23, జులై 2020, గురువారం

గజేంద్రమోక్షం

బమ్మెర పోతనామాత్యుల వారి - గజేంద్రమోక్షంలోని త్రికూట పర్వతవర్ణనము


8-23 సీస పద్యము

రాజేంద్ర! విను సుధారాశిలో నొక పర్వ;
తము త్రికూటం బనఁ దనరుచుండు;
యోజనాయుతమగు నున్నతత్వంబును;
నంతియ వెడలుపు నతిశయిల్లుఁ;
గాంచనాయస్సారకలధౌతమయములై;
మూఁడు శృంగంబులు మొనసియుండుఁ;
దట శృంగబహురత్న ధాతుచిత్రితములై;
దిశలు భూనభములుఁ దేజరిల్లు;

తేటగీతము

భూరి భూజ లతా కుంజ పుంజములును
మ్రోసి పఱతెంచు సెలయేటి మొత్తములును
మరఁగి తిరిగెడు దివ్యవిమానములును
జఱులఁ గ్రీడించు కిన్నరచయముఁ గలిగి.

తాత్పర్యము

“మహారాజా! పాలసముద్రంలో త్రికూటమనే పర్వతం ఉంది. దాని ఎత్తు, వెడల్పు ఒక్కొక యోజనము (4 కోసులు అంటే సుమారు 14 కిలో మీటర్లు). దానికి బంగారం వెండి ఇనుప శిఖరాలు మూడు (3) ఉన్నాయి. కొండ సానువుల లోను శిఖరాలలోను యున్నట్టి రత్నాలు ధాతువులు వలన దిక్కులు భూమి ఆకాశం చిత్రమైన రంగులతో మెరుస్తుంటాయి. దాని మీద పెద్ద పెద్ద చెట్లు తీగలు పొదలు గలగలలాడే సెలయేర్లు ఉన్నాయి. వీటికి అలవాటుపడిన దేవతలు విమానాలలో తిరుగుతుంటారు. ఆ కొండ చరియలందు కిన్నరలు విహరిస్తుంటారు.
రహస్యార్థం: సుధారాశి, పాలసముద్రం అనగా ఇతరం ఏది చూడని, వినని, ఎరుగని, చలించని అట్టి సహజ బ్రహ్మానంద స్థితి యగు పరబ్రహ్మము అందు. యోజననోన్నతం అనగా అనంత స్వరూపం గల పొడవు వెడల్పు అనే పడుగు పేకలుగా కూర్చబడిన పరబ్రహ్మము అందు. గుణసామ్యం అగు ప్రకృతి, రజో గుణం (కాంచనం, బంగారం), తమోగుణం (అయస్సారం, ఇనుము), సత్వగుణం (కలధౌత, వెండి) అనే త్రిగుణాలతో కూడినదిగా వ్యక్తమగుచున్నది. ఆయా త్రిగుణాల ప్రతిబింబాలు అయిన బ్రహ్మ, విష్ణు, రుద్రులు అనే మూడు శృంగములచే త్రికూట పర్వతం ప్రకాశించుతున్నది. అక్కడి చరియల సూత్రాత్మ (సూర్య చంద్రాది) కాంతులచే భాసమానములు అయిన సంసారం అనే మహా వృక్షాలు, ఆశ అనే లతలచే నిర్మితమైన పొదరిళ్ళు, వాసనా ప్రవాహాలు అనే సెలయేర్లు మరిగి దివ్యవిమానాలు అనే శరీరాలు మరియు విశ్వ, తైజస, ప్రాజ్ఞులు అను కిన్నరులు తిరుగుతున్నాయి.

8-24 వచనము

అది మఱియును మాతులుంగ, లవంగ, లుంగ, చూత, కేతకీ, భల్లాత, కామ్రాతక, సరళ, పనస, బదరీ, వకుళ, వంజుల, వట, కుటజ, కుంద, కురవక, కురంటక, కోవిదార, ఖర్జూర, నారికేళ, సింధువార, చందన, పిచుమంద, మందార, జంబూ, జంబీర, మాధవీ, మధూక, తాల, తక్కోల, తమాల, హింతాల, రసాల, సాల, ప్రియాళు, బిల్వామలక, క్రముక, కదంబ, కరవీర, కదళీ, కపిత్థ, కాంచన, కందరాళ, శిరీష, శింశు పాశోక, పలాశ, నాగ, పున్నాగ, చంపక, శతపత్ర, మరువక, మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత, పల్లవిత, కోరకిత, కుసుమిత, ఫలిత, లలిత, విటప, విటపి, వీరున్నివహాలంకృతంబును; మణివాలుకానేక విమల పులినతరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్ధళిత శాఖిశాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును; కనకమయ సలిల కాసార కాంచన, కుముద, కల్హార, కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీంకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విటసముదయ సమీప సంచార సముదంచిత శకుంత, కలహంస, కారండవ, జలకుక్కుట, చక్రవాక, బక, బలాక, కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బధిరీ భూత భూనభోంతరాళంబును; తుహినకరకాంత, మరకత, కమలరాగ, వజ్ర, వైఢూర్య, నీల, గోమేధి,క పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరతట దరీ విహరమాణ విద్యాధర, విబుధ, సిద్ధ, చారణ, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును; గంధగజ, గవయ, గండభేరుండ, ఖడ్గ, కంఠీరవ, శరభ, శార్దూల, శశ, చమర, శల్య, భల్ల, సారంగ, సాలావృక, వరాహ, మహిష, మర్కట, మహోరగ, మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై యొప్పు నప్పర్వత సమీపము నందు.

