10, జనవరి 2024, బుధవారం

నిద్ర - నియమాలు

 నిద్ర - నియమాలు  -


      మానవుడు ఆరోగ్యముగా ఉండవలెను అనిన ఆహారం మరియు నిద్ర ఇవి రెండు ముఖ్యమైనవి . నిద్ర వలన శ్రమ , అలసట తొలగిపోవును . నిద్ర సరిగ్గా పోనిచో శరీరం అశక్తతో నీరసంగా తయారగును. ముఖ్యంగా చిన్నపిల్లలకు , వృద్దులకు నిద్ర అత్యంత ముఖ్యం అయినది. ప్రతిమనిషి 5 గంటల నుంచి 8 గంటలపాటు తప్పకుండా నిద్రించవలెను. నిద్రను రెండురకాలుగా విభజించవచ్చు. అవి  


              1 . గాఢనిద్ర.


              2 . కలతనిద్ర .


 గాడనిద్ర  - 


       మైమరచి , బాహ్య విషయాలు తెలియకుండా రెండు నుంచి మూడు గంటల పాటు నిద్రించుట . దీనివల్ల మానసికపరమైన ఉల్లాసం , విశ్రాంతి లభించి మానవుడు దైనందిక కార్యక్రమాలు చురుకుగా నిర్వర్తించగలడు.


 కలతనిద్ర  -


        మనుష్యుడు నిద్రించునప్పుడు కొంతవరకు బాహ్యవిషయాలు తెలియుచుండును. ఎవరైనా బిగ్గరగా మాట్లాడటం , శబ్దము చేసిన వెంటనే మెలుకువ వచ్చును. ఈ నిద్ర వలన పూర్తి విశ్రాంతి కలుగదు. కొంతవరకు శారీరక విశ్రాంతి మాత్రం లభించును.


 నిద్ర నియమాలు  -


 *  కొన్నాళ్ళు జబ్బు పడి లేచినవారు , జ్వరముతో బాధపడువారు , నిద్రవచ్చినప్పుడు కునికిపాట్లు పడవచ్చు కాని పూర్తిగా నిద్రపోగూడదు అని ఆయుర్వేదం స్పష్టంగా చెప్పినది.


 *  జ్వరంతో ఉన్నప్పుడు ఆహారం తీసుకుని మరలా నిద్రించినచో జ్వరం వెంటనే తిరగబెట్టును. కావున వైద్యుడు చెప్పిన నియమాల ప్రకారమే నిద్రించవలెను.


 *  ఎదైనా పరిస్థితులలో రాత్రి జాగరణ చేసినచో రాత్రి ఎంతకాలం నిద్ర తగ్గినదో అంత సమయంలో సగభాగం ఉదయాన్నే ఆహారం తీసుకొకుండా నిద్రించవలెను.


 *  ఏప్రిల్ మరియు మే నెలలలో అనగా గ్రీష్మఋతువు నందు ఎండలు అధికంగా పగలు నిద్రించుట పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆరోగ్యం కలిగించును.


 *  సాయంత్రం సమయంలో టీ మరియు కాఫీని తాగడం ఆపినచో రాత్రి సమయం నందు చక్కటి నిద్రపట్టును .


 *  ఎక్కువుగా పొగ తాగేవారికి నిద్రపట్టదు. పొగలోని నికోటిన్ అంటూ విషపదార్థం శరీరంలోని నరములకు ఉత్తేజం కలిగించి నిద్రను రానివ్వదు.


 *  నిద్రించుటకు ముందు ఆలోచనలను దూరం పెట్టి ప్రశాంతంగా ఉండి వెలికిలిగా పడుకొని ధ్యానం చేయుట ద్వారా మంచి నిద్రపట్టును . మధ్యలో మెలకువ వచ్చిన ఎడమ చేతి వైపు తిరిగి పడుకోవలెను .


 *  పొలం పనిచేయువారు మరియు ఫ్యాక్టరీ పనిచేయువారు సాయం సమయాన గోరువెచ్చని నీటితో స్నానం చేసి 10 గంటల లోపు నిద్రకు ఉపక్రమించవలెను.


 *  శారీరక శ్రమ లేనివారు చన్నీటి స్నానము చేయవచ్చు . గదిలో తక్కువకాంతి ఇచ్చే బల్బ్ లను ఉంచరాదు.


