25, ఆగస్టు 2023, శుక్రవారం

శ్రీమహాలక్ష్మ్యై నమః

 ॐ           శ్రీమహాలక్ష్మ్యై నమః 


* ఆది శంకరులు లక్ష్మీదేవిని ఆశువుగా స్తుతించి, కనకధార కురిపించిన, ఈ "కనకధారా"స్తోత్రాన్ని, 

    శ్రావణ శుక్రవారమైన ఈ రోజు, సాయంసంధ్యవేళ, మనం పూజచేసుకొన్న అమ్మవారి ముందు వింటూ పారాయణ చేద్దాం. 

* Let us recite on hearing this Stothram today (being Sravana Sukravaram) at dawn, where we worshipped the Goddess. 


ఉదాహరణకి ఒక శ్లోకం 

One sloka as an example. 👇 


श्रुति - रति - शक्ति : महालक्ष्मी 

శృతి - రతి - శక్తి స్వరూపిణి శ్రీమహాలక్ష్శి 

Knowledge - Aesthetic - Power : Maha Lakshmi 


श्रुत्यै नमोस्तु शुभकर्मफल प्रसूत्यै 

रत्यै नमोस्तु रमणीय गुणार्णवायै।

शक्तयै नमोस्तु शतपात्र निकेतानायै 

पुष्टयै नमोस्तु पुरूषोत्तम वल्लभायै।।11।।


శ్రుత్యై నమోఽస్తు శుభకర్మ 

                     ఫలప్రసూత్యై 

రత్యై నమోఽస్తు రమణీయ 

                     గుణార్ణవాయై I 

శక్త్యై నమోఽస్తు శతపత్ర 

                        నికేతనాయై 

పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమ 

                          వల్లభాయై ॥ 

      - ఆదిశంకరుల కనకధారా స్తోత్రమ్ నుండి 


తాత్పర్యం: 


* సకల శుభకర్మల ఫలాలని ప్రసాదించే వేదస్వరూపిణియు, 

* మహిమాన్వితమైన గుణములకు సాగరరూపిణియైన సౌందర్య(రతి)రూపిణియు, 

* నూరురేకుల పద్మమునందు నివశించు మహాశక్తి స్వరూపిణియు, 

*  పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు భార్యయు, పుష్టిరూపిణియు అయిన లక్ష్మీదేవికి నమస్కారము. 



Salutations to Mother Lakshmi! 

Salutations to You as 

  - Shruti (Vedas), Who produces Auspicious Results of Works (when Shruti is followed in our lives),

  - Rati, Who is an Ocean of Good Qualities,

  - Shakti, Who abide within the Abode of Hundred Petals (Lotus of Kundalini) and 

  - Pussti (Nourishment) Who is the beloved of Purushottama 


मात:। 

  - शुभ कर्मों का फल देने वाली श्रुति के रूप में आपको प्रणाम है।   

  - रमणीय गुणों की सिंधु रूपा रति के रूप में आपको नमस्कार है। 

  - कमल वन में निवास करने वाली शक्ति स्वरूपा लक्ष्मी को नमस्कार है तथा 

  - पुष्टि रूपा पुरुषोत्तम प्रिया को नमस्कार है।।11।। 


https://youtu.be/-ZKvsRfnAUk 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

పప్పు కూడు కాదు !

 పప్పు కూడు కాదు !

      చిప్పకూడు లేదా పిండాకూడు !! 

👇👇👇👇👇👇👇👇👇


1. కూతురి పెళ్లి కోసం మలక్పేట్ మల్లేషం పాతబస్తీ వడ్డీ వ్యాపారులనుంచి లక్ష రూపాయిలు అప్పు తీసుకొన్నాడు . నూటికి నెలకు పది రూపాయిలు వడ్డీ .  ఐదో తేదీ లోగా నెల  వడ్డీ డబ్బులు చెల్లించాలి . లేక పొతే అది అసలుకు జమ అవుతుంది ....  ఇదీ ఒప్పందం . 


అప్పు తీసుకొని రెండేళ్లయ్యింది . ఒకటి-  రెండు నెలలు  తప్పించి వడ్డీ చెల్లించలేక పోయాడు . వారి దౌర్జన్యం ఎక్కువ కావడం తో భార్య నగలు తాకట్టు పెట్టి అప్పు  చెల్లించేద్దామనుకొన్నాడు . తీసుకొంది లక్ష . వడ్డీ  మొత్తం కలిపి ఇంకో యాభై అరవై వేలు అయ్యుంటుందనుకొన్నాడు . మొత్తం మూడున్నర లక్షలు అయ్యింది అన్నారు . ఇంత పెద్ద మొత్తం ఎలా అయ్యిందో అర్థం కాక లబో దిబో అన్నాడు .


 పుట్టింటికి భర్త తో  వచ్చిన కూతురిని తాము తీసుకెళ్ళిపోతామంటూ వారు ఆమెను బలవంతంగా కారు ఎక్కించారు . జరిగిన అవమానాన్ని తట్టుకోలేక మల్లేశం ఆత్మ హత్య చేసుకొన్నాడు . ఇప్పుడు వడ్డీ   వ్యాపారాలు ...  మల్లేశం భార్య ను,  అల్లుడిని వేధిస్తున్నారు . ఈ లోగా అప్పు మొత్తం అయిదు లక్షలయ్యింది . తమకు కూడా ఆత్మ హత్యే గతి అని ఆ కుటుంబం మొత్తం ఆలోచిస్తోంది .


 పెళ్ళికి చేసిన అప్పు అందరికీ పాడె ఎందుకయ్యింది ? 


 2. తిరుపతి  నాయుడప్ప . ఫైనాన్స్ వ్యాపారి . తన దగ్గర డబ్బు డిపాజిట్ చేస్తే నెలకు నూటికి  రెండు రూపాయిల వడ్డీ  చొప్పున టంచనుగా చెల్లిస్తాడు . ఇంటి దగ్గరకే వచ్చి  ఆ ఫైనాన్స్  సంస్థ ఉద్యోగులు వడ్డీ చెల్లించి పోతారు . 


  అదే ఊళ్ళో ఆర్థిక శాస్త్రం చదివిన  అరవింద రావు  "  ఎన్నో ఫైనాన్స్ సంస్థలు దివాళా తీశాయి .. ఇదీ అంతే "  అనుకునేవాడు . తనకు తెలిసిన వారు  సంస్థలో డిపాజిట్ చేసి నెల- నెల వడ్డీ  రూపం లో సంపాదిస్తుంటే ఆలోచనలో పడ్డాడు . 

  ఇది పెద్ద సంస్థ . తాము సేకరించిన డిపాజిట్ లను నాయుడప్ప బెంగళూరు లో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు . దివాళా  సమస్యే లేదని అయిదు కోట్లు డిపాజిట్ చేసాడు . నెలకు పది లక్షలు ఇంటికి రావడం మొదలయ్యింది .  ప్రాణానికి సుఖం  అయ్యింది . చేస్తున్న వ్యాపారాన్ని వదిలేసాడు . ఇదే ఆదాయ మార్గం అయ్యింది . ఆదాయం ఇక పెరగాలంటే ..? 


  మిత్రులకు బంధువులకు ఈ ఫైనాన్స్ స్కీం గురించి చెప్పాడు . "అతన్ని మేమెలా నమ్మాలి అన్నారు" . "అయితే రిస్క్ నాది . మీరు నాకివ్వండి . నాకు ఆయన రెండు రూపాయిల వడ్డీ  ఇస్తాడు . నేను మీకు రూపాయిన్నర వడ్డీ ఇస్తాను . రిస్క్ తీసుకున్నందుకు నాకు అర్ధ రూపాయి ఆదాయం"  అన్నాడు . వారు సరే అన్నారు . ఇంకో అయిదు కోట్లు  సేకరించి నాయుడప్ప ఫైనాన్స్ స్కీం లో పెట్టాడు . ఇప్పుడు  నెలకు రెండున్నర లక్షల అదనపు ఆదాయం .


   బెంగళూరు రియల్ ఎస్టేట్ ధరలు అనుకొన్న స్థాయిలో పెరగలేదు . నాయుడప్ప రొటేషన్ దెబ్బ తింది. చేతులెత్తేశాడు . అరవింద రావు తన పూర్వీకుల ఆస్తులు అమ్మి తన ద్వారా ఫైనాన్స్ కంపెనీ లో పెట్టుబడి పెట్టిన వారికి ఇచ్చేసాడు . ఈ లోగా వారినుంచి నిందలు .. అవమానాలు . ఆర్థిక శాస్త్రం చదివిన అరవింద రావు  రావు..  ఇప్పుడు తీవ్ర మనో  వ్యాకులతతో .. 


 3. అదో స్కూల్. దాని యజమాని చాలా బోల్డ్ . రిస్క్ తీసుకొని  పైకి రావాలి అనుకునేవాడు . స్కూల్ ఫీజు సంవత్సరానికి యాభై వేలు . "ఎల్ కేజీ నుంచి పదోతరగతి దాకా  మీ పిల్లల్ని స్కూల్ చదివిస్తే ఫీజు ఆరు  లక్షలకన్నా ఎక్కువే అవుతుంది . మొత్తం ఫీజు ఇప్పుడే...  ఒక్క సారే చెల్లిస్తే...  కేవలం రెండు లక్షలు"  అని ప్రకటించాడు .

 అప్పో సప్పో చేసి చాలా మంది  మొత్తం ఫీజు కట్టేసారు . బాగా లబ్ది పొందామనుకొన్నారు . 

స్కూల్ యజమాని ఇలా సేకరించిన డబ్బును షేర్ మార్కెట్ లో,  ఇంకా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసాడు . ఇది ఇబ్బుడి ముబ్బిడిగా లాభాలు తెస్తుంది . అప్పుడు నెల నెల స్కూల్ జీతాలు , బిల్డింగ్ అద్దెలు లాంటి ఖర్చులు  పోయినా బాగా మిగులుతుంది అనుకొన్నాడు . 

షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ఒడుదుడుకులు .  మొత్తం కుదేలయ్యింది . స్కూల్ యజమాని ..  స్కూల్ పేరెంట్స్ అటు పై ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు .


డబ్బు !

మనిషి సృష్టి !  

అది లేక పొతే చావే ! 

దాన్ని ఎలా మానేజ్ చెయ్యాలో తెలియక పోయినా చావే .! 


డబ్బు సైన్స్ .. అంటే ఆర్థిక శాస్త్రం . 


ఒకప్పుడు వస్తు మార్పిడి వ్యవస్థ ఉండేది .

 డబ్బు లావాదేవీలు పెద్దగా ఉండేది కాదు .

 ఉన్నా...  ఆ రోజుల్లో ఇంగిత జ్ఞానం ఎక్కువ .

 పొదుపు , శక్తికి మించి అప్పు చేయకపోవడం...  లాంటి ఎన్నో విషయాలు పెద్దలు తమ ఇంటిలోని యువకులకు చెప్పేవారు . 


రాను రాను కరెన్సీ లావాదేవీలు పెరిగాయి . దాన్ని దాటి డిజిటల్ లావాదేవీల స్టేజి  వచ్చేసింది . 

ఎకనమిక్స్ . తొమ్మిదో తరగతి వరకు దీని ప్రస్తావన ఉండదు . అటు పై  పదవ తరగతి దాకా అంటే  కేవలం రెండేళ్లు .. అదీ మూడో నాలుగో ఆర్థిక శాస్త్ర పాఠాలు. అదీ దైనందిన జీవితం తో సంబంధం లేని థియరిటికల్ పాఠాలు .

 అటు పై కాలేజీ చదువుల్లో ఆర్థిక శాస్త్రం తీసుకొనే వారు కరువయ్యారు .  


చదివేది బతకడం కోసం .

 బతకాలంటే డబ్బుండాలి { కేవలం డబ్బుంటే చాలదు . అది వేరే కోణం }.

 ఆ డబ్బును ఎలా మానేజ్ చెయ్యాలో తెలియక , ఏటా కొన్ని లక్షల బతుకులు తెల్లారిపోతున్నాయి .


బతకడం నేర్పని చదువులు . 

డబ్బు శాస్త్రం నేర్వని బతుకులు . 


క్రెడిట్ కార్డు వుంది కదా అని సంపాదించబోయే డబ్బును ముందుగానే  లెక్కకు మించి  ఖర్చు పెట్టి ఆనక అంగలార్చే జీవులు కోట్లలో .

 అమెరికా కో...  ఆస్ట్రేలియా కో ... ఎక్కడికి పోయినా ఒకటే తీరు  .


కారు , ఇల్లు క్రెడిట్ పై కొనేసి అటు పై జీవితాంతం EMI   చెల్లిస్తూ బతకడం  . 

ఉద్యోగం స్థిరంగా ఉండి EMI   చెల్లిస్తే తప్పేంటి ? అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కదా ? అని ఎవరైనా ప్రశించవచ్చు .

 నిజమే .

 కానీ కొలువు  పొతే ?

 పిల్లలు స్కూల్  లో ఉన్నంత  వరకు ఫరవాలేదు. 

అటుపై వారి కాలేజీ ఫీజ్ లు ఒక పక్క .. ఎప్పుడో కొన్న ఇంటి EMI   మరో పక్క . 

ఒకటికి రెండు కొలువులు చేస్తూ తాము ఇంటిని కొన్నామో ... ఇల్లే తమ జీవితాన్ని కొనేసిందో...  అర్థం కాక మధన పడే దూరతీరాల జీవులెందరో . 


అందరికోసం కొన్ని డబ్బు శాస్త్ర పాఠాలు .   

👇👇👇👇


1 . ఇంటి అద్దె , పచారీ సరుకుల ఖర్చు , బట్టలు , వాటర్ బిల్,  పెట్రోల్ బిల్...  లాంటి నెలవారీ ఇంటి ఖర్చులు .. ఇలాంటివి  ఒక లెక్క . ఇలాంటి ఖర్చుల కోసం మీరు అప్పు చేస్తున్నారు అంటే ప్రమాదం  అంచుల్లో ఉన్నట్టే . 

 ఎందుకు అప్పు చెయ్యాల్సి వస్తోంది ?  ఆదాయాన్ని పెంచుకోలేరా ? ఖర్చుల్ని తగ్గించుకోలేరా ? ఆలోచించండి . ఇలాంటి నెలసరి ఖర్చులకు { రెవిన్యూ వ్యయం } అప్పు చేస్తే దాన్ని ఎలా తీరుస్తారు ? తీసుకొన్న అప్పు ఇంతింతై రేపు ఉరితాడుగా మారే ప్రమాదముంది .  నేడు అప్పు చేసి పప్పు కూడు తింటే..   రేపు ? జైలా ? మరణమా? 


2 . చెల్లి / కూతురు లేదా ఇంట్లో మరొకరి పెళ్లి . పెళ్ళికి అప్పు చెయ్యాలా ? నలుగురికీ ఆడంబరంగా కనిపించి రేపు చిక్కుల్లో ఇరుక్కుంటారా ? ఉన్నంతలో పెళ్లి చేయలేరా ? 

గద్ద చాలా పైకి  ఎగిరిందని   కోడి ఆ పని  చేస్తుందా ? కుక్క ఎగిరే ప్రయత్నం చేయడం చూసారా  ?


  తమ  లిమిట్ వాటికి  తెలుసు .

 మనుషులై పుట్టిన మనకు కనీసం వాటి స్థాయి ఇంగిత జ్ఞానం   లేక పోతే  ఎలా ?


౩. డబ్బుని పాతి పెడితే చెట్టు మెలిసి , డబ్బు  కాయలు కాస్తుందా ?

 డబ్బు డబ్బు  ను సృష్టించాలి అంటే పని చెయ్యాలి .

 ఎవరో డబ్బు ఆధారంగా పని చెయ్యాలి . 

అంటే డబ్బు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది .

   


 మనం బ్యాంకుల్లో డబ్బు ను  రికరింగ్ ... సేవింగ్స్ అకౌంట్స్ రూపం లో డిపాజిట్ చేస్తాము . బ్యాంకు వారికి ఆదాయం   ఎలా వస్తుంది ?  వారు కరెన్సీ నోట్లను విత్తనాల్లా పాటి పెడతారా ఏంది  ? 

మనకు వారు,  ఎలా వడ్డీ  ఇవ్వగలుగుతున్నారు . 


మనకు బ్యాంకు ఏడు శాతం వడ్డీ ఇస్తుంది అనుకొందాము . మనం జమ చేసిన డబ్బును వారు  వేరే వారికి అప్పులిస్తారు  . వారి వద్ద నుంచి 13 - 14  శాతం  వడ్డీ వసూలు చేస్తారు . తేడా ...  జీతాలు అద్దెలు లాంటి ఖర్చులకు సరిపోతుంది . ఇంకాస్త మిగిలితే  బ్యాంకు కు లాభం . అదీ లెక్క . 

బ్యాంకు నుంచి 14  శాతం  ఇంటరెస్ట్ కు అప్పు తీసుకొన్న వారు ఏమి చేస్తారు ? చాలా మటుకు ఇలా అప్పు తీసుకొనే వారు దాన్ని వ్యాపారానికి పెట్టుబడిగా పెడుతారు . 


పై ఉదాహరణలో పాత బస్తీ వడ్డీ  వ్యాపారి నూటికి నెలకు పది రూపాయిలు వడ్డీ .. అంటే బ్యాంకు లెక్కలో చెప్పాలంటే 120  శాతం వడ్డీ  . ప్రైవేట్ వడ్డీ  వ్యాపారులు 120  శాతం .. పోనీ తక్కువంటే నూటికి నెలకు అయిదు రూపాయిలు అంటే 60  శాతం .. ఇంకా తక్కువంటే నాయుడప్ప ఫైనాన్స్ కంపెనీ చెల్లించినట్టు నూటికి నెలకు రెండు రూపాయిలు అంటే 24  శాతం ..


 బయట వడ్డీ రేట్లు ఇలా ఉంటే   బ్యాంకు లు కేవలం 14  శాతానికే అప్పులిస్తున్నాయి . ఎందుకు ?

 వారికి పిచ్చా? వెర్రా ?


మన దేశం లో...  ఆ మాటకొస్తే ప్రపంచం లో పది శాతం ప్రాఫిట్ వస్తే అది గొప్ప బిజినెస్ కింద లెక్క . కనీసం పది శాతం ప్రాఫిట్ రాకుండా కునారిల్లే వ్యాపారాలు ఎన్నో . అరుదుగా 20  శాతం  లాభాలు . మహా అరుదుగా ముప్పై ఆరు శాతం .


ఇప్పుడు ఆలోచించండి . నాయుడప్ప ఫైనాన్స్  సామ్రాజ్యం ఎందుకు కుప్ప కూలింది ?

తన కంపెనీ లో పెట్టుబడి పెట్టే వారికి ఆయన 24  శాతం ఇచ్చేవాడు . అంటే ఆయన కంపెనీ కి కనీసం 36  శాతం రాబడి ఉండాలి . 

  36  శాతం లాభాలు వచ్చే కంపెనీ లు ఎన్ని ? ఏదో ఇన్ఫోసిస్ లాంటి సంస్థ . అదీ అప్పుడప్పుడు . వారు నాయుడప్ప దగ్గర అప్పు చేయరు .

    నాయుడప్ప రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాడు . మహా అంటే రియల్ ఏస్టేట్ర్ ఐదేళ్లకు డబల్ అవుతుంది . అంటే 20  శాతం ఇంటరెస్ట్ .