తాత్పర్యం

ఆ త్రికూట పర్వతం నిండా ఎప్పుడు మాదీఫలం, లవంగం, పుల్ల మాదీఫలం, మామిడి, మొగలి, జీడిమామిడి, అంబాళం, తెల్ల తెగడ, పనస, రేగు, పొగడ, మఱ్ఱి, కొండమల్లి, కుంద, ఎఱ్ఱ గోరింట, పచ్చ గోరింట, కాంచనం, ఖర్జూరం, కొబ్బరి, వావిలి, చందనం, వేప, మందారం, నేరేడు, నిమ్మ, గురివింద, ఇప్ప, తాడి, తక్కోలం, చీకటి మాను, గిరికతాడి, తియ్యమామిడి, మద్ది, మోరటి, మారేడు, ఉసిరి, పోక, కడిమి, గన్నేరు, అరటి, వెలగ, ఉమ్మెత్త, కలజువ్వి, దిరిసెన, ఇరుగుడు, అశోక, మోదుగ, పొన్న, సురపొన్న, సంపెంగ, తామర, మరువక, మంచి మల్లె మొదలైనవి వసంత కాల శోభతో అలంకరింపబడి ఉంటాయి. ఆ చెట్లు కొమ్మలు పొదలు అన్ని ఎప్పుడు చక్కగా చిగుర్లు చిగురిస్తు, రెమ్మలు పల్లవిస్తు, మొగ్గలు తొడగుతు, పూలు పూస్తు, పండ్లు కాస్తు ఉంటాయి. ఎఱ్ఱమన్ను ఇసుకలు కలిగిన అనేకమైన చక్కటి ఇసుకతిన్నెలు కల సెలయేర్లు ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మలకు పండిన పండ్లను చిలుకలు కోయిలలు తమ వాడి ముక్కులతో పొడుస్తున్నాయి. ఆ పండ్ల రంధ్రాలనుండి రసాలు కారి కాలువ కాలువలుగా ప్రవహిస్తున్నాయి. ఆ కొండలో బంగారంలాంటి మంచినీటి సరస్సులున్నాయి. వాటిలో పసుపు కలువలు, తెల్లకలువలు, ఎఱ్ఱ కలువలు, పద్మములు ఉన్నాయి, వాటి సువాసనల మధువు ఎడతెగకుండ తాగి మదించిన గండు తుమ్మెదలు తమ ప్రియురాళ్ళతో చేరి విహరిస్తున్నాయి. ఆ దగ్గరలోని చక్కటి శకుంతపక్షులు, కలహంసలు, కారండవాలు, నీటికోళ్ళు, చక్రవాకాలు, కొంగలు, కొక్కెరలు, చీకుకొక్కెరలు మొదలైన నీటిపక్షుల గగ్గోలుతో ఆకాశం నేల గింగిర్లెత్తుతోంది. చలువరాళ్ళు, మరకతాలు, వజ్రాలు, వైడూర్యాలు నీలాలు, గోమేధికాలు పుష్యరాగాలు నిండిన మనోహరమైన బంగారు వెండి శిఖరాలు చరియలు ఉన్నాయి. అక్కడ విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నరలు, కింపురుషులు తమ ప్రియురాళ్ళతో కలిసి జంటలు జంటలుగా విహరిస్తున్నారు. వారు రసవంతంగా మాట్లాడుతూ పాటలు పాడుతున్నారు. ఆ కొండ శుభాలకు శాశ్వతమైన అలవాలంగా ఉంది. అందులో మదపుటేనుగులు, గురుపోతులు, గండభేరుండాలు, ఖడ్గ మృగాలు, సింహాలు, శరభాలు, పులులు, కుందేళ్ళు, చమరీమృగాలు, ముళ్ళపందులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్ళు, అడవిపందులు, అడవిదున్నలు, కోతులు, పెద్ద పెద్ద పాములు, పిల్లులు మొదలైన జంతువులు ఉన్నాయి. అవి ఎప్పుడు పోరాటాలు చేస్తుంటే చూసిన, యమ భటులు సైతం భయపడి శరణు వేడుతుంటారు.
రహస్యార్థం: వసంత సమయ సౌభాగ్య సంపద అనగా ఈశ్వర ధ్యానం అంకురిస్తున్న, సంసారం అనే అరణ్యంలో రాగాది పల్లవములు, విషయ పుష్పములు మొదలుగా గల వృక్షాలతో శోభాయుక్తం అయి, మోహాన్ని కలిగిస్తున్నది. ఆ సంసృతి అనే పాదపములకు బీజము అజ్ఞానం. దేహమే ఆత్మ అనెడి భావన అంకురం. లేచిగురు అనే రాగం. కర్మం అను దోహజం (జలం), కలిగిన చెట్ల వేళ్ళకు కొమ్మలకు మధ్య ఉండే కాండం స్థూలోపాధి. చివరి కొమ్మలు ఇంద్రియాలు. పుష్పములు శబ్దాది విషయములు. ఫలములు అనేక జన్మల నుండి వస్తున్న కర్మ వాసనలచే జనించు ప్రారబ్దానుభవాలైన దుఃఖాదులు. ఆ ఫలాల్ని అనుభవించేవి అయిన పక్షులు అను జీవులు. కలిగి ఉన్నాయి ఆ పాదపాలు. మణివాలుకానేక విమల పులినతలములు అనే రాబోవు దుఃఖాదులను మరగు పరచి తాత్కాలిక ఫలాలు అను ఆభాససుఖాలను కలిగిస్తున్నాయి. ఆయా సౌఖ్యా లను దుఃఖాలుగా గ్రహించి భక్తి జ్ఞాన ప్రవాహాలు తీరస్థ జ్ఞాన ఫల రంధ్ర స్రావకములు అనే ఆనంద రసాసావాదకములు శుక, పికాది పక్షులు కలిగి ఉన్నవి అగు ఆ వనాలు. భక్తి లతలు గుబురులు పుట్టి ప్రాకినవి. పుణ్యాలు అనే చివుర్లు చిగురించాయి. సచ్చిదానందం అను పుష్ప రస స్రావంతో కూడిన బ్రహ్మజ్ఞానం అనే ఫలం ఫలించింది. కనకమయ అనగా హిరణ్మయ మండలం. దాని యందలి హృత్పద్మాలు అందు నివసించే తృష్ణ సంబంధి మధుపాలు సంచరిస్తున్నాయి. మధుపాలు కనుక పైకి కిందకి అసంతుష్టిచే వ్యభిచరిస్తూ సంచరిస్తూ ఉంటాయి. సమీప సంచార నభోంతరాళ కల హంస పాలునీరు వేరు చేసి గ్రహించగల పక్షిరాజు అను పరమహంస. నామరూపాత్మక మాయాకల్పిత జగత్తు అనే నీరు వదలి. సచ్చిదానందరూప బ్రహ్మము అనే పాలు వేరు చేసి గ్రహిస్తాడు. అట్టి ద్విజ(పక్షి) శ్రేష్ఠులు పరమ హంసలు ఉన్నారు. ఇంకా లింగ శరీరాణ్యంలో ఉండే, క్రోధం అన్ పెద్దపులి, లోభం అనే శరభం (సింహాలను చంపే క్రూర మృగం). మోహం అనే పంచాననం (సివంగి), కామం అనే భల్లూకం (ఎలుగుబంటు), మదం అను జంబుకం (నక్క), మత్సరం అను కోక (తోడేలు, అడవి కుక్క) కలిసి చిత్తం అనే హరిణం (లేడిని) బాధిస్తున్నాయి. అట్టి త్రికూటమునందు

8-25 కంద పద్యము

భిల్లీ భిల్ల లులాయక
భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ
ఝిల్లీ హరి శరభక కిటి
మల్లాద్భుత కాక ఘూక మయమగు నడవిన్.