 *  ఉదయం నిద్రలేచే ముందు మంచం పైన అటూఇటూ నాలుగు నుంచి అయిదు సార్లూ పొర్లి చేతులు , కాళ్లు విదల్చవలెను.


 *  నిద్ర లేచించిన వెంటనే కాళ్లు , చేతులు వేళ్లు మెటికలు విరవడం వలన శరీర అవయవాలు శక్తిని పుంజుకోనును.


  

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

          9885030034 


       


     కాళహస్తి వేంకటేశ్వరరావు 


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

⚜ శ్రీ వజ్రేశ్వరిదేవి మందిర్

  🕉 మన గుడి : నెం 296


⚜ హిమాచల్ ప్రదేశ్  : నగర్కోట్ ధామ్


⚜ శ్రీ వజ్రేశ్వరిదేవి మందిర్



💠 భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటి హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా గ్రామంలో గల బ్రజేశ్వరీ దేవి ఆలయం .

ఆమే వజ్రేశ్వరీ దేవి అని అంటారు...

ఈ ఆలయం 10000 సంవత్సరాల పురాతనమైనది మరియు శిఖర నిర్మాణ శైలిని వర్ణిస్తుంది.

దీనిని బజరేశ్వరి దేవాలయం అని కూడా అంటారు.

 

💠 తన తండ్రి దక్ష ప్రజాపతి చేసిన యాగానికి సంతోషంగా వెళ్ళిన సతీదేవి అక్కడ తన భర్తకు జరిగిన అవమానం భరించలేక యజ్ఞకుండం లో దూకి ప్రాణత్యాగం చేసుకుంటుంది.

ఆమె మరణానికి ఉగ్రుడై ఆమె మృతకాయాన్ని చేతులపై మోస్తూ ప్రళయ భీకరుడైన రుద్రుని చూసి విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క ఖండాలుగా చేస్తాడు.


💠 రుద్ర తాండవం చేస్తున్న ఆ మహాదేవుని కదలికలకు ఆమె శరీర భాగాలు భూమిపై 51 చోట్ల పడ్డాయి. ఒక్కొక్క భాగం ఆ పరాశక్తి పీఠంగా రూపుదిద్దుకుంది.

ఆ మంచు కొండల్లో పడ్డ అమ్మవారి కుడి స్తనం వజ్రేశ్వరీ ఆలయమైంది. 

 

⚜ ఆలయ చరిత్ర ⚜


💠 వేల సంవత్సరాల క్రితం కలికుట్ అనే రాక్షసుడు  ఋషులను మరియు మానవులను ఇబ్బంది పెట్టాడు. దేవతలతో యుద్ధనికి దూకాడు.

బాధపడిన దేవతలు మరియు ఋషులు వశిష్ట నేతృత్వంలోని త్రిచండీ యజ్ఞం, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అగ్ని నైవేద్యాన్ని నిర్వహించారు. 


💠 ఇంద్రునికి ఆహుతి (యజ్ఞంలో నెయ్యి సమర్పించడం) ఇవ్వబడలేదు. 

కోపోద్రిక్తుడైన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని 

యజ్ఞం వైపు విసిరాడు. 

భయభ్రాంతులకు గురైన దేవతలు, ఋషులు తమను రక్షించమని అమ్మవారిని వేడుకున్నారు. 


💠 దేవి ఆ ప్రదేశంలో తన తేజస్సుతో ప్రత్యక్షమై వజ్రాన్ని మింగడంతోపాటు ఇంద్రుడిని బుద్ది చెప్పి  రాక్షసులను కూడా సంహరించింది. 

ఈ ప్రాంతం లోనే అమ్మవారు కాళికా రూపమై వజ్రాసురుడనే రాక్షసుడిని సంహరించిందని అందుకే ఆమె వజ్రేశ్వరీదేవి అయిందనీ ఒక గాథ. 


💠 మహాభారతకాలంలో  పాండవులు అరణ్య వాసం చేస్తున్నప్పుడు అమ్మవారు ఆదేశించగా వారు ఈ ఆలయాన్ని నిర్మించారని ఇతిహాసగాథ. 

ఒకరోజు పాండవులు తమ కలలో దుర్గాదేవిని చూసారని, ఆమె నాగర్‌కోట్ గ్రామంలో ఉందని, వారు సురక్షితంగా ఉండాలంటే ఆ ప్రాంతంలో ఆమెకు ఆలయాన్ని నిర్మించాలని, లేకపోతే వారు నాశనం అవుతారని చెప్పారని పురాణాలు చెబుతున్నాయి. అదే రాత్రి నాగర్‌కోట్ గ్రామంలో ఆమెకు అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు.