   నాయుడప్ప కు రియల్ ఎస్టేట్ సజావుగా సాగితే వచ్చేది 20  శాతం . ఆయన జనాలకు ఇవ్వాల్సింది 24  శాతం . అంటే ఆయన ఫైనాన్స్ వ్యాపారం గర్భం లోనే మరణించిన శిశువు . ఫండమెంటల్స్ సరిగా లేవు . ఏదో కొన్నాళ్ళు...  వస్తున్న డబ్బుతో  రొటేట్  చేసి బాగుందనిపించాడు .


    ఆర్థిక శాస్త్రం చదివిన అరవింద రావు ఒక పెన్ను పేపర్ తీసుకొని లెక్కవేసుంటే ఇది మృత శిశువు అని అర్థం అయిపోయివుండేది . కానీ నలుగురితో  నారాయణ మెంటాలిటీ . అందరూ వేసుకున్నారని కరోనా వాక్ సీన్ వేసుకొని కీర్తి శేషులైన ఎంతో మంది ని చూసాము   .


   కృషి బ్యాంకు మసై పోవడానికి ,  చార్మినార్ బ్యాంకు మూసి వరదల్లో కొట్టుకొని పోవడానికి,  ఏటేటా ప్రతి కాలనీ లో ఎన్నో ఫైనాన్స్  కంపెనీ లు దివాళా తీసిపోవడానికి ... కారణం ఇదే .

  గుర్తు పెట్టుకోండి . నూటికి నెలకు మహా అంటే 18  శాతం ..

   ఆరోగ్యం బాగాలేదు .. వెంటనే  ఆసుపత్రికి డబ్బులు కావాలి లాంటి ఎమర్జెన్సీ లో  24  శాతం .. అంతకు మించి ఎక్కువ వడ్డీ  కి మీరు అప్పు తీసుకొంటే  మీ గొయ్యి మీరే తవ్వుకొన్నట్టే .

   అదే విధంగా  24  శాతం అంతకంటే ఎక్కువ వడ్డీ  ఇస్తాము అని చెప్పే నాయుడప్ప ఫైనాన్స్ లాంటి సంస్థల్లో మీరు డిపాజిట్ చేస్తే మీ డబ్బులకు మీరు తిలోదకాలు ఇచ్చుకొన్నట్టే ! 


అప్పు లేనిదే అమెరికా కైనా తెల్లారదు . నిజమే .


 కానీ తీసుకొనే మొత్తం ఎంత ? 

దానికి మీరు చెల్లించే వడ్డీ ఎంత ? 

 తీసుకొన్న అప్పుతో మీరు ఏదయినా సంపదను సృష్టిస్తున్నారా?కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ } . అయితే ఏంటది ?

 వచ్చే లాభాలు ఎంత ? 

రిస్క్ ఎంత ? 

నష్టాలు వస్తే వాటిని ఎలా భరిస్తారు ?

 బ్యాంకు లు కొల్లేటరల్ లేకుండా  సాధారణ జనానికి  అప్పుఇవ్వవు .   బిజినెస్ లో నష్టం వస్తే ఆ ఆస్తిని ని అమ్మి వారు సొమ్ము రాబట్టుకొంటారు . 

అదే రీతిలో మీ అంత మీరు లెక్క పెట్టుకోవాలి . పెట్టిన పెట్టుబడి ఎంత రాబడినిస్తుంది . లెక్క తప్పైతే ఏంటి ?  అని 


ఇంకా ఎన్నో వున్నాయి .. అన్నీ ఒకే క్లాసులో{ ఒకే పోస్ట్ లో }  అయిపోవాలంటే ఎలా ?   

అప్పుడప్పుడు .. పోస్టు చేస్తూనే వుంటాను . 

చదవండి .

 ఒకటికి రెండు మూడు సార్లు చదవండి . 

చదివి అర్థం చేసుకోండి . 

నలుగురికీ పంచండి .

 ఎందుకంటే సరైన విజ్ఞానమే .. సంతోషకర జీవితాన్నిస్తుంది .

హైదరాబాద్ విమోచనం

 హైదరాబాద్ విమోచనం నాటకం || సమర్పణ  ఇతిహాస సంకలన సమితి,భాగ్యనగర్.



7వ నిజాం దర్బారు 

https://youtu.be/H2tagcB7vik


గోల్కొండ దర్బారు 

https://youtu.be/51YvM_Y0r_w


జనగాంలో బ్రాహ్మణుల హత్య 

https://youtu.be/NPal1ETROi8


మొగిలయ్య గౌడ్ త్యాగం

https://youtu.be/jaGuJ032qXg


షోయబుల్లా ఖాన్ హత్య

https://youtu.be/f6JFAD1hR5E


ఉద్యమ చైతన్యం - సామాన్యుల ఆక్రందన

https://youtu.be/tdZK3z0INhU


మద్రాసు ముఖ్యమంత్రి మీటింగ్

https://youtu.be/8aRLduHLl9g


నిర్ణాయక శక్తి సర్దార్ పటేల్

https://youtu.be/dLKWLIZQ9vE


అయిదు రోజుల యుధ్ధం 

https://youtu.be/TuEVG9f_o60


*Sep 17 హైదరాబాద్ విమోచనం నాటకం సీన్ 5* 

*ఉద్యమ చైతన్యం - సామాన్యుల ఆక్రందన* 


🛕దేశభక్తి కి పన్ను, పూజ కి పన్ను, ఆచారాలకి పన్ను, ఏదో ఒక tax

⛓️లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు, అవమానాలు, 

✒️నైజాం సృష్టించిన మారణకాండ 

🚩స్వామి రామానంద తీర్థ నాయకత్వం

🪓ఆర్యసమాజం నాయకత్వంలో సత్యగ్రహాలు, తిరుగుబాటు


https://youtu.be/tdZK3z0INhU 


మీరు చూడండి. ఇతరులకి ఫార్వర్డ్ చేయండి 


*భాగ్యనగర్ ఇతిహాస సంకలన సమితి*

*భారత్ మాతాకీ జై* 🇮🇳

చంద్రయాన్-3

 చంద్రయాన్-3 


సాంఘిక మాధ్యమం ఫేస్బుక్లో Chandrayan-3 విజయాన్ని వారి చాచా నెహ్రు కి కట్డబెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఈ మూర్ఖులకు తెలియని ఏమిటంటే నెహ్రూ 1964 లో చనిపోయాడు. ISRO 1969 లో స్థాపించబడింది. " ఇదేమిట్రా బాబు పోయినాడు ISRO ఎలా స్థాపించగలడు? ఈ ప్రశ్నకు సమాధానంగా " అహ ! అప్పుడు ISRO అనే పేరులేదు. వేరే పేరుతో ఉండేది.  అయినా దానికి స్థలం 4 వేల ఎకరాలు దానం చేసింది మైసూర్ మహారాజ. ఆ మహారాజును ఒప్పించింది జనసంఘ్ మహానేత దీన దయాల్ మహారాజు కదా! స్టాంపు డ్యూటీ Exemption ఇవ్వాలని దీన్ దయాల్ వ్రాస్తే " ఆకలితో అలమటించే వారికి ఇస్తాను గాని ప్రజల సొమ్మును వ్యర్ధంగా ఖర్చు చేయను అన్న నెహ్రు , తన సిగార్లకు, బట్టలకు ఏకంగా విమానాలే వాడుకున్నాడు ఆయన ఏ విధంగా ఈరోజు సాధించిన ఘన విజయానికి ' విజనరీ " ఎలా అవుతాడు. పెట్రోల్ ఖర్చుకు డబ్బులేక సైకిల్ మీద మొదటి రాకెట్ నున శాస్త్రజ్ఞులు తరలించిన వైనం కదా మన చాచా నెహ్రూ విజన్ !! ఎందుకండీ చరిత్రను వక్రీకరిస్తారు.

అమ్మా..... అన్నీ నీవే ౹౹*

 🙏🌹🌹🌹🕉️🕉️🌹🌹🌹🙏

*మాతృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ!!* 

             *అమ్మా..... అన్నీ నీవే ౹౹*


భవానీ అష్టకంలో అమ్మ గురించి, ఆమె గొప్పతనం గురించి, ఆమె అమృతమయమైన ప్రేమ గురించి ఎంతో గొప్ప వర్ణనలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని శ్లోకాలు..


న తాతో న మాతో న బన్ధు ర్న దాతా

న పుత్రో న పుత్రీ నభృత్యో న భర్తా

న జాయా న విద్యా న వృత్తి ర్మ మైవ

గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవాని


‘‘అమ్మా! ఓ భవానీ! నాకు తల్లిగానీ, తండ్రిగానీ, కొడుకు గానీ, కూతురుగానీ, యజమాని గాని, సేవకుడుగాని, భార్యగాని, బంధువుగాని, విద్యగాని, వృత్తిగాని ఏదియు లేదు. కేవలం నీవే నాకు దిక్కు. నాకు దిక్కు’’.


భవాబ్దావసారే మహాదు:ఖ బీరు

పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్త

కుసంసార పాశప్రబద్ధ సదాహం

గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవానీ


అమ్మా! భవానీ! కామాంధుడనై, లోభినై, మత్తుడనై, జన్మ పాశబద్ధుడనై, భరించలేని దు:ఖంతో మిక్కిలి భయాన్వితుడనై సంసార సాగరమున మునిగిపోయాను. తల్లీ! నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేరు. నీవే దిక్కు.


న జానామి దానం న చ ధ్యాన యోగం

న జానామి యంత్రం న చ స్తోత్ర యంత్రం

న జానామి పూజాం న చ న్యాస యోగం

గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవానీ


అమ్మా! భవానీ! దానము, ధ్యానము, మంత్రము, యంత్రము, పూజ- పునస్కారము, న్యాసము, యోగము.. ఇవేవీ నాకు తెలియవు. తల్లీ నీవు తప్ప నాకెవరూ దిక్కు లేరు. నీవే దిక్కు.


