19, సెప్టెంబర్ 2023, మంగళవారం

తల్లి మొక్కును

 


మనకు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రాగానే, పురాణాలను, దేశాన్ని, ఆచారాలను, సంప్రదాయాలను, పెద్దలను, సంస్కృతాన్ని విమర్శించే స్థాయికి వచ్చామని విర్రవీగుతుంటారు కొంతమంది.

వాళ్ళకు బుద్ధి వచ్చే సంఘటన ఈ మధ్యనే జరిగింది. 

దివాకర్ అనే వ్యక్తి రాసిన పోస్టు దీనికి మూలం.


''నాసిక్ హై వే మీద, రోడ్డు మీద వెళుతున్న జనాల వంక ఆసక్తిగా చూస్తున్న ఒక వృద్ధ జంటను చూసాను. చూడ్డానికి వాళ్ళు చాలా పేదవారిలా, ఏదో అవసరంలో ఉన్నవారిలా అనిపించింది. నేను వారికి ఆహారం కానీ, మరేదైనా సహాయం కావాలా అని అడిగి వారు మొహమాట పడుతుంటే, ఒక వంద రూపాయల నోటు ఇస్తే వాళ్ళు నిరాకరించారు. నేను వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు చెప్పిన విషయం విని నా మతి పోయింది. 


 *వాళ్ళు 2200 కిలోమీటర్ల దూరాన్ని మూడు నెలల్లో కాలినడకన పూర్తి చేసి ''ద్వారక''కు తిరుగు ప్రయాణం చేస్తున్నారట.* ఇల్లు చేరడానికి మరొక నెల పడుతుందట. 


అలా ఎందుకు నడవడం అని నేనడిగిన ప్రశ్నకు ఆయన, 


నా చిన్నప్పుడు నా రెండు కళ్ళలోని చూపు పోతే, మా అమ్మ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. కానీ, అక్కడి డాక్టర్లు, ప్రపంచంలోని ఏ గొప్ప డాక్టరు కూడా కళ్ళు తెప్పించలేడని చెప్పారట. అయినా, వాళ్ళమ్మ పట్టుబట్టి ఆపరేషన్ చేయమని, ఫలితం భగవంతునికి వదిలేద్దామని చెప్పిందట. అంతేగాక, తన కొడుకుకు కంటి చూపు వస్తే, కొడుకుని కాలి నడకన పండరిపూర్, తిరుపతికి యాత్రకు పంపిస్తానని మొక్కుకున్నదట. అతనికి చూపు వచ్చిందట. 


అందుకని ఆ కొడుకు కాలి నడకన, అమ్మ కోరిక ప్రకారం యాత్ర పూర్తి చేసి, తిరుగు ప్రయాణంలో ద్వారకకు బయల్దేరారట. 


కానీ, మరి ఆ స్త్రీ ఎందుకు ప్రయాణం చేస్తుందనే ఆసక్తితో అడిగితే, ఆమె, 


'నా భర్త ఒంటరిగా అంత దూరం కాలినడకన వెళ్ళడం ఇష్టం లేకా, దారిలో ఆయనకు అన్నపానీయాలు అమరుస్తూ, ప్రయాణంలో ముచ్చటించుకుంటూ సరదాగా గడపవచ్చని నడుస్తున్నానని' చెప్పింది. 


వాళ్ళిద్దరూ చక్కటి హిందీ, ఇంగ్లీషుల్లో మాట్లాడడం చూసి వారి చదువు గురించి ప్రశ్నించిన నాకు వారు చెప్పిన సమాధానం విని మతిపోయింది. 


ఆ మగ వ్యక్తి *ఆస్ట్రో_ఫిజిక్స్* లో *పి.హెచ్.డి* చేసి లండన్ లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఏడేళ్ళు *సీ_రంగరాజన్*, *కల్పనా_చావ్లాతో* కలిసి పనిచేసాడట....

అతని భార్య లండనులోని ఒక విశ్వవిద్యాలయం నుండి *హ్యూమన్_సైకాలజీలో_ పీ హెచ్ డి* చేసిందని చెప్పేసరికి నాకు మూర్ఛ వచ్చినంత పనైంది. వాళ్ళ ముఖాల్లో అంత చదువుకున్నామనే, అంత గొప్పవారమనే ఛాయలు కనిపించడమే లేదు. 


వాళ్ళు చెప్పిన మరొక విషయం కూడా నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. వాళ్ళకు వచ్చే పెన్షన్ మొత్తం అంధులకు సహాయం చేసే, ఒక ట్రస్టుకు విరాళంగా ఇస్తున్నారట. 


 *అతని పేరు డాక్టర్ దేవ్ ఉపాధ్యాయ.* 


 *ఆమె పేరు డాక్టర్ సరోజ్ ఉపాధ్యాయ.* 


తల్లి మొక్కును ఇప్పటికైనా తీర్చిన వాళ్ళిద్దరూ, *ధన్యులు*


ఇది కదా మన దేశపు ఔన్నత్యం.  


👆This is a humble effort to translate the post in Marathi by Diwakar.🌹🌻🌹🌻🌹

*తల్లి ఋణం

 *తల్లి ఋణం - తీర్చలేనిది..!!* 


🌟 ఒక యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని లక్ష బంగారు నాణాల సంచిని తల్లికి ఇస్తూ, ‘అమ్మా! ఈ నాణాలను తీసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో. దానితో నీ రుణం నుండి నాకు ముక్తి లభిస్తుంది’ అన్నాడు.


🌟 తల్లి నవ్వి ఊరుకుంది. కానీ, ఆ యువకుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో - తల్లి ఇలా అంది .. బిడ్డా, నా రుణం తీర్చుకోవాలీ అనుకుంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు, నీవు ఒకరోజు రాత్రిపూట పసి బిడ్డగా నా వద్ద పడుకో చాలు అంది. ఆ బిడ్డడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు.


🌟 అతనికి నిద్ర రాగానే తల్లి లేపి నాయనా, దప్పికవుతోంది, నీళ్ళు తాగించు’ అంది. కొడుకు సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్ళిచ్చాడు. రెండు గుటకలు వేసి గ్లాసును జారవిడిచింది. నీళ్ళుపడి పక్క తడిసిపోవడం చూసి ‘ఏమిటమ్మా ఇది’ అన్నాడు. ‘పొరపాటు అయిపోయింది నాయనా’ అంది తల్లి. కొడుకు మౌనంగా పడుకున్నాడు.


🌟 అతడికి కాస్త నిద్రపట్టగానే తల్లి మళ్ళీ లేపి ‘బిడ్డా! దప్పిక అవుతోంది, నీళ్ళు ఇవ్వు’ అంది. ‘ఇప్పుడే కదా నీళ్ళు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పిక అయిందా... పత్తి గింజలు ఏమైనా తిన్నావా?’ అంటూ చిరాగ్గా లేచి నీళ్ళు ఇచ్చాడు.


🌟 తల్లి మొదటి మాదిరిగానే ఒకటి రెండు గుటకలు వేసి నీటిని పక్కమీద ఒలకబోసింది. కొడుకు కోపంతో ‘అమ్మా, ఏమిటిది, పక్కంతా తడిపేశావు... కళ్ళు కనిపించట్లేదా’ అన్నాడు. ‘నాయనా! చీకటిగా ఉండటంతో గ్లాసు చేతినుండి జారిపోయింది’ అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకున్న కొడుకు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో కోపం పట్టలేకపోయాడు. ‘అమ్మా! ఏమిటి... దప్పిక దప్పిక అని నా దుంప తెంచుతున్నావు. నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా’ అంటూ నీళ్ళు తీసుకువచ్చి ‘ఇదిగో తాగి చావు’ అన్నాడు.


🌟 తల్లి ఎప్పటిలాగానే ఓ గుక్క తాగి మిగిలిన నీళ్ళతో పక్కను తడిపేసింది. ఇది చూసిన కొడుకు ఇక సహించలేక .... అమ్మా !! బుద్ధుందా లేదా ఏమిటిది ఇలా వేధించడానికేనా నన్ను నీ మంచం మీద పడుకోమన్నావు? ఈ తడిబట్టల మీద ఎట్లా పడుకోవాలి? చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లు ఉంది... అందుకే ఇలా చంపుకు తింటున్నావు’ అంటూ ఆగ్రహంతో కేకలేశాడు.


🌟 అప్పుడు తల్లి ..... బిడ్డా చాలించు. అరుపులు ఆపు. నా రుణం తీర్చుకుంటానన్నావు, తల్లి రుణం తీర్చుకోగలుగుతావా? నీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తి, నిరంతర సేవ చేసినా మాతృ రుణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటావా... నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజూ పక్కమీదే మల మూత్రాదులు చేసేవాడివి.


🌟 నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి, నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. పక్కబట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకుని నిన్ను పొడిగా ఉన్నవైపు పడుకోబెట్టి నిద్రబుచ్చేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాలపాటు - నీ అంతట నువ్వు వేరే పడుకోగలిగే వరకూ నేను ప్రతిరోజూ అలానే- ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు ఒకటి రెండుసార్లు నీళ్ళతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు, ఒక్క రాత్రి నిద్రలేనందుకే వీరంగం వేస్తున్నావు అంది తల్లి.


🌟 ఆ కొడుకు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకుని ,అమ్మా! నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమకు,ఆమె చేసే సేవలకు,ఆమె త్యాగాలకు, కష్టానికి, సహనానికీ బదులు తీర్చుకోవడమన్నది ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు. 


👉నీ రుణం చెల్లించడం అసంభవం. నేనే కాదు, లోకంలో ఎవరూ కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు’ అన్నాడు.


అందుకే తల్లిని మాతృదేవోభవ అన్నారు. తల్లి దేవత. తల్లి రుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.


నవమాసాలు తన బిడ్డను కడుపులో మోసి, ఎన్నో బాధలకు ఓర్చి, బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తల్లి ఇంకో జన్మ ఎత్తినట్లే.


 *దయచేసి తమ పిల్లలకు ఇది పంపించండి🙏

Flying weel


 

Winding technology


 

Gate mechanism


 

Amazing bicycle


 

Peroectual motion


 

Mechanical engineering


 

Mechanical engineering


 

Sweet potato tsmoto curry


 

సంసారం సారము లేనిదైనను

 శ్లోకము

*అసారే ఖలు సంసారే*

 *సారం శ్వశుర మందిరం l*

    *హిమాలయేహరశ్శేతే"

  *హరిశ్శేతే మహోదధౌll*


 *తాత్పర్యము. సంసారం సారము లేనిదైనను శ్వశురగృహము నసారము గలది .కనుకనే శివుడు హిమాలయము నందును,విష్ణువు పాలసముద్రము నందును  శయనించినారు.*

Panchaag


 

శ్రీ మా భవాని మందిర్

 🕉 మన గుడి : నెం 183





⚜ ఛత్తీస్‌గఢ్ : కొర్భా


⚜ శ్రీ మా భవాని మందిర్ 


💠 కోర్బాలోని భవానీ మాత ఆలయం దాని అద్భుతాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.


💠 24 సంవత్సరాల క్రితం అమ్మవారు కలలో కనిపించి విగ్రహం ఉన్న ప్రదేశాన్ని చెప్పారని, ఆపై ఆలయాన్ని స్థాపించారని నమ్ముతారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఆలయంపై భక్తుల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోంది. 