💠 ఇక్కడ రాక్షసులతో యుద్ధం చేసిన అమ్మవారికి గాయల నుండి రక్తము కారినచోట చన్నీటితో కడిగి నెయ్యి రాసే ఆచారము వుంది. 100 సార్లు చన్నీటితో కడిగిన తరువాత నెయ్యి రాయబడు విగ్రహము ఇది. దీనిని మకర సంక్రాంతి మరుసటి రాత్రి నుండి వారం రోజులు నెయ్యి రాస్తారు. ఈ కార్యక్రమాన్ని లోహ్రి అని పిలుస్తారు. 


💠 ఇక్కడి అమ్మవారు వజ్రేశ్వరిదేవి. 

ఆమె శక్తి 6 చక్రాల ద్వారా విశదం అవుతుంది. 

1. ఆజ్ఞాచక్ర  2. విశుద్ధ 3. అనాహత 

4. మణిపూరక 

5. స్వాధిష్ఠాన 

6. మూలధార చక్రములు


💠 చుట్టుపక్కల ఉపద్రవాలు సంభవించినప్పుడు కళ్ళ నుండి నీరు, శరీరం నుండి చెమటలు వచ్చు భైరవ విగ్రహమున్న ఆలయం ఒకటి ఇక్కడ ఉంది


💠 మహమ్మద్ ఘజనీ ఎన్నోసార్లు ఆలయాన్ని కొల్లగొట్టినా తిరిగి అమ్మవారి ఆలయం వజ్ర వైఢూర్యాలతో నిండిపోయేది.

తిరిగి ఫిరోజ్ షా కూడా ఎన్నో సార్లు ఆలయం పై దాడి చేశాడు. కానీ అమ్మవారి సంపదకి ఏ లోటూ రాలేదు. 

పాండవులు నిర్మించిన ఆలయ కట్టడం భూకంపాలవల్ల సడలినా తిరిగి భారత ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మించింది. 

అమ్మవారు ఇప్పటికీ సకల సంపదలతో,సర్వార్థ దాయినిగా భక్తుల కోర్కెలను నెరవేరుస్తూనే ఉంది. 


⚜ ఆలయ నిర్మాణం ⚜


💠 ఈ దేవాలయం చుట్టూ కోట లాంటి రాతి గోడ కూడా ఉంది. ప్రధాన మందిరానికి చేరుకోవడానికి యాభై రెండు రాతి మెట్లు ఎక్కాలి. ఒక మెట్లపై బంగారు తాబేలు చెక్కబడి, విష్ణువు యొక్క తాబేలు అవతారం అయిన కూర్మగా పూజిస్తారు .


 💠వజ్రేశ్వరి దేవి యొక్క విగ్రహ, ఆమె కుడి మరియు ఎడమ చేతులలో వరుసగా కత్తి మరియు గదా  మరియు ఆమెతో పాటు త్రిశూలం మధ్యలో ఉంది. 


💠 గర్భగృహానికి వెలుపల ఉన్న గర్భగుడిలో వినాయకుడు , భైరవుడు , హనుమంతుడు మరియు మొరబా దేవి వంటి స్థానిక దేవతల విగ్రహాలు ఉన్నాయి.


💠 ఈ ఆలయంలో  చైత్ర మాసంలో  నవరాత్రి  జరుపుకుంటారు , ఆపై 10వ రోజు విజయదశమి .

చైత్ర మాసంలో అమావాస్య నాడు వజ్రేశ్వరి దేవి గౌరవార్థం జాతర జరుగుతుంది. 

14వ రోజున అమ్మవారి ఆరాధనతో జాతర ప్రారంభమవుతుంది. అమావాస్య నాడు రాత్రి దీపారాధన చేస్తారు. మరుసటి రోజు దేవత యొక్క ప్రతిమను మోసుకెళ్ళే పల్లకి  ఊరేగింపు జరుగుతుంది.


💠 దేవాలయం జరుపుకునే ఇతర పండుగలు శ్రావణంలో శివారాధన ;

కోజాగిరి పూర్ణిమ -పౌర్ణమి రోజు; దీపావళి, హోలీ , దత్త జయంతి, హనుమాన్ జయంతి.


