16, మే 2025, శుక్రవారం

భారతదేశాన్ని జంబూ ద్వీపం అని ఎందుకు అంటారు?

 భారతదేశాన్ని జంబూ ద్వీపం అని ఎందుకు అంటారు?

జంబో ద్వీపం అని మనం రోజూ చెప్పుకొనె సంకల్పం లొ వస్తుంది. దీని గురించి తెలుసుకోవలంటె కొంత ఖగోళ శాస్త్రం గురించి తెలియాలి కొంచం వివరంగా చెప్పాలి.

ఏకకాలం లొ ముల్లోకాలలొ నివసిస్తాం.

మొదటిది చరలోకం.

మనం భూమి పై ఉన్నాం. భూమి తనలో తాను తిరుగుతోంది. దరి దాపు గంటకు 1500 KM వేగంతొ భూమి తిరుగుతొంది. తనలో తాను భ్రమణం కాలనికి ఒక రోజు అని పేరు.ఇది మనకందరికి తెలిసిందే.

ఇదే కాకుండా భూమి సుర్యుని చుట్టూ తిరుగుతొంది. ఈవేగం దరిదాపు సెకెనుకు 30 KM, గంటకు 1,07,000 KM. భూపరిభ్రమణ కాలానికి సంవత్సరం అని పేరు. ఇది కూడా మనకు తెలుసు.

మరి సూర్యుడు కల్పకేంద్రకం (Center of Galaxy) చుట్టు ప్రదక్షణ చెస్తాడు. దాని వేగం దరిదాపు సెకెనుకు 230 KM అంటె గంటకు 8,28,000. మొగుడుతొ పాటు పెళ్ళాం పిల్లలు వెళ్ళినట్లుగా, సుర్యుడితో పాటు భూమి తొ సహా మిగతా గ్రహాలు ఉపగ్రహాలు అన్నీ ప్రయాణిస్త్తాయి. తప్పదుగా మరి. ఈ పరిభ్రమణానికి పట్టేకాలన్ని ఒక యుగం అంటారు. ఇది కొంచం మనకు తెలుసు. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం అంటారు. ఇది మనందరకూ తెలుసు.


ఇలా ఉంటె ఈ కల్పకం(Galaxy) మొత్తం విశ్వకెంద్రకం (Center of Universe) చుట్టు తిరుగుతోంది. దాని వేగం సెకెనుకు 200 KM అంతె దరిదాపు గంటకు దరిదాపు 7,50,000 KM. ఈ వేగంతొ ఒక అస్తిర కక్ష్య లొ ప్రయాణిస్తూ ఉంటుంది. ఈకల్పక పరిభ్రమణానికి పట్టే సమయాని మన్వంతరం అంటారు. (దీనికి మనువుకు, మనుచరిత్రకి ఎలాంటి సంబంధం లేదు) ఇది కొంతమందికి తెలుసు.ప్రస్తుత మన్వంతరానికి వైవశ్వత మన్వంతరం అని పెరు. ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది.

ఇదే కాకుండా విశ్వ కేంద్రకం వ్యాకొచిస్తునాది దీనివలన విశ్వం మొత్తం పెరుగుతోంది. దీనిని బ్రహ్మణము అని అంటారు. దీని రమారమి వ్యాకొచవేగం సెకెనుకు 72 KM, దీనివలన మన్వంతరానికి మన్వంతరానికి పరిభ్రమణ కాలం పెరుగుతుంది. యుగానికి యుగానికికాలం కూడా పెరుగుతుంది.

అంటె ఈ విశ్వంలొ ఒకసారి మనం ఉన్న చోటుకి మరొ సారి వచ్చే ప్రసక్తే లేదు.

ఇంక రెండవ లొకం

దీనికి కాల లొకం అంటారు. ఇది విశ్వ వ్యాకొచం వలన ఏర్పడుతుంది. దీనికి ముందుకు పోవడమే తప్ప వెనుకకు మరలడం లేదు. దీని గురించి మనకందరకు తెలుసు. కాల రహస్యం గురించి మరో సారి వివరంగా చర్చించుకుందాం.

మూడవది మాయాలోకం.

