26, మార్చి 2024, మంగళవారం

Panchaag


 

గణపతి మనకు ప్రసాదించుగాక.

 ౭శ్లోకం:☝️

*ప్రారంభే లఘుశిఖరం*

  *జ్ఞానం మోదకసదృశం |*

*విస్తీర్ణం తు ప్రజానాయ*

  *ప్రజ్ఞాం దేహి గజానన ||*


భావం: జ్ఞానం మోదకం లాంటిది, మొదట్లో చిన్న శిఖరం (చివర) మాత్రమే కనిపిస్తుంది, నేర్చుకునే కొద్దీ అది విశాలమవుతుంది. అంటే జ్ఞానాన్ని సంపాదించుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాల్సినది ఎంతో ఉందనిపిస్తుంది. అలాంటి అపారమైన జ్ఞానాన్ని పొందే ప్రజ్ఞని గజవదనుడైన గణపతి మనకు ప్రసాదించుగాక.🙏

అలాగే కర్మ

 ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా,


 భర్తగా,....


సంతానంగా,....


తల్లిదండ్రులుగా,....


మిత్రులుగా,....


 నౌకర్లుగా,....


ఆవులు,.... గేదెలు,.....కుక్కలు.....


 ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు. 


ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో,.....


మరణించడమో జరుగుతుంది.  


ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే.....


 మన జీవితకాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. 


ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...


-- మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా,.....


లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో.....


మన సంపాదనతో పోషించబడే భార్యగా,.....


 సంతానంగా,......


మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.


-- ద్వేషం కూడా బంధమే....


పూర్వజన్మలోని మన మీదగల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా.....


 లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.


-- మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి.....


ఈ జన్మలో శత్రువులుగానో,.....


 దాయాదులుగానో,......


ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.


-- మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి......


ఈ జన్మలో మిత్రులుగానో,......


సహాయకులుగానో ఎదురవుతారు. వి. ఎస్. మూర్తి 


ఉదాహరణకు ఒక జరిగినకథ:-


కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర....


 అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు.


ఈ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు.


 కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ,


రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు. ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు...


పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు . అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. VSM


అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ: 


ఒకసారి సత్యసాయిబాబా బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, “స్వామీ ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి?” అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు స్వామి.


ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే,.....


ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడిగితే, 


పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు.


అప్పుడు మలయాళ స్వామి వారు *...


”నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తె.....


వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది!” అన్నారు.


ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం.


మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో,


 మర్యాదకో, కృతజ్ఞత గానో,


గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో....


 ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. 


కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం,


 పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం,....


ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.  


అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలో చిక్కుకుపోతుంటాము.


ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో,...


 అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం.


అలాగే కర్మ ఎంత పెద్దదైనా,....


 చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.


కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం ఈ కర్మబంధాల నుంచి ఎన్ని జన్మలెత్తినా మనం తప్పించుకో గలమా......


అరుణాచలశివ 🌹

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం  -‌   ప్రతిపత్ - హస్త -‌‌ భౌమ వాసరే* (26.03.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మానవ శరీరం మాత్రం

 *శరీరం కర్మలు చేసే ఒక పరికరం*


*పునర్విత్తం పునర్మిత్రం* 

*పునర్భార్య పునర్మహి*

*ఏతత్సర్వంపునర్లభ్యం*

*న శరీరం పునఃపునః।।*


 🌷పోయిన *ధనం* మళ్లీ చేరుతుంది. 


🌷*దూరమైన మిత్రుడు* మళ్లీ చేరువఅవుతాడు.      

         

🌷*భార్య* గతిస్తే మరొక భార్య లభిస్తుంది.


🌷*భూసంపద* మళ్లీ ప్రాప్తిస్తుంది. 


పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు! 


కాని *మానవ శరీరం మాత్రం మళ్లీ మళ్లీ తిరిగి రాదు.*


అందుకే *శరీరం ఖలు ధర్మసాధనం* అన్నారు.


 కేవలం *శరీరం* ఉంటేనే ధార్మిక పనులు చేయవచ్చు.


 *శరీరం* ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది.


 *శరీరం* ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు.

ఏ పని చేయడానికైనా *శరీరం* కావాలి.


 కనుక *శరీరము* ను రక్షించుకోవాల్సింది మానవ జన్మ ఎత్తినవాళ్లే.


జంతువులకు *శరీరం* ఉంటుంది కాని వాటికి ఆలోచన ఉండదు.


పైగా కొద్దోగొప్పో ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి *శరీరం* సహకరించదు.


*బుద్ధి, ఆలోచన, మాట్లాడే శక్తి, కావలసినది సంపాదించుకొనే జ్ఞానం *తగిన అవయవ నిర్మాణం*

ఉండేది ఒక్క *మనుష్యులకే.*


వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది.

కనుక మనమందరం శరీరాన్ని కాపాడుకోవాలి.


*అతిగా తిన్నా,*

*అతిగా ఆలోచించినా,*

*అతిగా సుఖించినా,*

*అతిగా దుఃఖించినా,*                    

*ఏదైనా అతిగా చేస్తే ఈ "శరీరం" కాస్తా పుటుక్కుమంటుంది*. 


ఇక *శరీరం* చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు. 


కనుక ముందు *శరీరము* ను జాగ్రత్తగా చూసుకోవాలి.    

                                   

*దీనికి*

 

*సత్యం,* 

*ధర్మం*,

*శాంతి*,

*ప్రేమ,*

*అహింసలను*


 *పాటించడమే "మహా ఔషధంగా" భావించాలి.*


*విస్తరాకు*


విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటారు. 

బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము,


తినిన మరుక్షణం ఆ విస్తరాకును మడిచి, దూరంగా *మురికి పెంటపై పడేసి వస్తాము.* తర్వాత ఆ ఎంగిలి ఆకును ముట్టుకోము కూడా.


*మనిషి జీవితం కూడ అంతే*

 *'ఊపిరి" పోగానే ఊరిబయట పారేసి వస్తారు*,


విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు *ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను అన్న తృప్తి ఆకుకు ఉంటుంది*,


*విస్తరాకుకు ఉన్న ముందు ఆలోచన, తృప్తి భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ !*


*"" సేవ చేసే అవకాశము* *వచ్చినపుడు సేవ చేయండి""*     *జారవిడుచుకోకూడదూ* 


మల్లీ ,

ఇంకొకసారి,

ఎప్పుడో చేయవచ్చు

అనుకొని వాయిదా వేయకండి, 

ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే, *కుండ ఎప్పుడైనా పగలవచ్చు అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.*


*ఎంత సంపాదించి ఏమి లాభం ?*


*ఒక్క పైసా కూడా తీసుక పోగలమా?*


*మన చేత* *ప్రత్యక్షంగా,పరోక్షంగా ఓ 10 మందికి* 

*మంచి జరిగితే,* 

*మన మానవ జన్మ సార్థకమయినట్లే ........*.👏🙏సర్వేజనా సుఖినోభవంతు🙏