న జానామి పుణ్యం న జానామి తీర్థం

న జానామి ముక్తిం లయం వా కదాచిత్‍

న జానామి భక్తిం వ్రతం వాపి మాత

గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవానీ


అమ్మా! భవానీ! పుణ్యకార్యము లేదు. తీర్థసేవ లేదు. మోక్షోపాయము తెలియదు. జన్మరాహిత్యము తెలియదు. భక్తి మార్గము తెలియదు. ఏ వ్రతములు తెలియవు. తల్లీ నీవు తప్ప నాకెవరు దిక్కు లేరు. నీవే దిక్కు.


కుకర్మీ కు సంగీ కు బుద్ధి కు దాస

కు లాదారహీన కదా దారహీన

కుదృష్టి కు వాక్యప్రబంధ సదాహం

గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని


తల్లీ! దుష్కర్మాచరణము, చెడు సాంగత్యము, దుర్బుద్ధులు, దుష్టసేవకజనము, కులాచారహీనత్వం, దురాచార తత్పరత, చెడు ఆలోచనలు, చెడ్డమాటలు మాట్లాడటం ఇవి నా లక్షణములు. అందుచేత నీవు తప్ప నన్ను ఉద్ధరించుటకు వేరే దిక్కులేదు.


మనం అందరిలో లోపాలు వెతుకుతాం. కానీ, మనలో ఎన్ని లోపాలు ఉన్నా మనల్ని మనల్నిగా ప్రేమించేది ఈ సృష్టిలో అమ్మ ఒక్కటే.

మాతృదేవోభవ


ఈ సృష్టికి అమ్మ ఒక్కతే. స్త్రీలందరిలోనూ అమ్మను చూడాలన్నారు పెద్దలు. మరి కుమార శతకంలో ‘పంచమాతలు’ గురించి వర్ణించారు. అంటే ప్రధానంగా ఐదుగురిని అమ్మగా ఎంచి పూజించాలని ఈ శతకంలో చెప్పారు.


ధరణీ నాయకు రాణియు గురు రాణియు నన్నరాణి కుతకాంతను గన్న రమణి దనుగన్న దియును ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా

రాజు భార్య (రాణి), అన్న భార్య (వదిన), గురుని భార్య (గురుపత్ని), భార్య తల్లి (అత్త), కన్న తల్లి (మాతృమూర్తి).. ఈ ఐదుగురిని పంచమాతలుగా భావించాలి. ఆదిశంకరుల వారిని పెంచి పెద్ద చేసింది తల్లే. ఆయనకు తన మాతృమూర్తితో అల్లుకున్న బంధం ఎంతో గొప్పది. అందుకే ఒక సందర్భంలో ఆయన ఇలా చెప్పారు-


"కుపుత్రోజాయేత క్వచిదపి కు మాతా న భవతి"

‘పుత్రుడు చెడ్డవాడైనా, తల్లి చెడ్డది కాబోదు’ అని పై శ్లోకానికి తాత్పర్యం.


ఇక, సుమతీ శతకకారుడు అమ్మ గురించి ఏమన్నారో చదవండి..


ఇమ్ముగ జదువని నోరును

అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్‍

దమ్ముల బిలువని నోరును

గుమ్మరిమను దవ్వినట్టి గుంటర సుమతీ!


‘ఇంపుగా పఠింపని నోరె••, అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరు, తమ్ముడూ అని పిలవని నోరు, కుమ్మరివాడు మన్ను తవ్విన గోయితో సమాన’మని పై సుమతీ శతకానికి భావం. అమ్మ గురించి ఇంకా ఎందరో మహానుభావులు ఇంకా ఎంతో గొప్పగా చెప్పారు. అమ్మ గురించి, ఆమె దయామయత్వం గురించి చెప్పడానికి, వర్ణించడానికి ప్రపంచంలో ఉన్న భాషలు కూడా సరిపోవు.🙏🪷

మాతృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవ

🙏🌹🌹🌹🕉️🕉️🌹🌹🌹🙏

శ్రీ కాళహస్తీశ్వర శతకం - 75

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*



శ్రీ కాళహస్తీశ్వర శతకం  - 75



పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే

లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనంటే లాలింపరే తల్లిదండ్రులపు డట్లే తెచ్చి  వాత్సల్య లక్ష్మీలీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా!


తాత్పర్యం:



శ్రీ కాళహస్తీశ్వరా! 

లోకములో తల్లిదండ్రులు తమ పిల్లలను పాపా! పాపడా నీకు పాలను అన్నమును పెట్టెదను తినుము.


లెమ్మని లాలించి పిలువగా ఆ పిల్లలు గారాబము పోవుచు ’నాకు అరటి పండ్లు కూడ కావలె’ నన్న వెంటనే ఆ తల్లిదండ్రులు వాత్సల్య విశేషములతో అరటి పండ్లు తెచ్చి యిచ్చెదరు లేదా మరియొక విధముగ సముదాయించి బువ్వ తినిపించెదరు. 


అట్లే నీవును వాత్సల్యలక్ష్మీ లీలా విలాసములను నాయందు ప్రసరింపచేసి నాకును ఇహపర సుఖములని అనుభవింపజేయుమా....



ఓం నమః శివాయ



🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

శుక్రగ్రహ జననం - 2*

 *నవగ్రహ పురాణం - 35 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷



*శుక్రగ్రహ జననం - 2*



త్రిమూర్తుల సన్నిధిలో పులోమ పుత్రుడి నామకరణోత్సవం జరిగింది. బాలునికి 'ఉశనుడు' అని నామకరణం చేశాడు భృగుమహర్షి.


*"కుమారా ! నీ కుమారుడు కారణజన్ముడు ! దైవికమైన ఆ కారణమే - తనకు ఎలాంటి పుత్రుడు కావాలో నీ అర్ధాంగి పులోమ నోట పలికించింది !"* బ్రహ్మ అన్నాడు. భృగుడితో.


*"భృగూ ! భవిష్యత్తులో ఉశనుడు నవగ్రహాలలో ఒకడుగా అభిషిక్తుడవుతాడు. అందరికీ ఆరాధ్యుడవుతాడు."* అన్నాడు శ్రీమహావిష్ణువు.


*"ఉశనుడికి శాస్త్రబోధ చక్కగా జరగాలి సుమా !”* శివుడు అందుకుంటూ అన్నాడు. *"జపవిధానం , తపోవిధానం , ధ్యాననిష్ఠా ఉశనుడికి కరతలామలకాలుగా చేయాలి నువ్వు"*


*"ఆజ్ఞ !"* భృగువు చేతులు జోడిస్తూ అన్నాడు..


*"దేవదేవులైన మీ ఆశీస్సులే నా బిడ్డడిని అద్వితీయుడిగా రూపొందిస్తాయి. ఈ భృగువు నిమిత్తమాత్రుడు!"*


*"పులోమా ! నీ పుత్రుడు నీ ఆశయాలను నెరవేరుస్తాడు"* విష్ణువు పులోమతో అన్నాడు.


*“ఆ సాధ్వీమణి కలలు కన్నది ; కావలసిన పుత్రుణ్ని కన్నది !”* నారదుడు నవ్వుతూ అన్నాడు.


అందరూ నవ్వారు.


సకాలంలో బాల ఉశనుడికి విద్యాభ్యాసం ప్రారంభించిన భృగుమహర్షి - కుర్రవాడి ధారణ శక్తికి అబ్బుర పడిపోయాడు.


తండ్రి బోధించే విషయాలను అవగాహన చేసుకోవడంతో తృప్తిచెందని ఉశనుడు , తనలో ఉద్భవించే రకరకాల సందేహాలను ప్రశ్నల రూపంలో అడుగుతూ - సమాధానాలు తెలుసుకుంటూ , ఇతోధికంగా విషయ గ్రహణం చేయసాగాడు.


భృగుమహర్షి ఆశ్రమంలో లేని సమయాల్లో , ఉశనుడు తనతోపాటు పూలమొక్కల మధ్య , ఫలవృక్షాల మధ్య తిరుగాడే సమయాల్లో - పులోమ అతనికి దేవరాక్షసుల మధ్య నెలకొన్న విరోధం గురించీ , త్రిమూర్తుల సహాయ సహకారాలతో దాయాదులైన అసురులకు దేవతలు కలిగిస్తున్న కష్టాల గురించి వివరించసాగింది. రానురాను , పులోమ బోధనల వల్ల రాక్షసకులం నిస్సహాయంగా దేవతల వల్ల పీడనకు గురి అవుతోందన్న భావం బాలఉశనుడిలో వేళ్ళు తన్నుకోసాగింది. వయసుతోబాటు అసురులు పట్ల ఉశనుడిలో సానుభూతి కూడా పెరగసాగింది.


నూనూగు మీసాల వయసు వచ్చేసరికి ఉశనుడి విద్యాభ్యాసం ముగిసింది. తల్లిదండ్రులను సేవిస్తూ , తండ్రివద్ద తపస్సమాధి శిల్పాన్ని నేర్చుకుంటూ , తన వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకుంటున్నాడు ఉశనుడు.


అన్నలకూ , ఉశనుడికీ మధ్య మాటతీరులో , ప్రవర్తనలో ఉన్న భేదాన్ని విశ్లేణాత్మకంగా గమనిస్తున్న పులోమ తాను ఆశించిన , కలలుగన్న లక్షణాలన్నీ ఉశనుడిలో వున్నాయన్న సత్యాన్ని గ్రహించి , ఆనందంలో మునిగిపోయింది.


రాక్షసరాజు వృషపర్వుడు సభలో కొలువుదీరి వున్నాడు. దేవతల గురించి చారులు విన్నవిస్తున్న విషయాలను ఆసక్తిగా ఆలకిస్తున్నాడు.


భటుడు దగ్గరగా వచ్చి , తలవంచి నమస్కరించాడు. *"రాక్షసచక్రవర్తికి జయం ! ప్రభూ , నారదమహర్షి వచ్చి కొలువు కూటం ముందున్నారు. ప్రవేశపెట్టమని సెలవా ?”*


*"ఊ ! వద్దంటే , తిరిగి వెళ్తాడా , ఆ మాటకారి ? ప్రవేశపెట్టు !"* వృషపర్వుడు విసుగ్గా అన్నాడు.