ఆలయ ప్రఖ్యాతి ఇప్పుడు మరింత పెరిగింది. నవరాత్రుల సందర్భంగా ఆలయ అందాలు చూడాల్సిందే.



💠 భవానీ దేవాలయం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.. ఏ కథ నిజమో ఎవరికీ తెలియదు.. కానీ ప్రతి కథపై ప్రజలకు అచంచలమైన నమ్మకం ఉంటుంది. 

ఈ ఆలయంలో అమ్మవారు స్వయంగా ఉన్నట్లు చెబుతారు. హస్దేవ్ నది ఒడ్డున కూర్చున్న భవానీ తల్లి భక్తుల బాధలను పోగొడుతుంది. 

చత్తీస్‌గఢ్‌ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.


💠 భవానీ ఆలయ ప్రధాన పూజారి చంద్ర కిషోర్ పాండే మాట్లాడుతూ, "ఈ ఆలయాన్ని ఫిబ్రవరి 1999లో శివరాత్రి రోజున స్థాపించారు. అప్పుడు ఈ ఆలయాన్ని కత్ఘోరాలో నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ కలలో నా భార్య జ్యోతి పాండేకి అమ్మవారు వచ్చి నది ఒడ్డున నా విగ్రహం ఉంది అని సంకేతం ఇచ్చింది.

తర్వాత మేము ఈ ప్రాంతానికి చేరుకున్నాము, హస్దేవ్ నది ఒడ్డున వెతికిన తర్వాత మాకు దేవత విగ్రహం కనిపించింది.

ఆ రోజు నుండి  దేవాలయంకి పునాది  ఇక్కడ వేయబడింది.


💠 ఈ ప్రదేశం పేరు జోగియ డేరా, ఇది 7 దేవతల ప్రదేశం, నర్మదేశ్వరుడే ఇక్కడ శివశక్తి రూపంలో ఉన్నాడు, రామేశ్వరం నుండి తెచ్చిన 750 సంవత్సరాల శివలింగం ఇక్కడ ప్రత్యేకత.


💠 కలలో దేవత శివశక్తి స్థాపనకు ఆదేశించిందని, ఆలయంలో భవానీ మాతను స్థాపించిన తర్వాత శివలింగం కోసం అన్వేషణ ప్రారంభమైందని , ఈ ఆలయం గురించి కూడా ప్రసిద్ధి చెందింది. 

ఆలయ పూజారులు రామేశ్వరం ధామ్‌కి వెళ్లారు, అక్కడ ఇండోర్ రాజ కుటుంబానికి చెందిన అప్పటి రాణి అహల్య హోల్కర్ శివలింగాన్ని ప్రతిష్టించారు. 

అయితే గతంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది, ఆ తర్వాత శివలింగాన్ని మరెక్కడా ప్రతిష్టించలేదు. అప్పుడు రామేశ్వరం ధామ్‌లోని మహామండలేశ్వరుడు ఈ శివలింగాన్ని భవానీ ఆలయ అర్చకుడికి ఇచ్చాడు. దీని తరువాత, 750 సంవత్సరాల నాటి అరుదైన శివలింగం రామేశ్వరం నుంచి తీసుకొచ్చి భవానీ ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుండి, భవాని ఆలయంలో మాతా భవానీ మాత్రమే కాకుండా, పరమేశ్వరుని కూడా పూజించడం ప్రారంభించారు.


💠 ప్రతి సోమవారం ఇక్కడ మాత ఆస్థానం జరుగుతుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు లేదా ఏదైనా బాహ్య అడ్డంకులు, శారీరక సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. 

చంద్ర కిషోర్ పాండే మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని, ఇదంతా అమ్మవారి కోరిక మేరకే జరుగుతుందని, ఆమె ఆదేశానుసారం భక్తుల సమస్యలు పరిష్కరిస్తారని, దీని ఖ్యాతి ఛత్తీస్‌గఢ్‌లోనే కాదు. ఇతర రాష్ట్రాలలో కూడా ఉందని అంటారు


💠 మా భవానీ ఆలయానికి ఎలా చేరుకోవాలి : 

రహదారి ద్వారా ; మా భవానీ దేవాలయం కోర్బా బస్ స్టాండ్ నుండి 8 కి.మీ దూరంలో , కోర్బా రైల్వే స్టేషన్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

 దేశంలోని అనేక నగరాల నుండి కోర్బా రైల్వే స్టేషన్‌కు నేరుగా రైలు సౌకర్యం ఉంది మరియు చంపా జంక్షన్ మరియు బిలాస్‌పూర్ జంక్షన్ నుండి కూడా కోర్బా రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు.


 

హనుమాన్ చాలీసా పై ప్రశ్నలు

 🎻🌹🙏హనుమాన్ చాలీసా పై ప్రశ్నలు, సమాధానములు ....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿1. చాలీసా" అంటే ఏమిటి? 


🌸జ. ఈస్తోత్రంలో  40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.)



🌿2. హనుమాన్ అంటే  అర్థం ఏమిటి?


🌸జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. అజ్ఞానమును హననము చేయునది కనుక జ్ఞానమునకు హనుమ అని పేరు.



🌿3. ఆంజనేయ - అర్థం?


🌸జ. ఆంజనేయ అంటే .... సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం , జ్ఞానాంజనం వల్ల  మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.



🌿4. తులసీదాస్ అస్సలు పేరు ?


🌸జ. రామ్ బోల. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.



🌿5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు?


🌸జ. దేవుళ్ళ భార్యలను,  మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్య  వల్ల వచ్చిన తేజో వర్చస్సు యే "సువర్చల".

ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.



🌿6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి ?


🌸జ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. 

హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే.



🌿7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ. అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదామరి?


🌸జ.  తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా  అర్ధం  చేసుకోవాలి.



🌿8. హనుమంతుని పంచముఖములు ఏవి?


🌸జ.  హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు,

హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే. .....

తూర్పున వానర ముఖం  జన్మతః  వచ్చినది అది సద్యోజాత శివవదనము.


🌿దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.

పశ్చిమం  గరుడ ముఖం  అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.


🌸ఉత్తరం  వరాహ ముఖం  అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ.శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. 


🌿ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం . వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు  వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య ,త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ  నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది    



🌸9. "జయ" హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి?


🌿జ. ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం  అంటే  అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము.



🌸10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు?


🌿జ.126 సం.జీవించాడు...స్వస్తీ..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 26*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 26*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


         *విరించిః పంచత్వం వ్రజతి హరి రాప్నోతి విరతిం*

         *వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |*

         *వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా*

         *మహాసంహారేఽస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ ||*


నాలుగో పాదంలో *మహా సంహారే అస్మిన్* అని అన్నారు. ఏమిటీ మహాసంహారము అంటే, బ్రహ్మ గారికి నూరు కల్పాలు పూర్తయితే, మహాకల్పము అంటారు. అప్పుడిక ఆయన పని అయిపోతుంది. ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు ఎలా ఉంటుందో వివరిస్తున్నారు.

కల్పాంతం వేరు, యుగాంతం వేరు.యుగాంతంలో మార్పులుంటాయి కానీ ప్రళయం, జగత్తు మాయం అవటం వుండవు. అది కల్పాంతంలో జరుగుతుంది.


అస్మిన్ = ఆ సమయంలో


విరించిః పంచత్వం వ్రజతి = బ్రహ్మ మరణిస్తాడు.


హరిరాప్నోతి విరతిం = స్థితి చేయటానికి సృష్టి జరగలేదు కాబట్టి విష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు.


వినాశం కీనాశో భజతి = యముడు కూడా వెళ్ళిపోయాడు. దిక్కులే లేవు కనుక దిక్పాలకులూ లేరు.


ధనదో యాతి నిధనమ్ = కుబేరుడు కూడా. ఆయనా ఒక దిక్పాలకుడేగా!


వితంద్రీ మాహేంద్రీ వితతిరపి = ఇంద్రులంతా వెళ్లిపోయారు.


సంమీలితదృశా విహరతి సతి త్వత్పతి రసౌ = 22 వ శ్లోకార్ధం లో చెప్పుకున్నాము సత్ అంటే ఎప్పుడూ ఉండేవాడని. అమ్మవారికి అన్వయిస్తే సతి అవుతుందని. ఆమె శాశ్వతమైన ఉనికి కలది.*దేశ కాలా పరిచ్చిన్నా* ఆమె.

ఈ జగత్తు అంతా నాశనమవుతుంటే ఆయన, ఆవిడా విహరిస్తూ చూస్తూ ఉంటారట. ఆయన నాట్యం చేస్తుంటే, ఆమె చూస్తూ ఆనందిస్తుందట. గుర్తు తెచ్చుకోండి--అమ్మవారి నామాల్లో *మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ*


అమ్మా ! మహా ప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మ, విష్ణువు కూడా అంతమును పొందెదరు. అందరికీ మృత్యు పాశములు వేయు యముడు కూడా మృత్యువును పొందుచున్నాడు. ధనమునకు అధిపతి అయిన కుబేరుడు కూడా మరణము చెందుచున్నాడు. ఇంద్రుడు మున్నగు దేవతలు, మునులు కూడా అంతము చెందుచున్నారు. అటువంటి మహా ప్రళయమునందు కూడా నీ పతి యగు సదాశివుడు నిన్ను చేరి స్వేచ్చగా నీతో విహారము చేయుచున్నాడు కదా ! 


360 మానవ సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం.

12 వేల దేవతల సంవత్సరాలు ఒక చతుర్యుగం.నాలుగు యుగాలు కలిపి మనుష్యమానంలో 

43 ,20 ,000 సంవత్సరాలు.

అలాటి 2 వేల చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహో రాత్రం. (ఒక పగలు, ఒక రాత్రి)

ఇటువంటి 360 బ్రహ్మ దివసాలు ఒక బ్రహ్మ మాన సంవత్సరం.

అలాటి 50 బ్రహ్మ వత్సరాలు ఒక పరార్ధం. బ్రహ్మ జీవిత కాలం 2 పరార్ధాలు. మన లెక్కలో 31104 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు మనం రెండవ పరార్ధంలో వున్నాము.


వెయ్యి చతుర్యుగాలు పధ్నాలుగు మన్వంతరాలుగా విభజించారు. ఈ 14 మన్వంతరాలు కలిపి ఒక కల్పము. అట్టి 100  కల్పములు బ్రహ్మ జీవిత కాలం. ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క మనువు అధిపతి. ప్రస్తుతం శ్వేత వరాహ కల్పంలో ప్రస్తుత బ్రహ్మ గారి 51 వ సంవత్సరం నడుస్తున్నది. ఈ కల్పంలో ఇప్పుడు 7 వ మనువు వైవస్వతుడు అధిపతి. 

