31, ఆగస్టు 2021, మంగళవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 *31.08.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - నాలుగవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*రాజోవాచ*


*4.1 (ప్రథమ శ్లోకము)*


*యాని యానీహ కర్మాణి యైర్యైః స్వచ్ఛందజన్మభిః|*


*చక్రే కరోతి కర్తా వా హరిస్తాని బ్రువంతు నః॥12301॥*


*నిమి మహారాజు నుడివెను* "యోగీశ్వరులారా! సర్వేశ్వరుడైన శ్రీహరి తనను ఉపాసించినవారి యొక్క భక్తిప్రపత్తులకు వశుడై, లోకకల్యాణార్థము తన ఇచ్ఛానుసారముగా అనేక అవతారములను దాల్చి, వివిధములైన అద్భుతలీలలను ప్రకటించుచుండును. ఇంతవరకును ఆ భగవంతుడు ప్రదర్శించిన లీలలను, ఇప్పుడు చేయుచున్నవాటిని, మున్ముందు నడుపబోవు మహత్కార్యములను గూర్చి వివరింపుడు.


*ద్రుమిల ఉవాచ*


*4.2 (రెండవ శ్లోకము)*


*యో వా అనంతస్య గుణాననంతాననుక్రమిష్యన్ స తు బాలబుద్ధిః|*


*రజాంసి భూమేర్గణయేత్కథంచిత్ కాలేన నైవాఖిలశక్తిధామ్నః॥12302॥*


*ఏడవయోగీశ్వరుడైన ద్రుమిళుడు ఇట్లు నుడివెను* "నిమి మహారాజా! భగవంతుడు అనంతుడు. ఆ స్వామి గుణములు అసంఖ్యాకములు. ఆ ప్రభువుయొక్క గుణములను యథాక్రమముగా పూర్తిగా లెక్కింప బూనుకొనుట మూర్ఖత్వమేయగును. ఏదోవిధముగా ఎంతకాలమునకైనను భూమికణములను లెక్కింప వచ్చునేమోగాని, సమస్తశక్తులకు ఆధారమైన ఆ సర్వేశ్వరుని గుణములను మాత్రము లెక్కించుట అసాధ్యము.


*4.3 (మూడవ శ్లోకము)*


*భూతైర్యదా పంచభిరాత్మసృష్టైః పురం విరాజం విరచయ్య తస్మిన్|*


*స్వాంశేన విష్టః పురుషాభిధానమవాప నారాయణ ఆదిదేవః॥11303॥*


ఆ పరమాత్మ తననుండి పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము - అనుపంచ మహాభూతములు మొదలగు చతుర్వింశతి తత్త్వములను తానే సృష్టించెను. వాటిద్వారా విరాడ్రూపమైన బ్రహ్మాండమును నిర్మించి, అందు తనయొక్క అంశతో అంతర్యామిరూపమున ప్రవేశించెను. అప్పుడు ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుడు *పురుషుడు* అను పేరుతో ఖ్యాతి వహించెను. ఇది ఆ స్వామియొక్క మొదటీ అవతారము.


*4.4 (నాలుగవ శ్లోకము)*


*యత్కాయ ఏష భువనత్రయసన్నివేశో యస్యేంద్రియైస్తనుభృతాముభయేంద్రియాణి|*


*జ్ఞానం స్వతః శ్వసనతో బలమోజ ఈహా సత్త్వాదిభిః స్థితిలయోద్భవ ఆది కర్తా॥12304॥*


ఈ ముల్లోకములును ఆ పరమాత్ముని శరీరమే. ఆయనశక్తి కారణముననే దేహధారులైన సమస్తప్రాణుల యొక్క జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు రూపొందినవి. ఆ స్వామియే ప్రాణులన్నింటిలో అంతర్యామి రూపమున స్థితుడైయున్నాడు. అందువలననే సకలజీవులలో జ్ఞానశక్తి, ప్రాణశక్తి ఏర్పడినవి. ఆ ప్రభువు యొక్క శక్తివలననే అందఱికిని శారీరకశక్తి, మానసికశక్తి, క్రియాశక్తి సమకూరినవి. ఆదికారణుడైన శ్రీమన్నారాయణుడు సత్త్వ, రజ, స్తమోగుణములద్వారా ఈ విశ్వము యొక్క ఉత్పత్తి, స్థితి, లయములను జరుపుచుండును. ఇది ఆ పరమాత్ముని లీలావిలాసము.


*4.5 (ఐదవ శ్లోకము)*


*ఆదావభూచ్ఛతధృతీ రజసాస్య సర్గే విష్ణుః స్థితౌ క్రతుపతిర్ద్విజధర్మసేతుః|*


*రుద్రోఽప్యయాయ తమసా పురుషః స ఆద్య ఇత్యుద్భవస్థితిలయాః సతతం ప్రజాసు॥12305॥*


ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడే మొట్టమొదట రజోగుణముద్వారా బ్రహ్మరూపమున విశ్వమును సృజించెను. యజ్ఞములకు అధిపతియైన శ్రీహరి ద్విజులయొక్క వర్ణాశ్రమాను గుణధర్మములను నిలుపుటకై సత్త్వగుణముద్వారా విష్ణురూపమున విశ్వమును రక్షించుచుండును. ఆ ఆదిపురుషుడే రుద్రరూపమున తమోగుణముద్వారా విశ్వమును లయమొనర్చును. ఈ విధముగా ఈ విశ్వముయొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు శ్రీమన్నారాయణుడే కారకుడు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*402వ నామ మంత్రము* 31.8.2021


*ఓం విద్యాఽవిద్యా స్వరూపిణ్యై నమః*


విద్య (జ్ఞానము, ఏకత్వం), అవిద్య (అజ్ఞానం, నానాత్వ భావము) - ఈ రెండిటి స్వరూపమై విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలీ *విద్యాఽవిద్యా స్వరూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును, *ఓం విద్యాఽవిద్యా స్వరూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ తల్లి అజ్ఞానులకు జ్ఞానము, అద్యైతభావన, జ్ఞానులకు కైవల్యమును ప్రసాదించును.