ప్రస్తుతం మన నివశించే లోకం. భూమి ఇంత చండ ప్రచండ వేగాలతొ వివిధ దిశలలొ దూసుకు పోతున్నా మనకు తెలీదు. దివా రాత్రులు, సుర్యోదయాలు, చంద్రకళలు రొజూ వచ్చె నక్షత్రలు మనచుట్టు నే ఉంటాయి. అసలు భూమి కదులుతున్న అనుభవం మనకి రాదు.

మన జాగింగ్ వేగమే మనవెగం. పట్టు బడకుండా కారు నడిపే వేగమే మనవేగం. దీనిని మిధ్యా లొకం అంటారు.

దీనిగురించి మనం రొజు చెప్పుకొనె పూజ సంకల్పం లొ చక్కగా చెప్పబడింది.


మహవిష్ణో రాజ్జాయ – శ్రీ మహా విష్ణురాజ్యం అంటె ఈ విశ్వంలొ

ప్రవర్తమానస్య – ప్రవర్త – నిరంతర చలించే మానస్య – లెక్కల పట్టికలో

ఆద్య బ్రహ్మణః – ఈ రోజు వ్యాకోచించె విశ్వంలొ

దితీయ పరార్ధే – రెండవ పరార్ధమైన. మొడటి పరార్ధంలొ ఈ విశ్వం కేవలం స్తలకాల శక్తులతో నిండి ఉండెది, ఈ గెలాక్సీలు నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రాహలు తరువాత పునఃసృష్టిలొ ఏర్పడ్డాయి

శ్వేత వరహ్హ కల్పే – మన Milky way Galaxy సంస్కృతం లొ పేరు.

వైవస్వత మన్వంతరే – మన కల్పక ప్రస్తుత ప్రరి భ్రమణం పేరు.

కలియుగే ప్రధమ పాదే – మన సుర్య కుటుంబం ప్రస్తుత ప్రరిభ్రమణం పేరు. ఇంకా మనం first quarter లొనే ఉన్నాం

జంబో ద్వీపే – నేరేడు పండు ఆకారం లొ ఉండె భూమిలో

భరత వర్షే – భరతుడు పాలించిన రాజ్యంలొ

భరత ఖండే – హిమలయాలకి కన్యాకుమారికిమధ్య ఉన్న భాగానికి

కావేరి క్రిష్ణా మధ్య భాగే – కావేరీ క్రిష్ణా నదుల మధ్యలో – మాచెన్నైకి.

అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన– ఈరోజు మన వ్యవహారం లొ ఉన్న చంద్ర మానం ప్రకారం తరువాత సంవత్సరం ఋతువు నెల పక్షం తిధి వస్తాయి.

ఇవి కూడా మనం భూ కక్ష్యలొ ఎక్కడ కచ్చితం గా ఉన్నామో తెలియజేస్తాయి. ఇంకా కరణీ యోగం కూడా చెప్పగలిస్తే, దరిదాపు భూ భ్రమణ కక్ష్యలో 500/600 కిలొమీటర్ల మధ్య, భుమి పరిభ్రమణంలొ ఎంతం కొణం లొ ఉన్నామో నిశ్చయంగా చెప్పగలుగుతాం.

చూసారా రోజు మనం చెప్పుకోనె సంకల్పం లో చాలా సులభం గా ఖగొళ శాస్త్రాలు మేళవించి మన స్తల కాలాల్ని నిర్ణయించి చెప్పేరో.

ప్రస్తుతం ఉన్న దృక్సిద్ధాంత చంద్రమాన పంచాంగాన్ని వరహామిహురుడు రాసాడు. ఆయనెమీ ఖగోళ శాస్త్రాన్ని రాయలేదు. అభిజిత్ నక్షత్రం ఏష్యమైన తరువాత వచ్చిన పరిస్తితుల ననుసరించి తిరిగి వేదాలలో ఉన్న ఖగొళ శాస్త్రాన్ననుసరించి పంచాంగ నిర్ణయంచేసాడు.

ఆయన విక్రమార్కుని ఆస్తాన పండితుడు. అందుకె ప్రస్తుత శకాన్ని విక్రమార్క శకం అంటారు. వరహామిహురుని శిష్యుడే ఆర్య భట్టు.