తాత్పర్యము

ఆ త్రికూటం దగ్గర ఉన్న అడవి నిండా చెంచిత స్త్రీలు, చెంచు పురుషులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గ మృగాలు, గురు పోతులు, కొండముచ్చులు, చమరీమృగాలు, ఈలపురుగులు, సింహాలు, శరభాలు, సీమపందలు, కోతులు, కాకులు, గుడ్ల గూబలు ఉంటాయి.
రహస్యార్థం: తృష్ణ అనే చపల స్వభావ కోతులు, కామం అనే కాముకుని తీవ్ర సంకల్పం గల ఈల పురుగులు, పగ అనే రాత్రి తప్ప పగలు దృష్టి లేని గుడ్లగూబలు, కలిగి ఆత్మ దృష్టి లేక ప్రాపంచిక దృష్టి కలిగి ఉన్న సంసారం అనే అడవి అందు.

8-26 శార్దూల విక్రీడితము

అన్యాలోకన భీకరంబులు జితాశా
......నేకపానీకముల్
వన్యేభంబులు కొన్ని మత్తతనులై
......వ్రజ్యావిహారాగతో
దన్యత్వంబున భూరి భూధరదరీ
......ద్వారంబులందుండి సౌ
జన్యక్రీడల నీరుగాలిపడి
...... కాసారావగాహార్థమై.

తాత్పర్యము

ఆ అడవిలోని ఏనుగులు ఇతరులు కన్నెత్తి చూడలేనంత భయంకరమైనవి. అవి మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించినవి. వాటిలో కొన్ని కొండగుహల నుండి బయలు దేరాయి. చెర్లాటాలు ఆడుతు దప్పి గొన్నాయి. జల క్రీడల కోసం సరస్సులవైపు నీటిగాలి వాలు పట్టి నడిచాయి.
రహస్యార్థం: అభయం అయిన సమాధిలో యోగులు (ద్వైతులు) భయం కల్రించుకొని దుర్ణిరీక్షణం అని చెప్పదగ్గ కూటస్థాది చైతన్య రూప ఏనుగులు. మూలాధారాది గుహల నుండి బయలుదేరి పరాగ్దృష్టులకు భయంకరములై దిగ్దేవతలగు ఇంద్రాదులను జయించునవి అయి సంచరిస్తున్నాయి. కర్మాది, అభాస సుఖాలు అయిన విలాసేచ్ఛలచే క్షుత్పిపాసాది షడూర్ముల స్థానం అగు మనస్సు అను కాసారం (సరస్సు) కోసం బయలు దేరాయి. (ఆకలి దుప్పులు, శోక మోహములు, జరామరణములు షడూర్ములు)

8-27-ఆ.ఆటవెలది

అంధకార మెల్ల నద్రిగుహాంతర
వీథులందుఁ బగలు వెఱచి డాఁగి
యెడరు వేచి సంధ్య నినుఁడు వృద్ధత నున్న
వెడలె ననఁగ గుహలు వెడలెఁ గరులు.

తాత్పర్యము

చీకట్ల గుంపులు పగలంతా భయంతో కొండగుహలలో దాక్కొని సాయం కాలం సూర్యుడి శక్తి సన్నగిల్లటం కనిపెట్టి బయటకొచ్చాయా అన్నట్లు ఆ త్రికూట పర్వతం నుండి బయలుదేరిన ఏనుగులు ఉన్నాయి.
రహస్యార్థం: బ్రహ్మజ్ఞానం ప్రకాశించే సమయంలో (పగలు) కనబడని చీకటి అనే అవిద్య కొండ గుహలు అను హదయ కుహరాలలో దాగి ఉండి, జీవుని వృత్తి బహిర్ముఖం అయినప్పుడు అవరించి నట్లు అజ్ఞానవృత్తులు బయలుదేరాయి.

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

మొసలి గజేంద్రుని పట్టుకొనుట

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - రెండవ అధ్యాయము



ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

2.1 (ప్రథమ శ్లోకము)

ఆసీద్గిరివరో రాజంస్త్రికూట ఇతి విశ్రుతః|

క్షీరోదేనావృతః శ్రీమాన్ యోజనాయుతముచ్ఛ్రితః॥6359॥

శ్రీశుకుడు నుడివెను-పరీక్షిన్మహారాజా! పాలసముద్రము మధ్య త్రికూటము అను పేరుగల ఒక మహాపర్వతము గలదు. అది మిగుల ప్రసిద్ధి గాంచినది. అది పదివేలయోజనముల ఎత్తుగలిగినది.

2.2 (రెండవ శ్లోకము)

తావతా విస్తృతః పర్యక్ త్రిభిః శృంగైః పయోనిధిమ్|

దిశః ఖం రోచయన్నాస్తే రౌప్యాయసహిరణ్మయైః॥6360॥

దాని పొడవు వెడల్పులు గూడ నాలుగువైపుల అంతే వైశాల్యము గలదు. అది బంగారము, వెండి, ఇనుములతో నిర్మితములైన మూడు శిఖరములతో విలసిల్లుచుండును. వాటి కాంతులు సముద్రమును, ఆకాశమును, దిక్కులను ప్రకాశింపజేయు చుండెను.

2.3 (మూడవ శ్లోకము)

అన్యైశ్చ కకుభః సర్వా రత్నధాతువిచిత్రితైః|

నానాద్రుమలతాగుల్మైర్నిర్ఘోషైర్నిర్ఝరాంభసామ్॥6361॥

దాని ఇతర శిఖరములు విచిత్రములైన రత్నములతో ధాతవులతో ఒప్ఫుచు, అన్ని దిక్కులయందు తమ ప్రకాశమును వెదజల్లు చుండెను. ఆ శిఖరములపై వివిధ జాతుల వృక్షములు, లతలు, పొదలు నిండియుండెను. వాటిపైగల సెలయేళ్ళు గలగల ధ్వనులను చేయుచుండెను.

2.4 (నాలుగవ శ్లోకము)

స చావనిజ్యమానాంఘ్రిః సమంతాత్పయఊర్మిభిః|

కరోతి శ్యామలాం భూమిం హరిణ్మరకతాశ్మభిః॥6362॥

ఆ పర్వతము చుట్టునుగల సముద్రపుటలలు, దాని పాదములను ప్రక్షాళనము చేయుచున్నట్లు ఉండెను. చక్కని మరకతములతో కాంతులీనుచున్న ఆ పర్వత శిలలు ఆ భూమిని శ్యామల వర్ణముతో నింపుచుండెను.

