25, ఫిబ్రవరి 2024, ఆదివారం

Abakaapally tiffin


 

Mouna swami


 

Application of break


 

Scary jump


 

*శ్రీ మహాలక్ష్మి నివాస స్థానాలు*

 🛕🕉️ *శ్రీరామ సైన్యం భక్తి* 🕉️🛕


🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏


*శ్రీ మహాలక్ష్మి నివాస స్థానాలు* 


సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహా లక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె దృష్టి మన మిద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ చేస్తూ ఉంటాము. కానీ, శ్రీ లక్ష్మి దేవి యొక్క నివాస స్థానాలు, ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి అనేది మనం సూక్ష్మం గ తెలుసుకొందాము. పూజలు, వ్రతాలూ చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వార లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు.

1. సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పదేయకూడదు. గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మిద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమ తో అలంకరించాలి.

2. ప్రధాన ద్వారం తలుపు మిద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసిన మంచిదే.

3. శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మి దేవికి ఆలవాలం. కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి.

4. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి, వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు.

5. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఉడ్చి ముగ్గులు వేసుకోవాలి.

6. ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు.

7. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు.

8. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్దకస్తులు ఎక్కడ ఉంటారో, అక్కడ లక్ష్మి దేవి ఉండదు.

9. ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

10. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే.

11. సత్యవాదులు, ధార్మిక , నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది.

12. వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాలు లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

13. అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జుదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మి దేవి ఉండలేదు.

14. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి, ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి, లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు.

15. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు

అంతర్వేది ఏకాదశి

 *గోదావరి తీరాన.....* *నరహరి రూపాన!*

✍️ కడియం త్రినాథస్వామి,  

      చింతా నరసింహస్వామి.     

(నేడు అంతర్వేది ఏకాదశి - లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య రథోత్సవ వేళ... )

🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏

*వశిష్ఠ గలగలలు... సాగరం సవ్వళ్లు... వాటిని మరిపించేలా గోవింద© నామస్మరణ. ఇది ప్రఖ్యాత నృసింహ క్షేత్రం అంతర్వేది వైభవం. దేవదేవుడి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధమైన తరుణాన తూర్పుగోదావరి జిల్లాలోని ఈ క్షేత్రం వేలాది మంది భక్తులతో ఇల వైకుంఠంగా మారనుంది.*

🕉️┅━❀꧁꧂❀┅━🕉️

✳️‌ *స్తంభంలో నుంచి ఆవిర్భవించి ప్రహ్లాదుని రక్షించినా...* 


✳️ *శ్రీశైల మహారణ్యంలో సింహగర్జనలు చేస్తూ ఆదిశంకరులను కాపాడినా...* 


✳️‌ *సర్వకాల సర్వావస్థల్లోనూ సరహరి భక్తులవెంట తానున్నానని చాటుతూనే ఉన్నారు.*


✳️ అలాంటి నృసింహుడు వెలసిన ప్రఖ్యాత క్షేత్రాల్లో *అంతర్వేది* ఒకటి. నిత్య హోమాలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే స్వామివారి వైభవం ఇక్కడ చూసి తరించాల్సిందే. 


✳️‌ ప్రస్తుతం అంతర్వేది ఆలయం ఉన్న ప్రాంతంలో బ్రహ్మ, యజ్ఞం చేశాడని చెబుతారు. అఖండగోదావరి నుంచి ఓ పాయను తెచ్చి సాగరంలో కలిపిన పశిష్ట మహర్షి తపస్సు చేస్తుండగా హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవిలోచనుడు ఆయన సంతానాన్ని నాశనం చేశాడని, మహర్షి ప్రార్ధనతో ప్రత్యక్షమైన నారసింహుడు రాక్షస సంహారం చేశాడని^... వశిష్టుడి అభ్యర్ధన మేరకు లక్ష్మీనృసింహస్వామిగా ఇక్కడ వెలిశాడని పురాణ కథనం. 


✳️‌ స్వామి ఇక్కడ పశ్చిమాభిముఖుడై ఉంటారు. ఇక్కడికి సమీపంలోని కేశవదాసుపాలేనికి చెందిన మందపాటి కేశవదాసు అనే యాదవుడు కర్రలతో పందిరిని నిర్మించాడు. కొంతకాలానికి సప్తసాగర యాత్రకొచ్చిన రెడ్డిరాజులు చెక్కతో ఆలయాన్ని నిర్మించారు. క్రీ.శ. 1823లో ఓడలరేవుకు చెందిన *^కొపనాతి కృష్ణమ్మ^*అ ఇప్పుడున్న ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల్లో ఉంది. పెద్దాపురం సంస్థానాదీశులు, మొగల్తూరు రాజవంశీయులు ఆలయాన్ని పరిరక్షించారు. ఏటా మాఘ మాసంలో స్వామివారి దివ్య కల్యాణోత్సవాలు జరగుతాయి. ఆగమోక్తంగా పది రోజుల పాటు జరిగే పరిణయోత్సవాలు నేత్రపర్వం కలిగిస్తాయి.