శ్రీ సిద్ధనాథ్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1112


⚜ మధ్యప్రదేశ్  : నెమవర్ 


⚜  శ్రీ సిద్ధనాథ్ ఆలయం



💠 పవిత్ర నర్మదా నది ఒడ్డున ఉన్న నేమావర్ పట్టణంలో పురాతన సిద్ధనాథ్ మహాదేవ్ ఆలయం ఉంది.  నభీపూర్ అని పిలువబడే ఈ నగరం మహాభారత కాలంలో వాణిజ్య కేంద్రంగా ఉండేది.   

ఈ ఆలయాన్ని సత్యయుగంలో స్థాపించారు.   

అందుకే ఈ ఆలయానికి సిద్ధనాథ్ అని పేరు వచ్చింది. 



💠 పవిత్ర నర్మదా నది ఒడ్డున నెలకొని ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రాత్మక నగరం నెమవార్ వారసత్వం, కళ, సంస్కృతి మరియు ఆధ్యాత్మికత యొక్క నిధి.  


💠 నెమవార్ లేదా నాభిపురా మహాభారత కాలంలో ప్రసిద్ధ వాణిజ్య కేంద్రం.  

నర్మదా నది యొక్క 'నాభి' లేదా నాభి ఇక్కడ ఉన్నందున ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు తరువాత దాని పేరును నాభాపట్టం అని మార్చారు.


💠 సనక, సనందన, సనత్కుమార మరియు సనత్సుజాత అనే నలుగురు పరమర్షులు సత్యయుగంలో పురాతన సిద్ధనాథుని ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించారని, అప్పటి నుండి ఈ ఆలయానికి సిద్ధనాథ్ అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.  


💠 ఈ ఆలయం పైభాగంలో ఓంకారేశ్వర్ మరియు దిగువ భాగంలో మహాకాళేశ్వర్ యొక్క పవిత్ర జ్యోతిర్లింగాల మధ్య ఉంది.


💠 సిద్ధేశ్వర్ మహాదేవ్ శివలింగానికి నీటిని సమర్పించినప్పుడు, ఓం యొక్క ప్రతిధ్వని కలుగుతుందని భక్తులు నమ్ముతారు.  

ఈ ప్రదేశం హిందూ మరియు జైన పురాణాలలో చాలా సార్లు ప్రస్తావించబడింది.   

సర్వపాపాలు నశింపజేసే పుణ్యక్షేత్రంగా దీన్ని పరిగణిస్తారు. 


💠 చాలా మనోహరమైన ఆచారం ఏమిటంటే, తెల్లవారుజామున, ఆలయ సమీపంలోని ఇసుకపై పాదముద్రలు కనిపిస్తాయి మరియు కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు వ్యాధి నుండి ఉపశమనం పొందాలని ప్రార్థిస్తూ తమ శరీరాలపై ఈ ఇసుకను పూస్తారు.  


💠 కొండ లోపల ఉన్న గుహలలో గొప్ప సాధువులు మరియు యోగులు నివసిస్తున్నారని మరియు వారు నర్మదా నదిలో స్నానం చేయడానికి ప్రతిరోజూ వస్తారని స్థానికులు చెబుతారు.  


💠 ఈ ప్రదేశం చుట్టూ పురావస్తు ఆసక్తి ఉన్న అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం హిందూ మతం యొక్క ప్రధాన విశ్వాస కేంద్రం. 


💠 ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం, ఈ ఆలయం యొక్క షికారా (శిఖరం లేదా శిఖరం) సుమారు 3094 సంవత్సరాల నాటిది.  


💠 ఈ ఆలయాన్ని ద్వాపుర యుగంలో కౌరవులు నిర్మించారని, వాస్తవానికి తూర్పు ముఖంగా ఉండేదని స్థానికులు చెబుతారు.  

ఒకసారి కౌరవులు మరియు పాండవులు ఒకే రాత్రిలో దేవాలయాన్ని నిర్మించమని ఒకరినొకరు సవాలు చేసుకున్నారు.  

కౌరవులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున, పాండవులు తమ ఆలయాన్ని పూర్తి చేయలేకపోయినప్పుడు వారు ఈ ఆలయాన్ని విజయవంతంగా నిర్మించారు.  

పాండవుల సవాలును ఎదుర్కొనలేకపోవడాన్ని ఎగతాళి చేస్తూ, కౌరవులు వారి నైపుణ్యం మరియు నిబద్ధత లేకపోవడాన్ని నిందించారు.  


💠 కౌరవుల మాటలకు కోపంతో భీముడు తన శక్తినంతా ఉపయోగించి తూర్పు ముఖంగా, పడమర ముఖంగా ఉన్న ఆలయాన్ని తిప్పాడు.  

ప్రధాన ఆలయానికి సమీపంలోని మణిగిరి పర్వతం వద్ద పాండవుల అసంపూర్తి ఆలయం నేటికీ సరిగ్గా ఆ స్థితిలోనే ఉంది.


💠 పశ్చిమ ముఖంగా ఉన్న ఆలయం నర్మదా నది ఒడ్డున నాలుగు వైపులా చదును చేయబడిన ప్రాంగణంపై ఉంది. నదికి ఎదురుగా ఉన్న వైపు ఒక గోడ నిర్మించబడింది. ఇది నాగర శైలిలో నిర్మించబడింది మరియు మండపం (స్తంభాల హాలు), అంతరాల (ముందు గది) మరియు గర్భగృహం (గర్భగుడి) ఉన్నాయి. మండపం తప్ప, ఆలయం పసుపు ఇసుకరాయితో నిర్మించబడింది.



రచన

©️ Santosh Kumar

17-12-గీతా మకరందము

 17-12-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - రాజసయజ్ఞమును గూర్చి తెలుపుచున్నారు– 


అభిసన్ధాయ తు ఫలం 

దమ్భార్థమపి చైవ యత్ |

ఇజ్యతే భరతశ్రేష్ఠ 

తం యజ్ఞం విద్ధి రాజసమ్ ||


తాత్పర్యము:- భరతవంశశ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఫలమునుగోరియు, డంబముకొఱకును గావింపబడు యజ్ఞమును రాజసమైనదానినిగా నీవు తెలిసికొనుము.


వ్యాఖ్య:- ఫలమునుగోరి చేయబడు కర్మచే చిత్తశుద్ధి యెన్నటికిని కలుగనేరదు. చిత్తము శుద్ధముకానిచో ఆత్మతత్త్వము ప్రకాశింపదు (అనుభూతముకాదు). కావున అట్టి ఫలాభిసంధియుక్తమగు కర్మ ఇచట రాజసమని (కావుననే త్యాజ్యమని) చెప్పబడినది. మఱియు కేవలము పేరుప్రఖ్యాతులకొఱకు, వేషముకొఱకు, డంబము కొఱకు చేయబడు కార్యమున్ను రాజసమేయని యిట పేర్కొనబడినది. కాబట్టి వాని నెవరును ఆశ్రయించరాదు.


ప్రశ్న:- రాజసయజ్ఞ మెట్టిది?

ఉత్తరము:- (1) ఫలాభిలాషతోను (2) డంబముకొఱకును గావింపబడు యజ్ఞము రాజసమని చెప్పబడును.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము*


*378 వ రోజు*

*రెండవ అశ్వాసం*


కర్ణుడికి శల్యుడు సారథ్యం వహించడానికి అంగీకరించిన పిదప సుయోధనుడు కర్ణుని చూసి " కర్ణా ! భీష్ముడు, ద్రోణుడు పాండవులను సంహరిస్తారని ఆశించాను. కాని వారికున్న పాండవపక్షపాతం కారణంగా నా ఆశ నెరవేర లేదు. కనీసం నీవైనా ధర్మరాజును బంధించి పాండవ సైన్యాలను నిర్మూలించి నా మనసుకు ఆనందం కలిగించు " అన్నాడు. కర్ణుడు శల్యునితో " నేను వేయు నారాచములు మొదలగు బాణములు చూసి పాండవులు భయపడతారు. నా భుజబలం చూసి దేవతలు మెచ్చుకుంటారు. నీవు కూడా మెచ్చుకునేలా యుద్ధం చేస్తాను " అన్నాడు.