మనువులు స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఔత్తమి, తామసుడు, రైవతుడు, చాక్షషుడు, వైవస్వతుడు, సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, రౌచ్య సావర్ణి, ఇంద్ర సావర్ణి వీరు పదునాలుగు మంది మనువులు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 43*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 43*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఎలాంటి పరిస్థితులు నరేంద్రుని దృఢచిత్తం మీద ఎలాంటి ప్రభావమూ చూపలేవని శ్రీరామకృష్ణులు ఎరుగని విషయం కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రమే కాదు, సమస్త విషయాల్లోనూ నరేంద్రునికి ప్రత్యేక స్థానం కల్పించారు ఆయన. కొన్ని సంఘటనలు పరికిద్దాం:


ఆహారం : శ్రీరామకృష్ణులు సామాన్యంగా ప్రతి ఒక్కరి నుండి ఆహారం స్వీకరించరు. ఒక గ్లాసు నీరైనా సరే, దానిని తీసుకువచ్చిన వ్యక్తి మనఃస్థితిని బట్టే ఆయన స్వీకరించేవారు; సరియైన వ్యక్తి కాకపోతే పుచ్చుకోరు. తీసుకువచ్చిన వ్యక్తి మనస్సును క్షణంలో చదవగలిగేవారు. దుశ్శీలుర నుండి ఏదీ ఆయన స్వీకరించరు. అదేవిధంగా శ్రాద్ధ ఆహారం ఆయన ససేమిరా తినరు. ఈ విషయాల్లో తమ శిష్యులకు కూడా ఇదే నియమాలను విధించారు. 


కాని నరేంద్రుడు ఎలాంటి ఆహారాన్నైనా ఎవరి నుండియైనా నిరాక్షేపణీయంగా స్వీకరించవచ్చు. "ఆతడిలో ప్రజ్వరిల్లే జ్ఞానాగ్ని ఎలాంటి దోషాన్నైనా దగ్ధం చేస్తుంది" అనేవారు ఆయన. ఒకసారి ఆయన నరేంద్రునితోనే, “నువ్వు ఎలాంటి ఆహారం తిన్నా ఫరవాలేదు. అది నీకు హానికరం కాదు. గోమాంసమో, పంది మాంసమో ఏది తిన్నా సరే, ఆ తరువాత మనస్సును స్థిరంగా భగవంతుని మీద లగ్నం చేయగలిగితే, ఆ ఆహారం హవిషాన్నంతో సమానమైనది. హవిష్యాన్నం భుజించీ ఒక వ్యక్తి మనస్సు కామకాంచనాలలో పొర్లితే అతడు ముమ్మాటికీ అల్పుడే" అని చెప్పారు.🙏


 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *31వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *31వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*గురుగ్రహ జననం - 2*


అంగిరసుడూ , శ్రద్ధా ఆనందంతో ఒకరినొకరు చూసుకున్నారు. శ్రద్ధ ఆనందావేశాలతో పసికందును ముద్దులతో నింపేసింది.


*"మా జన్మలు ధన్యమైనాయి ! దేవదేవులకు మా ధన్యవాద పూర్వక ప్రణామాలు అందజేయి , నారదా !"* అంగిరసుడు అన్నాడు.


*"బృహస్పతిని మేధావంతుడిగా , జ్ఞానసముద్రుడిగా తీర్చిదిద్దే అద్భుతమైన అవకాశమూ , విశిష్టమైన విధీ మీవే , అంగీరస మహర్షీ !"* నారదుడు ప్రోత్సహిస్తూ అన్నాడు.


*"అది నా అదృష్టం నారదా ! జ్ఞాన పరీక్షలో నన్ను అవలీలగా పరాజితుణ్ణి చేసేటంత మేధావిగా తీర్చిదుద్దుతాను నా కుమారుడిని !”* అంగిరసుడు సగర్వంగా అన్నాడు. 


*“బాగుంది ! పుత్రాదిచ్చేత్ పరాజయం ! శుభం ! వెళ్ళివస్తాను. త్రిమూర్తులకు బృహస్పతి బాలకుడి గురించి విన్నవించాలి"* నారదుడు నవ్వుతూ అన్నాడు.


తల్లిదండ్రుల పెంపకంలో బృహస్పతి గారాబంగా పెరుగుతూ పెద్దవాడవుతున్నాడు. కుమారుడి బుద్ధికుశలతను గుర్తించిన అంగిరస మహర్షి. అనుకున్న సమయం కన్నా ముందే విద్యాబోధన ప్రారంభించాడు. అన్న ఉతథ్యుడినీ , తల్లితండ్రులనూ ఆశ్చర్యపరుస్తూ , చురుకుగా , వేగంగా వేదశాస్త్రాలు అవగాహన చేసుకుంటూ విద్యాభ్యాసంలో పురోగమిస్తున్నాడు బృహస్పతి.


విద్యార్జనకే అంకితమై పోయిన బృహస్పతి - గురువుకు తీసిపోని శిష్యుడిగా , తండ్రిని మించిన తనయుడుగా తనను తాను నిరూపించుకుని , యువకుడయ్యాడు.


జ్యేష్ట పుత్రుడైన ఉతథ్యుడికి అదివరకే వివాహం జరిపించిన అంగిరస దంపతులు బృహస్పతి వివాహం గురించి ఆలోచనలో పడ్డారు.


తన లోక సంచారంలో భాగంగా నారదుడు స్వర్గ రాజ్యానికి వెళ్ళి ఇంద్రుణ్ణి కలుసుకున్నాడు. ఇంద్రుడి వైభవాన్ని శ్లాఘించాడు.


*“నా పరిపాలనలో మా దేవతలకు అన్నీ ఉన్నాయి. విద్యాబుద్ధులు చెప్పి , మార్గనిర్దేశం చేసే గురువు లేడు ! ఆ లోటు బాగా కనిపిస్తోంది. నారదమునీంద్రా !"* ఇంద్రుడు నారదుడితో అన్నాడు. *"అందరినీ ఎరిగినవాడివి ! దేవ గురువుగా తగిన విజ్ఞానిని సూచించ వచ్చు కదా !"*


*“నారాయణ ! చక్కటి ఆలోచన ! దేవ గురువుగా రాణించే వ్యక్తి ధీశాలి అయి ఉండాలి. నా దృష్టిలో అంతటి మహాజ్ఞాన సంపన్నుడు ఒక్కడే ఉన్నాడు."*



*ఎవరు ? ఎవరా మేధావి ?"* ఇంద్రుడు ఆత్రుతగా అడిగాడు.


*"శ్రద్ధా అంగిరస దంపతుల పుత్రుడు బృహస్పతి ! విద్యాభ్యాసం ముగించి , తగిన అర్హత సముపార్జించి , సర్వసిద్ధంగా ఉన్నాడు. బృహస్పతి గురువుగా లభిస్తే - మహేంద్రుడి పరిపాలన కొత్త పుంతలు తొక్కుతుంది."*


*"మనిద్దరం ఈ క్షణమే అంగిరసుడి ఆశ్రమానికి వెళుతున్నాం. ఆయన మా జనకులకు తోటి మానసపుత్రుడే కదా"* అంటూ ఇంద్రుడు సింహాసనం మీద నుంచి లేచాడు.


అంగిరసుడికీ శ్రద్దకూ పాదాభివందనం చేసి , ఇంద్రుడు తాను వచ్చిన పనిని విన్నవించాడు. 


*"మా పుత్రుడి బుద్ధికుశలత దేవతల అభివృద్ధికి ఉపయోగపడితే - అంతకన్నా  ఏం కావాలి ?"* అంగీరసుడు సంతోషంగా అన్నాడు. *"బృహస్పతి అభిప్రాయం తెలుసుకుందాం !"*


*"మీ అనతి నా కర్తవ్యం నాన్నగారూ ! అయితే ఒక నిబంధన ! ఒక ఆశ్రమ పాఠశాల స్థాపించి , మీరు అనుగ్రహించిన అపార విద్యాసంపదను విద్యార్థులకు పంచాలని నిర్ణయించుకున్నాను..."*


*"మా గురుదేవుల నిర్ణయం మాకు ఆమోదయోగ్యమే. వారి ఆశ్రమ పాఠశాలలో మా దేవ విద్యార్థులు కూడా విద్యను ఆర్జిస్తారు. చక్కటి ప్రదేశంలో ఆశ్రమం ఏర్పాటు చేసి , గురువు గారికి అర్పించుకుంటాం"* గురుశిష్య సంబంధంతో వరస కలుపుతూ అన్నాడు. ఇంద్రుడు. 


*"సంతోషం ! బృహస్పతికి వివాహం చేయాలని తల్లిదండ్రులైన మేం సంకల్పించాం".* అంగిరసుడు అన్నాడు.


*"ఆ శుభకార్యం బాధ్యత కూడా ఈ దేవరాజు భుజస్కంధాల మీద మోపండి ! మా గురుపుంగవులకు తగిన కన్యను సూచించమని ఆ సృష్టికర్తను అర్థిస్తాను !"* ఇంద్రుడు అన్నాడు.


*"మహేంద్రుల ఆలోచన దివ్యంగా ఉంది !"* నారదుడు మెచ్చుకున్నాడు.


*"అలాగే... అంతకంటేనా ! కన్యను మా పితృదేవులే నిర్ణయిస్తే ఇక అభ్యంతరం మేముంటుంది !"* అంగిరసుడు సంతోషంగా అన్నాడు.


*"మహేంద్రా ! దేవసభ 'సుధర్మ'లో మా బృహస్పతిని దేవగురువుగా అభిషేకించేదెప్పుడు ?"* నారదుడు అడిగాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-51🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-51🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల బ్రహ్మోత్సవాలు:*


తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి 'బ్రహ్మోత్సవాలు' అయ్యాయని అంటారు. మరో వ్యాఖ్యానం ప్రకారమైతే- నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి 'బ్రహ్మోత్సవాలు'. అసలీ ఉత్సవాలకూ బ్రహ్మదేవుడికీ సంబంధంలేదనీ తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే, ఇవి చాలా పెద్దయెత్తున జరిగేవి కాబట్టి వీటిని 'బ్రహ్మోత్సవాలు' అంటారనీ ఇంకొందరి భావన. ఈ ఉత్సవాలన్నీ పరబ్రహ్మస్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని 'బ్రహ్మోత్సవాలు' అంటున్నారని మరికొందరి భావన.

బ్రహ్మోత్సవాలలో రకములు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజులు కన్నులపండువగా జరుగుతాయి. 'నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి' అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో- అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు. స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి, భక్తిపారవశ్యంతో పునీతులవుతారు.

నిత్య బ్రహ్మోత్సవం

ప్రతి సంవత్సరం నిర్ధారిత మాసంలో నిర్ధారిత నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు. ఇవి మూడురోజులుగానీ అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు రోజులుగానీ జరుగుతాయి.

శాంతి బ్రహ్మోత్సవం

కరవు, కాటకాలు, భయాలు, ప్రమాదాలు, వ్యాధులు, గ్రహపీడల నివారణ కోసం ప్రత్యేకంగా జరిపించేవి 'శాంతి బ్రహ్మోత్సవాలు'. ఇలాంటి శాంతి బ్రహ్మోత్సవాలను గత చరిత్రకాలంలో చాలామంది ప్రభువులు, దేశ, ప్రాంత, జనహితార్థం అయిదు రోజులపాటు నిర్వహించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి.

శ్రద్ధా బ్రహ్మోత్సవాలు

ఎవరైనా భక్తుడు, తగినంత ధనాన్ని దేవస్థానంలో, దైవసన్నిధిలో సమర్పించి, భక్తిశ్రద్ధలతో జరిపించుకొనేది 'శ్రద్ధా బ్రహ్మోత్సవం'. శ్రీవారి ఆలయంలో ఇలాంటి శ్రద్ధా బ్రహ్మోత్సవాలను 'ఆర్జిత బ్రహ్మోత్సవాలు'గా పేర్కొంటున్నారు.