'విద్యను, అవిద్యను తెలిసికొనినవాడు అవిద్యచే మృత్యువును తరించి, విద్యచే అమృతత్వమును, మోక్షమును పొందును' అని ఈశాన్యోపనిషత్తులో చెప్పబడినది. విద్య, అవిద్య అను రెండిటిని గ్రహించవలెను. అందుచే విద్యా, అవిద్యల స్వరూపమైన పరమేశ్వరిని ఉపాసించవలెను. విద్య అనగా స్వాత్మారూపజ్ఞానము అనియు, అవిద్య అనగా చరమవృత్తి జ్ఞానము అనియు అందురు. అనగా అద్వైతభావనతో తననే పరమాత్మగా తెలిసికొనుట విద్య అని చెప్పబడితే, జీవాత్మ, పరమాత్మలను వేరు వేరుగా చెప్పడమనేది అవిద్య. దేనిలో భేదవృత్తితో చరమవృత్తి రూపజ్ఞానము ఉండునో అది అవిద్య, దేనిలో వృత్తిరాహిత్యముతో ఆత్మైక్యానుభూతి కలుగునో అది విద్య. ఇటువంటి విద్య-అవిద్యల రెండిటి స్వరూపము తనదిగా విరాజిల్లుచున్నది పరమేశ్వరి గనుకనే ఆ తల్లి *విద్యాఽవిద్యా స్వరూపిణీ* యని అనబడినది.


విద్యాస్వరూపము తెలిసికొనిన జ్ఞాని ముక్తుడగును. అవిద్యారూపమును తెలిసినవాడు సంసారబంధమును పొందును. విద్యా-అవిద్యలు రెండూ అవసరమే ఎందుకంటే ఆ రెండు స్వరూపాలు కూడా పరమేశ్వరియే గనుక. విద్య-అవిద్యలు రెండూకూడా సమానంగానే ఉపాసన చేయవలసి ఉంటుంది. అవిద్య వల్ల శరీరాన్ని వదలి విద్యతో జన్మరాహిత్యం పొందవలెను. జ్ఞానం లేకుండా ఉపాసన చేయుట వలనగాని, ఉపాసన లేని జ్ఞానం వలన గాని సద్గతి లభించదు. విద్యను ఉపాసించడం వలన దేవలోకము, అవిద్య వలన పితృలోకము ప్రాప్తిస్తాయి. 'భ్రాంతి, విద్య, పరము అనునవి మూడును శివస్వరూపములు. వేరువేరుగా పదార్థములను తెలిసికొనుట భ్రాంతి, అంతయు ఆత్మస్వరూపముగా తెలిసికొనుట విద్య, వికల్పములులేని కేవల పరతత్త్వాకారము పొంది ఉండుట పరము' అని లింగపురాణమున గలదు. విద్య-అవిద్యలు పరమేశ్వరి స్వరూపాలు గనుక, ఆ తల్లి *విద్యాఽఅవిద్యా స్వరూపిణి* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం విద్యాఽవిద్యాస్వరూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*985వ నామ మంత్రము* 31.8.2021


*ఓం అంబాయై నమః*


సకల జగత్తులకు మరియు గుణత్రయమునకు జనని అయిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అంబా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం అంబాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి సర్వకాల సర్వావస్థలయందును కాపాడుచు వారికి సకల సంపదలు, శాంతిసౌఖ్యములు, ఆయురారోగ్యములు ప్రసాదించును.


ఇంతకు ముందు నామములో (984వ నామమంత్రములో) జగన్మాతను *త్రిగుణా* యని స్తుతించాము. *సత్త్వరజస్తమో* గుణములు గలదిగా అమ్మవారిని ప్రస్తుతించాము. ఆ గుణములు కలిగియుండుట మాత్రమేగాక, అట్టి గుణములు వ్యక్తమగుటకు ఆ తల్లియే కారణము. గనుకనే అమ్మవారు *అంబా* (త్రిగుణాంబా) యని అనబడినది. సకలజగత్తులకు ఏవిధముగా జనని అయినదో, అలాగే గుణత్రయమునకు కూడా ఆ పరమేశ్వరి జనని.