*శల్యసారధ్యము*


కర్ణుడి మాటలు విన్న శల్యుడు " కర్ణా ! పాండవులు సత్యసంధులు, భుజబల పరాక్రమవంతులు, తేజో మూర్తులు, అస్త్రశస్త్ర పారంగతులు, దివ్యాస్త్రసంపన్నులు, అఖిల శాస్త్రపారంగతులు ఇంద్రునికే భయం కలిగించకలిగిన మహిమాన్వితులు వారిని గురించి నీవు ఇలా మాటాడతగదు. అర్జునుని గాండీవ ధ్వని నీ చెవులు బద్దలు చేస్తుంది, భీముడి గదా నైపుణ్యం నీ కళ్ళను మిరుమిట్లు కొల్పుతుంది. పాండవులు వారి పరాక్రమంతో నిన్ను గజగజలాడించగలరు. అర్జునుడి శరాఘాతానికి నీ రధము కూలుతుంటే, భీముని గధాఘాతాలకు గజసైన్యములు కూలుతున్నప్పుడు, ధర్మరాజు నకులసహదేవులతో చేరి నీ సైన్యాలను చీల్చి చెండుతున్న సమయంలో నీవు ధైర్యంగా నిలిచి ఉంటే నీ మాటలు నమ్మగలను " అన్నాడు. ఆ మాటలు వినీ వననట్లు కర్ణుడు " శల్యా ! నా పరాక్రమము చూపిస్తాను పాండవుల ఎదుటకు రధము పోనిమ్ము. నేను విల్లు ఎక్కుపెడితే దేవేంద్రుడు కూడా నా ముందు నిలువలేడు. అసలు పాడవుల బలం ఏపాటిదని భీష్ముడు, ద్రోణుడు వారి చేతిలో చచ్చారు. నీవు చూస్తూ ఉండు నేను అర్జునుడిని చిటెకెలో సంహరిస్తాను. పాండుకుమారులు ఒక్కుమ్మడిగా నా మీద పడినా నేను జంకక పాడవసైన్యాలను చీల్చి చెండాడి భీష్మ, ద్రోణులు పోయినా సుయోధనుడికి విజయం చేకూర్చడానికి దివ్యాస్త్రసంపన్నుడైన కర్ణుడు ఉన్నాడని నిరూపిస్తాను " అని పగల్భాలు పలికాడు.


