25, అక్టోబర్ 2025, శనివారం

అద్భుతమైన పద్యం

 

అద్భుతమైన పద్యం 

పోతన వ్రాసిన భాగవతంలోని ప్రతి పద్యము ఆణిముత్యమే అనటంలో సందేహం లేదు. అది కందము కానీయండి, మత్తేభం కానీయండి, సేసం కానీయండి. ప్రతి పద్యం చదవటానికి అనువుగా, వినసొంపుగా అర్ధవంతంగా ఉంటాయి అనటంలో సందేహం లేదు. చిన్న చిన్న పద్యాలలోకూడా ఎంతో భావాన్ని అర్ధవంతంగా పొందుపరచటంలో పోతనకు సాటి వేరొకరు రారు అనటంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ చూడండి ఒక చిన్న కంద పద్యంలో అన్నే లోకాలను చుట్టుముట్టి వచ్చాడు. 

కం||
లోకంబులు లోకేశులు
లోస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

 

లోకాలు అంటే మనకు తెలుసు చతుర్దశ భువనాలు అంటే 7 ఊర్ధ్వ లోకాలు 7 అదో లోకాలు వెరసి 14 లోకాలు ఉన్నట్లు మనకు శాస్త్రోవాచ అటువంటి అన్ని లోకాలకు పరిపాలించే రాజులు అంతేకాదు ఆ లోకాలలో నివసించేవారు అన్నీకూడా సృష్టి అంతంలో నశించినప్పుడు అంటే ప్రళయం సంభవించినప్పుడు లోకాలు వుండవు, రాజులు వుండరు, లోకాలలో వుండే జనాలు వుండరు అంతా నశించిపోయి కారు చీకట్లు కమ్మి ఉంటాయి అని సృష్టి వినాశనాన్ని గురించి చెపుతారు. అప్పుడు ప్రకాశించే సూర్యుడు, చంద్రుడు కూడా నశించిన తరువాత పూర్తిగా అంధకార బంధురంగా ఉంటుంది. అటువంటి చీకట్లలో చీకటికి అవతల ఉన్నటువంటి వెలుగే పరమేశ్వరుడు అని శాస్త్ర ఉవాచ అంటే కేవలం ఈశ్వరుడు తప్ప ఇంకా ఏమి ఉండదు. ఆ పరమేశ్వరుడు మరల సృష్టి కార్యం చేపట్టి క్రొత్తగా సృష్టిని అంటే మరల లోకాలను, లోకేసులను, లోకస్తులను సృష్టిస్తాడన్నమాట. అటువంటి దివ్యమైన శక్తివంతమైన పరమేశ్వరుడిని నేను సేవిస్తాను అని ఇక్కడ కవి అంటున్నాడు. అది ఎంతటి అద్భుతమైన భావనో చుడండి.  

మరిన్ని ఇటువంటి విషయాలకోసం వేచిచూడండి 

 ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ 

అద్భుతమైన పద్యం

అద్భుతమైన పద్యం 

పోతన వ్రాసిన భాగవతంలోని ప్రతి పద్యము ఆణిముత్యమే అనటంలో సందేహం లేదు. అది కందము కానీయండి, మత్తేభం కానీయండి, సేసం కానీయండి. ప్రతి పద్యం చదవటానికి అనువుగా, వినసొంపుగా అర్ధవంతంగా ఉంటాయి అనటంలో సందేహం లేదు. చిన్న చిన్న పద్యాలలోకూడా యంతో భావాన్ని అర్ధవంతంగా పొందుపరచటంలో పోతనకు సాటి వేరొకరు రారు అనటంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ చుడండి ఒక చిన్న కంద పద్యంలో అన్నే లోకాలను చుట్టుముట్టి వచ్చాడు. 