సృష్ట్యాదియందు పరబ్రహ్మ స్వరూపిణియైన పరమేశ్వరి అవ్యక్తమై, తాను మాత్రమే యున్నది. అట్టి పరబ్రహ్మ తత్త్వం నుండి సత్త్వము, రజస్సు, తమస్సులనెడి త్రిగుణములతోగూడిన మూలప్రకృతి ఉద్భవించెను. ఆ మూలప్రకృతియందు ఏర్పడిన సంక్షోభకారణముగా మహత్తత్త్వము ఉత్పన్నమాయెను. దానినుండి సూత్రాత్ముడైన హిరణ్యగర్భుని ఉత్పత్తి జరిగెను. ఈ సూత్రాత్మ నుండి జీవులకు ఉపాధియగు (కార్యరూపమైన) అహంకారము, మనస్సు, ఇంద్రియములయొక్క అధిష్ఠానదేవతలు, ప్రాణములు, ఇంద్రియములు, అట్లే శబ్ధాది విషయములు ఉత్పన్నములయ్యెను. ఆ పరమాత్మయే జీవరూపముగా ఈ తత్త్వములన్నింటిలో ప్రవేశించెను. ఈ విధముగా అన్ని రూపములలోను అనంతశక్తి స్వరూపమైన ఆ పరమాత్మ మాత్రమే ప్రకాశించుచుండెను. గుణత్రయమునకు కారణభూతురాలు కనుకనే పరమేశ్వరి *అంబా* యని అనబడినది. ఈ విషయాన్ని మంత్రశాస్త్రములో మంత్రజీవమని చెప్పడం జరిగినది. తేజోమూర్తులకు, శక్తిమూర్తులకు, సకల జగత్తులకును కారణము గుణత్రయము. అటువంటి గుణత్రయమునకు కారణమైన పరమేశ్వరి *అంబా* (త్రిగుణాంబా) యని అనబడినది. 


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం అంబాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

తృటి లో మన లెక్క

 తృటి లో మన లెక్క

౮౮౮౮౮౮౮౮౮౮

మనం అప్పుడప్పుడు వింటుంటాం.. పత్రికలలో చదువుతుంటాం.. 

" *తృటి* లో తప్పిన ప్రమాదం " అని.. అసలీ *తృటి* అంటే ఏమిటి? 

మన పూర్వీకులు మనం కాలాన్ని ఎన్ని భాగాలు గా విడదీసారొ,వాటి పేర్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తృటి =సెకండ్ లో 1000 వంతు

100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేశం అంటే రెప్ప పాటుకాలం నిముషం కాదు.. 

3 నిమేశాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్ట

12 కష్టాలు = ఒక నిముషం 

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము,ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల.

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు

4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం

పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట

అదన్నమాట సంగతి.. 

మనము మన విజ్ఞానాన్ని తెలుసుకుందాం.. భావి తరాలకు తెలుపుదాం.. 

*సర్వేజనా సుఖినోభవంతు!*

శ్రీకృష్ణావతారం

 ॐ శ్రీకృష్ణావతారం - కొన్ని ముఖ్య అన్వయాలు 


    దేవకీదేవి అష్టమ గర్భంలో అవతరించాడు.

    నందగోపునివద్ద పెరిగాడు.


* వెన్నముద్దలు కాజేశాడు 


నవనీతమ్ - "నవ" అంటే "కొత్తగా", 

                    "నీతమ్" అంటే -పొందబడింది"

                      జన్మాంతర సంబంధమైన వాసన పాతది. 

                       ఈ జన్మలో మనకి కోరికలు కలగజేసే కర్మల దోషాలు (ప్రార్థనతో) హరించడం.


* కాళీయమర్దనం 


కాళీయుడు - తమో గుణం 


వ్యాపించేది మాయ.

        మాయకు మూలస్థానమైన వాసనా బీజం "కదంబ వృక్షం" నుండి దూకి తమోగుణంమీద నృత్యం చేశాడు.

        పాదాలు శిరస్సుపై పెట్టుకుంటే, ఆ పాద ముద్రలు చూస్తే, "గరుడుడు"(వేదం) ఏమీ చేయలేడు - అంటాడు. అంటే వేదం కర్మలు చెబుతుంది కదా! 


* గోపికా వస్త్రాపహరణం 


గోపికలు - ఇంద్రియాలు

    - వాసనా తత్త్వం కలిగిన ఇంద్రియాలు నీటిలో మునిగియున్నాయి. 

   - గుడ్డలు విడిచినా(మాయ తొలగినా) మళ్ళీ ప్రాపంచకమైన మాయలో పడతాయి. 

    - మాయను కృష్ణుడు స్వాధీనపరచుకుంటే,

      "నీరు" అంటే "అజ్ఞానం" అనే నుంచీ వస్తే తప్ప ఇవ్వను అన్నాడు.

     ఆయన చేతినుంచీ వచ్చేది "జ్ఞానం".

      లోకంలో వచ్చేది మాయ.


కృష్ణః 


 కర్షతీతి కృష్ణః

 - ఆకర్షించే స్వభావం ఉన్నవాడు. 


    కృష్ణావతారం జరిగి ఇప్పటికి 5,247 సంవత్సరాలైంది.


                      =x=x=x=


    — రామాయణం శర్మ

            భద్రాచలం

తిరుమల తిరుపతి గోవిందా !

 వందేమాతరం

 

తిరుమల తిరుపతి గోవిందా !

 

గత రెండు సంవత్సరాలుగా అధ్యాత్మికంగా కాక ఎడారిమత పాలనలో అక్కడ జరుగుతున్న వికృత కార్యకలాపాల వలన తిరుమల ప్రతీరోజు వార్తా శీర్షికల్లో  కనిపిస్తోంది.