2.5 (ఐదవ శ్లోకము)

సిద్ధచారణగంధర్వవిద్యాధరమహోరగైః|

కిన్నరైరప్సరోభిశ్చ క్రీడద్భిర్జుష్టకందరః॥6363॥

ఆ పర్వతగుహలయందు సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, కిన్నరులు, అప్సరసలు మున్నగువారు విహారము చేయుచుండిరి

2.6 (ఆరవ శ్లోకము)

యత్ర సంగీతసన్నాదైర్నదద్గుహమమర్షయా|

అభిగర్జంతి హరయః శ్లాఘినః పరశంకయా॥636॥॥

అచటి సంగీత ధ్వనులు గుహలయందు ప్రతిధ్వనించు చుండెను. ఆ ధ్వనులను విన్న సింహములు వేరే సింహములు గర్జించుచున్నవని భావించి, తామును బిగ్గరగా గర్జించుచుండెను.

2.7 (ఏడవ శ్లోకము)

నానారణ్యపశువ్రాతసంకులద్రోణ్యలంకృతః|

చిత్రద్రుమసురోద్యానకలకంఠవిహంగమః॥6365॥

ఆ పర్వతముల లోయలు పలువిధములైన వన్యమృగముల సమూహములచే శోభిల్లుచుండెను. వివిధములగు వృక్షములతో నిండి అవి దేవతల ఉద్యానవనములను తలపింప జేయుచుండెను. అందమైన పక్షులు మధురముగా కలకల ధ్వనులను గావించుచుండెను.

2.8 (ఎనిమిదవ శ్లోకము)

సరిత్సరోభిరచ్ఛోదైః పులినైర్మణివాలుకైః|

దేవస్త్రీమజ్జనామోదసౌరభాంబ్వనిలైర్యుతః॥6366॥

ఆ పర్వతముపై పెక్కునదులు, సరోవరములు కలవు. అందలి జలములు స్వచ్ఛముగా ఉండెను. వాటి తీరములయందలి ఇసుక తిన్నెలు మణులవలె అలరారుచుండెను. ఆ సరోవరములయందు దేవతా స్త్రీలు స్నానములను ఆచరించుచుండుటచే అందలి జలములు పరిమళభరితములై యుండెను. వాటి మీదుగ వీచు వాయువులు ఆ సుగంధమును నలుదిశలయందును వ్యాపింపజేయుచుండెను.

2.9 (తొమ్మిదవ శ్లోకము)

తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః|

ఉద్యానమృతుమన్నామ ఆక్రీడం సురయోషితామ్॥6367॥

ఆ త్రికూట పర్వతము యొక్క లోయయందు మహాత్ముడైన వరుణ దేవుని ఉద్యానవనము గలదు. దాని పేరు ఋతుమంతము. దానియందు దేవాంగనలు విహరించుచుందురు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

Corona is going to happen to everyone, remember this

Corona is going to happen to everyone, remember this

 When a prisoner was been sentenced to death in the United States, some scientists thought that we should do some experiments on this prisoner. The prisoner was told that he shall be killed by attack of  poisonous cobra instead of hanging

 A large venomous snake was brought in front of him, they closed the prisoner's eyes and tied him to a chair.  He was not bitten by a snake, but two safety pins were pierced, and the prisoner died within two seconds

 Postmortem revealed that the prisoner's body contained venom resembling snake Venom

 Now where did this poison come from, or what caused the death of the prisoner? 

That poison was produced by his own body due to mental trauma!

 Every decision you make produces positive or negative energy and accordingly your body produces hormones

 The root cause of 90% of illnesses is the energy generated by negative thoughts

 Today man is burning himself with his wrong thoughts and destroying himself

 From 5 year old to 80 years old patients have been Corona negative from positive

 Don't go over the statistics because more than half of the people are well, and the deaths are not just due to corona disease, they have other illnesses, so they can't cope.

 Remember that no one has died at home yet by Corona, all the patients died were majorly in the hospitals. Reason being the atmosphere in the hospital and the fear in the mind.


 Always keep your thoughts positive....🤚

కాలజ్ఞానం - 4

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 4 🌹 
 📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాలజ్ఞానంలో చెప్పినవి – ఇప్పటివరకు జరిగినవి 🌻

1. కాశీ పట్న దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని భవిష్య వాణి చెప్పాడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. అది ఎలా నిజమయిందో చూద్దాం. 1910 – 12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు.

2. ఒక అంబ పదారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది…. ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలపాటు మన దేశానికి ప్రధానిమంత్రిగా వున్నారు. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంతకంటే ముందు సినిమా నటి. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సినీ రంగం నుంచి వచ్చినవారే! చిరంజీవి, విజయశాంతి, జమున- ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది తెరమీది నటులు రాజకీయాల్లో ప్రవేశించారు..

3. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ లేదు. ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా నశించింది. ఉన్నదల్లా ప్రభుత్వము, మంత్రులూను. ఈ మంత్రులు వారసత్వం లాగా రారు. నిరంకుశత్వం ఉండదు. ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు. కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన మాట అక్షరాలా నిజమైంది.

4. ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేకమంది మరణిస్తారు ఆకాశంలో పక్షి వాహనాలు నడుస్తాయని పోతులూరి చెప్పేనాటికి అసలు విమానమే పుట్టలేదు. పుష్పకవిమానం అంటూ పురాణ కధలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతం తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విమాన ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తున్నారు.

సశేషం...

నవగోప్యాలు అంటే ఏమిటి

మీకు తెలుసా నవగోప్యాలు అంటే ఏమిటో...:

ఆయువు, విత్తము,  ఇంటిగుట్టు, మంత్రం,   ఔషధం, సంగమం,   దానం, మానము,  అవమానం-

ఈ తొమ్మిదింటిని నవగోప్యాలు అంటారు.

ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.

భగవంతుడు అన్ని జంతువులకు ఇచ్చినట్లు శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు.

ఈమూడు కారణాలవల్ల మనిషి పిచ్చెక్కకుండా సుఖంగా ఉండగలుగుతున్నాడు.

మరుక్షణంలో మనిషి చస్తాడని తెలిస్తే ముందు క్షణమే ఆలోచనతో చావడం ఖాయం.

నిజంగా నీ ఆయుఃప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై వాడిని బాధిస్తుంది.

కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు.

ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు.

‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే.

‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం. అయినా మన దగ్గర ధనం ఉన్న విషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం.

ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి.

ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీనపరచుకోవడమోఅగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగుతుంది.

ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమ పూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.

సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి.

వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.

మననం చేసేది మంత్రం- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.

ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలు ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరచి ఎవ్వరంటేవారు తయారుచేయకూడదు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.

సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.

దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.

మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.

అలాగే తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవమానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగుతుంది. దాంతో పగ..              అలా అంతే ఉండదు.

ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం. ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధ.

హనుమాన్ చాలీసా చదివితే...

రాత్రిపూట హనుమాన్ చాలీసా చదివితే...

🚩హనుమాన్ చాలీసా పఠనం వల్ల, హనుమంతుడ్ని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల శనిప్రభావం కూడా పోతుంది. హనుమాన్ చాలీసా చదవటానికి ఒక సమయం, పద్ధతి ఉన్నాయి. అందులోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉన్నది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉందని అంటారు. పొద్దున లేదా రాత్రి ఈ హనుమాన్ చాలీసా చదవటానికి మంచి సమయాలు.

🚩*శనిప్రభావం ఉన్నవారు ప్రతిరాత్రి హనుమాన్* *చాలీసాను 8సార్లు చదవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు*
హనుమాన్ చాలీసా ముందు పంక్తులు 8 సార్లు చదవటం వల్ల ఎవర్ని అయినా నిందించటం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి.

🚩*రాత్రి హనుమాన్ చాలీసా పఠనం వల్ల దుష్టశక్తుల నీడ మీ జీవితంపై నుంచి తొలగిపోతుంది. పిల్లలకి దెయ్యాలంటే భయం ఉన్నప్పుడు భయం పోగొట్టుకోడానికి రాత్రిపూట వారు ఇది చదవడం మంచిది.* హనుమాన్ చాలీసా చదవటంవల్ల హనుమంతుడి కృపకి పాత్రులయి మీకష్టాలను తొలగించుకోగలుగుతారు.

🚩ఏదైనా పెద్దపనిలో విజయం సాధించాలనుకుంటే, మంగళ, గురు, శని లేదా మూలా నక్షత్రం ఉన్నరోజు రాత్రులు 108 సార్లు ఇది చదివితే మంచిది. సరియైన శ్రద్ధ, విశ్వాసంతో హనుమంతుడి అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు.

🕉️హనుమాన్ ..చాలీసా.

🚩దోహా

🚩శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి | వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి || బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార | బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్

🕉️ధ్యానమ్
><><><><><

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ | రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ || యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ | బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||
చౌపాఈ
జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||
రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవనసుత నామా || 2 ||
మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||3 ||
కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || 4 ||
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై |
కాంథే మూంజ జనేవూ సాజై || 5||
శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||
విద్యావాన గుణీ అతి చాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || 7 ||
ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామలఖన సీతా మన బసియా || 8||
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా |
వికట రూపధరి లంక జరావా || 9 ||
భీమ రూపధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే || 10 ||
లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉరలాయే || 11 ||
రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ || 12 ||
సహస వదన తుమ్హరో యశగావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 ||
సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || 14 ||
యమ కుబేర దిగపాల జహాఁ తే |
కవి కోవిద కహి సకే కహాఁ తే || 15 ||
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా || 16 ||
తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా || 17 ||
యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||
దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 ||
రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆఙ్ఞా బిను పైసారే || 21 ||
సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డర నా || 22 ||
ఆపన తేజ తుమ్హారో ఆపై |
తీనోఁ లోక హాంక తే కాంపై || 23 ||
భూత పిశాచ నికట నహి ఆవై |
మహావీర జబ నామ సునావై || 24 ||
నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || 25 ||
సంకట సేఁ హనుమాన ఛుడావై |మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||
సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా || 27 ||
ఔర మనోరధ జో కోయి లావై |
తాసు అమిత జీవన ఫల పావై || 28 ||
చారో యుగ పరితాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా || 29 ||
సాధు సంత కే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || 30 ||
అష్టసిద్ధి నవ నిధి కే దాతా |
అస వర దీన్హ జానకీ మాతా || 31 ||
రామ రసాయన తుమ్హారే పాసా |
సాద రహో రఘుపతి కే దాసా || 32 ||
తుమ్హరే భజన రామకో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై || 33 ||
అంత కాల రఘువర పురజాయీ |
జహాఁ జన్మ హరిభక్త కహాయీ || 34 ||
ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ || 35 ||
సంకట కటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బల వీరా || 36 ||
జై జై జై హనుమాన గోసాయీ |
కృపా కరో గురుదేవకీ నాయీ || 37 ||
జో శత వార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహా సుఖ హోయీ || 38 ||
జో యహ పడై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీశా || 39 ||
తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహా డేరా || 40 ||

🕉️దోహా
🚩పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ |
రామ లఖన సీతా సహిత .హృదయ బసహు సురభూప్ ||

సియావర రామచంద్రకీ జయ |
పవనసుత హనుమానకీ జయ |
బోలో భాయీ సబ సంతనకీ జయ |
జై శ్రీరామ్..!!

🙏 *జై హనుమాన్*🙏

*అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము*

*మన్వంతరముల వర్ణనము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*1.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ఋషేస్తు వేదశిరసస్తుషితా నామ పత్న్యభూత్|*

*తస్యాం జజ్ఞే తతో దేవో విభురిత్యభివిశ్రుతః॥6346॥*

ఆ మన్వంతరమున వేదశిరుడు అను ఋషివలన అతని పత్నియైన  తుషిత యందు భగవంతుడు అవతరించి, విభువు అను పేరుతో ప్రసిద్ధిగాంచెను.

*1.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*అష్టాశీతిసహస్రాణి మునయో యే ధృతవ్రతాః|*

*అన్వశిక్షన్ వ్రతం తస్య కౌమారబ్రహ్మచారిణః॥6347॥*

అతడు తన జీవిత పర్యంతము బ్రహ్మచర్యవ్రతమును పాటించెను. అతని ఆచరణనుండి శిక్షణను పొందిన ఎనుబది ఎనిమిదివేల మంది ఋషులుగూడ వ్రతనిష్ఠతో బ్రహ్మచర్యమును పాటించిరి.

*1.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రతసుతో మనుః|*

*పవనః సృంజయో యజ్ఞహోత్రాద్యాస్తత్సుతా నృప॥6348॥*

ప్రియవ్రతుని కుమారుడైన ఉత్తముడు మూడవ మనువు. అతనికి పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలగు కుమారులు కలిగిరి.

