17, జులై 2025, గురువారం

Panchaag


 

బుధవారం 16 జూలై 2025🌷*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🌷బుధవారం 16 జూలై 2025🌷*

        

                    3️⃣``

             *ప్రతిరోజూ...*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*

``

     *శ్రీమద్భాగవత కథలు*

               ``

       *2.1. రఘువంశము*


విశుద్ధమగు సూర్యవంశమున పరమ ప్రతాపుడును, యశస్వియును, దీర్ఘబాహుడును, పుణ్యశ్లోకుడును అగు ఖట్వాంగుడను రాజు పృథివిని పాలించుచుండెను. అతని పరిపాలన ప్రజలకానందము కలిగించుటయేకాక, ప్రజలు ప్రభువునే దైవముగా భావించి, విశ్వసించి గౌరవించుచుండిరి. మహారాజునకు ఏకైక పుత్రుడు కలడు. అతడే దిలీపుడు. 

కుమారుడైన దిలీపుడు దినదినాభివృద్ధిగాంచుచు, 

మహా తేజోవంతుడై తండ్రితో పాలన విషయాదులందు పాల్గొనుచు, దేశమందలి మంచిచెడ్డలను గమనించుచు, విచారించుచు, అతిశ్రద్ధాళుడై ప్రజలమధ్య పెరుగుచుండెను. కుమారుడు పెద్దవాడగుట చూచి యుక్తవయస్సుననే వివాహముజేసి కొంత పరిపాలనా బాధ్యత అతని తలపై పెట్టవలెనని సంకల్పించి, అన్నింటికీ సరిపడునట్టి కోడలు కావలెనని విచారించి, కడకు మగధ నందినియగు సుదక్షిణ అను కన్యతో అత్యంత వైభవముగా వివాహము జరిపించెను. సుదక్షిణ మహాగుణవంతురాలు. సాధ్వియును, సరళ హృదయయునై, పతిననుసరించుచు, ప్రాణసమముగ ప్రేమించి సేవించుచుండెను. పతియగు దిలీపుడు కూడను, మహా గుణవంతుడగుటచే ఆమెకెట్టి లోటునూ లేకుండ చూచుకొనుచు, పరిపాలనా విషయమున తండ్రిననుసరించుచు క్రమక్రమముగా తండ్రి బాధ్యతలన్నింటిని తానే చూచుకొనుచు కొంత విశ్రాంతిని కలిగించుచుండుట ఖట్వాంగుడు గమనించి తనలో తాను కుమారుని తెలివితేటలకును, శక్తి సామర్థ్యములకును ఎంతో సంతసించుచుండెడివాడు.


ఈవిధముగ కొంతకాలము గడచెను. ఖట్వాంగుడు సుముహూర్తమును నిర్ణయించి దిలీపునకు రాజ్యపాలనా పట్టము గావించెను. నాటినుండియు దిలీపు మహారాజను నామముతో సప్తద్వీపవతియగు వసుంధరకు ప్రభువై ధర్మపాలన జరుపుచుండ, సకాల వర్షము కురిసి, సస్యశ్యామలమై సమృద్ధిగా పండి పాడిపంటలకెట్టి కొరతయు లేక నిత్యకల్యాణములతో, వేద పారాయణములతో, శాస్త్రసమ్మతమైన యజ్ఞయాగాది క్రతువులతో అన్ని జాతులవారు హాయిగా జీవించుచుండిరి.


కానీ మహారాజునకు దినములు సంవత్సరములు గడచుకొలది తనలో ఏదో అశాంతి బాధించుచుండినటుల అతని ముఖవర్చస్సు తెలుపుచుండెడిది. కొన్ని సంవత్సరములు గడచెను. ఇచ్ఛ నెరవేరునను ఆశ దినదినమునకు నీరసించెను.