 

కరోనా పేరు చెప్పి ఉచిత దర్శనం రద్దు చేసారు. ప్రస్తుతం ఆంధ్రాలో అవనీతి ఆనవాయితీ కాబట్టి 300 రూపాయలిస్తే కరోనా రాదనుకొంటా, ఆ దర్శనం మాత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంలా కొనసాగుతోంది.

కొండక్రింద తిరుపతిలో కూడా దైవ దర్శనాలకి ఎటువంటి ఆంక్షలు లేవు. 

 

కరోనా పేరు చెప్పి  ప్రజల  దృష్టికి అందని మరోక భయంకరమైన కుట్ర అక్కడ జరుగుతోంది.   తిరుపతి ప్రాదాన్యత తగ్గించడానికి మెల్లగ కొండపై వసతి సౌకర్యాలు తగ్గించుకొంటూ వస్తున్నారు.

 

ఈ మధ్య సాంప్రదాయ భోజనం  అంటూ ఒక క్రొత్త ప్రక్రియ మెదలుపెట్టారు. ఇది ఫక్తు వ్యాపారం. తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను దెబ్బతీసే ఒక కుతంత్రం.   తిరుమలని ఒక holiday spot గా తయారుచేసి , ఆ  పేరుమీద అన్ని మతాలవాళ్లని అక్కడ చేర్చి , అసలైన భక్తుల్లో అభద్రత, అసౌకర్యం కలగచేసి వారిని తిరుమలకి దూరం చేయడమే దీని వెనుక ఒక్క ప్రణాళిక.  ఇంతకముందు డా. రాజశేకర్ రెడ్డి  గారు 7 కొండలు కాదు 2 కొండలే అంటూ తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసారు. మిగిలిన 5 కొండల్లో Holiday resorts, amusement parts ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు  అప్పటి ఉడిపి పెజావర్ పిఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ విశ్వేశతీర్థ స్వామి వారు వెంటనే జరగబోయే ఉపద్రవాన్ని గుర్తించి ముందుండి ప్రజా ఉద్యమాన్ని నడపడం వల్ల ఆ దుష్టుల కల కలగానే మిగిలిపోయింది. ఆనాటి ఆ ఉప్పొంగిన ప్రజా ఉధ్యమంలో పాల్గొనే అవకాశం నాకు కూడా కలగడం నా అదృష్టంగా భావిస్తాను. ఆ మత మౌడ్యులు ఆ రోజుల్లో  తిరుమల కొండల్లో ఎన్నో శిలువలు పాతారు. 

 

గత కొన్ని సంవత్సరాలుగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని, హైందవ ధర్మానికి పొంచి వస్తున్న ముప్పు గ్రహించి హిందువుల్లో వస్తున్న సంఘటిత స్పందన ఈ విషయంలో స్పష్టంగా కనిపించింది. ప్రజల్లో, ముఖ్యంగా సాంఘీక మాధ్యమాల ద్వారా పెల్లుబికిన నిరసనలకు భయపడి ప్రభుత్వం తనకు తెలియకుండా జరిగిన విషయమని,  ఆ తప్పును అన్నిటికి  పాపాలబైరవులైన అధికారులపై నెట్టేసి, ఆ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిది. ఇక్కడ కోసమేరుపెమిటంటే, అదేదో ప్రభుత్వపు గొప్పతనంగా కొన్నిమన  సంఘాలే పొగడడం.

 

ఇక్కడ ఒక విషయం చర్చించులోవాలి, తిరుపతి వెళ్ళినవాళ్ళకి భోజనం ఉచితంగా పెట్టాలా అని కొందరు మాధ్యామాల్లో ప్రశ్నించారు. అలా అన్నవాళ్ళు ఎవరు?, వారి వెనుక ఉన్నదేవరు?, అని తెలిసిన విషయాలనే  ఆరా తీస్తూ ఆయాసపడడం కన్నా, దాని వెనుక ఉన్న నిగూడార్ధాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయాలి.  ఉచితంగా ఎందుకు పెట్టాలి అన్నారంటే, అక్కడ జరిగే నిత్యాన్నదాన పథకానికి ఎసరు పెట్టే ఆలోచనలో ఉన్నట్టే అని అర్థమవుతోంది.

 

స్వామివారి దర్శనానికి వచ్చే వారందరూ  హుండీలో రూపాయి వేసినా , కోట్లు వేసినా , స్వామివారికి కోట్లతో అభారణాలు చేయించినా, పేద, ధనిక తేడా లేకుండా అందరూ  అన్నసత్రంలో భోజనం చేసేది ప్రసాదమనే భక్తితోనే. ఈ విధంగా రోజూ కొన్ని వేలమంది పేదవారికి కడుపునింపుతున్న ఈ కార్యక్రమానికి ఎందరో గుప్తదాతలు సామాగ్రిని చేరుస్తూ చేయూతనిస్తున్నది అచంచలమైన భక్తితోనే అన్న విషయాన్ని దేవాలయ అధికారులు విస్మరిస్తున్నారు.

ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో  దేవస్థాన నిర్వహణపై ఆందోళన కలిగినపుడు, ప్రస్తుత ఛైర్మన్ ఎంపికలో  పలు అనుమానాలు తలేత్తినపుడు, ఆయన  హిందువు కాదు అని ఆరోపణలు  వచ్చినపుడు, ఆయన అందిరికన్నా పెద్ద హిందువని, నిత్యం గోపూజ చేస్తారని, ఆయన అధ్వర్యంలో దేవస్థానానికి ఎటువంటి ఢోకా ఉండదని, గత అనుభావాల దృష్టా  ఎటువంటి దుశ్చర్యకు ఒడగట్టరని ఆశపడ్డ వాళ్ళల్లో నేనూ ఒకడిని. అందుకు ఇప్పుడు చింతిస్తున్నాను.