*“ఆ నారదుడు వెళ్ళిపోయాక... విన్నవించుకో , శూర్పకర్ణా !"* అన్నాడు చారుడితో.. 


*"నారాయణ ! నారాయణ !"* అంటూ ప్రవేశించాడు నారదుడు.


*"ప్రణామాలు, నారదమునీ !”* వృషపర్వుడు సింహాసనం మీంచి లేవకుండానే , చేతులు జోడించకుండానే అన్నాడు. 


*"నారాయణార్పణం !"* నారదుడు అప్రయత్నంగా అన్నాడు.


*"అది మా అసురవీరులను అవమానించే మాట , నారదా !"* వృషపర్వుడు గంభీరంగా అన్నాడు. *"ఆ నారాయణుడో , ఏ నారాయణుడో - మాకు ఆగర్భశత్రువని నీకు తెలియదా ?"*


*"ఓహ్... తెలిసింది...” నారదుడు నాలుక కరచుకున్నట్టు నటిస్తూ అన్నాడు. అలవాటు కదా , అసుర చక్రవర్తీ ! నోరు జారుతూ వుంటుంది !"*.


*"ఏమిటి నారదా , ఏదైనా విశేషం వుందా , పనిగట్టుకుని వచ్చారు !"* వృషపర్వుడు నవ్వుతూ అన్నాడు , తన సమీపంలో ఆసనం మీద కూర్చున్న నారదుణ్ని చూస్తూ. 


*"విశేషం ఏముంటుంది , రాక్షసేంద్రా ! నా కార్యక్రమం తెలిసిందే కద ! విషయ సేకరణ , విషయ విస్తరణ , విషయ వితరణ ! ఈ నిత్యసంచారి నిత్యకృత్యం ఇవేకదా వృషపర్వా !"* నారదుడు నవ్వుతూ అన్నాడు.


*“ఇప్పుడు - ఇక్కడికెందుకు దయచేసినట్లు ? సేకరణకా ?"* వృషపర్వుడు నవ్వుతూ

అడిగాడు.


*"అన్నింటికీ కలిపి అనుకోరాదా?”* నారదుడు నవ్వాడు.


*"ఆ విధంగా అపార్ధం చేసుకోలేంలే నారదా ! విషయ సేకరణకూ , విస్తరణకూ మాత్రమే వచ్చి వుంటావు ! నువ్వు - నిత్యమూ నీ నోట్లో నానే వ్యక్తిలాగా - సురపక్షపాతివే కదా !"*


*"సరే ! విషయ వితరణం చేసి , మీ అభిప్రాయం తప్పు అని నిరూపిస్తాను”* నారదుడు నవ్వుతూ అన్నాడు. *“విషయం ఏమిటంటే... ఇంద్రుడు - అంగిరసపుత్రుడు బృహస్పతిని దేవతల గురువుగా , మంత్రాంగం నెరిపే నేర్పరిగా , వ్యూహ కర్తగా నియమించుకున్నాడు...”*


వృషపర్వుడి గుబురు కనుబొమలు మధ్యలో కలుసుకుని , ముడిపడ్డాయి. *"బృహస్పతినా ? అంత తెలివైన వాడా , ఆ ఋషి పుత్రుడు ?”*

🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 🌸 *అథ ద్వితీయోధ్యాయః 🌸* *🌸 సాంఖ్య యోగః 🌸*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️* 

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

🌸 *అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 


 *2-అధ్యాయం, 7వ శ్లోకం*


 *కార్పణ్య దోషోపహతస్వభావః  పృచ్ఛామి త్వాం ధర్మసమ్ము ఢచేతాః I* 

 *యచ్చ్రేయః  స్యాన్నిశ్చితం భ్రూహి తన్మే శిష్యస్తే హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ || 7* 


 *ప్రతిపదార్థం* 


 కార్పన్య దోషోప=  పిరికితనమనేడి దోషమునకు లోనైన స్వభావము కలిగినవాడై ; ధర్మ సమ్మూఢ ఛేతాః త్వామ్ = ధర్మ విషయం నా మూఢచిత్తుడనై నిన్ను ;పృచ్చామి = అడుగుచున్నాను; యత్ = ఏ ( ఏ సాధన ); నిశ్చితమ్ = నిశ్చయముగా ; శ్రేయః, స్యాత్ = మేలు అగునో ? ; తత్ = దానిని ; మే = నాకు; బ్రూహి = తెలుపుము ; అహం = ( ఏలననా ) నేను ; తే = నీకు; శిష్య: = శిష్యడ ను ' త్వామ్ = నిన్ను; ప్రపన్నమ్ = శరణు పొందిన వాడను ; మామ్ = (కనుక) నన్ను (నాకు);శాధి = ఉపదేశింపుము ;


 *తాత్పర్యము* 


 కార్పన్య దోషము (పిరికితనము )నకు లోనైన నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నాకర్తవ్యమును నిర్ణయించుకున్న లేకున్నాను.నాకు నిజముగా శ్రేయస్కారమైన దానిని తెలుపుము.నేను నీకు శిష్యుడను.శరణాగతుడను, ఉపదేశింపుము.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

రామాయణమ్ 303

 రామాయణమ్ 303

...

మహారాజా వాడెవడో భయంకర రూపముతో ఉన్న వానరుడు అశోకవనమును ధ్వంసము చేసి అడ్డు వచ్చిన వారిని అరచేతితోనే చావమోది చంపేశాడు.వాడు అంతకు మునుపు సీతతో మాటలాడినాడు ప్రభూ!.

.

వానికి నీవు భయంకరమైన దండన విధింపుము.

.

రాక్షస్త్రీల మాటలు వినగానే రావణుడి నేత్రాంచలములనుండి ,మంటతో కూడిన దీపములనుండి వేడివేడి నూనెబిందువులు కారినట్లు, కన్నీటిబిందువులు రాలెను .

.

మండుచున్న అగ్నిహోత్రము వలే ఎర్రనైన కన్నులు మరింత పెద్దవి చేసి  ధూర్తవానరుని పట్టుకొనుడు అనుచు ఎనభైవేల మంది శూరులైన కింకరులను ఆజ్ఞాపించెను.

.

ప్రభువాజ్ఞ అయిన వెంటనే వివిధ ఆయుధములతో వారు హనుమంతుని పైకి యుద్ధమునకు బయల్వెడలిరి.

.

మిడతలదండు అగ్నివైపు దూకినట్లుగా వారంతా ఆ మహాబలుడి మీదకు దూసుకుంటూ పోసాగిరి.

.

వారిని చూడగనే సమరోత్సాహముతో తోకను నేలపై విసరికొట్టి దేహము ఇంకా పెద్దది చేసి లంకా నగరము ప్రతిధ్వనించునట్లుగా జబ్బలు చరచి  నిలబడెను.

.

ఆ ధ్వనికి పక్షులు రాలిక్రింద పడిపోయెను.

.

శ్రీరామ చంద్రునకు జయము అంటూ జయఘోషలు చేయసాగెను.

.

వూటుకూరు జానకిరామారావు

ఆగస్టు 25, 2023* రాశి ఫలాలు🌹

 .       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*శుక్రవారం, ఆగస్టు 25, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*నిజ శ్రావణ మాసం - శుక్ల పక్షం*

*తిధి*      :  *నవమి రా8.26* వరకు 


.                *🌹రాశి ఫలాలు🌹* 

 

*మేషం*


సన్నిహితులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి.

---------------------------------------

*వృషభం*


చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటాబయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

---------------------------------------

*మిధునం*


వృత్తి వ్యాపారాలలో సొంత  ఆలోచనలు అమలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమునకు ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగి హోదాలు పెరుగుతాయి.

---------------------------------------

*కర్కాటకం*


ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.  ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం తప్పదు.

---------------------------------------

*సింహం*


స్నేహితులు మీ మాటతో విబేదిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలలో మార్గ  అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది.  ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. 

---------------------------------------

*కన్య*


ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.  ఇంటా బయట కొన్ని సమస్యలు సన్నిహితుల సాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో  అనుకున్న లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు.

---------------------------------------

*తుల*


ఆదాయం మరింత  నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన  వ్యవహారాల్లో చికాకులు తప్పవు. కొందరి ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు.

---------------------------------------

*వృశ్చికం*


ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందుతాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాల్లో  అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

*ధనస్సు*


మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

*మకరం*


 ధార్మిక  సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో  ముందుకు సాగుతారు. సమాజంలో  పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన  కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. 

---------------------------------------

*కుంభం*


సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో  స్థిరాస్తి  విషయాలలో నూతన ఒప్పందం చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన  ఉద్యోగ, వివాహయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

*మీనం*


సన్నిహితులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో పునరాలోచన చేయడం మంచిది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఇంటా బయట  పరిస్థితులు అనుకూలించవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో   వివాదాలు తప్పవు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻,


*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 21*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 21*


ఆత్మవిచారణ


తర్వాతి అర్హత స్వాధ్యాయం. చదువు, మంత్రజపం అని సామాన్యంగా దీనికి అర్థం చెప్పుకొంటారు. కాని దీని విశేషార్థం, 'తనను అధ్యయనం చేసుకోవడం' (స్వ+అధ్యయనం). అంటే ఆత్మ విచారణ అని అర్థం. 


ఆధ్యాత్మిక జీవితానికి మాతృమూర్తి శ్రీ శారదాదేవి దీనిని ఒక ముఖ్యమయిన నియమంగా అభివర్ణించారు. నౌకకు చుక్కానిలా ఆత్మ విచారణ సాధకునికి మార్గదర్శి వంటిదని కూడా ఆమె పేర్కొన్నారు. 