*శల్యుడు కర్ణుడి ప్రగల్భాలను త్రోసి పుచ్చుట*


కర్ణుడి మాటలకు శల్యుడు నవ్వుకుని " కర్ణా ! ఎందుకయ్యా ఈ వ్యర్ధ ప్రగల్భాలు. ఎవరైనా వింటే నవ్వగలరు. నీవు ఎప్పటికీ అర్జునుడికి సరిరావు. అది అందరికీ తెలుసు. అర్జునుడి చేతిలో ఓడి పోయిన గంధర్వుడు అంగారపర్వునికన్నా, సుయోధనుడిని బంధించిన చిత్రసేనుడికన్నా, వరాహం కొరకు అర్జునుడితో పోరిన పరమేశరుడికన్నా నీవు ఎందులో గొప్పవాడివి. వారిలో ఎవరికీ సరి పోలని నీవు అర్జునుడిని గెలుస్తానని అనడం నోటి దురదగాక మరేమి. కర్ణా ! ఉత్తర గోగ్రహణ సమయాన అర్జునుడి చేతిలో మీరు పొందిన భంగపాటు అప్పుడే మరిచావా ! లేక అర్జునుడి బాణములు అప్పుడే తుప్పు పట్టాయని అనుకున్నావా ! ఇంతకు ముందులా కాకుండా ప్రాణాలకు తెగించి అర్జునుడితో పోరాడుతానని అన్నావు కదా! అదే నిజమౌతుందేమో ! ఎందుకంటే అర్జునుడి చేతిలో నువ్వు చచ్చినా ! నీ మాట నిలబడుతుంది " అన్నాడు. శల్యుని మాటలకు కర్ణుడికి కోపము కట్టలు తెంచుకున్నా ఆపుకుని " శల్యా ! నీవు అర్జునుడిని పొగడడమే పనిగా పెట్టుకున్నావు. నేను అర్ఝునుడితో యుద్ధము చేస్తున్నప్పుడు ఎవరు పరాక్రమవంతులో చూసి అప్పుడు పొగుడు. అప్పటి వరకు నోరుమూసుకుని రధము నడుపు " అని అన్నాడు. శల్యుడు నవ్వుకుంటూ రథము తోలుతున్నాడు. కర్ణుడు తన పక్కన ఉన్న సైనికులను చూసి " సైనికులారా ! అర్జునుడేడి నాకు చూపించండి. అర్జునుడి రథం ఎక్కడుందో చూపిన వారికి నేను కోరిన కానుకలు ఇస్తాను " అని కర్ణుడు తన శంఖం పూరించాడు. ఆ మాటలకు శల్యుడు పకపకా నవ్వి " కర్ణా ! అర్జునుడిని ఒకరు చూపేదేమిటి నువ్వే చూడగలవు. నీ వద్ద ధనం ఎక్కువగా ఉంటే దానిని సద్వినియోగపరచాలి గాని ఇలా అపాత్రాదానాలు చేయకూడదు. అయినా కర్ణా ! ఎక్కడైనా నక్క సింహాన్ని జయిస్తుందా! అర్జునుడితో స్వయంగా యుద్ధము చేయడము అంటే నీకు నీవే అగ్నిలో ప్రవేశించడమే ! అందుకని ఎల్లప్పుడూ నీ సైన్యమును దగ్గర ఉంచుకో. నేను సుయోధనుడికి మిత్రుడను కనుక ఇదంతా నీకు రుచించకున్నా ఇది చెప్తున్నాను. నా మీద కోపగించక నా మాట విను " అన్నాడు. కర్ణుడు కోపంతో " శల్యా ! నేను నీమాటలకి భయపడను. ఇంద్రుడు అడ్డుపడినా అర్జునుడితో ఒంటరిగా యుద్ధము చేయక వదలను. ముందు రధము పోనిమ్ము " అన్నాడు. కర్ణుడిని ఇంకా ఉడికించాలని శల్యుడు " కర్ణా ! నా మాటలు నీ చెవికి ఎక్కవులే అర్జునుడి గాండీవం నుండి జినించే శబ్దం నీ చెవులు బద్ధలు కొడుతుండగా గాండీవం నుండి వర్షంలా వచ్చి పడే బాణములు నీ మీద పడే వరకు నీకు బుద్ధి రాదులే ! కర్ణా ! అర్జునుడితో ద్వంద యుద్ధము అంటే మాటలా ! సింహముతో జింకపిల్ల, ఏనుగుతో కుందేలు, పులితో నక్క, గ్రద్దతో పాము యుద్ధము చేయడం లాంటిది. నీకు అర్జునుడితో పోరాడగలిగిన బలము, శక్తి, సామర్ధ్యము ఉన్నాయంటావా " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము*


*378 వ రోజు*

*రెండవ అశ్వాసం*


కర్ణుడికి శల్యుడు సారథ్యం వహించడానికి అంగీకరించిన పిదప సుయోధనుడు కర్ణుని చూసి " కర్ణా ! భీష్ముడు, ద్రోణుడు పాండవులను సంహరిస్తారని ఆశించాను. కాని వారికున్న పాండవపక్షపాతం కారణంగా నా ఆశ నెరవేర లేదు. కనీసం నీవైనా ధర్మరాజును బంధించి పాండవ సైన్యాలను నిర్మూలించి నా మనసుకు ఆనందం కలిగించు " అన్నాడు. కర్ణుడు శల్యునితో " నేను వేయు నారాచములు మొదలగు బాణములు చూసి పాండవులు భయపడతారు. నా భుజబలం చూసి దేవతలు మెచ్చుకుంటారు. నీవు కూడా మెచ్చుకునేలా యుద్ధం చేస్తాను " అన్నాడు.