కం||
లోకంబులు లోకేశులు
లోస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

 

లోకాలు అంటే మనకు తెలుసు చతుర్దశ భువనాలు అంటే 7 ఊర్ధ్వ లోకాలు 7 అదో లోకాలు వెరసి 14 లోకాలు ఉన్నట్లు మనకు శాస్త్రోవాచ అటువంటి అన్ని లోకాలకు పరిపాలించే రాజులు అంతేకాదు ఆ లోకాలలో నివసించేవారు అన్నీకూడా సృష్టి అంతంలో నశించినప్పుడు అంటే ప్రళయం సంభవించినప్పుడు లోకాలు వుండవు, రాజులు వుండరు, లోకాలలో వుండే జనాలు వుండరు అంట నశించిపోయి కారు చీకట్లు కమ్మి ఉంటాయి అని సృష్టి వినాశనాన్ని గురించి చెపుతారు. అప్పుడు ప్రకాశించే సూర్యుడు, చంద్రుడు కూడా నశించిన తరువాత పూర్తిగా అంధకార బంధురంగా ఉంటుంది. అటువంటి చీకట్లలో చీకటికి అవతల ఉన్నటువంటి వెలుగే పరమేశ్వరుడు అని శాస్త్ర ఉవాచ అంటే కేవలం ఈశ్వరుడు తప్ప ఇంకా ఏమి ఉండదు. ఆ పరమేశ్వరుడు మరల సృష్టి కార్యం చేపట్టి క్రొత్తగా సృష్టిని అంటే మరల లోకాలను, లోకేసులను, లోకస్తులను సృష్టిస్తాడన్నమాట. అటువంటి దివ్యమైన శక్తివంతమైన పరమేశ్వరుడిని నేను సేవిస్తాను అని ఇక్కడ కవి అంటున్నాడు. అది ఎంతటి అద్భుతమైన భావనో చుడండి.  

 ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ 

🌹25అక్టోబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🍁శనివారం🍁*

  *🌹25అక్టోబర్2025🌹*

     *దృగ్గణిత పంచాంగం* 

               

            *ఈనాటి పర్వం* 

            *నాగులచవితి* 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరత్ఋతౌః* 

*కార్తీకమాసం - శుక్లపక్షం*


*తిథి  : చవితి* రా 03.48 వరకు ఉపరి *పంచమి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : అనూరాధ* ఉ 07.51 వరకు *జ్యేష్ఠ*

సూర్యరాశి : *తుల*                      

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.12* 

సూర్యాస్తమయం :*సా 05.48*

*యోగం : శోభన* *ఈరోజంతా రాత్రితో సహా* 

*కరణం  : వణజి* మ 02.34 *భద్ర* రా 03.48 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.30 - 12.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 12.54 - 02.42*

అభిజిత్ కాలం  : *ప 11.28 - 12.15*

*వర్జ్యం    : మ 02.08 - 03.56*

*దుర్ముహూర్తం  : ఉ 06.02 - 07.36*

*రాహు కాలం   : ఉ 08.57 - 10.24*

గుళికకాళం      : *ఉ 06.02 - 07.30*

యమగండం    : *మ 01.19 - 02.46*


*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.02 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.42*

మధ్యాహ్న కాలం    :    *10.42 - 01.01*

అపరాహ్న కాలం    : *మ 01.01 - 03.21*


*ఆబ్ధికం తిధి         : కార్తీక శుద్ధ చవితి*

సాయంకాలం        :  *సా 03.21 - 05.40*

ప్రదోష కాలం         :  *సా 05.40 - 08.09*

రాత్రి కాలం           :*రా 08.09 - 11.27*

నిశీధి కాలం          :*రా 11.27 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.24 - 05.13*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🍁ఆంజనేయ స్తోత్రం🍁*


*గతి నిర్జిత వాతాయ* 

*లక్ష్మణ ప్రాణదాయచ*

*వనౌకసాం వరిష్ఠాయ* 

*వశినే వననాసినే!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

Doctor

 Doctor: 

How old are you and what's bothering you?


Rakesh: 

Doctor, I'm 65 years old. Every night I go to sleep, I'm afraid someone is hiding under my bed...

This is why I can't sleep.


Doctor: 

You'll have to come every week for six months.