"నేనెవరిని? నా మనోవైఖరి ఏమిటి?”, “నేను దేనిని అన్వేషిస్తున్నాను?" "దానిని పొందడానికి తగిన మార్గంలోనే వెళుతున్నానా?” ఇలాంటి ప్రశ్నలను లోతుగా యోచించడం తప్పనిసరి. వీటికి జవాబులు లభించినా, లభించకపోయినా నిత్యం కొంతసేపు వీటిని గూర్చి యోచించడం ఎంతో ఆవశ్యకం.🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పండగ పూట

 నిత్యాన్వేషణ: 


"పండగ పూట పాత మొగుడేనా" ఈ సామెత సరైనదా?

పండగ పూట పాత మొగుడేనా? ఈ సామెత తప్పు…!

పండగ పూట పాత మొగుడేనా.. అనే సామెత…! ఎప్పటి నుంచో మనం విటున్నాం కదా… ఈ మాటకున్న అర్థం మీరు ఎప్పుడైనా ఆలోచించారా…? అసలు ఇంతకూ ఈ సామెత కరెక్టేనా…? ఈ సామెత మన హిందూ స్త్రీ యెుక్క గుణనమును తప్పుగా తెలిపే విధంగా అర్థాన్ని తెలపటం జరుగుతున్నది.

మన హిందూ సంప్రదాయానికి విరుద్ధమైన అర్థం ఇచ్చే విధంగా అంటే……”పండగ పూట కొత్త మొగుడు కావాలి” అన్న అర్థం వచ్చేల వుంది. ఆడవారిని కించపరిచేలా ఈ సామెత వుండడం బాధాకరం.

నిజంగా ఈ సామెత ఇలానే వుందా అని….. అనుమానం రావడంతో… దీని ఆంతర్యం కోసం చిన్న పరిశోధన ప్రయత్నం చేశాను.. అప్పుడు నాకు దొరికింది అసలైన సామెత… ఇది నిజమైన తెలుగు సాంప్రదాయ సామెత…. అదే ఈ సామెత……!!

పండగ పూట పాత మడుగేనా… మరొకసారి చదవండి, ఈ పురాతన సామెత ఇప్పుడు వెలుగు చూడడం చాలా సంతోషించదగిన విషయం. ఈ పాత సామెత అర్థం ఏమిటో మనం ఒక్క సారి చూద్దాం…!

మడుగు అంటే వస్త్రం అని అర్థం.. ‘పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ.. ఆ అర్థంలో పుట్టిన సామెత ఇది… పండగ పూట పాత బట్టలు కాదు.. కొత్త బట్టలు కట్టుకోవాలి’ అని…, అప్పటి ప్రజల స్థితిగతులు(ఆర్ధిక పరిస్థితులు) సరిగాలేని రోజులలో ఈ సామెత పుట్టుకు రావడం జరిగింది….!!

ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు… ఈ సామెతను సరైన రీతిలోనే పలుకుదాం.. పలికిద్దాం… మన హిందూ స్త్రీ గుణాన్ని కించపరిచే సామెతను మరిచిపోదాం…పండగ పూట పాత మడుగేనా అన్న పాత సామెతనే ఇక నుంచి అందరం పలుకుదాం… మన తెలుగును మనం పరిరక్షంచు కొందాం…

నవగ్రహా పురాణం🪐* . *10వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *10వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 1*


ఆశ్రమ సమీపంలోని సుందర ప్రాంతంలో అదితి తపస్సు ప్రారంభించింది. పచ్చని పరిసరంలో , ప్రశాంత వాతావరణంలో పూర్వాభిముఖంగా కూర్చున్న అదితి , అచిరకాలంలో తాను కూడా ఆ ప్రకృతిలో భాగంగా లీనమైపోయింది. అసామాన్యమైన ఏకాగ్రత ఆమెను వరించింది. ప్రణవ పూర్వకంగా శ్రీ మహావిష్ణు నామం ఆమె హృదయంలో నినదిస్తోంది.


ఆమె ధ్యాననిష్ఠ నిత్య ధ్యానంతో గడిపే కశ్యప ప్రజాపతినే అబ్బుర పరుస్తోంది. 


అనతికాలంలోనే శ్రీమహావిష్ణువు ఆమె ముందు సాక్షాత్కరించాడు. అసంకల్పితంగా అదితి కళ్ళు విచ్చుకున్నాయి.


*"పరమాత్మా ! వచ్చావా !"* అదితి ఆనంద బాష్పాలు రాలుస్తూ చేతులు జోడించింది. *"నీ ధ్యాన తరంగాలు ఏకోన్ముఖంగా నా హృదయాన్ని తాకాయి ! నన్ను నీ ముందుకు రప్పించాయి !"* విష్ణువు మందహాసం చేస్తూ అన్నాడు. *"ఏం కావాలో కోరుకో !"*


*"ఈ దీనురాలి కోరిక నీకు తెలియదా , స్వామీ !"* అదితి కంఠంలో భావావేశం తొణికింది.


*"తెలుసు ! భక్తుల కోరికలను వాళ్ళ వాక్కులలో వినడం నాకు ఇష్టం ! అడుగు అదితీ !"* శ్రీమహావిష్ణువు కంఠం ఆ ప్రశాంత వాతావరణానికే గిలిగింతలు పెట్టింది.


*"ఈర్ష్యాద్వేషాలు లేని వాడూ , సర్వుల పట్లా సమదృష్టి కలిగిన వాడూ , లోక హితం కోరే వాడు అయిన పుత్రుణ్ని ప్రసాదించు , తండ్రీ ,"* అదితి వినయంతో అడిగింది. 


విష్ణువు మొహం మీద దరహాసం మెరిసింది. *"అదితీ ! నువ్వు కోరిన వరం ప్రశంసించదగింది. ఒక్కసారి , నీ ఎదురుగా ఆకాశంలోకి చూడు !"*


అదితి ఆశ్చర్యపోతూ , అప్రయత్నంగా కళ్ళెత్తి , ఆకాశంలోకి చూసింది. 


*"ఎవరు కనిపిస్తున్నారు. నింగిలో ?"* విష్ణువు ప్రశ్న ఆమెను హెచ్చరించింది. 


"... సూర్యభగవానుడు , స్వామీ..."* అదితి సమాధానమిచ్చింది. *"ఇప్పుడు నీ ఎదురుగా వున్న పూల మొక్కనూ , ముళ్ళపొదనూ చూడు !"* విష్ణువు చిన్నగా నవ్వాడు


అదితి అసంకల్పితంగా చూసింది. పూల మొక్కా , ముళ్ల పొదా రెండూ సూర్యకాంతిలో మెరుస్తున్నాయి.


*“ఆ రెండు మొక్కల మీదా సూర్యరశ్మి సమానంగా పడుతోంది కదా !"* విష్ణువు కంఠ స్వరంలో తేనెలు కురుస్తున్నాయి.


*"అవును..."* అదితి మంత్ర ముగ్ధలా అంది.


*"సకల ప్రాణుల పట్లా , సకల చర - అచర ప్రపంచం పట్లా సమదృష్టి కలిగిన వాడూ , సర్వలోక హితం కోరే వాడూ - ఆ సూర్యుడు ! ఆ సూర్యుడే నీ పుత్రుడుగా జన్మిస్తాడు !"*


*"స్వామీ !”* అదితి కంఠం వణికింది. ఆనందబాష్పాలు ఆమె కళ్ళ ముందు మంచు తెరను పట్టుతున్నాయి.


*"ఆ సూర్యుడు ఎక్కడున్నాడో తెలుసా ?"* విష్ణువు నవ్వుతూ అన్నాడు. *"ఊర్ధ్వ లోకంలో , జ్యోతిర్మండలంలో నీకు కనిపిస్తున్న గోళాకారంలో వున్నాడు ! సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంలో - ఇదిగో - నా కుడికంటిలో వున్నాడు !"*


అదితి శరీరంలో ఏదో గగుర్పాటు.


*“చర్మ చక్షువులకు కనిపించని మహా సూక్ష్మరూపంలో నా దక్షిణ నేత్రంలోనూ , కంటికి కనిపిస్తూ , తదేకంగా చూడలేని తీక్షణ గోళాకారంలో నింగిలోనూ వున్న ఆ 'వెలుగు వేలుపు' సశరీరంగా నీ పుత్రుడుగా జన్మిస్తాడు !".*


*"స్వామీ ! స్వామీ ! నేనెంత ధన్యురాల్ని ! ఎంత అదృష్టవంతురాల్ని...”* అదితి వణికే కంఠంతో అంటోంది.


*"అవును , అదితీ ! నీవు మహాభాగ్యశాలినివి ! సకల జీవులూ , ముఖ్యంగా భూలోకంలోని మానవులూ , ఆరాధించుకోవడానికి అనువుగా జ్యోతిర్మండలాలలో కాంతి గోళాలుగా వున్న నవగ్రహాలు తేజోరూపాలతో , శరీరాలతో అవతరించాలని నేను సంకల్పించాను. నీ ద్వారా నవగ్రహాల ఆవిర్భావాలకు ఆరంభం జరుగుతుంది. నా అంశ కలిగిన సూర్యుడు నీ గర్భవాసాన జన్మిస్తాడు !"*  శ్రీ మహావిష్ణువు గంభీరంగా అన్నాడు. *"నన్ను అలరించినట్టే , ఆ సూర్యుణ్నీ నీ ధ్యానంతో అలరించు ! అఖండభక్తితో ఆరాధించు ! వరం అర్థించు !"* 


మాటలు మరిచిపోయిన అదితి వినయంగా చేతులు జోడించింది. విష్ణువు అంతర్ధానమయ్యాడు.


*"నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి, అదితీ !"* శ్రీహరి సాక్షాత్కారం గురించి భార్య చెప్పిందంతా విన్న కశ్యపుడు సంతోషంగా అన్నాడు. *"ఆ పరమ పురుషుడు ఆదేశించిన విధంగా రేపే సూర్యారాధన ప్రారంభించు !"*


అదితి సోదరీమణులు పన్నెండుగురూ చుట్టూ చేరి ఆసక్తిగా వింటున్నారు. *"అదితి అక్క అదృష్టమే అదృష్టం ! విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకుంది ! ఇప్పుడు నింగిలోని సూర్యుణ్ణి నేలకు దించి , పుత్రుడిగా పొందబోతోంది !"* వినత మెప్పుగా అంది..