✳️ కల్యాణోత్సవాల అంకురార్పణలో భాగంగా తొమ్మిది పాళికల్లో నవధాన్యాలు పోసి అవి బాగా చిగురించాలని మంత్రోచ్ఛరణతో పూజలు చేస్తారు. అదే రోజు ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద గరుడపటాన్ని ఆవిష్కరించి సకల దేవతాగణాన్ని కల్యాణానికి ఆహ్వానం పలుకుతారు.


✳️ నాలుగో రోజు దశమినాటి రాత్రి ఆరుద్రా నక్షత్ర యుక్త తులాలగ్న పుష్కరాంశలో స్వామివారి కల్యాణం జరుగుతుంది. ఆలయానికి ఎదురుగా ఉండే వేదికపై ఈ క్రతువును నిర్వహిస్తారు.


✳️ ఏడో రోజు పండిత సదస్యం అనంతరం రాత్రి స్వామివారిని అశ్వవాహనం పై ఊరేగిస్తారు. ఉత్సవమూర్తులను 16 కాళ్లమంపడం వద్దకు తీసుకువస్తారు అక్కడ ఆలయంలోని అర్చకులు, పేరూరు బ్రాహ్మణులకు మధ్య *చోర సంవాద మట్టం* ఆసక్తిదాయకంగా జరుగుతుంది.


✳️ ఆలయంలోని సుదర్శన పెరుమాళ్ విగ్రహం ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. 15 చేతులు, 16 ఆయుధాలతో చుట్టూ జ్వాలలు, వెనుక సుదర్శన యంత్రం, కింద గురుడ వాహనంతో ఉన్న దీనిని *∆బలిబేరం∆* గా సంబోధిస్తారు. 


✳️ కల్యాణోత్సవాల్లో సాగర జలాల్లో స్వామివారికి ఏటా సుదర్శన పెరుమాళ్ కు చక్రస్నానోత్సవాన్ని నిర్వహిస్తారు. తొమ్మిదో రోజు *మాఘ పౌర్ణమి* నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది.


✳️ పదో రోజున ఆలయానికి సమీపంలో దక్షిణ దిశగా ఉన్న తటాకంలో తెప్పోత్సవం వైభవంగా జరుగుతుంది. 


✳️ రోజూ ఉదయం, సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులకు వాహన సేవ జరుగుతుంది. *సింహ, హనుము, శేష, హంస, గరుడ, ఆశ్వ, గజ, పొన్న, రాజాధిరాజు వాహనాల* పై లక్ష్మీ నృసింహస్వామి ఊరేగుతారు.

🕉️┅━❀꧁꧂❀┅┉🕉️

✳️ కల్యాణం జరిగిన మరుసటి రోజు మధ్యాహ్నం *దివ్య రథయాత్ర* జరుగుతుంది. స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి దిక్కులన్నీ పిక్కటిల్లేలా భక్తులంతా గోవింద నామస్మరణలు చేస్తుండగా రథాన్ని ముందుకు కదుపుతారు. రధం స్వామివారి సోదరి ఆయిన *గుర్రాలక్కమ్మ* ఆలయం చెంతకు చేరుతుంది. ఆమెకు చీర, సారె సమర్పించే ఘట్టాన్ని మంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తారు. 


✳️ నృసింహస్వామి రక్తవిలోచనుణ్ణి చంపుతున్నప్పుడు అతని శరీరం నుంచి నేలపై పడిన ప్రతి రక్త బిందువు నుంచి ఒక్కో రాక్షస రూపం రావడంతో ప్రత్యక్షమైన *అశ్వరూఢాంబిక* తన నాలుక రాసి అసురుడి రక్తం నేలపై పడకుండా చేసిందని చెబుతారు. ఆ అశ్వరూపంబినే గుర్రాలక్కమ్మగా ఆరాధిస్తుంటారు. పసుపు, కుంకుమలతో పూజలు చేసి ప్రసాదాలను అందజేస్తారు.


🙏 *శ్రీ లక్ష్మీనారసింహాయనమః* 🙏



🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

🚩

జ్వరం హరించు యోగం

 జ్వరం హరించు సులభ ఆయుర్వేద యోగం - 


   6 నిమ్మకాయల రసం , 300 గ్రాముల గోరువెచ్చని నీటిలో కలిపి 3 స్పూనుల పటిక బెల్లం చూర్ణం లేదా పంచదార కలిపి ఆ రసాన్ని రోజు మొత్తం మీద కొంచం కొంచం మోతాదులో జ్వరంతో బాధపడుతున్న వారికి ఇచ్చుచున్న జ్వరం , వాంతులు , అతిసారం , విరేచనాలు నివారణ అగును . 