💠 ఇది కాంగ్రాలో జ్వాలాముఖికి 55 కి. మీ. దూరంలో ఉంది



©

శ్రీదేవీభాగవతము

 శ్రీదేవీభాగవతము

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


పరమపవిత్రుడా ! విశ్వామిత్రుడా! అదంతా నీకు చెప్పి ఏమి ప్రయోజనం ? అనవసరంగా

నువ్వూ దుఃఖించవలసివస్తుంది.

హరిశ్చంద్రా ! అక్రమంగా ఆర్జించిన అపవిత్రధనమైతే నేను దీన్ని ముట్టను. ప్రశస్తమైనదే

స్వీకరిస్తాను. అందుకోసం అడుగుతున్నాను. ఎలా సంపాదించావో చెప్పు.

మహర్షీ! నా భార్యను కోటి నిష్కాలకు అమ్మేశాను. పుత్రుణ్ణి అర్బుదనిష్కాలకు విక్రయించాను

ఇవిగో మొత్తం పదకొండుకోట్ల సువర్ణటంకాలు. స్వీకరించు.

హే రాజన్ ! స్వీకరించు, స్వీకరించు అంటున్నావు. బోడి పదకొండుకోట్ల చిల్లరవాణేలు

రెండున్నరబారువు లవుతాయనుకుంటున్నావా? నువ్వు ఇస్తానన్న దక్షిణ ఎంతో మరిచిపోయావా? వాళ్లకు 

తూకాలూ కొలతలూ తెలియవనుకుంటున్నావా? ఇవి సరిపోవుగాక సరిపోవు. మరిన్ని పంపాదించు.

మసిబూసి మారేడుకాయ చేద్దామని చూశావో నా తపోబలం రుచిచూస్తావు. నా స్వచ్ఛశీలమూ నా

అధ్యయనమూ ఎంతటివో తెలుసుకుంటావు.

మహాత్మా! తక్కినదికూడా తప్పకుండా సంపాదించి ఇస్తాను. కాకపోతే మరికొంతకాలం గడుపు

పెంచు. పత్నీపుత్రులను అమ్మినది ఇప్పుడేకదా!

హరిశ్చంద్రా! గడువు పెంచడం కుదరదు. ఈ రోజుకి ఇంకా నాల్గవభాగం మిగిలి ఉంది. ఆది

ముగిసేలోగా నువ్వు సంపాదించడమూ నాకు చెల్లించడమూ అవ్వాలి. అంతకుమించి క్షణం ఆగము. ఇకనువ్వు ఏమీ చెప్పకు. నేను వినను.

Gamaninchandi


 

Temple prasaad

 https://youtube.com/shorts/pIItfpoWsus?si=3zfI3zmd1BXK3Mnk


Panchaang


 

వినయాంజలి

 కవియోగి పోతనకు

         వినయాంజలి 


సీ. బమ్మెర గ్రామాన ప్రభవించి యుర్విపై

               భక్తి పంచిన యట్టి  భాగవతుడు

    పద్యముల్  సేద్యమున్ పరవశంబున చేసి

               సన్నుతుండైనట్టి  సవ్యసాచి

    మకరంద సాహిత్య మాధుర్య రసమును 

               తెలుగుజాతి కిడిన వెలుగు రేఖ

    భక్తి సాహిత్యంబు పంచియున్ మేనున

               పులక లెత్తించిన నలువపట్టి 

తే. రాజులకు కావ్య మీయక రక్తి తోడ 

     భక్తితో రామవిభునకు ముక్తి గోరి

     కావ్య మంకింత మొనరించి ఘనత గాంచె

     భక్త పోతన పావన భాగవతుడు          



 సీ. 'కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి'

                పరికించి చూచిన భక్తవరుడు

     'ఎవనిచే జనియించు నీ జగమ్మ 'నుచును 

               'కరిచేత' తెల్పిన పరమబుధుడు

     'రాజులు గల్గరే ! రాజ్యంబు లేలరే !

               యవనిలో  నుండిరే!' యనిన ఘనుడు

      కన్నీరు నింపిన కమలాసనునిసతి 

                న్నోదార్చి పొగడిన యోగివరుడు

తే. భక్తి వైరాగ్య కావ్యమౌ భాగవతము

      రచన జేసియు నత్యంత రమ్యముగను 

      తెలుగు వారికి నిచ్చిన  దివ్య సుకవి

      పోతనకు మించి యెవ్వరు పుడమి గలరు ?  


✍️గోపాలుని మధుసూదన రావు 🙏