*శల్యసారధ్యము*


కర్ణుడి మాటలు విన్న శల్యుడు " కర్ణా ! పాండవులు సత్యసంధులు, భుజబల పరాక్రమవంతులు, తేజో మూర్తులు, అస్త్రశస్త్ర పారంగతులు, దివ్యాస్త్రసంపన్నులు, అఖిల శాస్త్రపారంగతులు ఇంద్రునికే భయం కలిగించకలిగిన మహిమాన్వితులు వారిని గురించి నీవు ఇలా మాటాడతగదు. అర్జునుని గాండీవ ధ్వని నీ చెవులు బద్దలు చేస్తుంది, భీముడి గదా నైపుణ్యం నీ కళ్ళను మిరుమిట్లు కొల్పుతుంది. పాండవులు వారి పరాక్రమంతో నిన్ను గజగజలాడించగలరు. అర్జునుడి శరాఘాతానికి నీ రధము కూలుతుంటే, భీముని గధాఘాతాలకు గజసైన్యములు కూలుతున్నప్పుడు, ధర్మరాజు నకులసహదేవులతో చేరి నీ సైన్యాలను చీల్చి చెండుతున్న సమయంలో నీవు ధైర్యంగా నిలిచి ఉంటే నీ మాటలు నమ్మగలను " అన్నాడు. ఆ మాటలు వినీ వననట్లు కర్ణుడు " శల్యా ! నా పరాక్రమము చూపిస్తాను పాండవుల ఎదుటకు రధము పోనిమ్ము. నేను విల్లు ఎక్కుపెడితే దేవేంద్రుడు కూడా నా ముందు నిలువలేడు. అసలు పాడవుల బలం ఏపాటిదని భీష్ముడు, ద్రోణుడు వారి చేతిలో చచ్చారు. నీవు చూస్తూ ఉండు నేను అర్జునుడిని చిటెకెలో సంహరిస్తాను. పాండుకుమారులు ఒక్కుమ్మడిగా నా మీద పడినా నేను జంకక పాడవసైన్యాలను చీల్చి చెండాడి భీష్మ, ద్రోణులు పోయినా సుయోధనుడికి విజయం చేకూర్చడానికి దివ్యాస్త్రసంపన్నుడైన కర్ణుడు ఉన్నాడని నిరూపిస్తాను " అని పగల్భాలు పలికాడు.