ఒకరోజు బ్రహ్మోత్సవం

రథసప్తమి రోజు స్వామిని సప్తవాహనాలలో ఊరేగిస్తారు. అందువల్ల దీనిని ఒకరోజు బ్రహ్మోత్సవమని చెబుతారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభించి, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంలో స్వామిని ఊరేగిస్తారు. చక్రస్నానానంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలలో ఊరేగిస్తారు. సప్తాశ్వాల, సప్తమి నాటి, సప్తవారాల సంకేతంగా సూర్యుడు పుట్టినప్పుడు ఈ ఉత్సవం జరుగుతుంది.


అంకురార్పణ:

స్వామివారి బ్రహ్మోత్సవాలు 'అంకురార్పణ'తో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల ఆరంభదినానికి ముందురోజుగానీ మూడు రోజులు, అయిదు రోజులు, ఏడు రోజులు, తొమ్మిదిరోజుల ముందుగానీ అంకురార్పణ జరుగుతుంది. ఇలా నిర్ధారితమైన రోజున, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకై స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు, ఆలయంలో నైరుతిథిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. ఆ తర్వాత, నిర్ణీత పునీత ప్రదేశంలో, భూదేవి ఆకారాన్ని లిఖించి, ఆ ఆకారమునందు లలాట, బాహు, స్తన ప్రదేశాలనుంచి మట్టిని తీసి, స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీన్నే 'మత్సంగ్రహణం' అంటారు. యాగశాలలో, ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో- శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి, పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికలలోని నవధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరుపోసి, అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇదే 'అంకురార్పణ' అయింది.


*మొదటి రోజు ధ్వజారోహణం:*

 

వేంకటేస్వరుడికి ముందుగా ఊరేగింపుకు వచ్చే బ్రహ్మరధం

బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం 'ధ్వజారోహణం'. ఆరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాలసేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంమీద పతాకావిష్కరణ చేస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్త వస్త్రంమీద గరుడుడి బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీన్ని 'గరుడధ్వజపటం' అంటారు. దీన్ని ధ్వజస్తంభంమీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. గరుడధ్వజపటాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో- గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే- సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రం. అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకూ ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ, రాక్షసగణాలకు, వారివారి నిర్ణీత స్థలాలను కేటాయించి, పద్ధతి ప్రకారం, వారి నియమాల ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే.


బ్రహ్మోత్సవాలు రెండో రోజు

శేషవాహనం

 

*శ్రీవారి శేష వాహనం:*

 

శ్రీవారి చిన్నశేష వాహనం

ధ్వజారోహణం తర్వాత, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, వాహన మంటపంలో ఉన్న పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రంగనాయక మంటపంలో విశ్రమింపజేస్తారు. స్వామి శేషతల్పశాయి. ఆయన కొలువున్న కొండ- శేషాద్రి. అందుకే ఏడు తలలున్న పెద్ద శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనదిగా పరిగణిస్తారు. వెుదట్లో ఈ పెద్ద శేషవాహనాన్ని తొమ్మిదోరోజు ఉదయంపూటనే ఊరేగింపునకు వినియోగించేవారు. కానీ ఇప్పుడు అది మొదటిరోజుకే వచ్చి చేరింది.

గతంలో స్వామివారి ఊరేగింపునకై రెండు, మూడు, నాలుగు, ఏడోరోజులలో ఎలాంటి వాహనాలనూ వినియోగించేవారు కాదు. కానీ ఇప్పుడారోజుల్లోనూ వాహనసేవ జరుగుతోంది. అందులో భాగంగా రెండోరోజు ఉదయం, ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే, చిన్న శేషవాహనాన్ని 'వాసుకి'కి ప్రతీకగా పరిగణించటం కద్దు. రోజూ సాయంత్రం వేళలో స్వామివారిని హంస వాహనంమీద వూరేగిస్తారు. ఈ హంసవాహనం మీద స్వామి, విద్యాలక్ష్మీగా వూరేగటం విశేషం.

ధ్వజారోహణం తెల్లవారి ఉదయం మలయప్ప స్వామి చిన్న శేష వాహనం పై నాలుగు మాడ వీధులలో విహరిస్తారు.


 చిన్న శేషుడు అనగా శేషుని తమ్ముడు వాసుకి. ఈ వాసుకి శ్రీమన్నారాయణుని ఆజ్ఞతో క్షీరసాగర మదన సమయంలో మందర పర్వతానికి కవ్వపు తాడుగా మారి సముద్రాన్ని చిలకడానికి సహాయం చేశాడు. స్వామి ఆజ్ఞతో తన పడగల నుండి అనగా ముఖముల నుండి విషజ్వాలలు చిమ్ముతూ రాక్షసులను మూర్ఛాక్రాంతులను చేశాడు. తన విషమును సముద్రమున ఉద్గారం(వాంతి) చేసి సముద్రంలో హాలాహలం పుట్టడానికి తన వంతు సేవ చేసి శంకరునికి ఆ హాల హలాన్ని పానం చేసి లోకాలను రక్షించే అవకాశాన్ని ఇచ్చి దానికి కృతజ్ఞతగా శంకరుని చేతికి కంకణమైనాడు. తన చెల్లె లైనా ‘జగత్కారు’ ని ‘జగత్కారు’ అనే మహర్షికి ఇచ్చి వివాహం చేసి బ్రహ్మ ఆజ్ఞను పాటించి ఆ దంపతుల సంతానమైన ఆస్తీకునితో జన్మయజయుడు ఆచరించిన సర్పయాగాన్ని నివారించి అఖిల నాగులకు జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడు ‘వాసుకి’. అందుకే మలయప్ప స్వామి వాసుకికి రెండవ సేవా భాగ్యాన్ని ప్రసాదించాడు.



*మూడో రోజు సింహవాహనం*

 

శ్రీవారి సింహ వాహనం

మూడోరోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ జరుగుతుంది. ఆ సమయంలో స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమయి ఉంటారు. జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుడిని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు.


 ఆరోజు రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి, అచ్చమైన భోగశ్రీనివాసునిగా *ముత్యాలపందిరి* వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు తెల్లటి ముత్యాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన వాహనంపై స్వామివారు వూరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తారు.

అంతకు ముందు రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వూంజల్సేవ నిర్వహించనున్నారు.


సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు....

జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుడిని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ *సింహవాహనం* పై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు.

రాత్రి ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలో పోటీ పడుతూ విద్యుద్ధీపకాంతులతో తళుకులీనే ముత్యాలపందిరి వాహనంలో మలయప్పస్వామి విహరిస్తారు.


ముత్యాలు విలువైనవి. చల్లదనాన్ని ప్రసాదిస్తాయి. అంతటి ప్రాశస్త్యమైన ముత్యాలను పందిరిగా చేసుకున్న వాహనంలో మలయప్ప స్వామి చూడముచ్చటగా ఆసీనులై భక్తులకు అభయప్రదానం చేస్తారు ఈ పందిరిలో శ్రీవారిని దర్శించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ప్రశాంతత చోటుచేసుకుంటుంది.


*శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱.

herbal bath soaps

,


I, T.V.R.N.SARMA , from A.S.Rao nagar, Hyderabad 

have been making Hand made herbal bath soaps with blend of Coconut, Olive and Castor oil , since 5 years.


Natural ingredients.

Helps to Protect Skin.

No chemicals, 

No fragnances ,  No colours, 

No preservatives.


Varieties :


1. SUNNIPINDI --( Ingradients : Bengal gram Green gram, Rice, Amla, Neem, Yastimadhu, Gandha kachchuralu, Rose petal, Kasturi turmeric) For all skin types


2. SHIKAI -- (Ingradients : Shikai,Soap nuts,Brungaraj,Amla,Neem)For head bath


3. NEEM TURMERIC -- (Neem, Nalapamaradi tailam, Kasturi turmeric), For all skin types.


4. CHARCOAL --(Activated charcoal and Multanimitti)For oily skin ,tan removal and pimples.


5. COW MILK SOAP--for all skin types.


6. KAOLIN CLAY SOAP---for oily skin and normal skin.


7. DEAD SEA MUD SOAP -- More toned skin with a younger appearance,skin cell development, repair, and regeneration.

prevent the skin from getting oily or dry, acne spots many advantages  for almost every common skin problems.


8.MANJISTHA SOAP --Improves skin Complexion and overall look of the skin.

reduce blemish marks.

soothing effect on dry and sensitive skin.

prevent acne.



Upcoming varieties :

* Green tea

*Glycerine


Each soap Rs. 40(cost to cost / no profit no loss basis)

Weight 80 to 90 gms

Shipping extra 


Any further information please contact

WhatsApp no 9750198932

tvrnsarma@gmail.com


There are numerous benefits of using handmade soaps: 


1.) Handmade is nice !! - Making handmade soap is a real passion, people more often do it for passion than earning money out of it. Handmade is an art, people spend countless hours perfecting it, the soap feels so lively due it.


2.) Good Quality - Most of the time handmade soaps are made by individuals and they are very conscious as what goes into the soap, as an individual only the best ingredients are used and soaps are made in an ethical way.


3.) Handmade Soaps are True Soaps and not Detergents - Handmade soaps by definition are true soaps.


4.) Free from preservatives & parabens - Thats true ! properly made Handmade Soaps do not require any preservatives or parabens.


5.) Ecological Impact - Cold process handmade soaps does not require any heating, so you save on carbon footprint. Further, handmade soap being true soaps they are nothing but an alkaline salt + glycerin, so ecological impact after drainage is also minimal.


6.) Full of Natural Glycerin - Handmade Soaps contain high amounts of natural glycerin formed during saponification, commercial soap makes extract glycerin and is sold separately as it gives more profit than a pound of soap.


7.) Chemical Free - Handmade Soaps are free form all harsh chemicals including surfactants, emulsifiers, foaming agents, preservatives.


Hair oil :


PACK SIZE --100ML

PRICE --Rs.150


Home made Herbal Hair oil with vital herbs for hair growth  and preventing greying and dandruff .


Usage of Hair oil :


For daily application dillute with 2 times of plain coconut oil.


For twice in a Week apply the oil leave it for 1hr and then head bath with shikai soap.


For better results apply twice in a week (male--wed &sat, female --tue& fri)


Also available


Natural moisturiser 

Face cream

Pain relief/fracture healing oil

Diabetic medicines (Nishamalaki)

పట్టుకోవాల్సిన పోలీసులే

 ◾ *|| పవిత్రమైన పుణ్య క్షేత్రంలో పేకాట ఆడుతున్న పోలీసులు ||* ◾


▪️రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆలయ సమీపంలో పేకాట ఆడుతున్న దృశ్యాలు.


▪️శ్రీశైలంలో ఆలయ సమీప పోలీస్ సెక్యూరిటీ రెస్ట్ రూమ్ లో పేకాట ఆడుతున్న పోలీసులు.


▪️వీఐపీ దర్శనం కోసం వచ్చే వారి కోసం ఈ సెక్యూరిటీ సిబ్బంది పనీ చేస్తారు అని ముఖ్య సమాచారం.