Rakesh: 

How much will it cost, Doctor?


Doctor: 

Around 40,000-50,000 rupees.


After six months, the doctor sees Rakesh on the way...


Doctor: 

What happened, Rakesh? You didn't come back for treatment.


Rakesh: 

Doctor, a friend of mine treated me.


Doctor: 

What's the matter? What kind of treatment did your friend give you?


Rakesh: 

Nothing, he just said...

Sell the bed and sleep on the mattress on the floor.

That's all I'm doing.


 *The moral of the story*...


*Before going to the doctor, talk to your friends* !


*Because...friendship is the medicine that never expires*!


*Where there are friends, you will surely find a way out*.


Dedicated to all friends. Always be happy, be cheerful, be busy... Keep smiling and laughing...


Yours friendly


😃😃😃🌹


Good Night

శివుడాజ్ఞ

 

శివుడాజ్ఞ  

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. ఇది ఇప్పటి మాట కాదు మన తాత ముత్తాతలనుండి వస్తున్న నానుడి. నిజానికి ఈ చరాచర జగత్తుని మొత్తాన్ని నిర్మించేది, నడిపించేది, నిర్ములించేది ఆ పరమ శివుడే. నా దృష్టిలోకి వచ్చిన ఒక సంఘటన ఇక్కడ పొందుపరిచ ప్రయత్నిస్తాను. 

చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక యదార్ధ గాధ. 

నా మిత్రుడు వాళ్ళ తండ్రిగారు మరియు వారి బంధువర్గం కొంతమంది ఒక మెటాడోర్ వ్యాను ( ఇంతకుముందు ఉండేవి ఇప్పుడు అవి లేవు. అందులో 7-8 మంది ప్రయాణించే సదుపాయం ఉండేది.) తీసుకొని తీర్థ యాత్రలకు వేళ్ళ సంకల్పించారు. కాగా వారికి అందులో ఒక సీటు కాళీగా ఉండటంతో ఆ సీటుని నింపాలని మా స్నేహితుని తమ్ముని రమ్మని అన్నారు. దానికి అతను నాన్న నేను 10వ తరగతి పరీక్షలకు  చదువుకుంటున్నాను కదా నేను చదువు వదిలి పెట్టి రాలేను అని జవాబు చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇంకా మెటాడోరులో ప్రయాణించే ఇతర బంధువులు చాల్లెరా నీ చదువు నీవు ఒక 4-5 రోజులలో నీ చదువు ఏమి పాడుకాదు సరదాగా అందరము వెళదాము ఆ సీటు ఎందుకు కాళీగా  వదలటం  రమ్మని బలవంతం చేశారు. పెద్దవాళ్ళ మాటలను కాదనలేక చివరి ఘడియల్లో బట్టలు సర్దుకొని వాళ్లతో ప్రయాణానికి సిద్దపడి వ్యాను ఎక్కాడు. వారి ప్రయాణం మొదలైయిన్ది . రెండు మూడు రోజులు చూడదలచిన ప్రదేశాలన్నీ చూసి చివరకు శ్రీశైలం నుండి వాళ్ళ వ్యానుతిరుగు ప్రయాణానికి  బయలుదేరింది. శ్రీశైలం కొండలమీదినుంచి వ్యాను వస్తూవుంటే మధ్యలో డ్రైవరు అదుపు తప్పి వ్యానుని కంట్రోలు చేయలేకపోవడంతో వ్యాను బోల్తా పడ్డది .  అందరికి గాయాలు అయ్యాయి కానీ మన 10 వ తరగతి చదువుతున్న మా స్నేహితుని తమ్ముడు మాత్రమే అక్కడికి అక్కడే మరణించాడు. విధి యెంత బలీయమైనదో చుడండి. ఇంట్లో చక్కగా పరీక్షలకు చదువుతున్న కుర్రవాడు యాత్రకు రానన్నా  వినకుండా వాళ్ళ పెద్దవాళ్ళు బలవంతంగా తీసుకొని వెళితే దాని పర్యవసానంగా అతని మృత్యువు అతనిని కబళించింది. వాడి మాట విని వాడిని ఇంట్లోనే వదిలి వేసినా బాగుండేది అని కుర్రవాని తల్లిదండ్రులు బాధపడ్డారు .  కానీ మరణించిన కుమారుడు తిరిగి వస్తాడా చెప్పండి. 

