29, డిసెంబర్ 2022, గురువారం

స్మశాన నారాయణస్వామి* *ఆలయం,*

 *స్మశాన నారాయణస్వామి* *ఆలయం,*

*ఆలంపుర్*


పితృ దోషము నుండి బయటపడే 

సులువైన పరిష్కారం..


#పితృదోషం మన తాతలు తండ్రులు 

సంపాదించిన ఆస్తిపాస్తులను 

వంశపారంపర్యంగా అనుభవించటానికి 

మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ...

అలాగే... 

తాతలు తండ్రులు చేసిన 

పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.

మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.

అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు..


మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే #పితృదోషం


ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం.

అందుకే ఈ పోస్టు పెడుతున్నాను.

పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.


ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.

వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...


🔻 చిన్న వారు అకాలమరణం పొందడం 


🔻 శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.


🔻 అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం.


🔻 మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం.


🔻 మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం


ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం

దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.

స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే ...

అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.


1. కాశీ

2. పాపనాశి  ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)


అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.


విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .

అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.


స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....

పాలు అన్నముతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నేయి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని  స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు . 

స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.

ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును ) 

అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ  స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.


ఈ ఆలయ ప్రాముఖ్యము  తంత్ర గురు "వేణు మాధవ నంబూద్రి " ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !

ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం..


చేరుకొనే విధానం:


అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "


ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి!


దయవుంచి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.


    🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏

స్పాండిలైటిస్

: స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 


          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 


       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 


          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 


              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 


       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 


      ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం  ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  


                కాళహస్తి వేంకటేశ్వరరావు 


            అనువంశిక ఆయుర్వేద వైద్యం 


                      9885030034

[29/12, 5:36 am] +91 98850 30034: వ్యాధుల నివారణ కొరకు రహస్య తాంత్రిక ప్రయోగాలు  - 1


     మనుష్యుడు యొక్క రోగాలకు ప్రధానకారణం తన అలవాట్లతోపాటు పూర్వజన్మ కర్మఫలం కూడా ఉంటుంది. మన జాతకంలో గ్రహస్థితులు కూడా మన ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తాయి. మనిషికి సంప్రాప్తించిన రోగాలకు ఔషధాలు వాడటం మాత్రమే కాదు కొన్నిరకాల తాంత్రికపరమైన చిట్కాలు చేయడం ద్వారా కూడా సమస్య నుంచి బయటపడవచ్చు.  అనారోగ్యం వచ్చినపుడు ముందు ఔషధసేవన చేయవలెను . తగ్గనప్పుడు ఆ రోగకారణమైన గ్రహానికి జపం చేయించవలెను . మార్పు రాకున్నచో అభిషేకం ఆ తరువాత హోమం చేయించవలెను . కాని ఔషధసేవన మాత్రం విడువరాదు. పురాతన కాలము నందు వైద్యులకు వైద్యశాస్త్రముతో పాటు జ్యోతిష్యం మరియు ప్రశ్నశాస్త్రము నందు సంపూర్ణ అవగహన ఉండేది. 


                  ఈ మూడింటిని కలిపి తప్పక నేర్చుకునేవారు. " వైద్యజ్యోతిష్యము " అని ఆయుర్వేదం నందు ఒక ప్రత్యేక విభాగం ఉండేది.  అదేవిధంగా కొన్నిరకాల మంత్ర మరియు తాంత్రిక ప్రయోగ పద్ధతులను పాటించి సులభముగా అనారోగ్యము నుంచి బయటపడవచ్చు. 


      మన ప్రాచీన భారతదేశం అనేక శాస్త్రాలకు పుట్టినిల్లు . ఆయా శాస్త్రాలలో ఎన్నొ పురాతన ప్రక్రియలు ఉన్నాయి . అటువంటి శాస్త్రాలను నేను సేకరించే పని మీద ఉన్నాను. నాకు లభ్యం అయిన అటువంటి పురాతన గ్రంథాలను చదివి అవగాహన చేసుకుని కొన్ని అనుభవ యోగాలను జోడించి నేను రెండు గ్రంథాలు రాయడం జరిగింది. ఇప్పుడు మీకు తాంత్రిక పద్దతిలో అనారోగ్యం నుంచి బయటపడుటకు కొన్ని రహస్య యోగాల గురించి వివరిస్తాను. 


 తాంత్రిక యోగాలు  - 


 *  మనశ్శాంతికి  - 


        మనశ్శాంతి లేకపోవడం వలన మనము చేసేపని మీద శ్రద్ధ పెట్టలేము . అటువంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు శుక్లపక్ష సోమవారం నాడు ప్రారంభించి వరుసగా ఏడు సోమవారాలు శివలింగానికి పాలు మరియు నీరు కలిపి అభిషేకం చేస్తూ " ఓం నమః శ్శివాయ " అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి . ఈ విధముగా ఏడు సోమవారాలు చేసిన మనశ్శాంతి లభించును. 