▪️వీఐపీ భక్తులకు ప్రోటో కాల్ సిబ్బంది గా ఉంటూ ఇలాంటి పనులు చేయడం పై భక్తులు,హిందూ సంఘాలు మండిపడ్తున్నాయి.


▪️శ్రీశైలం కొండపైకి పేకాట సామగ్రి ఎలా వచ్చింది...❓


▪️శ్రీశైలం కొండపైకి వచ్చేటప్పుడు గిద్దలూరు చెక్ పోస్ట్ మరియు తెలంగాణ చెక్ పోస్ట్ లో సిబ్బంది నిద్ర పోతున్నారా...❓


▪️ఈమధ్య కాలంలో శ్రీశైలం కొండపైకి మద్యం, మాంసం మరియు పేకాట సామగ్రి విచ్చల విడిగా కనిపిస్తున్నాయి అంటు స్వయంగా శ్రీశైలం ఆలయ సిబ్బంది సమాచారం ఇచ్చారు.


▪️చట్టాలు , అనేక నిబంధనలు ఉన్న ఏ మాత్రం పట్టించుకోను పోలీసులు.


▪️శ్రీశైల పవిత్ర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది అటువంటి పుణ్య క్షేత్రంలో స్వయంగా ప్రభుత్వ పోలీస్ సిబ్బందే ఇటువంటి దృశ్యచర్యలకు పాల్పడితే శ్రీశైల మల్లికార్జున క్షేత్రాని కాపాడేది ఎవరూ.


▪️రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇటువంటి తప్పుడు పనులు చేస్తుంటే ప్రశ్నించేది, శిక్షించేది ఎవరూ ...❓


▪️ఈ దృశ్యాలు కచ్చితంగా ఆలయ సమీపంలో రక్షణ కల్పించాల్సిన పోలీసులు చేస్తున్న తప్పుకు సాక్ష్యాలు.


▪️ఈ దృశ్యాలు పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందేనా...❓


▪️తప్పు చేస్తే పట్టుకోవాల్సిన పోలీసులే ఇలా పేకాట ఆడుతున్న దృశ్యాలు మా *m2m News Exclusive* కెమెరా కు చిక్కాయి.


*www.m2mnewsreport.com*

ఋషిపంచమీ సాధన*

 *

*సెప్టెంబరు 20, బుధవారం 2023*

🚩 ® *జ్ఞాన సింధు* ®🚩

*ఋషిపంచమీ సాధన*

🕉️🌻🌻🌻🌻✡️🌹🌹🌹🌹🕉️


      🥀 *శ్రీ మాత్రే నమః* 🥀


✅👉 *మహిళలు అందరూ తప్పనిసరిగా ఆచరించవలసిన వ్రతము......*


 🕉️  _*"ఋషి పంచమీ వ్రతము"*_ 🕉️


🕉️ *మనము ఆర్ష ధర్మ వారసులం. మన ఆచార సంప్రదాయాలు, పర్వదినములు, వాటి అనుసరణలు మనకు సూత్రీకరించి అందించినవారు ఋషులు* 


🕉️ *"ఋషి"* అంటేనే సత్య వాక్కుల స్పురద్రూపము.

 

🕉️ రుతుక్రమ సమయంలో పాటించవలసిన కొన్ని నియమాలు, నిస్సహాయ పరిస్థితుల్లో అతిక్రమించడం వలన ప్రాప్తించిన దోషాలు బాధించకుండా, పాపనివృత్తి దోష నివారణ కోసం తప్పనిసరిగా మహిళలు ఆచరించే  వ్రతము - _*ఋషిపంచమీ వ్రతం.*_


🕉️ ఇష్టదేవతా పూజ అనంతరం ఈ క్రింది శ్లోకమును పలుమార్లు పారాయణ చేస్తూ సప్తఋషులను  స్మరిస్తూ నమస్కరించాలి.


*"కశ్యపో౬త్రిర్భరద్వాజో*

*విశ్వామిత్రో౬థ గౌతమః|*

*జమదగ్ని వశిష్ఠా చ సప్తైతే ఋషయ : స్మృతాః||*"


🙏 *సప్త ఋషిభ్యో నమః* 🙏


✅👉 *"ఋషి పంచమి"* 

*సెప్టెంబర్ 20వ తేదీ బుధవారం 2023*



🪴 *Gnaana Sindhu* 🪴


🕉️🌹🌹🌹🌹✡️🌻🌻🌻🌻🕉️

ఛప్పన్న గణపతులు:

 వారణాసియందలి ఛప్పన్న గణపతులు:

౧. అసీ సంగమమున అర్క వినాయకుడు

౨. క్షేత్రానికి దక్షిణమున దుర్గావినాయకుడు

౩. భీమచండి సమీపమున భీమచండి వినాయకుడు

౪. క్షేత్రమునకు పశ్చిమమున దేహలీ వినాయకుడు

౫. వాయవ్యమున ఉద్దండ వినాయకుడు

౬. ఉత్తరమున పాశ పాణి వినాయకుడు

౭. వరణా సంగమమున ఖర్వ వినాయకుడు

౮. క్షేత్రమునకు తూర్పున సిద్ధి వినాయకుడు

౯. అర్క వినాయకున కుత్తరమున లంబోదర వినాయకుడు

౧౦. దుర్గావినాయకున కుత్తరమున కూటదంత వినాయకుడు

౧౧. భీమచండి వినాయకున కీశాన్యమున శూలటంక వినాయకుడు

౧౨. దేహలీ వినాయకునకు తూర్పున కూష్మాండ వినాయకుడు

౧౩. ఉద్దండ వినాయకునకు ఆగ్నేయమందు ముండవినాయకుడు

౧౪. పాశ పాణికి దక్షిణమున వికట ద్విజ వినాయకుడు

౧౫. ఖర్వునకు నైరుతి యందు రాజపుత్ర వినాయకుడు

౧౬. ఆతనికి దక్షిణమున ప్రణవ వినాయకుడు

౧౭. గంగాతీరమున లంబోదర గణేశునకు ఉత్తరమున వక్రతుండ వినాయకుడు

౧౮. కూటదంత వినాయకునకు ఉత్తరమున ఏకదంత వినాయకుడు

౧౯. శూలకంటునకు ఈశాన్యమునందు త్రిముఖ వినాయకుడు

౨౦.కూష్మాండ గణేశునకు తూర్పునందు పంచముఖ వినాయకుడు

౨౧. ముండవినాయకునకు ఆగ్నేయాన హేరంబగణేశుడు

౨౨. వికటదమ్త వినాయకునకు పడమటి భాగాన విఘ్నరాజగణపతి

౨౩. రాజపుత్ర గణపతికి నిర్రుతి దిశయందు వరదవినాయకుడు.

౨౪. ప్రణవ వినాయకునకు దక్షిణాన మోదకప్రియ వినాయకుడు

౨౫. వక్రతుండ గణపతికి ఉత్తరమున అభయప్రద గణపతి

౨౬. ఏకదంత గణపతికి ఉత్తరమున సింహతుండ గణపతి

౨౭. త్రిముఖ గణపతికి ఈశాన్యమున కూణితాక్ష గణపతి

౨౮. పంచముఖ గణపతికి  తూర్పున క్షిప్రప్రసాదన గణపతి

౨౯.  హేరంబగణపతికి ఆగ్నేయదిశయందు చింతామణి గణపతి

౩౦. విఘ్నరాజ వినాయకునకు దక్షిణమున దంతహస్త వినాయకుడు

౩౧. వరద వినాయకునకు నైరుతిమూలయందు పిచండిల గణేశుడు

౩౨. పిలపిలా తీర్థమునందు (త్రిలోచన మందిరం) ఉద్దండముండ వినాయకుడు

౩౩. అభయప్రద గణేశునకు స్థూలదంత వినాయకుడు

౩౪. సిద్ధతుండ వినాయకునకు ఉత్తరమున కలిప్రియ వినాయకుడు

౩౫. కూణితాక్ష గణపతికి ఈశాన్యమున చతుర్దంత వినాయకుడు

౩౬. క్షిప్రప్రసాదన గణపతికి తూర్పున ద్విముఖ వినాయకుడు

౩౭. చింతామణి వినాయకునకు ఆగ్నేయమున జ్యేష్ఠా వినాయకుడు

౩౮. దంతహస్త వినాయకునకు దక్షిణమున గజవినాయకుడు

౩౯. పించడిల గణేశునకు దక్షిణమున కాల వినాయకుడు

౪౦. ఉద్దండముండ గణపతికి దక్షిణమున నాగేశ వినాయకుడు

౪౧. తూర్పున మణికర్ణ వినాయకుడు

౪౨. ఆగ్నేయమున ఆశావినాయకుడు

౪౩. దక్షిణమున సృష్టి వినాయకుడు

౪౪. నైరుతియందు యక్ష వినాయకుడు

౪౫. పడమట గజకర్ణ వినాయకుడు

౪౬. వాయవ్యమున చిత్రఘంట వినాయకుడు

౪౭. ఉత్తరమున స్థూలజంఘ వినాయకుడు

౪౮. ఈశాన్యమున మంగళ వినాయకుడు

౪౯. యమతీర్థమునకు ఉత్తరమున మిత్ర వినాయకుడు

మోదాది పంచ వినాయకులు అనగా

౫౦. మోద వినాయకుడు

౫౧. ప్రమోద వినాయకుడు

౫౨. సుముఖ వినాయకుడు

౫౩. దుర్ముఖ వినాయకుడు

౫౪. గణనాథ వినాయకుడు

౫౫. జ్ఞాన వినాయకుడు, ద్వారవినాయకుడు

౫౬. అవిముక్తవినాయకుడు


ఈ యేబది యారు గణపతులను స్మరించు వారు దూరదేశమునందు మృతులైనను జ్ఞానమును పొందుదురు. పఠించు వారు పుణ్యాత్ములై సిద్ధిని పొందుదురు. విఘ్నములు బాధింపవు, పాపములు సమీపింపవు, ఆపదలనుండి బయట పడుదురు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

విఘ్నేశ్వర స్తుతి

 విఘ్నేశ్వర స్తుతి 


తెలి వలువలు శశి వర్ణము 

నలు భుజములు విష్ణుతత్వ నాయకుడయ్యున్ 

లలి శాంత వదన మొప్పెడు 

నిలవేల్పుని శ్రీగణేశు నెపుడు భజింతున్


అగజ ముఖపద్మ వికసిత కర్కుడయ్యు

గజముఖుం డౌట శాంతితో కానిపించు 

భక్త  జనులకు నిరతమ్ము ప్రాపు నున్న 

ఏక దంతుండు స్వామికి మోకరిలుదు


చిన్ని కండ్లు పెద్ద బొజ్జ చిద్విలాస ముద్రతో 

చెన్ను మీర దంతిమోము చేటచెవుల తోడ తా 

పన్నగమ్మెజంద్యముగను పైనదాల్చియొప్పియున్

సన్నుతాంగుడౌ గణేశు సతము గొల్తు భక్తితో


✍️గోపాలుని మధుసూదనరావు శర్మ 🙏

సంప్రదాయ పచ్చళ్ళు*

 *SP PICKLES*

*సంప్రదాయ పచ్చళ్ళు*


*బ్రాహ్మణ సంప్రదాయ పద్దిలో బ్రాహ్మణ మహిళలతో తయారుచేయబడిన పచ్చళ్ళు*


**మాదగ్గర తయారు చేసిన అన్ని పచ్చళ్ళు పొడులు సంప్రయం పద్దతిలో కలర్స్ ప్రిసర్వేటివ్స్ లేకుండా క్వాలిటీ పదార్ధాలతో తయారుచేస్తాము**