ప్రతీ హిందూ దేవాలయంలోనూ  అన్నదానం జరుగుతుంది. ఇది వేల సంవత్సరాలుగా హైదవ సమాజంలో వస్తున అనావాయతీ.  అసలు అన్నదానం ఎందుకు చేస్తారు?

 

మనిషికి ఉన్న పంచ కోశములైన అన్నమయ , ప్రాణమయ , మనోమయ , విజ్ఞానమయ , ఆనందమయ కోశములు . అన్నమయ కోశము స్థూలశరీరానికి  సంబందించినది. మనిషి మనుగడకు అతి ముఖ్యమైన ఈ అన్నమయ కోశములో ప్రవేశించే పదార్థము(అందుకే దానిని అన్నము అంటాము) ప్రాణ శక్తిగా మారి మనిషి ప్రాణాన్ని  నిలుపుతుంది.

 

హైందవ సంస్కృతిలోని గొప్పదనమదే . హిందూ దేవాలయాల్లో నిరంతరంగా జరుగుతున్న ఆన్నదాన ప్రక్రియ వెనుక ఉన్న సంకల్ప లక్ష్యం కూడా సమాజ శ్రేయస్సే.

 

ఇంతటి గొప్ప సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి వేల సంవత్సరాలుగా ఎడారి మతాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ వారు కృతకృత్యులైనా పూర్తిగా నిర్వీర్యం చేయలేక పోయారు. దానికి కారణం మన సంస్కృతి యుక్క గొప్పదనం , హిందూజాతి ప్రజల సంఘటిత  సంకల్పమే.

 

కానీ, మనం తెలుసుకోవలసిన నిజమేమిటంటే , మన దేశ స్వాతంత్రం అనంతరమే మన ధర్మానికి యెక్కువ నష్టం జరిగింది.  ప్రస్తుత తరుణంలో అందరం సంఘటితమై ఎదురునిలువవలసిన సమయం ఆసన్నమైంది. నీ, నా తరతమ భేధం లేకుండా అందరం ఈ ఉధ్యమంలో పాత్ర వహించవలసిందే.

 

ధర్మాన్ని  నాశనం చేసేవాడికి  ప్రాంతీయ భావంతోనో , కుల ప్రాతిపదికతోనో , భాష మత్తుతోనో  మద్దతు పలకం మానుకోవాలి.

 

ఇక్కడ ఒక విషయం, వారి దుశ్చర్యలు ఇంతటితో ఆగిపోవు, సమస్యలు సమిసిపోవు.  అధికారంలో వారికి ఆయువు దొరికినప్పుడేల్లా వారి ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి . కాబట్టి వారి ఆయువు తెలుసుకొని దెబ్బ కొట్టడమే సమస్యకు పరిష్కారం.  సంఘటితంగా నిలవడమే సమాధానం.

 

మీ తరువాయి తరాలకి బ్రతకడమే కాదు భారతీయత కూడా నేర్పండి

 

మీ

 

మృశి

30.08.2021

శాస్త్రము విధించిన అన్ని కర్మలను

 మానవుడు తనకు శాస్త్రము విధించిన అన్ని కర్మలను ఎల్లప్పుడూ ఆచరిస్తూ ఉండాలి. కాని ఆ కర్మలు చేసేటప్పుడు నన్నే ఆశ్రయించుకొని ఉండాలి. ఆ ప్రకారంగా కర్మలు చేస్తే, నా అనుగ్రహము వలన తుదకు శాశ్వతమైన పరమ పదమును పొందుతాడు.


ఇప్పటి దాకా జ్ఞానము భక్తి గురించి చెప్పిన పరమాత్మ కర్మల గురించి కూడా చెబుతున్నాడు. ఇంతకు ముందు పరమాత్మ కర్మలు స్వధర్మనిష్టతో చేయాలి అని అన్నాడు. ఇప్పుడు ఆ స్వధర్మనిష్టకు భక్తి కూడా తోడవ్వాలి. భగవంతుని మీద భక్తి లేనిదే ఏ కర్మ కూడా సఫలం కాదు అని భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.


మానవుడు కర్మలు చేయక తప్పదు. ఏదో ఒక కర్మ చేయాలి. అందుకే మానవులు తమకు నిర్దేశించిన కర్మలను, స్వధర్మపరమయిన కర్మలను ఆచరిస్తూ కూడా, ఎల్లప్పుడూ పరమాత్మయందు మనసును లగ్నం చేసి, పరమాత్మయందు భక్తి కలిగి ఉండాలి. భక్తితో కూడిన కర్మ మాత్రమే కర్మయోగము అవుతుంది. కేవలం యాంత్రికంగా చేసే కర్మలు, శుష్క, కర్మలు అవుతాయి కానీ కర్మయోగము అనిపించుకోవు. అందుకే ఇక్కడ రెండు నిబంధనలు పెట్టారు. ఒకటి ఏ పని చేసినా పరమాత్మను ఆశ్రయించుకొని చేయాలి. పరమాత్మ పరంగా చేయాలి. కరృత్వభావన లేకుండా చేయాలి. ఫలితం ఆశించకుండా చేయాలి. అందుకే మద్వ్యపాశయ: అన్నారు.