 *  గుండె దడ నివారణ కొరకు  - 


      " ఓం నమః శ్శివాయ " అనే పంచాక్షరి మంత్రం కాని " ఓం నమో నారాయణాయ నమః " అనే అష్టాక్షరీ మంత్రం జపించుచున్న గుండె దడ తగ్గును. 


 *  శరీర ఆరోగ్యానికి  - 


       శరీరంలోని అనారోగ్య భాధ ఎన్నటికీ తగ్గకున్న గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయవలెను . గంగాజలం ఎక్కువ లేకున్న  స్నానానికి సిద్ధం చేసుకున్న నీటిలో కొంచం గంగాజలం కలుపుకొని ఆ నీటితో అయినా స్నానం చేయవచ్చు . 


 *  రోగవిముక్తికి  - 


      దేవాలయంలో గుప్తదానం చేయడం రోగ నివారణకు ఫలవంతమైన ఉపాయం . 


 *  శరీరంలో కఫదోష నివారణ కొరకు  - 


      కఫదోష నివారణ కొరకు రావిచెట్టు మీద పెట్టిన తేనె తుట్టె నుంచి సేకరించిన తేనె లోపలికి  తీసుకోవలెను . సైన్ధవ లవణంతో భంగు కలిపి తీసుకోవడం వల్ల జఠరాగ్ని పెరుగును . 


 *  అనారోగ్యం తొలగి ఆరోగ్యం వృద్ధికి  - 


      వేపచెట్టు నాటాలి . తూర్పు దిక్కుకి ఎదురుగా నిలుచొని రాగిచెంబుతో నీటిని అర్పించాలి. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి ఇది బాగుగా పనిచేయును . 


 *  రోగ నివృత్తికి  - 


      ఇంట్లో ఎవరైనా రోగగ్రస్తులై ఉంటే వారిని ఇంటికి నైరుతి కోణంలో పడుకోపెట్టి ఈశాన్యకోణంలో చల్లని నీటికుండ ఉంచాలి. రోగి వాడుతున్న ఔషధాలు శక్తివంతంగా పనిచేసి రోగి అనారోగ్యం నుంచి కోలుకుంటాడు. 


 *  అనవసరపు తగువులు నుంచి రక్షణ  - 


        రాత్రిపడుకునే ముందు మంచం కింద రాగిగ్లాసులో నీరు ఉంచి ఉదయం ఆ నీటిని ఏదైనా మొక్క దగ్గర పోయాలి వ్యాధుల నుండి అనవసరపు తగువులు నుండి రక్షణ కలుగును. 


            తరవాతి పోస్టులో మరిన్ని తాంత్రిక విషయాలు వివరిస్తాను. 


 

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

అందం అంటే ఏంటి

 అందం అంటే ఏంటి నాన్నా అని ఎనిమిదేళ్ళ కూతురు తన నాన్నను అడిగితే, వాళ్ళ నాన్న చెప్పిన సమాధానం.....


రోజూ లేవగానే నువ్వు నానమ్మకు గుడ్ మార్నింగ్ నానమ్మా  అని చెప్తావు చూడు..ఆ పలకరింపే అందం అంటే.


స్కూల్ కి నిన్ను తీసుకెళ్లేటప్పుడు టర్నింగ్ లో నువ్వు చేతితో సిగ్నల్ ఇస్తావు చూడు అదే అందమంటే..


ఒకరోజు నీ ఫ్రెండ్ నీకు తెలీకుండా నీ పెన్సిల్ తీసిందని నీకు తెలిస్తే మళ్లీ ఎప్పుడూ అలా చెయ్యకు కావాలంటే నన్నడుగు అంటూ షేరింగ్ ఈజ్ కేరింగ్ అని అన్నావు చూడు అదే అందమంటే.


షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఏదన్నా బొమ్మ నచ్చితే .. కాస్ట్లీ అయితే వద్దు నాన్నా అంటావు చూడు అదే అందమంటే..


అమ్మకూ నాకూ గొడవైనప్పుడు నా దగ్గరికొచ్చి స్మైల్ నాన్నా అంటావు చూడు అదే అందమంటే.


నీకు ఐస్ క్రీం కొన్నప్పుడు బయట నుంచి ఆశగా చూస్తున్న ఇద్దరి పిల్లలకు కూడా తీసుకో నాన్నా అన్నావు చూడు అదే అందమంటే.


అమ్మకి ఒంట్లో బాలేనప్పుడు ఇంటి పనిలో నాకు సాయం చేస్తావు చూడు అదే అందమంటే..


నా బాధ నీకు తెలీకుండా నీతో మాట్లాడినప్పుడు అలా ఉన్నావేంటి నాన్నా..అంతా ఓకే అవుతుందిలే అంటావు చూడు అదీ అందమంటే.


అని అనగానే..అందం అంటే హర్ట్ లో ఉంటుందా అన్న ఆయన కూతురు సమాధానం విన్న నేను ఆశ్చర్యంగా..ఆనందంగా తన వైపే చూస్తూ ఉండిపోయాను.


సేకరణ.   🌺🌺🌺