గీత రచయిత)

జయభేరి (1959) (గీత రచయిత)

తల్లి బిడ్డ (1963) (గీత రచయిత)

జ్ఞానేశ్వర్ (1963) (గీత రచయిత)

దేశద్రోహులు (1964) (గీత రచయిత)

రహస్యం (1967) (గీత రచయిత)

వీరాంజనేయ (1968) (గీత రచయిత)

అత్తగారు కొత్తకోడలు (1968) (గీత రచయిత)


సేకరణ

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - కృష్ణ పక్షం -‌ ద్వాదశి - భరణి -‌‌ భాను వాసరే* (22.06.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం 22.06.2025 Sunday,

 ఈ రోజు పంచాంగం 22.06.2025 Sunday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష ద్వాదశి తిథి భాను వాసర భరణి నక్షత్రం సుకర్మ యోగః కౌలవ తదుపరి తైతుల కరణం


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:0 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు. 




నమస్కారః , శుభోదయం

మొక్కల నాటెడి వారలు

 *2155*

*కం*

మొక్కల నాటెడి వారలు

పెక్కుగ కలరీ పుడమిన విలువేమిటయా!?.

చక్కగ(ని) చెట్లను గాచెడు

మక్కువ కాడొక్కడైన మాన్యుడు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మొక్కలు నాటేవారు ఎంతో మంది ఉండి విలువయేమిటి!!?? చక్కని చెట్లను కాపాడేవాడు ఒక్కడైననూ గొప్ప వాడే. 

*సందేశం*:-- ఏదో ఒక సాకు తో ఏళ్ల నాటి వృక్షాలను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే అటువంటి చెట్ల ను నరకబడకుండా కాపాడేవాడే పూజ్యుడు. చెట్లు మనకు చేసే ఉపకారాలు చాలా ఎక్కువ.అవి మనం వేరేవిధంగా పొందలేము.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*