ఒకనాడు తన రాణియగు సుదక్షిణతో తనలోని చింతను ఈరీతిగా వెలిబుచ్చెను: “ప్రియా! మనకింత వరకును సంతానము లేకపోవుటచే కొడుకులు లేరను చింతకంటెను ఇక్ష్వాకు వంశ ప్రసారమెట్లు కాగలదను విచారము నన్ను మరింత బాధించుచున్నది. దీనికి నేనొనరించిన ఏ పాపఫలమో కారణమయి ఉండ వచ్చును. దాని పరిహారార్ధమై ఏమి చేయవలెనో నాకు తోచుటలేదు. దైవ కరుణా కటాక్షమును అందుకొనుటకు తగిన మార్గమేదియో మన కులగురువగు వసిష్ఠులవారిని అడిగి తెలిసికొన వలెనని ఈనాడు నా మనసు తత్తరపడుచున్నది. ఇందుకు నీ ఉద్దేశ్యమేమి?” అని దిలీపుడు అడుగ సుదక్షిణ ఆలస్యము చేయక, ఆలోచించక, “నాథా! ఇదే ఆలోచన నాలోను చాలా దినములనుండి బాధించుచున్నప్పటికిని పతి ఆజ్ఞ లేక నా తలంపును బైట పెట్టుట తప్పగునేమో అని నాలోనే నేను అణచుకొంటిని. తమ ఇచ్ఛననుసరించుటకు నేనెల్లప్పుడు సిద్ధమే అనునది తమకు విదితమే కదా. ఇందుకు ఆలస్యమెందుకు?” అని రాణి తన అంగీకారమును తెలుపగనే, దిలీపుడు రథమును సిద్ధము చేయించి, “ఈనాడు నావెంట పరివారము, రక్షక భటు లెవ్వరును రానక్కరలేద”ని ఆజ్ఞాపించి తానే రథమును నడుపుకొని గురుదేవులగు వసిష్ఠులవారి ఆశ్రమము చేరెను.


రథ శబ్దము వినగనే వెలుపలనున్న ఆశ్రమవాసులు లోనికి వెళ్లి గురువుగారికి తెలుప, వసిష్ఠులవారు ద్వారము చెంతకు వచ్చి దిలీపుని ఆశీర్వదించి కుశల ప్రశ్నలు గావించుచుండ, రాణి సుదక్షిణ చెంతనేయున్న అరుంధతీదేవికి నమస్కరించెను. అంత అరుంధతి ఆమెను ఆశీర్వదించి, ప్రేమతో కుశల ప్రశ్నలు గావించుచు లోనికి తీసుకొని వెళ్లెను. అంత, రాజుకూడను ప్రభు ధర్మము ననుసరించి, “ఆశ్రమ జనులకుకానీ, యజ్ఞ యాగాది సత్కర్మలకుకానీ, లేక ఆహార విహారములకుకానీ, ఎట్టి ఇబ్బందియు లేక అరణ్యమునందు క్రూర మృగముల బాధలులేక, తమతమ నిత్యానుష్ఠానములు సక్రమముగ జరుగుచున్నవి కదా?” అని గురువైన వసిష్ఠులవారిని, ఆశ్రమవాసులను కుశల ప్రశ్నలు గావించుచు, లోనికి వెళ్లి వారివారి ఆసనములు వారు స్వీకరించిరి.


అంత వసిష్ఠులవారు అచటున్న ఆశ్రమవాసులను తమతమ వసతులకు వెళ్ళమని ఆజ్ఞాపించి, రాజు తన ఆశ్రమమునకు రాణీ సమేతుడై వచ్చిన కారణమును తెలుపుమని అడుగ, రాజు తనకుగల కొరతను, విచారమును, వినయముతో విన్నవించి, తమ అనుగ్రహము తప్ప, ఇందుకు అన్యమార్గము లేదని ప్రార్థించెను.``


                  *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*

      *జ్వాలా వారి విశిష్ట*     

      *వ(ర)చనామృతం*  

  *‘శ్రీమద్భాగవత కథలు’* ``

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

తు.చ. తప్పకుండా

 తు.చ. తప్పకుండా అనే పదం ఎలా వచ్చింది?

*********


తు.చ. తప్పకుండా అనే పదం సంస్కృతం నుండి వచ్చిందిట. 

ఈ సంస్కృత #శ్లోకాలు రాసేటప్పుడు పాటించవలసిన #నియమాలలో 

పంక్తికి ఎనిమిది అక్షరాలు ఉండాలనే ఒక నియమం ఉండేదిట. 