  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

సంకల్పము

 *శుభోదయం*

16.2291923113

Xxxxxx

 సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.25.02.2024 ఆది వారం (భాను వాసరే) 

 *******

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

మాఘ మాసే కృష్ణ పక్షే

ప్రతి పత్తిథౌ (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ శోభకృత్  నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

మాఘ మాసే 

కృష్ణ పక్షే  ప్రతి పత్తిథౌ

భాను వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.26

సూ.అ.6.01

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

శిశిర ఋతువు

మాఘ మాసం 

కృష్ణ పక్షం పాడ్యమి రా. 7.20 వరకు. 

ఆది వారం. 

నక్షత్రం పుబ్బ రా.12.24 వరకు. 

అమృతం సా.6.17 ల 8.04 వరకు. 

దుర్ముహూర్తం సా. 4.26 ల 5.14 వరకు.  

వర్జ్యం ఉ.6.37 ల 8.24 వరకు. 

యోగం సుకన్య మ.1.56 వరకు.  

కరణం కౌలవ రా.7.20 వరకు.  

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా.4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ.12.00 ల 1.30 వరకు. 

***************

పుణ్యతిధి మాఘ బహుళ పాడ్యమి.

*****************

గమనిక* :౼

మా సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక  *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏

.

ఫిబ్రవరి 25,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


ఆదివారం, ఫిబ్రవరి 25,2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం - బహుళ పక్షం

తిథి:పాడ్యమి రా7.15 వరకు

వారం:ఆదివారం(భానువాసరే) 

నక్షత్రం:పుబ్బ రా12.19 వరకు 

యోగం:సుకర్మ మ1.53 వరకు

కరణం:కౌలువ రా7.15 వరకు తదుపరి తైతుల తె6.13 వరకు

వర్జ్యం:ఉ6.36 - 8.23

దుర్ముహూర్తము:సా4.28 - 5.14

అమృతకాలం:సా5.13 - 7.00

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి: కుంభం

చంద్రరాశి : సింహం 

సూర్యోదయం:6.26

సూర్యాస్తమయం:6.01


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

శ్రీ సర్థాల్ మాత ఆలయం

 🕉 మన గుడి : నెం 237


⚜ జమ్మూకాశ్మీర్  : కిష్త్వార్


⚜ శ్రీ సర్థాల్ మాత ఆలయం



💠 మాతా సర్థాల్ దేవి మందిర్ అనేది  భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్ (కేంద్రపాలిత ప్రాంతం) లోని కిష్త్వార్ జిల్లా సర్థాల్ వద్ద ఉన్న ఒక హిందూ దేవాలయం,

అష్టభుజ దేవి ఆలయం అని కూడా పిలువబడే సార్థల్ మాత ఆలయం, దుర్గామాత అవతారం అయిన 18 సాయుధ దేవత యొక్క ఒకే ముక్క నల్లని విగ్రహాన్ని కలిగి ఉన్న ఒక గుహ దేవాలయం.  


💠 ఈ విగ్రహం 14వ శతాబ్దంలో కాశ్మీర్ లోయ నుండి తీసుకురాబడింది.  

కిష్త్వార్ నుండి 18 కి.మీ దూరంలో, ఇది పచ్చని చెట్లతో కూడిన కొండ ట్రెక్కింగ్ ప్రదేశంలో ఉంది.  ప్రతి సంవత్సరం శ్రీ సర్థాల్ దేవి పుణ్యక్షేత్రం నిర్వహణ మండలి ద్వారా ఆషాడ శుద్ధ అష్టమి మరియు నవమి (జూన్-జూలై) సందర్భంగా వార్షిక యాత్రను నిర్వహిస్తారు.  

వేలాది మంది యాత్రికులు ఈ వేడుకలో దేవత ఆశీర్వాదం కోసం ఆలయానికి తరలివస్తారు.


 

⚜ సార్థల్ మాత చరిత్ర 


💠 కిష్త్వార్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో అందమైన కొండల మధ్య ఉన్న సర్థాల్ మాత ఆలయం దాని స్వంత అద్భుతమైన చరిత్రను కలిగి ఉంది. 

విశ్వాసాల ప్రకారం, మహర్షి కశ్యప్, తన హిమాలయ పర్యటన సమయంలో, ఆ సమయంలో చంద్రభాగ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన కిష్త్వార్ ప్రాంతంలో కూడా నివసించారు.  

శ్రీ కశ్యపముని నివాసం కారణంగా, చంద్రభాగ ప్రాంతానికి కాశ్యపనివాస్ అనే పేరు వచ్చింది, అది తరువాత క్షీణించి కిష్త్వార్‌గా మారింది.


💠  కిష్త్వార్ ప్రజలను మతం మరియు భక్తి మార్గంలో నడిపించడానికి, కశ్యప ముని తన తపస్సు ద్వారా ఆదిశక్తి మా జగదంబ యొక్క దివ్యమైన విగ్రహాన్ని వ్యక్తపరిచాడు మరియు మంత్రాలను పఠించడం ద్వారా విగ్రహాన్ని ప్రతిష్టించాడు. 