*1.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*వసిష్ఠతనయాః సప్త ఋషయః ప్రమదాదయః|*

*సత్యా వేదశ్రుతా భద్రా దేవా ఇంద్రస్తు సత్యజిత్॥6349॥*

ఆ మన్వంతరమున వసిష్ఠునకు ప్రమదుడు మొదలగు ఏడుగురు సప్తర్షులు సుతులుగా జన్మించిరి. సత్యుడు, వేదశ్రుతుడు, భద్రుడు అనువారు దేవతలలో ప్రముఖులు. సత్యజిత్తు అనువాడు ఇంద్ర పదవిని చేపట్టెను.

*1.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*ధర్మస్య సూనృతాయాం తు భగవాన్ పురుషోత్తమః|*

*సత్యసేన ఇతి ఖ్యాతో జాతః సత్యవ్రతైః సహ॥6350॥*

ఆ సమయమున ధర్ముని పత్నియైన  సూనృతయందు ఫురుషోత్తముడైన  భగవంతుడు సత్యసేనుడు అను పేరున అవతరించెను. అతనితో గూడి సత్యవ్రతులు అను దేవతలుగూడ ఉండిరి.

*1.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*సోఽనృతవ్రతదుఃశీలానసతో యక్షరాక్షసాన్|*

*భూతద్రుహో భూతగణాంస్త్వవధీత్సత్యజిత్సఖః॥6351॥*

ఆ సమయమున భగవంతుడు, ఇంద్రుడగు సత్యజిత్తునకు మిత్రుడై, అసత్యపరాయణులును, దుశ్శీలురును, దుష్టులును ఐన యక్షరాక్షసులను, జీవ ద్రోహులైన భూతగణములను సంహరించెను.

*1.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*చతుర్థ ఉత్తమభ్రాతా మనుర్నామ్నా చ తామసః|*

*పృథుః ఖ్యాతిర్నరః కేతురిత్యాద్యా దశ తత్సుతాః॥6352॥*

తామసుడు అనువాడు నాల్గవ మనువు. అతడు మూడవ మనువైన ఉత్తమునకు సోదరుడు. అతనికి పృథువు, ఖ్యాతి, నరుడు, కేతువు మొదలగు పదిమంది సుతులు కలిగిరి.

*1.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*సత్యకా హరయో వీరా దేవాస్త్రిశిఖ ఈశ్వరః|*

*జ్యోతిర్ధామాదయః సప్త ఋషయస్తామసేఽన్తరే॥6353॥*

సత్యకుడు, హరి, వీరుడు అనువారు దేవతలలో ముఖ్యులు. ఆ మన్వంతరమున త్రిశిఖుడు అనువాడు ఇంద్రుడు. జ్యోతిర్ధాముడు మొదలగువారు సప్త ఋషులుగా ఉండిరి.

*1.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*దేవా వైధృతయో నామ విధృతేస్తనయా నృప|*

*నష్టాః కాలేన యైర్వేదా విధృతాః స్వేన తేజసా॥6354॥*

మహారాజా! ఆ తామస మన్వంతరమున విధృతికి పుత్రులై వైధృతులు అను దేవతలు గూడ ఉండిరి. వారు కాల ప్రభావమున నష్టప్రాయమైన వేదములను తమ శక్తిద్వారా రక్షించిరి. అందువలన వారు *వైధృతులు*- అని ప్రసిద్ధిగాంచిరి.

*1.30 (ముప్పదియవ శ్లోకము)*

*తత్రాపి జజ్ఞే భగవాన్ హరిణ్యాం హరిమేధసః|*

*హరిరిత్యాహృతో యేన గజేంద్రో మోచితో గ్రహాత్॥6355॥*

ఆ మన్వంతరమున హరిమేధుడు అను ఋషివలన హరిణి అను పేరుగల అతని పత్నియందు భగవంతుడు *హరి* యను పేర అవతరించెను. ఈ అవతారమున గజేంద్రుని మొసలి బారినుండి భగవంతుడు రక్షించెను.

*రాజోవాచ*

*1.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*బాదరాయణ ఏతత్తే శ్రోతుమిచ్ఛామహే వయమ్|*

*హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమమూముచత్॥6356॥*

*పరీక్షిన్మహారాజు ప్రశ్నించెను* శుకమహర్షీ! భగవంతుడైన శ్రీహరి గజేంద్రుని మొసలి పట్టునుండి ఎట్లు విడిపించెనో నేను వినగోరుచున్నాను.

*1.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*తత్కథా సుమహత్పుణ్యం ధన్యం స్వస్త్యయనం శుభమ్|*

*యత్ర యత్రోత్తమశ్లోకో భగవాన్ గీయతే హరిః॥6357॥*

ఆ గజేంద్ర మోక్షణ వత్తాంతము అన్ని కథలలో ఉత్తమమైనది, అది పవిత్రము, ప్రశస్తము, శుభ ప్రదము. మహాత్ములు ఆ కథను గానము చేయుచు శ్రీహరిభగవానుని పవిత్రకీర్తిని ప్రశంసింతురు కదా!

*సూత ఉవాచ*

*1.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*పరీక్షితైవం స తు బాదరాయణిః  ప్రాయోపవిష్టేన కథాసు చోదితః|*

*ఉవాచ విప్రాః ప్రతినంద్య పార్థివం  ముదా మునీనాం సదసి స్మ శృణ్వతామ్॥6358॥*

*సూతుడు వచించెను* శౌనకాదిమహర్షులారా! పరీక్షిన్మహారాజు శ్రీహరి కథలను వినుటకై ప్రాయోపవేశమునకు పూనుకొనెను. ఆ మహారాజు శ్రీశుకమహర్షిని ఇట్లు ప్రశ్నించగా ఆ మునీశ్వరుడు సంతోషించి, అతనిని అభినందించెను. పిమ్మట మహర్షులసభలో గజేంద్రమోక్షణ కథను వినిపించసాగెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ప్రథమోఽధ్యాయః (1)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు ప్రథమాధ్యాయము (1)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