*పచ్చళ్ళు*:  *1kg cost*


చింతకాయ తొక్కు450/-

ఉసిరి తొక్కు450/-

ఉప్పు గోంగూర  550/-

పులిహోర గోంగూర 750/-

పండుమిర్చి గోంగూర 650/-

పండుమిర్చి 550/-

ఉసిరికాయ 550/-

దబ్బకాయ 550/-

నిమ్మకాయ 550/-

ఆవకాయ(వెల్లుల్లి/లేకుండా) 600/-

బెల్లం ఆవకాయ 600/-

పెసర ఆవకాయ   600/-

మెంతి ఆవకాయ  600/-

నువ్వు ఆవకాయ 600/-

కాలి్ఫ్లవర్ ఆవకాయ 600/-

పనసపోట్టు ఆవకాయ 750/-

పచ్చఆవకాయ  850/-

దోసవకాయ. 600/-

మాగాయ  600/-

*వంకాయ నిల్వ పచ్చడి* 750/-

అల్లం పచ్చడి  650/-

మామిడి అల్లం పచ్చడి 650/-

టొమోటో పచ్చడి 550/-

మునక్కాయ టమోటా 650/-

*పచ్చిమిరప ఆవకాయ* 600/-


*పొడులు* :   *1kg cost*


కంది పొడి 550/

నువ్వులపొడి 500/-

ధనియాల పొడి 500/-

పప్పులపొడి 500/-

కరివేపాకు కారప్పొడి 550/-

అవిశగింజల పొడి 600/-

కొబ్బరి పొడి  550/-

రసం పొడి 500-

సాంబారు పొడి 650/-

నల్లకారం 600/-

పుదీనా కారపోదడి 750/-

మునగాకుపోడి 2000/-

మునగాకు కారపోడి 650/-


*వడియాలు* & *అప్పడాలు*: 


సగ్గుబియ్యం వడియాలు  1kg - 500/-

పెసర అప్పడాలు       650/-

మినప అప్పడాలు 650/-

మిర్చి   850/- *soldout*

గుమ్మడి వొడియలు 850/-

మినపిండి వోడియలు   600/-


*మాదగ్గర ఇంకా*


 *చిట్టెంటాపోటు* *పాల ఇంగువ* *లభించును*


*మేము అన్నిరకాల పచ్చళ్ళు పొడులు AS బ్రాండ్ పప్పునూనెతో మాత్రమే తయారు చేస్తాము*


*అన్ని ప్రదేశాలకు కొరియర్ సౌకర్యం కలదు* *చార్జీలు అదనం*

 


*అందరికీ నమస్కారం.  మీరు దేశ విదేశాలలో ఎక్కడున్నా, మేము మీకు సహకరించగలము. మేము ఆహార పదార్థాలు (స్వీట్లు, ఖారా, పొడులు, పచ్చళ్ళు, చలిమిడి) స్వయంగా శుచి, శుభ్రతతో తయారు చేసి ఇయ్యగలము. మీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యక్రమానికైనా మేము కావలసిన సరంజామా, మీ బడ్జెట్ ప్రకారం చీరలు, ధోవతులు, లుంగీలు, తువ్వాళ్ళు, జాకెట్టు బట్టలు, కర్చీఫ్లు, రిటర్న్ గిఫ్టులు పసుపు కుంకుమ పాకెట్లు, ఇట్లా మీకు కావాల్సిన ప్రతీది మీ సమయం ఆదా చేస్తూ, మీ ఇంటి దగ్గరకే ఏర్పాటు ఔతాయి. మీరు ఏ వయస్సు వారైనా మీకు పూజకైనా, పెళ్ళికైనా లేదా వ్రతాలకైనా అన్నీ ఏర్పాటు చేయబడతాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి *


*దయచేసిమీకుతెలిసిన

బ్రాహ్మణ గ్రూపులలో

ఈ మెసేజ్ ని పంపవలసినదిగా

కోరుకుంటునను*


*జలసూత్రం పల్లవి*

*విజయవాడ*

*సంప్రదించండి* : *7981370664**Gp number*

*08662533848*


*7382665848* Gp or Pp number

మనసున గల మలినంబులు

 *1921*

*కం*

మనసున గల మలినంబులు

తనువును కడుగంగపోవు గమనించుమయా!!

తనువున పూసిన గంధము

మనసున మలినంపుకంపు మాన్పదు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనసు లో ఉన్న మలినాలు శరీరాన్ని కడగడం వలన పోవు. దేహానికి పూసిన గంధం మనసు లోని మాలిన్యదుర్గంధాన్ని తగ్గించదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

తొలిపూజ లొనరించ

 *సర్వ "సల"సీసము*

తొలిపూజ లొనరించ తులుచంగ కరుణించి

   గరికంబులను గూర్చ  వరము లొసగు

నవరాత్రి వ్రతమందు లవపూజ లొనరించ

   మదిమెచ్చి ఫలమిచ్చు మహిత గుణుని

జగమెల్ల భజియించు సతతమ్ము మతిభక్తి

    వికలమ్ములను త్రుంచి వెతల నణచ

గణనాథ గరిమంబు గణుతించ సరిలేరు

   సురలైన నరులైన సుధులునైన.

*ఆ.వె.*

ప్రమథ గణములైన  ప్రథమార్చనముజేయ

విఘ్నరాశులెల్ల నిఘ్నమొనరు

పరమ పూజ్యుడైన పరమేశు తనయుండు

వరము లొసగు జనుల భక్తి మెచ్చి.

*అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు*


*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మనస్సుని నిగ్రహించటమ్


🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸 


*ಅಪ್ಸ್ಯಬ್ಧಿಪಾನಾನ್ಮಹತಃ*

*ಸುಮೇರೂನ್ಮೂಲನಾದಪಿ |*

*ಅಪಿ ವಹ್ನ್ಯಶನಾತ್ಸಾಧೋ*

*ವಿಷಮಶ್ಚಿತ್ತನಿಗ್ರಹಃ ||*

(ಯೋಗವಾಸಿಷ್ಠ-ಶ್ರೀರಾಮನ ಚಿಂತನೆ)


ಸಮುದ್ರಜಲವನ್ನಾದರೂ ಪಾನಮಾಡಬಹುದು, ಮೇರುಪರ್ವತವನ್ನು ಸಮೂಲವಾಗಿ ಕೀಳಬಹುದು, ಬೆಂಕಿಯನ್ನು ಭಕ್ಷಿಸಬಹುದು. ಆದರೆ ಈ ಚಿತ್ತವನ್ನು ನಿಗ್ರಹಿಸುವುದು ಮಾತ್ರ ಅದೆಲ್ಲಕ್ಕಿಂತಲೂ ಕಷ್ಟಕರ. 


*🌷🌺🙏 ಶುಭದಿನವಾಗಲಿ! 🙏🌺🌷*

 సముద్ర జలమును త్రాగవచ్చు. మేరు పర్వతమును పెకిలించవచ్చు నిప్పుని భక్షించ వచ్చు. కానీ మనస్సుని నిగ్రహించటమ్ వీటన్నికన్నా కష్టం.

ధర్మాచరణమును

 *1920*

*కం*

కొందరు ధనార్జనమ్మును

కొందరు ధర్మాచరణము కోరుదురిలలో.

కొందరు మాత్రము ధనముల

నొందును ధర్మాచరణకు నుర్విన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఈ లోకంలో కొందరు ధనములు సంపాదించడాన్ని, మరికొందరు ధర్మాచరణమును కోరుకుంటారు.కానీ కొందరు మాత్రం ధర్మాచరణము కోసం ధనములు సంపాదిస్తారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

జ్ఞాన సింధు 🚩 " గాణాపత్యము "

 🚩   జ్ఞాన సింధు   🚩

         "  గాణాపత్యము "

   హిందూ శాస్త్రాలని అనుసరించి

.   భగవత్ ఆరాధన పద్ధతులు

    షణ్ముతములుగా ప్రసిద్ధి

    అంటే 6 రకాల శాస్త్రీయ

     ఆరాధన విధానాలని

      వేదం ప్రసాదించింది

   1) గాణాపత్యము - గణపతి

   ప్రధాన దేవతగా ఆరాధించడం

  2) సౌరవము - సూర్యుని ప్రధాన

   దేవతగా ఆరాధించడం 

  3) శైవం - శివుడు ప్రధాన

   దేవతగా ఆరాధించడం     

   4) శాక్తేయము - జగన్మాతని

   ప్రధాన దేవతగా ఆరాధించటం 

   5) వైష్ణవం - నారాయణుని

   ప్రధాన దేవతగా ఆరాధించడం 

   6) షణ్ముఖం  - ప్రధాన దేవతగా

   సుబ్రహ్మణ్యస్వామి ఆరాధించటం


     గాణాపత్య సంప్రదాయాలని  

     అనుసరించి మరియు

   భారతదేశానికి తలమానికమైన

   గణపతి క్షేత్రములైన 

     ' అష్ట గణపతుల '

      పుణ్యక్షేత్రములలో

     ఈ రోజు భౌమ చతుర్థి

    యోగములో 19-09-2023

    శ్రీ వరసిద్ధి వినాయక చతుర్థి

     వ్రతము జరుగుతుంది


   నేటి వరసిద్ధి వినాయక వ్రతము

    సంపూర్ణ సత్ఫలితాలను

    ఆశీస్సులు అందిస్తుంది

   👉🏼 ' జ్ఞాన సింధు  ' ప్రకటించిన

    విధముగా వ్రతము ఆచరించే 

    ఆధ్యాత్మిక సాధకులకు

   తక్షణం మీ సంకల్పములు

  శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి

   అనుగ్రహంతో నెరవేరుతూ

    అనుభవంలోకి  రాగలవు   

  

    

  🥀  నేడు వ్రతం ఆచరిస్తున్న

       ధార్మిక సాధకులకు వినాయక

     చవితి శుభాకాంక్షలు 🥀

  

  🙏  గం గణపతియే నమః 🙏


   📞 *96403 00507* 


🚩® *Gnaana Sindhu* ®🚩


🕉️🌹🌹🌹🌹🔯✡️🌻🌻🌻🌻🕉️

నవగ్రహ పురాణం - 58 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 58 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*సూర్యగ్రహ చరిత్ర - 1*



తన సంతానం - శనైశ్చరుడూ , సావర్ణి , తపతీ పెద్దవాళ్లయ్యే కొద్దీ - ఛాయ సంజ్ఞ పిల్లలకు మానసికంగా బాగా దూరంగా జరిగింది. వైవస్వతుడినీ , యముడినీ , యమినీ చూడడానికే ఆమె ఇష్టపడడంలేదు.


ఛాయ తన బిడ్డలు ముగ్గుర్నీ రహస్యంగా సమావేశపరిచింది. *"వైవస్వతుడూ , యముడూ , యమి మంచి వాళ్ళు కారు. వాళ్ళకు మీరు దూరంగా ఉండాలి"* అంది. ముగ్గురూ ముఖాలు చూసుకొన్నారు.