అష్టాదశ భుజ మాత విగ్రహాన్ని ఉంచడానికి ఒక ఆలయం కూడా స్థాపించబడింది. 


💠 విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఆలయాన్ని నిర్మించిన ప్రదేశానికి కాళిగాడ్ అని పేరు వచ్చింది.  దీనిని నేడు గాలిగాడ్ అని పిలుస్తారు.  

అప్పటి నుండి, కొన్ని కారణాల వల్ల, ఈ అమ్మవారి దివ్య విగ్రహం అదృశ్యమైంది మరియు చాలాసార్లు కనుగొనబడింది.  

కానీ చివరిసారిగా మహారాజా మహా సింగ్ హయాంలో క్రీ.శ.1650లో ఆవును మేపుతుండగా ఒక గోవుల కాపరికి.విగ్రహం దొరికింది.


💠 మహారాజా మహా సింగ్ స్వయంగా సర్థాల్ గ్రామంలో ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించాడు.  అప్పటి నుండి నేటి వరకు, ఈ పవిత్ర తీర్థయాత్ర కిష్త్వార్ ప్రజల విశ్వాసంతో పాటు సాంస్కృతిక జీవితానికి ముఖ్యమైన కేంద్రంగా మారింది.


💠 సాంస్కృతిక వారసత్వం: 

విశ్వాసంతో పాటు, ఈ సార్థల్ మాత ఆలయం జీవితంలోని దాదాపు ప్రతి శుభ సందర్భంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 

పెళ్లి నిశ్చయమైన వెంటనే, మొదటి ఆహ్వాన పత్రిక ఇక్కడి అమ్మవారికి అందిస్తారు.  

వధువు బట్టలు లేదా నగలు కొనడానికి ముందు తల్లి కోసం షాపింగ్ జరుగుతుంది.  

వివాహం పూర్తయిన తర్వాత ముందుగా సకుటుంబ మాత ఆశీస్సులు తీసుకుంటారు.  పిల్లలకు షేవింగ్ కూడా ఇలాగే చేస్తారు.  


💠 కిష్త్వార్ జిల్లాలో, పిల్లల తలనీలాలు, వివాహం మరియు యజ్ఞోపవీత్ వంటి పెద్ద ఎత్తున నిర్వహించబడుతుంది.  

రెండు మూడు రోజుల పాటు జరిగే ముందన్ సంస్కారంలో ప్రజలు తమ కుటుంబసభ్యులను, బంధువులను, స్నేహితులను సంగీత వాయిద్యాలతో సర్థాల్ ఆలయానికి తీసుకువెలెత్తారు.రెండో రోజు అక్కడ భగవతీ దేవి హవనం, యాగం నిర్వహిస్తారు. 


💠 దుర్గామాత యొక్క పునర్ అవతారంగా పరిగణించబడే ఈ విగ్రహం మొదట కిష్త్వార్ కాలం నాటి రాజా అగర్ దేవ్ కాలంలో స్థానికులచే రాళ్లతో చెక్కబడింది మరియు తరువాత, 1936లో మహారాజా హరి సింగ్చే పునరుద్ధరించబడింది. 

ఇది సుమారు 6000 అడుగుల ఎత్తులో ఉంది మరియు సాధారణంగా శీతాకాలంలో మంచులో కప్పబడి ఉంటుంది.


💠 కిష్త్వాడ్ జిల్లా ప్రజల ఇష్టదైవంగా, శతాబ్దాల కిష్టవాడ్ చరిత్రకు సాక్షిగా నిలిచిన అష్టాదశభుజ దేవి సర్థాల్ మాత ఆలయంలో నవరాత్రుల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది

అమ్మవారి దర్శనం కోసం భక్తులు ప్రతిరోజూ ఈ ఆలయానికి వస్తూనే ఉన్నప్పటికీ, ముఖ్యంగా నవరాత్రుల సమయంలో, భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయానికి వస్తారు.


💠 ఆలయానికి వార్షిక తీర్థయాత్ర (జూలై నెలలో) ఒక ముఖ్యమైన సంఘటనగా చెప్పవచ్చు, ఆ సమయంలో సమీపంలోని గ్రామాల ప్రజలు దేవత యొక్క ఆశీర్వాదాలను పొందేందుకు ఆలయానికి తరలివస్తారు. 

ప్రజలు ఆలయానికి త్రిశూలాలను (త్రిశూలం) తీసుకువస్తారు. వందల సంవత్సరాల నాటి త్రిశూల సేకరణ ఈ ఆలయంలో ఉంది. 

డోగ్రా పాలనలో, ఈ యాత్రను "సర్కారీ యాత్ర" అని పిలిచేవారు, ఈ యాత్రను జరుపుకోవడానికి మొత్తం దోడా జిల్లాలో 3 రోజుల సెలవులు ఉండేవి. 