శోధన


౦ విసర్గ ః గా మారి ఆపై ఆంగ్ల అక్షరం బి గా మారి అది త్రికోణాకృతి, షట్కోణాకృతి కలిగి ఆపై వృత్తాకారంలో స్ధిరమైన కక్ష్యలో లో చలనమైయున్నది. అట్టి బి అనగా మహా శక్తి తిరిగి సమానంగా రెండుగా మారి నాలుగు సమానమైన వృత్తము లుగా అనగా నాలుగు దిక్కులకు వ్యాప్తి చెందినది. అది పి,క్యూఆంగ్లఅక్రముల శక్తి కేతివుగా వ్యాప్తమై,అనగా మారి పి అనే కేతువు శక్తి క్యూ ఆపః అనగా క్వాంటమ్ గా మారి వ్యాప్తి యైనది ఆపై ప్రతీ 30 డిగ్రీలలో శక్తి యెక్క లక్షణము < > ^ v యీ సమస్త గుర్తు లతో లక్షణము తెలిసినది. గణత శాస్త్ర ప్రకారం ఏవైతే గుర్తులు వున్నాయెూ అవి సమస్తం శ్రీ చక్రం మూలం.(.) ౦ ∆ [] ^v  🔲 rectangle 0 🔲 వీటి శక్తియు మూలముగా తెలియును అచ్చట నుండి  lotus flower 🌻 అష్ట దిక్కులనుండి కాంతి 🔦ఉదయింపజేసి ప్రకృతిని జీవ లక్షణముగా మార్పులు చేయుచున్నది. యిది యే శ్రీ  చక్రం యెుక్క ప్రకృతియే సమస్త మైన శక్తిగా మనకు అవగాహన కలుగుచున్నది. దేనినైనా సాధనతో శోధిస్తే తెలియును. సాధన అనగా శక్తి ఆరాధన ముఖ్యం అది రూపం ధరించిన మనస్సు లగ్నమగును. యిది ఏదో మత పరమైన విషము కాదు. విశ్వంలో గల చైతన్య మును అర్ధం చేసుకొనుటయే మన ల్ని మనం తెలుసుకొనుట.

" తమలపాకు " ఉపయోగాలు*



* వాగ్దేవీవిజయం  వారికి  కృతజ్ఞతలతో .*ఆరోగ్య పరం గా   "  తమలపాకు "   ఉపయోగాలు*

తమలపాకులను పూజ చేయునప్పుడు దేవునిముందు వుంచు కలశములో ఉంచుతారు.
తాంబూలములో ఉపయోగిస్తారు. భోజనానంతరం తాంబూల సేవనము మన సంప్రదాయం.
తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు.
శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు.
తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు.
తమలపాకుల రసమును చెవిలో పిండిన చెవినొప్పి తగ్గిపోవును.
అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు.
ఆరోగ్యపరమైనవి
ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వాక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి.
తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుందన్నమాట.
నూనెలూ ఇతర తైల పదార్థాలూ ఆక్సీకరణానికి గురై చెడిపోవడాన్ని ‘ర్యాన్సిడిటి’ అంటారు. తమలపాకు ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది- తైల పదార్థాలు చెడిపోవడానికి గురికాకుండా ఉంచుతుంది. నువ్వుల నూనె, ఆవనూనె, పొద్దుతిరుగుడు నూనె, వేరుశనగ నూనె... ఇలాంటి నూనెలు చెడిపోకుండా వుండాలంటే వాటిల్లో తమలపాకులను వేసి నిల్వచేయండి.
తమలపాకులో ‘చెవికాల్’ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధన.
తమలపాకులో ఉండే స్థిర తైలం (ఎసెంషియల్ ఆయిల్) ఫంగస్ మీద వ్యతిరేకంగా పనిచేసి, అదుపులో ఉంచినట్లు పరిశోధనల్లో తేలింది.
ఒక ముఖ్య విషయం. తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు గమనించారు. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమ తొలగించి వాడుకోవాలి.
తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనినీ పరిమితంగానే వాడుకోవాలి. ఈ సందర్భంగా తమలపాకు నేపథ్యంగా జరిగిన ఒక అధ్యయనం గురించి ప్రస్తావించాలి. రోజుకు 5-10 తమలపాకులను 2 ఏళ్లపాటు తినేవారు తమలపాకులకు డ్రగ్స్ మాదిరిగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది.
అధిక రక్తపోటు కలిగినవారు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు- తాంబూలాన్ని తయారుచేసేటప్పుడు సున్నం కలుపుతారు కాబట్టి ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది.
తాంబూలానికి పొగాకును కలిపి తింటే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ వంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది నోటి క్యాన్సర్‌కి ముందు స్థితి.
తమలపాకు, సున్నం, వక్క... ఇవి మూడూ చక్కని కాంబినేషన్. సున్నంవల్ల ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం) రాకుండా ఉంటుంది; తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే తమలపాకుకు చేర్చి వక్కపొడి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది.
ఔషధంగా తమలపాకుని వాడుకోదలిస్తే, రసం పిండి 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి.
ప్రతిరోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.
ప్రతిరోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.
స్వర్ణక్షీరి, విడంగాలు, ఇంగిలీకం, గంధకం, చక్రమర్ధ, చెంగల్వకోష్టు, సింధూరం వీటిని ఉమ్మెత్త ఆకులతోనూ, వేప చెట్టు బెరడుతోనూ, తమలపాకుతోనూ కలిపి ముద్దగా నూరి చర్మంమీద లేపనం చేస్తే ఎగ్జిమా, తామర, దురదలు వంటి చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.
తమలపాకు రసం, తేనె సమపాళ్లలో కలిపి కళ్లలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. (వైద్య పర్యవేక్షణ అవసరం)
తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి.
చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది.
తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో కనిపించే పిశాచ బాధలు, క్షణికావేశాలు తగ్గుతాయి.
తమలపాకు రసాన్ని రెండు కళ్లల్లోనూ చుక్కలుగా వేస్తే రేచీకటి సమస్య తగ్గుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)
గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది.
తమలపాకు షర్బత్‌ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరమవుతాయి.
ఏ కారణం చేతనైనా పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకు కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది.
చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.
తమలపాకు కాండంను (కులంజన్), అతిమధురం చెక్కను నూరి తేనెతో కలిపి తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌తో కూడిన జలుబు (దుష్టప్రతిస్యాయం) తగ్గుతుంది.
పాటలు పాడేవారు, ఉపన్యాసాలను ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది.
హిస్టీరియాలో కంఠం పూడుకుపోయి మాట పెగలకపోతే తమలపాకు రసం తీసుకుంటే కంఠం పెగులుతుంది. మాట స్పష్టతను సంతరించుకుంటుంది. కఫం తెగి వెలుపలకు వచ్చేస్తుంది. 2-5 తమలపాకులను వేడి నీళ్లకు కలిపి మరిగించి పుక్కిటపడితే కూడా హితకరంగా ఉంటుంది.
తమలపాకును తింటే శ్లేష్మం కరిగి పెద్ద మొత్తాల్లో స్రవిస్తుంది. దీంతో అరుగుదల తేలికగా జరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న వెంటనే ఆయాసం రాకుండా ఉంటుంది. మాటలో స్పష్టత వస్తుంది. అలాగే చెడు వానలు కురిసే రోజుల్లో, జలవాయు కాలుష్యాలవల్ల చెడిపోయిన ఆహారాన్ని ఇది శుద్ధపరుస్తుంది.
తమలపాకును తినడంవల్ల లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.
తమలపాకు తొడిమకు ఆముదం రాసి చిన్న పిల్లల్లో మల ద్వారంలోనికి చొప్పిస్తే మలనిర్హరణ జరుగుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)
తమలపాకును కడుపులోపలకు తీసుకుంటుంటే ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ (అంగ స్థంభన ) ఇబ్బంది పెట్టదు. తమలపాకు రసాన్ని బాహ్యంగా కూడాప్రయోగించవచ్చు.
తమలపాకు షర్బత్‌ని తీసుకుంటే బలహీనత దూరమవుతుంది.
తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.
తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.
మొండి వ్రణం త్వరితగతిన మానాలంటే వ్రణంమీద తమలపాకును అమర్చి కట్టుకట్టుకోవాలి.
తమలపాకు రసాన్ని ముక్కులో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
సేకరణ : *వికీపీడియా నుండి*
*" వాగ్దేవి విజయం "*