తరువాత మత్ ప్రసాదాత్ అంటే నా అనుగ్రహం కూడా ఉండాలి. భగవంతుని అనుగ్రహం ఎప్పుడు లభిస్తుంది. ఆయనను ఆశ్రయించుకొని ఉన్నప్పుడు. కాబట్టి భగవంతుని ఆశ్రయించడం, ఆయన అనుగ్రహానికి పాత్రులు కావడం ముఖ్యం. అప్పుడు అతడు ఏ కర్మ చేసినా అతనికి ఆ కర్మ బంధనములు అంటవు. సుఖదు:ఖములు ఉండవు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పని చేసినా లోపల భగవన్నామ స్మరణ చేస్తుంటాడు. అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు. పరమాత్మలో ఐక్యం అవుతాడు. కాబట్టి ఏ కర్మ చేసినా దైవమును స్మరించుకుంటూ చేయాలి. కర్మలను కర్మఫలములను ఈశ్వరార్పణ చేయాలి. ఏ పని సఫలం కావాలన్నా దానికి భగవంతుని అనుగ్రహం తప్పదు. మనకు ఏది లభించినా దానిని భగవంతుని ప్రసాదంగానే భావించాలి కానీ అంతా నా మహిమ వలననే జరిగింది అనుకోవడం అజ్ఞానం.


కాబట్టి ఏ కర్మ చేసినా భగవంతుని తల్చుకుంటూ, భగవంతుని పరంగా చేస్తూ, దాని వలన వచ్చే ఫలితాలను భగవంతునికి అర్పిస్తే, ఎల్లప్పుడూ పరమాత్మను ఆశ్రయించుకొని ఉంటే, ఆ కర్మలు, కర్మలు చేయగా వచ్చిన కర్మఫలములు అతనిని బంధించవు. అటువంటి వాడికి శాశ్వతమైన, ఎప్పటికీ నాశనము లేని, పరమ పదము అంటే మోక్షము లభిస్తుంది.

.

 #హరేకృష్ణ #కృష్ణంవందేజగద్గురుం #భగవద్గీత #k

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 35

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                   శ్లోకం : 35   

                           SLOKAM : 35

                                                

नमामि नारायणपादपङ्कजं

करोमि नारायणपूजनं सदा ।

वदामि नारायणनाम निर्मलं

स्मरामि नारायणतत्त्वमव्ययम् ॥ ३५ ॥


నమామి నారాయణ పాదపంకజం 

కరోమి నారాయణ పూజనం సదా I    

వదామి నారాయణ నామ నిర్మలం 

స్మరామి నారాయణ   

                        తత్త్వమవ్యయం ॥ 35


    శ్రీమన్నారాయణుని పాద పద్మములకు నమస్కరింతును.   

    నారాయణుని సదా పూజింతును. 

    నారాయణుని నిర్మలమగు నామమును కీర్తింతును.     

    శాశ్వతమగు నారాయణ తత్వమును స్మరింతును.  


    At every moment I bow down to the lotus feet of Nārāyaṇa, 

    I perform worship to Nārāyaṇa, 

    I recite the pure name of Nārāyaṇa, and 

    I reflect on the infallible truth of Nārāyaṇa.


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అంకమ్మ భక్తి..*


"అమ్మా..వయసురీత్యా పెద్దదానివి..ఇంటిపట్టున కూర్చొని కృష్ణా..రామా..అనుకోరాదూ..వారం మార్చి వారం బస్సెక్కి ఇంతదూరం రాకపోతే.." అని మా సిబ్బంది ఆమెతో హాస్యానికి అంటూ వుంటారు.."నాకేం ఇబ్బందీ లేదు..అన్నింటికీ ఆ దత్తాత్రేయుడే వున్నాడు..నాకే భయమూ లేదు..అన్నీ ఆ స్వామే చూసుకుంటాడు.." అని నిర్మలంగా నవ్వుతూ కందుకూరు నుంచి క్రమం తప్పకుండా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చే అంకమ్మ గారు తరచూ చెప్పే మాట ఇది..ఆమె విషయం లో అది నిజం కూడా..


శ్రీ స్వామివారు సిద్ధిపొందినది 1976 వ సంవత్సరం మే నెల 6వ తేదీ నాడు..ఆ తరువాత రెండు సంవత్సరాలకు అంకమ్మ గారు మొదటిసారి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్దకు వచ్చారు.."నాకు ముప్పై ఏళ్ల వయసప్పుడు జబ్బు చేసింది..అప్పట్లో ఇంత వైద్య సౌకర్యాలు లేవు..అప్పటికీ మా వాళ్ళు డాక్టర్ల కు చూపించారు కానీ పెద్దగా ప్రయోజనం కనబడలేదు..చుట్టుప్రక్కల వాళ్ళు ఈ స్వామి దగ్గరకు తీసుకెళ్లండి..ఏదైనా గాలి చేష్ట వున్నా బైట పడుతుంది..ఆరోగ్యం బాగు పడుతుందని చెపితే..ఇక్కడికి తీసుకొచ్చారయ్యా..మూడు వారాల్లోనే నేను మామూలు మనిషినయ్యాను..నువ్వు అప్పుడు ఇక్కడ లేవు..మీ నాన్నా..అమ్మా..నన్ను కన్నా బిడ్డలా చూసుకున్నారు..ఈ దత్తాత్రేయుడి దయ లేకుంటే..అప్పుడే నేను పోయేదాన్ని.." అని మొగలిచెర్ల శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతిసారీ నాకు చెపుతూ వుంటారు..