ఆలయం వద్ద ముండన్ (శిశువు యొక్క మొదటి వెంట్రుకలను తొలగించడం) శుభప్రదంగా పరిగణించబడుతుంది. 


💠 పురాతన  సర్థాల్ దేవి విగ్రహం 2008లో ఆలయం నుండి దొంగిలించబడింది. అయినప్పటికీ, విగ్రహాన్ని ఈ ప్రాంతం నుండి అక్రమంగా తరలించడానికి వీలులేదు మరియు దానిని స్వాధీనం చేసుకుని ఆలయంలో తిరిగి ప్రతిష్టించారు. ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపింది. 

రాశి ఫలితాలు

 *శుభోదయం*

16.2291923113

**********

25-02-2024

ఆదివారం (భాను వాసరః )

రాశి ఫలితాలు

********

మేషం

వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు.

---------------------------------------

వృషభం

శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.  వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

మిధునం

వృత్తి వ్యాపారాలు చికాకుగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో  ఆసక్తి పెరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుగుతాయి. బంధువులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి.

---------------------------------------

కర్కాటకం

ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసిరావచ్చు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఏర్పడతాయి.

------------------------------------

సింహం

వ్యాపారాలు సంతృప్తి కలిగిస్తాయి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తొలగుతుంది. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కన్య

నూతన  ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

------------------------------------

తుల

ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తులు సలహాలు తీసుకోవడం మంచిది.

---------------------------------------

వృశ్చికం

సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తుల పనికి తగిన గుర్తింపు లభించక విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాక చికాకులు పెరుగుతాయి.

-------------------------------------

ధనస్సు

బంధు మిత్రుల ఆదరణ కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అనుకుంటారు. ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగి స్థిరత్వం కలుగుతుంది. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------

మకరం

ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఊహించని విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

--------------------------------------

కుంభం

చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక శ్రమాధిక్యత కలుగుతుంది. బంధువులు మీ మాటతో విభేదిస్తారు ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో భాగస్తులు తో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి.

--------------------------------------

మీనం

నూతన వ్యాపారాలు ఒడిదుడుకులుగా ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి.

---------------------------------------


*గమనిక* :౼

మన సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక  *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

*శుభోదయం*

16.2291923113

**********

25-02-2024

ఆదివారం (భాను వాసరః )

రాశి ఫలితాలు

********

మేషం

వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు.

---------------------------------------

వృషభం

శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.  వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

మిధునం

వృత్తి వ్యాపారాలు చికాకుగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో  ఆసక్తి పెరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుగుతాయి. బంధువులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి.

---------------------------------------

కర్కాటకం

ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసిరావచ్చు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఏర్పడతాయి.

------------------------------------

సింహం

వ్యాపారాలు సంతృప్తి కలిగిస్తాయి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తొలగుతుంది. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కన్య

నూతన  ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

------------------------------------

తుల

ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తులు సలహాలు తీసుకోవడం మంచిది.

---------------------------------------

వృశ్చికం

సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తుల పనికి తగిన గుర్తింపు లభించక విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాక చికాకులు పెరుగుతాయి.

-------------------------------------

ధనస్సు

బంధు మిత్రుల ఆదరణ కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అనుకుంటారు. ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగి స్థిరత్వం కలుగుతుంది. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------

మకరం

ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఊహించని విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

--------------------------------------

కుంభం

చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక శ్రమాధిక్యత కలుగుతుంది. బంధువులు మీ మాటతో విభేదిస్తారు ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో భాగస్తులు తో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి.

--------------------------------------

మీనం

నూతన వ్యాపారాలు ఒడిదుడుకులుగా ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి.

---------------------------------------


*గమనిక* :౼

మన సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక  *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

🪐శ్రీ కృష్ణావతారం

 🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *పురాణ పఠనం*

. *🪐శ్రీ కృష్ణావతారం🪐*

. *101వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*విష్ణు సేవా ప్రాశస్త్యంబు*


“ఓ శుక మహర్షి! శివుడిని సేవించే దేవతలు, మానవులు సుఖసంపదలతో జీవిస్తారు; విష్ణువును నిండు భక్తితో సేవించే మునీశ్వరులు నిరుపేదలుగా జీవిస్తారు; దీనికి కారణం ఏమిటో వివరించు.” 