🌹

శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*
*41వ నామ మంత్రము*

*ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః*🙏🙏🙏ఎర్రని రంగులో ఉన్న ఆరుద్ర పురుగులచే చుట్టూ చెక్కబడిన మన్మథుని అమ్ములపొదుల బోలిన జంఘికలు (పిక్కలు) గలిగిన జగదాంబకు నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఇంద్రగోప స్మరతూణాభి జంఘికా* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరుని పూజించు భక్తులకు అనంతమైన సుఖసంతోషములు, భౌతికానందముతో బాటు బ్రహ్మానందమును ప్రాప్తించును🌻🌻🌻మోక్షమునిచ్చి రక్షించేది మరియు స్మరణ మాత్రముచే కోరికలను పూరించు ప్రకాశావిర్భావము గలిగినది శ్రీమాత🌺🌺🌺 శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో 83వ శ్లోకంలో అమ్మ జంఘికలను ఇలా చెప్పారు🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺
*పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే*

*నిషజ్గౌ జజ్ఘే తే విషమవిశిఖో బాఢమకృత||*

*యదగ్రే దృశ్యంతే దశ శరఫలాః పాదయుగళీ*

*నఖాగ్ర చ్ఛద్మాన స్సురమకుటశాణైకనిశితా ||83||*

గిరిసుతా! ఈశ్వరుని గెలుచుట కొఱకు మన్మధుడు నీ పిక్కలను పదేసి బాణములున్న అమ్ముల పొదులుగా చేసికొనెను. (ఎందుకంటే మన్మధుని దగ్గర ఉన్న ఐదే బాణాలు చాలవని). వాని చివరల నీ గోటికొనలనెడు బాణాగ్రములు (ములుకులు) కనుపించుచున్నవి. ఆ బాణాగ్రములు (అమ్మవారి పాదములకు మ్రొక్కుచున్న) దేవతల కిరీటములచే పదునుపెట్టబడియున్నవి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఇంద్రగోప (ఆరుద్ర పురుగులచే), పరిక్షిప్త (చుట్టును అమర్చబడిన) స్మర - తూణ (మన్మథుని అమ్ములుపొదుల వంటి), జంఘిగా (పిక్కలు గలిగిన తల్లీ)🌸🌸🌸వర్షాకాలములో ఆరుద్ర కార్తెయందు వ్యవసాయ భూములలో ఆరుద్ర పురుగులు పుట్టుకొస్తుంటాయి. అవి ఎర్రగా ముక్కమల్లు గుడ్డవలె చిన్నవిగా ఉంటాయి. వర్షంలో ఆవి చావకుండా వర్షాధిపతి ఇంద్రుడు కాపాడుతాడనియు, అందుకనే వీటికి ఇంద్రగోపములనియు పిలుస్తారు. అటువంటి ఎర్రని ఇంద్రగోపములు మన్మథుని బాణతుణీరమునకు చుట్టూ అమర్చబడి అందంగా ఉంటాయట.  అటువంటి అమ్ముల పొదులను బోలి అందముగా  శ్రీమాత జంఘికలు (కాలి పిక్కలు) అని  వశిన్యాదులు వర్ణించారు🌻🌻🌻పరమేశ్వరి వరుణ తేజముతో ఆవిర్భవించెను. ఇంద్రగోపములు అనగా మంత్రములోని బీజాక్షరములు అని రహస్యార్థము. తూణము (తూణీరము) అనగా మంత్ర సముదాయము. తూణమునందు ఉండే బాణములచే మంత్రములు సూచితమైనవి. దేవి జంఘికలు మహావర్ణ సంపుటికలు అని తెలియదగును. స్మర శబ్దము సగుణ బ్రహ్మయు, ప్రపంచ సృష్టికర్తయు అయిన పరమేశ్వరునకును - తూణా శబ్దము మాయా శక్తికిని బోధకములు అగును🌹🌹🌹శ్రీమాతకు నమస్కరించునపుడు *ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః* అని అనవలెను🌺🌺🌺🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🌻🌻నేడు గురు (బృహస్పతి) వారము🔯🔯🔯గురువారమునకు అధిష్టాన దేవత గురుడు (బృహస్పతి)🌻🌻🌻 అందుకే గురువారమును బృహస్పతివారము🌹🌹🌹గురువారమునకు పసుపురంగు మంగళప్రదం🔯🔯🔯గురువారం లక్ష్మీప్రీతికరం గనుక గురువారాన్ని లక్ష్మివారం అనికూడా అంటారు🚩🚩🚩శుక్రవారంకూడా లక్ష్మీప్రీతికరమే  ఎందుచేతనంటే శుక్రవారానికి అధిదేవత శుక్రుడు🔱🔱🔱శుక్రుడు భృగువంశస్థుడు అదేవిధంగా లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది గనుక శుక్రవారము కూడా లక్ష్మీప్రీతికరము🙏🙏🙏ఇదేరోజున సాయినాథుని అర్చించుతాము అలాగే శ్రీగురు దత్తాత్రేయ స్వామిని కూడా ఆరాధిస్తాము🕉🕉🕉ఓం శ్రీగురు దత్తాత్రేయ స్వామినే నమః🚩🚩🚩ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319

*********************************