ఆనాటి నుంచీ నేటి దాకా అంకమ్మగారు ఏ కష్టమొచ్చినా..సుఖం కలిగినా..నేరుగా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..ఆ స్వామివారి సమాధి ముందు నిలబడి విన్నవించుకొంటారు..తన బిడ్డల వివాహాలు ఇక్కడే చేశారు..ఆ తరువాతి తరం వాళ్ల వివాహాలు కూడా ఇక్కడే చేశారు..అంకమ్మ గారితో పాటు ఆమె సంతానమూ.. వారి సంతానం కూడా శ్రీ స్వామివారికి అత్యంత భక్తులు..ఇప్పుడంటే వార్ధక్యం కారణంగా అంకమ్మ గారు కేవలం శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి పరిమితం అయ్యారు గానీ..అంతకుముందు ఆవిడ వచ్చినప్పుడల్లా ఏదో ఒక సేవ చేస్తూనే ఉండేది..


పిల్లల కు చెప్పుకొని.. శ్రీ స్వామివారి మందిరం వద్ద..వచ్చి పోయే భక్తుల సౌకర్యం కోసం.. ఒక గది కూడా కట్టించారు..ప్రస్తుతం అంకమ్మ గారి వయసు సుమారు ఎనభై సంవత్సరాలు.. ఇప్పటికీ తన శక్తి కూడగట్టుకొని వారం మార్చి వారం (ఆదివారాల్లో) శ్రీ స్వామివారి దర్శనార్థం వస్తూనే వుంటారు..ఏనాడూ ఉత్త చేతులతో మందిరానికి రాదు..పళ్ళూ..కూరగాయలూ..బియ్యమో..ఏదో ఒకటి తీసుకొని వస్తారు..అంకమ్మ గారు శ్రీ స్వామివారిని దర్శించుకునే పద్దతి చిత్రంగా ఉంటుంది..ఆవిడ మందిరం లో గడిపే నాలుగైదు గంటల సమయంలో..కనీసం తొమ్మిది పది సార్లు శ్రీ స్వామివారి సమాధిని దర్శించి వస్తుంటారు.."అయ్యా..అక్కడ ఖాళీగా ఉంది..భక్తులెవరూ లేరు..ఒక్కసారి స్వామి దాకా వెళ్ళొస్తా నాయనా.." అని ప్రాధేయపూర్వకంగా అడుగుతారు..మేమూ కాదని చెప్పము.. ఎందుకంటే..ఒక్కొక్కసారి భక్తుల తాకిడి ఎక్కువగా వున్నప్పుడు..ఆవిడే గమనించుకుని ఒక ప్రక్కగా నిలబడి వుంటారు తప్ప..వాళ్ళ మధ్యలో దూరి వెళ్ళరు..తన పరిమితులు దాటి వేరే విధంగా ప్రవర్తించే అలవాటు లేని మనిషి అంకమ్మ గారు..


"మనకు కష్టమొచ్చినప్పుడే స్వామి దగ్గరకు వచ్చి..మనకు సుఖం కలిగితే అది మన గొప్ప అనుకోకూడదయ్యా.. ఏ కాలానికి ఏది మనకు ప్రాప్తమో దానిని అనుభవించాలి..ఇప్పటి వరకూ అన్ని విషయాల్లో ఆ దత్తాత్రేయుడు మమ్మల్ని చల్లగానే చూసాడు..కష్టాలు లేకుండా ఎవ్వరి జీవితమూ ఉండదు..చిన్నదో పెద్దదో కష్టం వచ్చి తీరుతుంది..స్వామిని నమ్ముకుంటే..ఆ కష్టం యొక్క తీవ్రత తగ్గిస్తాడు..నువ్వు చూపే విశ్వాసం..భక్తీ..ఆ రెండే ఆ స్వామి చూసేది..నీ దగ్గరున్న ధన రాశులు ఆయన చూడడు..ఆ స్వామి దయ లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేను నేను..ఇట్లా తిరుగుతూ వున్నపుడే నాకు మరణం ప్రసాదించే వరమివ్వు నాయనా..అని కోరుకుంటానయ్యా నేను.." అంటూ ఎల్లప్పుడూ చెప్పుకుంటూ వుంటారు అంకమ్మ గారు..ఆవిడ మాటల్లో అంతర్లీనంగా వేదాంత ఛాయలు ఉంటాయి..శ్రీ స్వామివారి గురించి చెప్పేటప్పుడు అంకమ్మ గారు ఏదో తెలియని ఆనందంతో పొంగిపోతూ వుంటారు..ఆవిడ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి..


అంకమ్మ గారు నిష్కల్మష భక్తి కి ప్రతిరూపంగా వుంటారు..ఆవిడ గారు చెప్పినట్టు భక్తీ విశ్వాసాలే ఆ భగవంతుడు చూస్తాడు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114...సెల్..94402 66380 & 99089 73699).