అలా అడిగిన పరీక్షిత్తుతో శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. “అలా ఉండటానికి కారణం చెప్తాను. ఓ పుణ్యపురుషుడా! శ్రద్ధగా విను. నీలకంఠుడు అయిన శివుడు మహాశక్తి సంపన్నుడు. సత్త్వ రజస్తమో గుణ సమేతుడు. కనుక పరమశివుడిని సేవించేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. అచ్యుతుడు, పరమాత్మ, అనంతుడు, పురుషోత్తముడు, ఆదిపురుషుడు అయిన శ్రీహరి త్రిగుణాతీతుడు. అతడిని కొలిచేవారు కూడా రాగరహితులే. వారు సంపదలను కోరరు. ధర్మరాజు రాజసూయయాగం చేసిన తర్వాత కోరి నారదాది మహర్షుల వలన ఎన్నో పుణ్యకధలు విన్నాడు. అలా నారదుని వలన పుణ్యకథా శ్రవణానంతరం, నన్ను ఎంతో ఆసక్తితో నీవడిగిన ఇదే ప్రశ్నను, పాండురాజ పుత్రుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు. అంతట మందహాస సుందర వదనారవిందుడై కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. “మహారాజా! ధర్మరాజా! ఎవరిపై నాకు అనుగ్రహం కలుగుతుందో ఆ ఉత్తముడి సంపదలు సమస్తము నేను హరిస్తాను. అతడు ధనహీనుడై దుఃఖిస్తాడు. బంధువులు అతడిని వదలివేస్తారు. అతడు నిస్సహాయుడై అన్నింటినీ త్యజించి నా భక్తులతో స్నేహం చేస్తాడు. క్రమంగా విజ్ఞానాన్ని పొంది, తుదకు అవ్యయానందచిత్తుడై, సారూప్యాన్ని పొందుతాడు. అందుచేత కొందరు నన్ను సేవించటం చాలా కష్టమని అనుకుని ఇతర దేవతలను ఆరాధిస్తారు. అలా ఆరాధించి ఆ దేవతలు అనుగ్రహించిన ఐశ్వర్యాలను సత్యమైనవని అనుకుంటారు. పిమ్మట కృతఘ్నులై వారు తమకు శుభాలను అనుగ్రహించిన ఆ దేవతలనే మరచిపోతారు. దీనికి తార్కాణంగా ఒక కథ ఉంది. అది నీకు చెప్తాను. నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం దానితోతెలుస్తుంది.


 వృకాసురుండు మడియుట 


శకుని అనే రాక్షసుని కొడుకు వృకాసురుడు. వాడు దుర్మార్గుడు. సుజనులను దారికాచి బాధించేవాడు. అలా ఒకనాడు రాక్షసుడు ఒక దారిలో దాగి ఉండి అటు వెళ్తున్న నారద మహర్షిని చూసాడు. అలా ఆ మార్గమున వస్తున్న నారదుడిని చూసి....వృకాసురుడు నారదమహర్షికి చేతులు జోడించి నమస్కారం చేసి ఇలా అడిగాడు “ఓ నారద మహర్షి! నీవు అన్నీ తెలిసిన మహా ఙ్ఞానివి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందున ....తమను సేవించే భక్తులకు ఆ త్రిమూర్తులలో ఎవరు శీఘ్రంగా కోరిన వరాలిస్తారు.” అలా అడిగిన వృకాసురుని ప్రశ్నకు నారదుడు సంతోషంగా ఇలా సమాధానం చెప్పాడు.

“అయితే శ్రద్ధగా విను. దుర్గుణాలు కలవారిమీద ఆగ్రహము చూపాలన్నా, సుగుణవంతులమీద అనుగ్రహము చూపాలన్నా, వెనువెంటనే చూపే దైవం త్రిమూర్తులలో ఒక్క పరమశివుడే. ఈ సంగతి తెలుసుకున్న బాణసురుడు, రావణాసురుడు మున్నగు దానవులు పరమశివుడిని భక్తితో సేవించి మహా సామ్రాజ్య వైభవాలను పొందారు. కనుక, నీవు కూడ శివుడిని భక్తితో పూజించు. నీ అభిమతం వేగంగా ఈడేరుతుంది.” అని చెప్పాడు. వెంటనే....