దితి ఎగతాళిగా నవ్వింది. *"సంతానం కోసం అంతయాతన ఎందుకు వినతా ? తపస్సు , ధ్యానమూ అనే శ్రమ అవసరం లేకుండానే , సంతానాన్ని యిచ్చే పతిదేవుడు. కళ్ళముందే వుంటే - ఎక్కడో వున్న ఆ దేవుళ్ళెందుకు ?”*


దనూ , సింహకి , కళా పగలబడి నవ్వారు.


కశ్యపుడు , దితివైపు మందలింపుగా చూశాడు. *"నీది అజ్ఞానమూ , అవిధేయతా కలిసిన ఆలోచన దితి ! శ్రీ మహావిష్ణువు ఎవరనుకున్నావు ? నీ తండ్రి దక్ష ప్రజాపతికి , నీ నా తండ్రి మరీచి మహర్షికి జన్మనిచ్చిన ఆ సృష్టికర్తకే తండ్రి. ఆయనే సూర్యుడు ! అలాంటి దైవస్వరూపుడైన సూర్యభగవానుడి ఆరాధనను అపహాస్యం చేయడం అపచారం !".*


*"పోనీలెండి , చెల్లి , దితి అమాయకురాలు. పాపం దానికి ఏమీ తెలీదు !"* అదితి కల్పించుకుంటూ అంది.


*ఎందుకు తెలీదు తెలుసు ! ఆ మహావిష్ణువు మన తండ్రులకు తాత ; మనకు ముత్తాత ; అందుకే గదా , మునిమనుమరాలైన యీ దితి కొడుకు హిరణ్యాక్షుణ్ని వరాహరూపంతో వధించాడు. హు !"* దితి అక్కసు వెళ్ళగక్కుతూ అక్కణ్నుంచి వెళ్ళిపోయింది. వినత , కద్రువా , మునీ తప్పించి - మిగతా సోదరీమణులందరూ దితి వెంట వెళ్ళిపోయారు.


*"దితి మాటల్ని మరిచిపో అక్కా నీ సూర్యారాధన ప్రారంభించు !"* అంది వినత.


అదితి ఉపవాస దీక్షతో సూర్యారాధన ప్రారంభించింది. విష్ణువును గురించి తపస్సు చేసిన ప్రదేశంలోనే ఆమె తపోదీక్ష కొనసాగుతోంది.


రోజులు గడుస్తున్నాయి. ఏకాగ్రతలో మునిగిపోయిన అదితి తాను వున్న స్థలాన్నీ , జరుగుతున్న కాలాన్నీ , ఆకలిదప్పుల్నీ , చివరికి తన ఉనికినీ పూర్తిగా మరిచిపోయింది. ఆమె శరీరంలోని ప్రతి అణువూ సూర్యధ్యానం చేస్తోంది. తన చుట్టూ వున్నది వెలుగో , చీకటో కూడా తెలుసుకోలేని ఒక దివ్యమైన అవస్థలోకి ప్రవేశించిందామె సర్వస్వమూ !


*“అమ్మా !”*


ఏదో అంతరాళం నుంచి వినవస్తున్నట్టు , అదితి చెవులకు లీలగా వినిపించిందా పిలుపు. ఆ పిలుపులోని మాధుర్యం అదితి నిమీలిత నేత్రాలు విచ్చుకునేలా చేసింది.


*"అమ్మా...”*


అదితి హృదయంలో ఏదో అవ్యక్తానందం పరవళ్ళు తొక్కింది. కళ్ళు పెద్దవిచేసి చూసిందామె. ఎదురుగా , భూమికి అంటకుండా ఒక కాంతిగోళం కనిపించింది. ఆ కాంతిగోళం లీలగా స్పందిస్తోంది. కనిపించీ కనిపించని కదలిక అది !


*"ఎవరు ?"* అదితి కంఠం వణికింది.


*"నేనే ! సూర్యుణ్ని ! మౌనభాషతో పిలిచావుగా ! వచ్చాను"* , కాంతి గోళంలోంచి స్పష్టంగా వినిపించింది సూర్యుడి కంఠం.


*"తండ్రీ !"* ఆనందోద్రేకంతో అదితి కంఠం సన్నగా వణికింది. గగుర్పాటుతో ఆమె లతలాంటి శరీరం వణికింది.


*"వచ్చావా , తండ్రీ..."* అంది అదితి పారవశ్యంతో.


*“నాకు తల్లి కావాలనుకున్నావుగా ! అందుకే వచ్చాను ! నీ గర్భవాసాన విశ్రాంతి తీసుకుని , నీ బిడ్డగా జన్మించి , నీ వొడిలో ఆడుకుంటాను !"* సూర్యుడి మాటల్లోని మధురిమ అదితిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది !


*"అది... అది... నా అదృష్టం తండ్రీ !" "నీ స్తన్యపానంతో తుష్టినీ , పుష్టినీ పొంది , నీ వొడిలో ఆడుకోవడం నా అదృష్టమమ్మా !”*


*"నాయనా..."* అదితి కంఠం మాతృభావనతో కంపించింది. 


*"అమ్మా ! ఆశ్రమానికి వెళ్ళు ! నా రాక కోసం ఎదురు చూడు !"* కాంతి వలయం లోంచి సూర్యకంఠం పలికింది.


క్షణంలో ఆ కాంతిగోళం అదృశ్యమైంది.


అదితి రెప్పలు టపటపలాడించింది. అంత సేపూ తాను రెప్పవేయడం మరచిపోయినట్టు ఆమె గుర్తించి ఆశ్చర్యపోయింది. నరనరంలోనూ , అణువణువు లోనూ ప్రవహిస్తున్న ఆనందం అదితిని ఆశ్రమం వైపు నడిపించింది.


సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 21*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 21*


ఆత్మవిచారణ


తర్వాతి అర్హత స్వాధ్యాయం. చదువు, మంత్రజపం అని సామాన్యంగా దీనికి అర్థం చెప్పుకొంటారు. కాని దీని విశేషార్థం, 'తనను అధ్యయనం చేసుకోవడం' (స్వ+అధ్యయనం). అంటే ఆత్మ విచారణ అని అర్థం. 


ఆధ్యాత్మిక జీవితానికి మాతృమూర్తి శ్రీ శారదాదేవి దీనిని ఒక ముఖ్యమయిన నియమంగా అభివర్ణించారు. నౌకకు చుక్కానిలా ఆత్మ విచారణ సాధకునికి మార్గదర్శి వంటిదని కూడా ఆమె పేర్కొన్నారు. 


"నేనెవరిని? నా మనోవైఖరి ఏమిటి?”, “నేను దేనిని అన్వేషిస్తున్నాను?" "దానిని పొందడానికి తగిన మార్గంలోనే వెళుతున్నానా?” ఇలాంటి ప్రశ్నలను లోతుగా యోచించడం తప్పనిసరి. వీటికి జవాబులు లభించినా, లభించకపోయినా నిత్యం కొంతసేపు వీటిని గూర్చి యోచించడం ఎంతో ఆవశ్యకం.🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సుభాషితమ్


 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*శ్రద్ధయా సాధ్యతే ధర్మో దత్తం వార్యపి చాక్షయమ్‌౹*

*మాతుః శతగుణం దానం సహస్రం పితురుచ్యతే౹*

*అనన్తం దుహితుర్దానం సోదర్యే దత్తమక్షయమ్‌౹౹*


𝕝𝕝తా𝕝𝕝

ధర్మము శ్రద్ధచేతనే సిద్ధిస్తుంది. శ్రద్ధతో మంచి నీళ్ళు ఇచ్చినా అది అక్షయమైన ఫలితాన్ని అందిస్తుంది.

( *శ్రద్దలేక చేసేదానికి ఏ ఫలం లేదు* )

తల్లికి ప్రేమతో ఏదైనా ఇచ్చినదానికి నూరు రెట్లు ఫలము, తండ్రి కిచ్చినదానికి వేయి రెట్లు ఫలం ఉండును.....పుత్రికలకు ఇచ్చినందుకు అనంత ఫలం, అక్కా చెల్లెండ్లకు ఇచ్చినందుకు అక్షయ ఫలం ఉంటుంది.

సన్యాసి..సంసారి..*

 *సన్యాసి..సంసారి..*


"నేను ఇక్కడ మండలం రోజులు ఉండాలని అనుకుంటున్నాను..ఈ వాతావరణం నాకు నచ్చింది..నేను ఉండటానికి ఏర్పాట్లు చేయగలరా?..నేను ప్రతిరోజూ సాధన చేసుకోవడానికి ఈ ప్రదేశం అనువైనదిగా నా మనస్సుకు అనిపిస్తోంది..పైగా ఇక్కడ ఒక అవధూత తపస్సు చేసి సిద్ధిపొందాడని విన్నాను.." అని ఆ సాధువు నన్ను అడిగాడు..కాషాయ వస్త్రాలు కట్టుకొని నుదుటన పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్న ఆయనను చూడగానే నాకు పెద్దగా భక్తిభావం కలుగలేదు..వయసు నలభై ఏళ్ళు ఉంటుందేమో అనుకున్నాను..అతని ముఖం లో నిర్లక్ష్యంతో కూడిన చూపు కనబడుతున్నదా అన్న భావన కలిగింది..


"ఇలా హఠాత్తుగా వచ్చి, ఏర్పాట్లు చేయండి అంటే..మాకు వీలుపడదు..మీరు కనీసం రెండు మూడు నెలల ముందుగా తెలియపరచి ఉంటే..అవకాశం కల్పించేవాడినేమో..ప్రస్తుతానికి ఇక్కడ తపస్సు చేసి సిద్ధిపొందిన అవధూత దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్ళండి..కొంతకాలం తరువాత మీరు ముందుగా తెలియచేస్తే..మీరు సాధన చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాము.." అన్నాను..