ఒక్కోసారి ఎనిమిది అక్షరాలు రాయటం కుదరనప్పుడు ... 

తు, చ, స్వ, హి, వై వంటి కొన్ని అక్షరాలను వాడటం ఉంచవచ్చు. 


ఉదాహరణకు : రామాయ లక్ష్మనశ్చతు


తు.చ. అంటే ...

!!రామస్తు సీతాన్ దృష్ట్వా.... రామశ్చ చకార!! 

తు ,చ అనేవి సంస్కృత భాషలో విశేషాలక్రింద లెక్క. ఇది పాద పూరణ కోసం వాడతారు. ఇవి సంస్కృత వాజ్మయంలోనివి.


తు.చ. తప్పకుండా తెలుగులోకి ఎలా వచ్చింది?

*********


మన కవులు కొంతమంది సంస్కృత శ్లోకాలను తెలుగులోకి #అనువాదం చేసేటప్పుడు సంస్కృత శ్లోకాలు వ్రాసిన వారు ఉపయోగించిన తు, చ, స్వ, హి, వై వంటి వాటికి సైతం కాని, మరియు అనే పదాలను ఉపయోగించి అనువాదం చేశారు.


సంస్కృతం/దేవభాష మీది #గౌరవంతో తెలుగు కవులు తు, చ వంటి అక్షరాలను సైతం వదలి పెట్టకుండా కచ్చితంగా, ఉన్నది ఉన్నట్లుగా అనువాదం చేయడం వలన ఈనాడు కచ్చితంగా, #ఉన్నది_ఉన్నట్లుగా అనే పదాలు వాడవలసిన చోట తు.చ. తప్పకుండా అనే పదాం #ఉపయోగంలోకి వచ్చింది.


నిజానికి సంసృత శ్లోకాల్లో అర్ధముతో నిమిత్తము లేకుండా #గణముతో సరిపెట్టడానికి " తు.చ." అని పూరణార్ధము వేసుకుంటారు . అలా వేసినవాటిని విడిచిపెట్ట కుండా ప్రమాణం గా స్వీకరించడమే దానర్ధము .


సంస్కృతం లో తు, చ అనే అక్షరాలని conjunction కోసమూ, ఛందస్సు లో గణాలు సరిపెట్టడం కోసం ఒక అక్షరం అవసరమైన సందర్భాల్లోనూ వాడతారు. పద్యం కోసం వాడినప్పుడు 

ఈ అక్షరాలు పద్యం యొక్క అర్ధానికి కొత్తగా ఎమీ తోడ్పడవు, ఇవి తీసెయ్యడం వల్ల పద్యం అర్ధం చెడదు. కేవలం fillers లాగ పని చేస్తాయి.

ఎవరైనా ఏదైనా Copy చేసే సందర్భాల్లో, అర్ధానికి contribute చెయ్యవని చెప్పి ఈ అక్షరాలని వదిలెయ్యకుండా వీటిని కూడా Copy చేస్తే, దీన్ని తు చ తప్పకుండా Copy చెయ్యడం అంటారు. #ఉన్నదున్నట్టు చెప్పడాన్ని తు చ తప్పకుండా చెప్పడం అన్న వాడుక ఈ విధంగా వచ్చింది.


తు.చ. ని విడమర్చితే... 

****

'తు' అంటే #తుమ్మినా....'చ' అంటే #చచ్చినా అని.ఇది పూర్తిగా తెలుగు వ్యావహారిక జానపదము. 


మన సంప్రదాయం ప్రకారం ఎవరైనా తుమ్మితే అది అశుభం లేదా అపశకునంగా భావించి సదరు చెయ్యబోయే పనిని ఆపివేస్తారు. ఇక ఎవరైనా ఒక వ్యక్తి చచ్చిపోయిన తరువాత కొన్ని పనులు అర్థంతరంగా ఆగిపోతాయి. ఇక్కడ మొదటిది (తుమ్ము) మన జీవితములో చాలా సాధారణంగా జరిగే విషయం, అతి స్వల్పమైనది. ఇక రెండవది (మరణం) జీవమే లేనిది, అంటే అతి గరిష్ఠమైనది. ఈ రెండిటిలో ఏది జరిగినా తప్పకుండా ఆ యొక్క పనిని ముగించుతాను అని అర్థము అనగా ఎన్ని అవాంతరాలు వచ్చినా అనుకున్న పని అయిపోవాలి అనే దృఢ సంకల్ప బలమే 'తప్పకుండా' అనే పదానికి 'తు.చ.' బలము.


తు.చ. తప్పకుండా అనే పదాన్ని కచ్చితంగా లేక ఉన్నది ఉన్నట్లుగా అనే అర్ధం వచ్చేలా లేక ఈ పదాలకు మరింత బలాన్ని చేకూర్చేదిగా చెబుతారు..

చిరు ప్రశంసే ముందుకు నడిపించే..!

 *చిరు ప్రశంసే ముందుకు నడిపించే..!!*


ఎండిన నేలలో కురిసిన చిరు జల్లులా 

మనసును తేలికపరిచే పన్నీరులా

లక్ష్య సాధనలో చిరునవ్వుల్లా

*చిరు ప్రశంసే* ముందుకు నడిపిస్తుంది...


ఆడి పాడే బాలలకు కొత్త ఉత్సాహం 

మట్టిలో మొక్కకు నీరులా ప్రోత్సాహం 

అనారోగ్యం మనిషికి ఔషధంలా 

*చిరు ప్రశంసే* సంజీవనిగా నిలుస్తుంది...


క్రీడాకారులకు స్ఫూర్తి మాత్రం 

కళాకారులకు చప్పట్లే ముచ్చట్లుగా 

ఉల్లాసం కలిగించే జీవామృతం 

*చిరు ప్రశంసే* ప్రతిభకు నిదర్శనం..


ఆవిష్కరణలకు చిరునామాగా

పరిశోధకులకు పట్టుదలగా 

అనాథలకు ఆపద్బంధువులా

*చిరు ప్రశంసే* ముందు నడిపించే..


అమ్మ పాటలా ముందుకు నడిపిస్తూ 

నాన్న మాటలా ధైర్యాన్ని కలిగిస్తూ 

మిత్రునిలా వెన్నంటే నీడలా ఉంటుంది 

*చిరు ప్రశంసే* నిండైన ఆకారం ఇస్తుంది..


జీవితాన్ని సవ్యంగా సాగించేందుకు 

భుజము తట్టి నడిపించేందుకు 

మెచ్చుకోగలిగిన మాటలే ఉంటే 

నిరాశ జీవితానికి *చిరు ప్రశంసే జీవం*..!!


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

సత్యానికి ధైర్యం ఎక్కువే..!!*

 *సత్యానికి ధైర్యం ఎక్కువే..!!*


వాస్తవాలు నిజంగా ఔషధ గుళికలే 

చెవులకు కఠోరంగా ఉన్నప్పటికీ 

తనువులో అలజడి సృష్టించింది 

మనసును ఆలోచన వైపు మళ్ళిస్తాయి...


సత్యానికి ధైర్యం ఎక్కువే 

అసత్యాలు ఎన్ని ప్రచారం చేసినా 

నిండుకుండలా తొణకకుండా

మనసును నిర్మలంగా ఉంచుతుంది...


అబద్దాన్ని కప్పిపుచ్చేందుకు 

వందల అబద్ధాలు తోడు చేయాలి 

నిక్కమైన మాట ఒక్కటే చాలు 

నిన్ను అందలమెక్కించి ఆదరించును..


అపద్దమనే వ్యసనానికి లోనైతే 

మనల్ని నమ్మే వారిని కోల్పోతాం 

సత్యం వైపు మొగ్గ గలిగితే 

శాశ్వత కీర్తితో నిలబడగలుగుతాం...


సత్కీర్తి కోసం పుణ్యపురుషులు 

మాటకు కట్టుబడి తనువును త్యజించారు 

వారి బాటలే మనకు ఆదర్శం 

వాళ్ల చరిత్రలే జగతికి నిదర్శనం..


ఈర్యా ద్వేషాలను వదిలితే 

నిర్మలమైన మనసులో సుఖం 

పగను పెంచుకుంటే ఇంట్లో పాములా 

సుఖనిద్రను వదిలి వెయ్యాల్సిందే...


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235