వృకాసురుడు బయలుదేరి కేదారతీర్థానికి వెళ్ళాడు. అక్కడ సాహసోపేతమైన నియమాలతో నీలకంఠుని, వరదుడిని, మహేశ్వరుడిని గురించి ఘోరతపస్సు చేసాడు. ఆ తీవ్రతపస్సు చూసి లోకాలన్నీ అచ్చెరువొందాయి. తన శరీరం లోని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి అగ్నికి ఆహుతి కావించాడు. అప్పటికి కూడ మదనాంతకుడు పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. వృకాసురుడు పట్టువదలక కేదారతీర్ధంలో స్నానం చేసి మృత్యుకోరవంటి భయంకరమైన గండ్రగొడ్డలితో తన తలని నఱకుకొనుటకు సిద్ధమయ్యాడు. అంతట ఆ అగ్నికుండంలో...పరమశివుడు ఆ అగ్ని గుండంలో నుండి వెలువడి దయతో ప్రత్యక్షము అయ్యాడు. వృకాసురుని చేతిని పట్టుకుని, “సాహసించకు. నీ తపస్సుకు మెచ్చుకున్నాను. నీ మనసులో ఎట్టి కోరికలున్నా కోరుకో. వెంటనే నెరవేరుస్తాను.” అని శివుడు అనగా, వృకాసురుడు ఎంతో సంతోషపడి, శంకరుని పాదాలపై పడ్డాడు....దానవుడు పరమశివుని పాదాలకు నమస్కరించి, “ఓ చంద్రమౌళీ! నుదుట కన్నుగల స్వామీ! నా చెయ్యి ఎవరి తల మీద పెడితే, వారు తల నూరుముక్కలు అయి చనిపోయేలా అనుగ్రహించు.” అలా అని ఆ రాక్షసుడు ప్రార్థించాడు. అది విని శివుడు చిరునవ్వు నవ్వుతూ అతడు కోరిన వరము వెంటనే ఇచ్చాడు. ఆ రాక్షసుడు పార్వతీపతి తనకు అనుగ్రహించిన వరాన్ని పరీక్షించాలనుకున్నాడు. తత్క్షణమే వరగర్వంతోవాడు అహంకరించాడు. ఆ వరం పరీక్షించడానికి సిద్ధపడి ముందుకు వచ్చి. తన చేతిని పరమశివుడి తలమీద పెట్టడానికి ఆ రాక్షుసుడు తెగించాడు. “అయ్యయ్యో నేనిచ్చిన వరం నామీదకే అపాయం తెచ్చిపెట్టిందే” అని శివుడు భయపడి పరుగెత్తాడు. వృకాసురుడు శివుడిని తరుముకుంటూ వెళ్ళాడు. ముల్లోకాలూ భీతిల్లాయి. మునులు దేవతలు కర్తవ్యం తెలియక భయకంపితులై తల్లడిల్లిపోయారు. శివుడు అలా పరగెత్తుకు వెళ్ళి......వైకుంఠపురం చూసాడు. ఆ వైకుంఠాన్ని నిరుపమాన ఆనందనిలయము అమృతపదం, పరమపదం అని ప్రసిద్ధమై నిఖిలలోకాలకూ అవతల సూర్యచంద్ర కిరణాలుసైతం ప్రవేశించటానికి వీలులేని విధంగా ఉండి, మనోఙ్ఞమైన సహజసిద్ధ ప్రకాశంతో విరాజిల్లుతూ ఉంటుంది. యోగులకూ భాగవతశ్రేష్ఠులకూ నివాసస్థలంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది.


మిక్కిలి నిర్మలమైన అనంత తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుంది. దివ్యమైన రత్నాలు, బంగారుమయమై ప్రకాశించే భవనాలు, మండపాలు, తోరణాలు, స్తంభాలు, విస్తారమైన గోపురాలుతో భాసిస్తూ ఉంటుంది ఆ వైకుంఠపురము. అలా దివ్యమైన వైకుంఠం ప్రవేశించిన శంకరుడు శ్రీమహావిష్ణువును దర్శించాడు. ఆ సమయంలో పుండరీకాక్షుడు అయిన శ్రీహరి మహా వైభవంతో ఆదిశేషుడిపై పవళించి ఉన్నాడు. తన మందహాసం అనే వెన్నెలతో లక్ష్మీదేవి కన్నులు అనే చకోరాలను అలరిస్తున్నాడు. ఈ విధంగా ఎన్నో వినోదాలలో తేలియాడుతూ ఉండి కూడ, పరమశివుడు ఆ రాక్షసుడికి వరము ప్రసాదించి, ఆపదలపాలైన విషయాన్ని విష్ణువు తన దివ్యదృష్టితో తెలుసుకున్నాడు. నీలకంఠునికి వాటిల్లిన ఉపద్రవాన్ని పోగొట్టాలని హరి నిశ్చయించుకుని, లక్ష్మీదేవితో సాగిస్తున్న వినోదాలను ఆపాడు. విష్ణువు వటువు వేషం ధరించాడు. చీకటిమాను వంటి నల్లని ఛాయ గల నెమ్మేనిపై చంద్రకిరణం లాంటి తెల్లని జందెపుపోగు, బంగారు మొలత్రాడు, పసుపువన్నె గోచీ ధరించాడు. దండ కమండలాలతో, పట్టెవర్ధనంతో, పట్టుగొడుగుతో, జింకచర్మంతో, హోమం బొట్టుతో, పిలక వ్రేలాడుతుండగా, వ్రేళ్ళ మధ్యన దర్భలతో అచ్చమైన బ్రహ్మచారి అయి ముచ్చటగా దానవుడిని సమీపించాడు. అలా పరమ అద్భుతంగా అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఉన్న ఆ బాల వటువు వేషంలో ఆ వృకాసురుని దగ్గరకు వెళ్ళాడు.