శ్రీకృష్ణ స్వామి జన్మోత్సవం


నేడు శ్రీకృష్ణ స్వామి జన్మోత్సవం ఒకటే కాదు. మాయమ్మ యోగమాయ జన్మోత్సవం కూడా నేడే. కావున భక్తిశ్రద్ధలతో నేడు ఇరువురుని పూజిద్దాం.. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో శుభోదయం.


శ్రీకృష్ణ

కర్ష యతి ఇతి కృష్ణ అని తెలుపుతుంది నిరుక్తము. మనసును చిలికి వెన్న తీస్తాడు అని తలువ వచ్చు. లేక భూమి దున్ని భక్తిబీజము నాటి సత్ఫలితమునందిస్తాడని చెప్పవచ్చు. నల్లగా ఉంటాడు అనీ చెప్పవచ్చు, ఇవికాక 'క' అంటే బ్రహ్మ. 'ఋ' అంటే అనంతుడు. 'ష' అంటే శివుడు. 'ణ' అంటే ధర్మము. 'అ' అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. కృష్ణునిలో కృషి ఉంది. కర్షణ ఉంది, ఆకర్షణ ఉంది, సంకర్షణ ఉంది. (అందుకే ఉపసర్గలు) అని సద్గురు శివానందమూర్తి గారు తమ అనుగ్రహ భాషణములో ఒక పర్యాయము పేర్కొన్నారు.

కృష్ణుని తెలుసుకొనుట సులభమైన విషయము కాదు. అది మహామహులకే అంతుబట్టని విషయము. నేనో ఒక పిపీలిక పాదమును. మహనీయుల వల్ల విన్నది, నేను చదివి తెలుసుకొన్నది, నాకు గుర్తున్నంతవరకు తెలియజేయ ప్రయత్నము చేస్తాను. కృష్ణ తత్వము తెలుసుకొనుటకు భాగవతము మాత్రమే చాలదు. ముఖ్యముగా బ్రహ్మవైవర్త పురాణము, హరివంశమే కాకుండా భారతము కూడా చదువవలసి వుంటుంది.


శ్రీ మద్భాగవతం ఇలా అంటుంది.


శ్లో || ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం

ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగేయుగే [1.3.28 ]


ఈ అవతారములన్నీ భగవంతుని యొక్క అంశకళలు మాత్రమే. 


కానీ శ్రీ కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే. 

ధర్మ విరోధుల చేత లోకం వ్యాకులం చెందినపుడు. రక్షించడానికి వీరు ప్రతి యుగంలోనూ వస్తుంటారు.


కొన్ని అవతారాలలో పదిపాళ్ళు, కొన్నింటిలో పాతిక పాళ్ళు, ఇంకోన్నింటిలో ఏభై పాళ్ళు, ఇలా రకరకాలుగా భగవంతుని శక్తి ఆవిర్భావం జరిగింది. కాని శ్రీ కృష్ణుని అవతారంలో నూటికి నూరు శాతం భగవంతుని శక్తి భూలోకానికి దిగి వచ్చిందని శ్రీమద్భాగవతం అంటుంది.


శ్రీకృష్ణావతారం వల్ల లోకానికి మూడు ముఖ్యమైన ప్రయోజనాలు


 ఒకటి - వేదాంతం గ్రంధాలకే పరిమితం కాదు అది ఆచరణాత్మకమే అని తన అద్భుతమైన జీవితం ద్వారా నిరూపించడం.


 రెండు- అత్యద్భుతమైన మధురభక్తిమార్గాన్ని లోకానికి అందించడం. కృష్ణప్రేమభక్తి మాధుర్యంలో ఓలలాడి ఎందరు భక్తవరేణ్యులు దివ్యానందాన్ని చవిచూసారో లెక్కలేదు. వేదాంతంలో అత్యున్నతమైనదిగా తలచే మోక్షాన్ని కూడా తక్కువ స్తాయిదిగా తలచి త్రుణీకరించగల శక్తి మధురభక్తి సొంతం. దివ్యమైన మధురప్రేమానుభావం ముందు మోక్షం కూడా వెలవెలా బోతుంది అన్నది వాస్తవమే.


మూడు - సమస్త వేదాంతసిద్ధాంతాలనూ భగవద్గీతా రూపంలో సమన్వయపరచడం. ఇప్పటివరకూ వచ్చిన ఆచార్యులు పండితులు అందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసినవారే. ఎందుకంటే సమస్త వేదవేదాంతాల సారం గీతలో నిక్షిప్తమై ఉన్నది.


కాకపోతే ఇటువంటి మహత్తరమైన అవతారాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడం ఎప్పటిలాగే మన దురదృష్టం. కృష్ణుడు అబద్దాలు చెప్పాడనీ, మోసాలు చేసాడనీ, గోపికలతో సరసాలు సాగించాడనీ, రాసలీల అనేది కామకేళి అనీ పిచ్చిపిచ్చి మాటలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. రాముడు చేసినట్లు చెయ్యండి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యండి - వ్యతిరేకంగా మాత్రం చెయ్యకండి. అన్న శ్లేషాత్మకవ్యాఖ్యలూ ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కృష్ణుని ఔన్నత్యం అర్ధంకాక అజ్ఞానులు అనుకునే పిచ్చిమాటలు. కృష్ణావతార మహత్యాన్ని అణుమాత్రం గ్రహించగలిగినా ఆ కధల వెనుక ఉన్న అద్భుతమైన ఔన్నత్యాన్ని మనం చూడగలుగుతాం.