"అలాగా..సరే.." అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు..కనీసం స్వామివారి సమాధి దర్శనం కూడా చేసుకోలేదు.."ఆ సాధువు మళ్లీ వస్తే..సమాధి వద్దకు పంపించండి..మనమేమీ ఏర్పాట్లు చేయలేమని చెప్పండి.." అని మా సిబ్బందికి చెప్పాను..మా వాళ్ళు కూడా సరే అన్నారు..ఆరోజు అతను మాకు కనబడలేదు..మేమూ మా పనుల్లో మునిగిపోయాము..ప్రక్కరోజు ఉదయం మళ్లీ వచ్చాడు.."అయ్యా..స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటాను.." అన్నాడు..సరే అన్నాను..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చి..గడప వద్ద నిలబడి..రెండు చేతులూ జోడించి నమస్కారం చేసుకొని..తన చొక్కా జేబులోంచి ఒక చిన్న కర్పూరపు గడ్డ తీసుకొని..ప్రక్కనే స్వామివారి ఉత్సవ మూర్తి ముందు వెలుగుతున్న దీపం వద్ద ఆ కర్పూరాన్ని వెలిగించి.."స్వామీ దత్తాత్రేయా..." అంటూ పెద్ద కేక పెట్టి..వెలుగుతున్న ఆ కర్పూరాన్ని అమాంతం నోట్లో వేసుకొని మింగేసాడు..ఈ తతంగం అంతా చూస్తున్న మా కందరికీ ఒళ్ళు జలదరించింది..ఒక ఐదు నిమిషాల పాటు అక్కడే కళ్ళుమూసుకుని నిలబడ్డాడు..ఆ తరువాత స్వామివారి ఉత్సవ మూర్తి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని..అర్చక స్వామి ని అడిగిమరీ తీర్ధం ఇప్పించుకొని..దానిని నోట్లో వేసుకొని..మళ్లీ నమస్కారం చేసుకొని..బైటకు వచ్చేశాడు..


"నాకు ప్రాయశ్చిత్తం జరిగింది.." అని ఒకే ఒక మాట చెప్పి.."నేను వెళ్ళొస్తాను.." అని వెళ్ళిపోయాడు..ఆరోజు ఆ సంఘటన నా మనసులో హత్తుకు పోయింది..ఆ తరువాత అతను మళ్లీ రాలేదు..క్రమంగా నేనూ మర్చిపోయాను..


మరో  రెండు సంవత్సరాల తరువాత..ఒక శనివారం నాటి మధ్యాహ్నం మూడు గంటల వేళ, ఇద్దరు దంపతులు వచ్చారు..నేరుగా నేను కూర్చున్న చోటుకి వచ్చి.."నన్ను గుర్తు పట్టారా?" అని ఆ ఇద్దరిలో మగవాడు అడిగాడు.."లేదు..మీరెవరో నాకు గుర్తు రావడం లేదు.." అన్నాను.."నిజమే లెండి..గుర్తుపట్టడం కష్టమే..కానీ ఇది చెప్పండి..రెండు సంవత్సరాల క్రితం..ఇక్కడ సాధన చేసుకోవాలి..నాకు ఉండటానికి ఏర్పాటు చేయమని ఒక సన్యాసి మిమ్మల్ని అడిగాడు..మీరు కుదరదు అన్నారు..గుర్తుందా?..ఆ సన్యాసిని నేనే..ఇప్పుడు సంసారిగా మారి..స్వామివారి దర్శనానికి వచ్చాను..ఈమె నా భార్య..సాధన, తపస్సు, మోక్షం..ఇలాటి మాటలు విని..సన్యాసుల్లో కలిశాను..ఎక్కడెక్కడో తిరిగాను..ఒక గమ్యం లేదు..ఒక మార్గం లేదు..మొదటిసారి మొగిలిచెర్ల వచ్చి ఈ స్వామివారి మందిరం లో అడుగుపెట్టిన తరువాత..నాకు తపన మొదలైంది..మీరు ఇక్కడ ఉండటం కుదరదు అన్న తరువాత..ఆరోజు రాత్రి స్వామివారు నాకు స్వప్న దర్శనం ఇచ్చి..నీ మార్గం ఇదికాదు..కుదురుగా సంసారం చేసుకో..పోరా..పోయి..నీ భార్య తో కలిసి ఇక్కడకు రా..! అని చెప్పారు..అందుకే తెల్లవారి వచ్చి ఇక్కడ వెలిగే కర్పూరాన్ని మింగి..నా తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను..నేరుగా మా ఊరు వెళ్లి, నా భార్యకు క్షమాపణ చెప్పుకున్నాను..వ్యవసాయం చేసుకుంటూ..కుదురుగ్గా వున్నాను..ఇన్నాళ్లకు మళ్లీ స్వామి దయవల్ల ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాను.." అన్నాడు..


అందరూ సాధకులు కాలేరు..కొందరు వక్రమార్గం పడతారు..అటువంటి వారు సరైన సమయం లో సద్గురువును ఆశ్రయిస్తే...సక్రమమైన బోధచేసి..జీవితానికో మార్గం చూపుతారు..సంసారిగా వుండి..సన్యాసిగా మారి..మళ్లీ సంసారం లోకి వచ్చిన ఈ సాధకుడి జీవితం కూడా మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు అనబడే సద్గురువు బోధ తోనే బాగుపడింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

చంద్రయాన్ 3 “

 మిషన్  “చంద్రయాన్ 3 “ ద్వారా చంద్రుడిమీద మన విక్రమ్ safelanding కావడం మన భారతీయులందరికీ గర్వ కారణం. ఈసందర్భంగా  ఎప్పుడో  దాదాపు  60 ఏళ్ల నాడు మహాకవి శ్రీశ్రీ గారు  తన “ఖడ్గ సృష్టి “ లో వ్రాసిన కవితా పంక్తులు  గుర్తుకొస్తాయి - కవులు దార్శనికులు ,సామాజిక శాస్త్రవేత్తలు అనడానికి ఈ కవితే నిదర్శనం !!


“ మబ్బుతునక జేబురుమాలు 

మాటు చేసుకున్న జాబిల్లీ !


ఏమో బహుశా త్వరలో 

నీ ఇంటికి రావొచ్చు మేము 

స్వాగతం ఇస్తావు కదూ !

ఆతిధ్యానికర్హులమే మేము !


చంద్ర మండలానికి ప్రయాణం 

సాధించరాని స్వప్నం కాదు 

గాలికన్నా బరువైన వస్తువుని 

నేల మీద పడకుండా నిలబెట్ట లేదూ ?


పరమాణువు గర్భంలోని 

పరమ రహస్యాలు 

మహాకాశ వాతావరణంలోని 

మర్మాలు తెలుసుకున్నాక 

సరాసరి నీదగ్గరకే  ఖరారుగా వస్తాంలే 

అపుడు మా రాయబారుల్ని 

ఆదరిస్తావు కదూ నువ్వు ?


(ఇది శ్రీశ్రీ గారు  1966 లోనే అందించిన “మానవుని ప్రోగ్రెస్ రిపోర్ట్”)

పంచాంగం 24.08.2023 Thursday,

 ఈ రోజు పంచాంగం 24.08.2023 Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల  పక్ష: అష్టమి తిధి బృహస్పతి వాసర: విశాఖ నక్షత్రం ఇంద్ర యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


అష్టమి రాత్రి 03:08 వరకు.

విశాఖ  పగలు 09:00 వరకు.

సూర్యోదయం : 06:04

సూర్యాస్తమయం : 06:32

వర్జ్యం : మధ్యాహ్నం 01:02 నుండి 02:38 వరకు.

దుర్ముహూర్తం: పగలు 10:13 నుండి 11:03 వరకు తిరిగి మధ్యాహ్నం 03:13 నుండి 04:02 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం  01:30 నుండి 03:00 వరకు.


యమగండం : ఉదయం 06:00 నుండి 07:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

శ్రీ శంకర కృప

 .🕉️ హర హర మహాదేవ శంభో శంకర 🔱 మన భారతదేశ చరిత్రలో సనాతన ధర్మానికి ధర్మ పరిరక్షకుడుగా నిలువెత్తు సాక్ష్యముగా నిలబడ్డ మహనీయుడు ఆదిశంకరాచార్యులు వారు. అయితే ఆ గురు పరంపరంగా వస్తున్న ఆ పీఠాధిపతులు కూడా ఎంతో ధర్మ పరిరక్షణ చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఈ ఆధునిక యుగంలో శ్రీ శంకర కృప అనే పేరుతో మన సనాతన ధర్మంలో జరుగుతున్న విశేషాలు వాటి యొక్క అర్థాలు వివరణలు తో కూడిన మాసపత్రిక పుస్తకమును శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ స్వామి వారి చేతుల మీదగా ఈ మాస పత్రికలను పంపిణీ జరగడం ప్రారంభమైనది, కావున తమరికి వీలైన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చదివి ఆ విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాము, మన ధర్మాన్ని మనమే పరిరక్షించుకోవాలి. మనము ఖర్చు చేసే విషయాల్లో కి వస్తే దీనికి ఖర్చు పెట్టేది చాలా చిన్నది కావున ప్రతి హిందువులు ఇంటిలో కూడా ఈ మాస పత్రిక పుస్తకం ఉండాలని మేము కోరుకుంటున్నాము, ప్రతినెలా కూడా ఈ పుస్తకము డైరెక్టుగా మీ ఇంటికి మీ అడ్రస్కే వస్తుంది, అందరూ కూడా సహకరించగలరని కోరుతున్నాము. మూడు సంవత్సరమునకు చందా ₹300/-. దీనికి సంబంధించి సంప్రదించవలసిన వారు సాయి కుమార్ శర్మ 9642907999