"జాతస్య మరణం ధ్రువం". జన్మించిన వానికి మరణం తథ్యం. కానీ ఎప్పుడు ఎవరు, ఎక్కడ మరణిస్తారో కేవలం ఆ పరమేశ్వరునికి మాత్రమే తెలుస్తుంది. 

సాధకులమైన మనము నిత్యం ఆ పరమశివుని పాదాలను శరణు చొచ్చటం తప్ప ఈ జన్మలో చేయవలసిన  వేరొక పని లేదు. 

 ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ 

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము  - శరదృతువు  - కార్తీక మాసం - శుక్ల పక్షం - చతుర్థి - అనూరాధ / జేష్ఠ -‌‌ స్థిర వాసరే* (25.10.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

నాగుల చవితి*

 …



               *నాగుల చవితి*

                  ➖➖➖✍️

```

*ఆశ్లేష, ఆరుద్ర, మూల,పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు.  సర్పము అనగా కదిలేది, పాకేది.  నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. 


జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.  జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ. అనగా ‘నాగం’ సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు.  కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది. కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణము కూడా సర్పమే.  కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.


కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ, నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులు కాకపోయినా కనీసం ‘కార్తీక శుద్ధ చవితినాడు’  నాగులను ఆరాధించాలి. చవితి అంటే నాల్గవది అనగా ‘ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో’  నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో, గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.


ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ, పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. 


నిశితంగా పరిశీలిస్తే... అందులో భాగంగానే ‘నాగుపాము’ ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.


ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. 


దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు, రెండు పాములు మెలికలు వేసుకొని రావి, వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక, దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. ‘కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా  జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయి ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి 

‘నీటిని’ ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా ‘రైతు’ కు పంటనష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.


భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా -  సంహితల్లో, బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ, ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలల్లో వివిధ జీవరాశులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.


కద్రువ నాగ మాత, మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని  ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.


దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన, ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి. సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.


వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి, రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో ‘కార్తీక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని  పర్వదినంగా ఆచరిస్తున్నాం.


పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !


పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి  విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.


‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.


పంట పొలాలకు శత్రువులు ఎలుకలు, వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా, విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 


*ఆధ్యాత్మిక యోగా పరంగా:-* 

ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను 

'వెన్నుపాము' అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘పాము’ ఆకారమువలెనే వుంటుందని ‘యోగశాస్త్రం’ చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ  మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది,  అందరి హృదయాలలో నివసించే 

'శ్రీమహావిష్ణువు’ నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది.


నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం:


పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా మజ్జిగను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన మజ్జిగ లో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే మజ్జిగ కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే మజ్జిగ లభిస్తుంది. ఆ మజ్జిగను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం, సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.


“దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం, అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

```

*నాగుల చవితి మంత్రం:*```

పాములకు చేసే ఏదైనా పూజ, నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. 

అనంత 

వాసుకి 

శేష

పద్మ

కంబాల

కర్కోటకం

ఆశ్వతార

ధృతరాష్ట్ర

శంఖపాల

కలియా

తక్షక

పింగళ

నాగదేవతల పేర్లు.


*పాము పుట్టలో  పాలు పోసేటప్పుడు  ఇలా చెప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి:*


 *నడుము తొక్కితే నావాడు అనుకో 

 *పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో 

 *తోక తొక్కితే తోటి వాడు అనుకో 

 *నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.


ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము అని అర్ధము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.


మనలను ఇబ్బంది పెట్టినవారిని, కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం, రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చెవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

Panchaag