*“అన్నలిద్దరూ మంచివాళ్ళమ్మా !”* సావర్ణి ఆశ్చర్యపోతూ అన్నాడు.


*“నాకు కూడా అలాగే అనిపిస్తుంది ! వైవస్వతుడు , యముడూ మాతో చక్కగా ఆడుకుంటారు !”* శనైశ్చరుడు ఛాయనే చూస్తూ అన్నాడు.


*“వాళ్ల మనసులు మీకు తెలీవు ! మీరు చిన్న పిల్లలు...”* ఛాయ చెప్పుకుపోతోంది. 


*"అక్క యమి చాలా మంచిదమ్మా ! నేను ఏది కావాలన్నా అడ్డు చెప్పకుండా ఇచ్చేస్తుంది తెలుసా !"* తపతి ఛాయ వైపే చూస్తూ అంది.


ఛాయ అసహనాన్ని దాచుకుంటూ నిట్టూర్చింది. *"మీకో నిజం తెలుసా ? మంచివాళ్ళకు సర్వమూ మంచిగానే , అందరూ మంచివాళ్ళగానే అనిపిస్తారు !”* 


*“అయితే మేం మంచి వాళ్ళమా అమ్మా ?"* శని ఆసక్తిగా అడిగాడు.


*“అందుకే గద నాయనా ! ఆ ముగ్గురూ మంచి వాళ్ళు కాకపోయినా మీకు మంచివాళ్ళుగా కనిపిస్తున్నారు !”* ఛాయ తెలివిగా అంది. *“వాళ్ళు ముగ్గురూ ఎంత చెడ్డ వాళ్ళంటే , మీ పరోక్షంలో మీ గురించి నాతో చెడుగా చెబుతూనే ఉంటారు. అయినా , నేను నమ్మనుగా ! మీరు చాలా మంచివాళ్ళనీ , చాలా బుద్ధిమంతులనీ , అమ్మ మాట జవదాటరనీ నాకు తెలుసుగా !"*


శనీ , సావర్జీ , తపతీ అనుమానంగా ఒకర్నొకరు చూసుకొన్నారు. ముందుగా శని పెదవి విప్పాడు.


*“అందుకేనేమో వాళ్ళను చూసినప్పుడల్లా ఎందుకో తెలియకుండానే నాకు కోపం వస్తూంటుంది. గుడ్లు ఉరిమి ఆగ్రహంగా చూడాలనిపిస్తుంది !"* 


ఛాయ శనిని ఆప్యాయంగా చూసింది. *"చూశారా ! ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి...".*


*"అంటే..."* తపతి అమాయకంగా అడిగింది. *"ఏం చేయాలి ?"*


*"మీరు ముగ్గరూ ఒక బృందంగా కలిసి ఉండాలి. ఆ ముగ్గురితో కలవకూడదు. అర్ధమైంది కదా ?"* ఛాయ అడిగింది.


*"మా బృందానికి నేను నాయకుడిని ! సరేనా , అమ్మా !"* శని ఉత్సాహంగా అడిగాడు.


*"ఔను ! మీలో పెద్దవాడివి నువ్వేగా , నాయనా ! అయితే ఒక ముఖ్యమైన విషయం. నేను మీతో చెప్పిందంతా వైవస్వతుడికీ , యముడికీ , యమికీ చెప్పకూడదు. అలాగే మీ తండ్రిగారికీ చెప్పకూడదు !"* ఛాయ గొంతు తగ్గించి అంది. 


*"నాన్నగారికి చెప్తే ఏం ?"* శని అనుమానం వ్యక్తం చేశాడు.


*“చెప్పకూడదు. అన్నాను కద !"* ఛాయ విసుగ్గా అంది. 


*"ఎందుకు ?"* శని మొండిగా అడిగాడు.


*"మీ నాన్నగారు నమ్మరు ! ఆయనకి వాళ్ళంటే ఎక్కువ ఇష్టం !"* ఛాయ అంది. 


*"అలాగా...మాకు తెలీదమ్మా !”* సావర్ణి ఆశ్చర్యంగా అన్నాడు. 


*"అందుకే మీరెప్పుడూ అమ్మ మాటే వినాలి !"* అంది ఛాయ.


ఛాయ ప్రబోధం ఆమె పిల్లల్లో మార్పు తెచ్చింది. వాళ్ళు సంజ్ఞ సంతానానికి దూరంగా ఉండటం ప్రారంభించారు. ముందుగా ఆడపిల్లలైన యమి , తపతి అభిప్రాయభేదాలకు అంకురార్పణ చేశారు. తల్లి మాటల్ని పూర్తిగా నమ్మిన తపతి యమి పట్ల ఇన్నాళ్ళూ ఉన్న ప్రేమను ద్వేషంగా మార్చుకుంది.


రోజులు గడిచే కొద్దీ ఛాయలో సంజ్ఞ బిడ్డల పట్ల వేళ్ళుతన్నిన ద్వేషం కొద్దికొద్దిగా వ్యక్తం కాసాగింది.


తల్లిలో కనిపిస్తున్న మార్పు వైవస్వతుణ్ణి , యముడినీ ఆశ్చర్యంలో పడవేసింది. తల్లి తనను చూస్తున్న విధానం వల్ల యమి అమితంగా బాధపడసాగింది. ముగ్గురూ , తమలో తాము బాధపడుతూ ఉండిపోయారు.


*“అమ్మ మనల్ని సరిగ్గా చూడడం లేదు. శనినీ , సావర్ణినీ , తపతినీ ప్రత్యేకంగా చూసుకుంటోంది. అమ్మలో వచ్చిన మార్పు మన మనసుల్ని బాధపెడుతోంది. నాన్నగారికి చెప్పాలి"* యముడు ఆవేశంగా అన్నాడు.


*"అమ్మ మంచిది కాదని నాన్నకు చెప్పడం తప్పు , తమ్ముడూ !”* వైవస్వతుడు యముడి భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు.


*"తప్పెందుకవుతుంది ? తప్పు చేసే వాళ్ళ గురించి పెద్దలకు చెప్పడం తప్పు కాదు. ధర్మం తప్పి ప్రవర్తించే వాళ్ళని వదిలి పెట్టరాదన్నయ్యా ! తల్లి అయినా , తండ్రి అయినా అంతే ! ధర్మం ధర్మమే ! అధర్మం అధర్మమే !"*


*"ఈ మధ్య నువ్వు ధర్మం గురించి ఎక్కువగా చెప్తున్నావు , యమా !"* వైవస్వతుడు నవ్వుతూ అన్నాడు.


*"అవును !"* యముడు వైవస్వతుడిని తదేకంగా చూస్తూ అన్నాడు. *"మీకు గుర్తుందో లేదో...మన తమ్ముడు శని జన్మించినప్పట్నుంచీ అమ్మ మారిపోయింది. సావర్ణి పుట్టాక ఇంకొంచెం , తపతి పుట్టాక మరికొంచెం - వాళ్ళు ముగ్గురూ పెద్ద వాళ్ళయ్యాక - ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అమ్మ !”*


*"ఏమో , యమన్నయ్యా ! నేను గమనించలేదు !"* అంది యమి. 


*"నేను కూడా !"* వైవస్వతుడు అన్నాడు. *"నువ్వెలా గమనించగలిగావో నాకు తెలీదు !"*


*"ఎలా గమనించానంటే - అమ్మ కళ్ళు చూసి ! ఆ తపతినీ , సావర్ణినీ , శనినీ చూస్తున్నప్పుడు అమ్మ కళ్ళు దీప కళికల్లా మెరుస్తాయి. మనల్ని చూసినప్పుడు అగ్ని గోళాల్లా మెరుస్తాయి"* యముడు వివరిస్తూ అన్నాడు. *"అమ్మ కళ్ళల్లో నాకు మన పట్ల ద్వేషం కనిపిస్తుంది , తెలుసా ? ఇప్పుడు అమ్మ మాటల్లో కూడా మన పట్ల అయిష్టత స్పష్టంగా వ్యక్తమవుతోంది !"*


*"అమ్మ... ఎందుకిలా అయిపోయిందన్నయ్యా !"* యమి వైవస్వతుణ్ణి అడిగింది అమాయకంగా. *“ఆలోచిస్తుంటే , నాకూ నిజమే అనిపిస్తోంది. తపతిని మెచ్చుకుంటుంది. నేను - కంటపడితే చాలు - కసురుతుంది !"*


*“బిడ్డలందర్నీ సమానంగా చూడడం తల్లిదండ్రుల విధి ! అది ధర్మం ! ఈ సారి అమ్మ పక్షపాతం చూపిస్తే నేను ఊరుకోను !"* యముడు నిష్కర్షగా అనేసి , అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.


*"యముడు ఎప్పుడూ 'ధర్మం , ధర్మం' అంటూ వుంటాడు ! ఏం చేస్తాడో ఏమో !"* వైవస్వతుడు ఆందోళనగా అన్నాడు. 


*“ఏం చేస్తాడు ? 'ధర్మం, ధర్మం' అనే వ్యక్తి ధర్మమైందే చేస్తాడు !"* యమి యముడు

వెళ్ళినవైపే చూస్తూ అంది.

మోదీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు.*

 *తాజా వార్తలు*


*ప్రధాని మోదీకి సంబంధించి దేశ మాజీ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ పెద్ద ప్రకటన చేశారు. నేను కాంగ్రెస్ పార్టీకి చెందినదానిని అయినప్పటికీ, ఈ రోజు భారతదేశ సామాజిక కార్యకర్తగా, భారతదేశాన్ని మంచి దేశంగా మార్చగల ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ అని భారతీయ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వారికి సత్తా ఉంది అని ప్రతిభా పాటిల్ అన్నారు. భారత పౌరులకు కొత్త దిశానిర్దేశం చేసే నిర్ణయాలు తీసుకోండి. మోదీజీ భారతదేశానికి కొత్త దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతిగా కూడా దేశానికి సేవ చేశాను. కానీ ప్రధాని మోదీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు.*

 **

🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

 🕉️🪷 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః* 🪷🕉️

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

 *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 


 *2-అధ్యాయం, 30వ శ్లోకం* 


 *దేహీ నిత్య మవధ్యోయం దేహే సర్వస్య భారత* I

 *తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి* || 30


 *ప్రతిపదార్థం*


భారత = ఓ అర్జునా ! ; అయమ్,దేహీ = ఈ ఆత్మ; సర్వస్య = ప్రతి ప్రాణి యొక్క ; దేహే = దేహము నందు ; నిత్యమ్ = ఎల్లప్పుడు :ను; అవధ్యః = విధంప వీలుకానిది యై యుండును; తస్మాత్ = అందువలన; సర్వాణి = సమస్తములైన ; భూతాని = ప్రాణాలను గూర్చి ( ఏ ప్రాణి కొరకు) ఐనను; త్వమ్ = నీవు; శోచితుమ్ = శోకించుటకు;న, అర్హసి = అర్హుడవుకావు శ్రోకింప దగదు ).