*శల్యుడు కర్ణుడి ప్రగల్భాలను త్రోసి పుచ్చుట*


కర్ణుడి మాటలకు శల్యుడు నవ్వుకుని " కర్ణా ! ఎందుకయ్యా ఈ వ్యర్ధ ప్రగల్భాలు. ఎవరైనా వింటే నవ్వగలరు. నీవు ఎప్పటికీ అర్జునుడికి సరిరావు. అది అందరికీ తెలుసు. అర్జునుడి చేతిలో ఓడి పోయిన గంధర్వుడు అంగారపర్వునికన్నా, సుయోధనుడిని బంధించిన చిత్రసేనుడికన్నా, వరాహం కొరకు అర్జునుడితో పోరిన పరమేశరుడికన్నా నీవు ఎందులో గొప్పవాడివి. వారిలో ఎవరికీ సరి పోలని నీవు అర్జునుడిని గెలుస్తానని అనడం నోటి దురదగాక మరేమి. కర్ణా ! ఉత్తర గోగ్రహణ సమయాన అర్జునుడి చేతిలో మీరు పొందిన భంగపాటు అప్పుడే మరిచావా ! లేక అర్జునుడి బాణములు అప్పుడే తుప్పు పట్టాయని అనుకున్నావా ! ఇంతకు ముందులా కాకుండా ప్రాణాలకు తెగించి అర్జునుడితో పోరాడుతానని అన్నావు కదా! అదే నిజమౌతుందేమో ! ఎందుకంటే అర్జునుడి చేతిలో నువ్వు చచ్చినా ! నీ మాట నిలబడుతుంది " అన్నాడు. శల్యుని మాటలకు కర్ణుడికి కోపము కట్టలు తెంచుకున్నా ఆపుకుని " శల్యా ! నీవు అర్జునుడిని పొగడడమే పనిగా పెట్టుకున్నావు. నేను అర్ఝునుడితో యుద్ధము చేస్తున్నప్పుడు ఎవరు పరాక్రమవంతులో చూసి అప్పుడు పొగుడు. అప్పటి వరకు నోరుమూసుకుని రధము నడుపు " అని అన్నాడు. శల్యుడు నవ్వుకుంటూ రథము తోలుతున్నాడు. కర్ణుడు తన పక్కన ఉన్న సైనికులను చూసి " సైనికులారా ! అర్జునుడేడి నాకు చూపించండి. అర్జునుడి రథం ఎక్కడుందో చూపిన వారికి నేను కోరిన కానుకలు ఇస్తాను " అని కర్ణుడు తన శంఖం పూరించాడు. ఆ మాటలకు శల్యుడు పకపకా నవ్వి " కర్ణా ! అర్జునుడిని ఒకరు చూపేదేమిటి నువ్వే చూడగలవు. నీ వద్ద ధనం ఎక్కువగా ఉంటే దానిని సద్వినియోగపరచాలి గాని ఇలా అపాత్రాదానాలు చేయకూడదు. అయినా కర్ణా ! ఎక్కడైనా నక్క సింహాన్ని జయిస్తుందా! అర్జునుడితో స్వయంగా యుద్ధము చేయడము అంటే నీకు నీవే అగ్నిలో ప్రవేశించడమే ! అందుకని ఎల్లప్పుడూ నీ సైన్యమును దగ్గర ఉంచుకో. నేను సుయోధనుడికి మిత్రుడను కనుక ఇదంతా నీకు రుచించకున్నా ఇది చెప్తున్నాను. నా మీద కోపగించక నా మాట విను " అన్నాడు. కర్ణుడు కోపంతో " శల్యా ! నేను నీమాటలకి భయపడను. ఇంద్రుడు అడ్డుపడినా అర్జునుడితో ఒంటరిగా యుద్ధము చేయక వదలను. ముందు రధము పోనిమ్ము " అన్నాడు. కర్ణుడిని ఇంకా ఉడికించాలని శల్యుడు " కర్ణా ! నా మాటలు నీ చెవికి ఎక్కవులే అర్జునుడి గాండీవం నుండి జినించే శబ్దం నీ చెవులు బద్ధలు కొడుతుండగా గాండీవం నుండి వర్షంలా వచ్చి పడే బాణములు నీ మీద పడే వరకు నీకు బుద్ధి రాదులే ! కర్ణా ! అర్జునుడితో ద్వంద యుద్ధము అంటే మాటలా ! సింహముతో జింకపిల్ల, ఏనుగుతో కుందేలు, పులితో నక్క, గ్రద్దతో పాము యుద్ధము చేయడం లాంటిది. నీకు అర్జునుడితో పోరాడగలిగిన బలము, శక్తి, సామర్ధ్యము ఉన్నాయంటావా " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

పరోప కారాయ పుణ్యాయా

 *_🌴 'పరోప కారాయ పుణ్యాయా, పాపాయ పరపీడనం' ఇతరులకు ఏదైనా ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది. అపకారం తలపెడితే పాపమే వస్తుంది. నీవు నీ స్వలాభం కోసం ఇతరులను ఇబ్బందులకు గురిచేసి, బాధపెట్టి, హింసించి, దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, పుష్కరాలు చేసినా నీ పాపాలు పోవు సుమీ!! ప్రాయశ్చిత్తం అనేది తెలియక జరిగిపోయిన తప్పుకే తప్ప పదే పదే చేసే తప్పులకు కాదు.. అంగడిలో వస్తువులు కొన్నట్లు, దేవుణ్ణి పూజలు, కానుకలు ఇచ్చి కొనలేం!! మనస్సులో మంచి చేయాలనే ఉద్దేశ్యం లేనపుడు ఎన్ని పూజలు చేసినా, ఎంత సాధన సలిపినా ప్రయోజనం ఉండదు.. పరుల నిమిత్తం నీవు ముందుకు కదిలినపుడు, నీ నిమిత్తం భగవంతుడు కదిలి వస్తాడు. కనుక నీలోని మంచిని పెంచుకో, చెడును త్రుంచుకో..🌴_*