బ్రహ్మచారి వేషంలో వెళ్ళిన విష్ణువు, దానవుడు వృకాసురుడికి కపట నమస్కారం చేసాడు. తియ్యని మృదు భాషణాలతో రాక్షసునితో ఇలా స్వాంతన వచనాలు పలికాడు. “అన్నా! ఇంత అలసిపోతు ఎందుకింత దూరం వచ్చావు? ఏ సుఖాలకైనా మూలమైనది ఈ శరీరమే కదా. ఊరక దానిని ఇలా ఎందుకు దుఃఖపెడుతున్నావు? ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకో. ఇంతటి నీ ప్రయాసకు కారణము ఏమిటి?” అని వాడిని ప్రశ్నించాడు. ఆ వటురూపి తీయనిమాటలకు సంతోషించి, ఆ రాక్షసుడు తాను తలపెట్టిన కార్యాన్ని వివరించాడు. విష్ణుమూర్తి మందహాసంచేస్తూ ఆ రాక్షసుడితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసరాజ! మునుపు దక్షుడి శాపం వలన పిశాచాలకు అధిపతి అయ్యాడు. కనుక, శంకరుడు నిజాలు మానేసి అబద్ధాలే చెప్తున్నాడు. ఆయన గారి చేష్టలు మాకేమీ కొత్తకాదులే. శివుని విషయం తెలియక అతని వెంట అనవసరంగా పడుతున్నావు.

దానవోత్తమా! పరమేశ్వరుడు సత్యం పలికేవాడే అయితే నీ చేయ్యి తన శిరస్సుకు తగలనీయకుండా భయంతో ఎందుకు పారిపోతాడు? ఇంతకీ శివుడి విషయంలో నమ్మదగినది ఏమైనా ఉన్నదా? అదీగాక దైత్యేంద్రా! నీవు అశుచిగా ఉండి మహేశుడిని తాకడం తగదు. అందుచేత, వెళ్ళి కాళ్ళుచేతులూ కడుగుకుని, ఆచమనం చెయ్యి. అప్పుడు శివుడిని వెంబడించి అతడిని తాకావచ్చు, నీ సందేహం తీర్చుకోనూవచ్చు. అనవసరంగా లేనిపోని శంకలు పెట్టుకోకు. వెంటనే బయలుదేరు.” అంటూ దానవాంతకుడు అయిన విష్ణువు హెచ్చరించాడు. వృకాసురుడు విష్ణుమాయవలన తనను తాను మరచి, తామసంతో తన చేతిని తన నెత్తి మీదే పెట్టుకుని మరణించాడు. వృకాసురుడు ప్రసిద్ధమైన వజ్రాయుధం దెబ్బకు కూలిన మహా పర్వతంలా నేలకూలాడు. అలా తన చెయ్యి తన నెత్తిన పెట్టుకోడం వలన, తల నూరు ముక్కలై నేలగూలిన వృకాసురుడిని చూసి దేవతలు, అప్పుడు....దానవవైరి హరి మీద దేవతలు మందార పూల వాన కురిపించారు. ఆకాశంలో దేవ దుందుభులు మున్నగు దివ్య వాయిద్యాలు మ్రోగాయి. గంధర్వులు పాటలు పాడారు. అప్సరసలు సంతోషంతో నాట్యాలు చేశారు, ఆకాశంలో గ్రహాలన్నీ కూటములు కట్టాయి. మునుల భీతిని విడిచారు. అప్పుడు...మురాసురసంహారి శ్రీహరి చిరునవ్వుతో పరమ శివుడితో ఇలా అన్నాడు “భూతేశ్వరా! ఈ దానవుడు నీకు అపకారం తలపెట్టి తనకు తానే మరణించాడు. అలాగే అవుతుంది కదా. లోకంలో మహాత్ములకు కీడు చేసిన వాడికి శుభాలు దక్కవు కదా. అలాంటిది లోకేశ్వరుడవు అయిన నీకు అపకారం తలపెట్టిన దుష్టుడు చావక తప్పదు. ఇలాంటి దుర్మార్గులకు అలాంటి వరాలు ఇవ్వడం తగదు.” అని ఈ రీతిగా పలికిన విష్ణువు శంకరుడికి వీడ్కోలు చెప్పాడు. హరుడు హరిని అనేక విధాలుగా స్తుతిస్తూ తన నివాసానికి వెళ్ళిపోయాడు.” అని చెప్పి మరల ఇలా అన్నాడు.

ఈ వృకాసుర వృత్తాంతం వినిన పుణ్యాత్ములు నిత్యం సుఖసంతోషాలతో జీవిస్తూ తుదకు మోక్షం పొందుతారు. ఇలా ఈ ఉపాఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పి శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో ఇంకా ఇలా అన్నాడు. “మహారాజా! నీకు ఇంకొక పురాతనగాథ చెబుతాను విను. పూర్వం తపోధనులైన మునులు ఎందరో సరస్వతీనదీ తీరంలో ఉండేవారు.


సశేషం🙏


*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