 *తాత్పర్యము* 


ఓ అర్జునా ! ప్రతి దేహమునందును ఉండేడి ఈ ఆత్మ వధించుటకు వీలుకానిది. కనుక ఏ ప్రాణిని గూర్చి యైనను నీవు శోకింపదగదు.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం🙏🙏*

వేదకుసుమాలు

 *అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్ వారి చే శోభకృత్ ఋషి పంచమి(19-9-23)నాడు సన్మానించబడే సీతారామ అగ్రహారవాసులైన శ్రీ శోభకృత్ వేదకుసుమాలు*

*గమనిక*:-- ఈ కార్యక్రమం ఈనాడు (19-9-23) సాయంత్రం *6 గంటకు* నిర్వహించబడుతుంది. అభీష్ట గణపతి భక్తులు, సీతారామ అగ్రహారం సభ్యులు అందరూ ఈ కార్యక్రమం లో పాల్గొని తరించగలరు.

*వేదిక*:-- సీతారామ అగ్రహారం లోని అభీష్ట గణపతి ఆలయం.


*ఘనాన్తపట్టభద్రులు*


*౧. బ్రహ్మ శ్రీ ధూళిపాళ మధుగణేశ శర్మ ఘనపాఠీ...* ఈయన మన అగ్రహారం నుండి ప్రప్రథమ సువర్ణపతకప్రాప్తులు


౨. బ్రహ్మ శ్రీ జోస్యుల హేమంత శర్మ ఘనపాఠీ,

౩. బ్రహ్మ శ్రీ ఆకెళ్ళ రామకృష్ణ శర్మ ఘనపాఠీ,

*క్రమాన్త పట్టభద్రులు*

ఈ సంవత్సరం ఎవరూలేరు, కానీ గడచిన సంవత్సరం విజయవాడ కౌతావారి పట్టాతో సహా సాధించిన *"బ్రహ్మ శ్రీ పిడపర్తి ఆంజనేయ శర్మ"* ను ఈ విభాగంలో గుర్తించడమైనది.

*మూలం పరీక్ష పూర్తి చేసి న వారు*

౧.  చి. గండికోట శేషవేంకట రమణ మూర్తి శర్మ.

౨. చి కొంపెల్ల ప్రణవేశ్వర శర్మ,

౩. చి. కొంపెల్ల ప్రమోదేశ్వర శర్మ,

*అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్*

నామం శక్తి వంతమైనది

 ఆత్మస్వరూపులారా..

దైవం సాకారుడు, నిరాకారుడు కూడా. ఆకారం ధ్యానం నిలబడటానికి దోహద పడుతుంది. క్రమంగా అది నిరాకారం వైపు మళ్ళుతుంది. అన్నింటి కంటే నామం శక్తి వంతమైనది. ప్రణవం, శివ, కేశవ, రామ ఇత్యాది నామాలన్నే భక్తిని స్థిరపరిచి పరబ్రహ్మను చేరుకునే మార్గాలే. సర్వం గచ్ఛతి వాసుదేవః. ఆ పరబ్రహ్మాన్ని ఈశ్వరుడు అనొచ్చు, భగవంతుడు అనొచ్చు, పరమాత్మ అనొచ్చు. నామధారిగా, నామ రహితుడిగా ఉన్న ఆ నారాయణ నామ స్మరణ ఇహపరాలను అందించే తారకం. అభ్యాస, వైరాగ్యాలతో ఎవరైతే సాధన చేస్తారో వారు నన్నే పొందుతారని గీతలో భగవానుడు ఇచ్చిన అభయమే శరణ్యం. కృష్ణస్తు స్వయం భగవాన్..అని చెప్పిన వ్యాస మహర్షి వేదోక్తిని అనుసరిద్దాం, తరిద్దాం. హరి ఓం./అంతరంగ తరంగం/AVR🙏

ముక్తి కోసం ఇప్పటి నుండే

 మనం ఇంతకు ముందు ఎన్నో జన్మలు ఎత్తి ఉంటాం, ఆ జన్మల పుణ్య ఫలితంగా మానవ జన్మ వచ్చింది. కాని ఎవరూ మళ్ళీ జన్మ లేకుండా ముక్తి కొరకు ప్రయత్నం చేయడం లేదు. కొంత మంది ఇహలోక సుఖాలు, భోగాలు అనుభవించడం కొరకు ఆరాటపడుతుంటే, మరి కొంత మంది స్వర్గలోక సుఖాల కొరకు యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. ఇంకా కొందరు వచ్చేజన్మ మంచి రావాలని మరో మంచి జన్మకోసం ఆరాటపడుతున్నారు. ఈ మానవులలో అతి కొద్ది మంది మాత్రమే ఈ జనన మరణ చక్రం నుండి ముక్తి కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో జన్మలో కొద్ది కొద్దిగా పుణ్యం సంపాదించుకుంటూ, పోగుచేసుకుంటూ, జ్ఞానం సంపాదించుకొని, గతజన్మ వాసనలను పోగొట్టుకుంటూ చివరికి పరమాత్మకు తనకు భేదం లేదు అనే స్థితికి చేరుకుంటున్నారు. అప్పుడు సర్వం పరమాత్మ మయంగా కనిపిస్తుంది.


లక్షల్లో ఒకడికి వచ్చే లాటరీ టిక్కట్టును, ఆ లాటరీ తనకే తగులుతుంది అనే ఆశతో కొనంగా లేనిది, ఆ ముక్తి నాకే వస్తుంది అని ముక్తి కొరకు ఎందుకు ప్రయత్నించకూడదు. 

"జన్మసార్ధకం అవ్వాలంటే ముక్తికోసం సాధన తప్పనిసరిగా చేయాలి."


అబ్బో! ఎన్నో జన్మల తరువాత వచ్చే ముక్తి కోసం ఇప్పటి నుండే ఎందుకు తాపత్రయపడటం దండగ అని చేతులుముడుచుకొని కూచోకూడదు. ఎందుకంటే, ఎప్పుడో 21 ఏళ్ల తరువాత వచ్చే ఇంజనీరింగ్ డిగ్రీకి ఇప్పటి నుండే చదవడం ఎందుకు అని ఊరికే కూర్చోవడంలేదుగా!

5వ ఏటనుండి ABCD లతో చదువు మొదలు పెడుతున్నాము కదా! ప్రస్తుతం ఒకటో క్లాసు నుండి ఐఐటి కోచింగులు ఇచ్చే స్కూళ్లు కూడా మొదలైయ్యాయి. ఇదీ అలాగే అనుకోవాలి. ఇప్పటి వరకు ఎన్ని జన్మలు గడిచిపోయాయో! ఏమో! ఇదే ఆఖరి జన్మేమో.. కాబట్టి ఇప్పుటీనుండే ప్రయత్నం మొదలెట్టాలి.


🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

కురుకర్తా కురువాసీ

 కురుకర్తా కురువాసీ 

కురుభూతో గుణౌషధః I 

సర్వాశయో గర్భచారీ 

సర్వేషాంప్రాణినాంపతిః ॥ 77 ॥  


* కురుకర్తా = కురుక్షేత్రమును సృష్టించినవాడు, 

* కురువాసీ = కురుభూములందు నివసించువాడు, 

* కురుభూతః = కురుభూములందు పుట్టినవాడు, 

* గుణౌషధః = మంచి గుణములు ఔషధములుగా కలవాడు, 

* సర్వాశయః = సమస్తమైన అభిప్రాయములు తానే అయినవాడు, 

* గర్భచారీ = సమస్త గర్భములందు సంచరించువాడు, 

* సర్వేషాం ప్రాణినాం పతిః = సమస్తమైన ప్రాణులకు అధిపతి.

ఆనందగణపతి

 ఆనందగణపతి (పాట


పాడరండి కలిసి మిత్రులార భక్తిమీర కొలువున్నది యిల ఆనందగణపతి

ఆదిశక్తి తనయుడట శక్తులకే నెలవు గజముఖవదనుడట విద్యలకే నెలవు

శశాంక ధారుడట సొగసులకే నెలవు సుందరాంగుడంట యీ ఆనందగణపతి పత్రిపూజనప్రియుడట

తనువులకే హితవు మోదకాప్రియుడట చవులకే హితవు ప్రణవనాద ప్రియుడట మనసులకే హితవు లేజీ విజయవరదుడంట యీ ఆనందగణపతి కళలతో తేజరిల్లె యీ ఆనందగణపతి

పిలిచినంత పలుకునట భక్తులకే చనువు సృష్టినెల్ల కాచునట జగతికే చనుపు ముదముమీర నర్తించే నృత్యగణపతి


డా. దేవులపల్లి పద్మజ,


విశాఖపట్నం, 



దాశరధీ



దాశరధీ! కరుణాపయోనిధీ!


"రంగదరాతిభంగ,ఖగరాజతురంగ,విపత్పరంపరో/

త్తుంగతమఃపతంగ,పరితోషితరంగ,దయాంతరంగ,స /

త్సంగ,ధరాత్మజాహృదయసారసభృంగ,నిశాచరాబ్జమా /

తంగ,శుభాంగ,భద్రగిరిదాశరధీ! కరుణాపయోనిధీ!

రచన:కంచర్లగోపన్న.

      (రామదాసు)


భావం:శతృసంహారీ! గరుడవాహనా! ఆపదోధ్ధారీ!రంగనాధసేవితా! కరుణాన్వితహృదయా! సత్సంగా!సీతాహృత్పద్మభృంగా!రాక్షసకులభీభత్సకరా!శుభాంగా! భద్రగిరినిలయా! దశరధకుమారా! కరుణాసాగరా! నన్నేలుముస్వామీ!


విశేషములు: తెలుగునవెలసిన శతక సముదాయమున దాశరధీ శతకము వెలలేనిది.పరమభక్తాగ్రేసరుడగు రామదాస విరచితమైనయీశతక మునందలి ప్రతిపద్యమొక అమృతబిందువు.భక్తిరస సింధువు.

                               స్వస్తి!🙏🙏🙏🙏💐💐💐💄💄🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

మంగళవారం, సెప్టెంబరు 19, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం, సెప్టెంబరు 19, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - శుక్ల పక్షం

తిథి:చవితి ఉ10.43 వరకు  

వారం:మంగళవారం (భౌమవాసరే)

నక్షత్రం:స్వాతి మ12.09 వరకు

యోగం:వైధృతి తె3.06 వరకు

కరణం:భద్ర ఉ10.43 వరకు తదుపరి బవ రా10.41 వరకు

వర్జ్యం:సా5.52 - 7.31

దుర్ముహూర్తము:ఉ8.17 - 9.05 &

రా10.43 - 11.31

అమృతకాలం:తె3.42 - 5.20

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి: కన్య

చంద్ర రాశి : తుల 

సూర్యోదయం:5.52 

సూర్యాస్తమయం:5.58


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

పంచాంగం 19.09.2023 tuesday,

 ఈ రోజు పంచాంగం 19.09.2023 tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: చతుర్ధి తిధి భౌమ వాసర: స్వాతి నక్షత్రం వైధృతి యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం 

చవితి మధ్యాహ్నం 01:39 వరకు.

స్వాతి మధ్యాహ్నం 01:44 వరకు .

సూర్యోదయం : 06:08

సూర్యాస్తమయం : 06:11

వర్జ్యం : రాత్రి 07:36 నుండి 09:17 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:33 నుండి 09:21 వరకు తిరిగి రాత్రి  10:58 నుండి 11:46 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30  వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  

 

వరసిద్ది వినాయక చవితి శుభాకాంక్షలు 


శుభోదయ:, నమస్కార: