3, ఫిబ్రవరి 2025, సోమవారం

ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చేత్"

 "ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చేత్" అని శాస్త్ర వచనము.

ఉత్తమమైన ఆరోగ్యం కావాలి అనుకునే వారు సూర్య భగవానుడిని ఆరాధిస్తే సంపూర్ణ ఆరోగ్యo కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. తత్రాపి 

 రథ సప్తమీ పర్వదినం వంటి రోజు ఆ భాస్కరుడిని పూజిస్తే ఎంతో శుభం.

అదే విధంగా అర్క పత్రములు శరీరము పైన ఉంచుకుని స్నానం చేయడం కూడా రథ సప్తమీ పర్వదినమున అందరూ తప్పకుండా చెయ్యాలి.


ఈ క్రింద శ్లోకాలు పఠిస్తూ స్నానము చేయవలెను.

*రథసప్తమీ సప్తార్కస్నాన ప్రార్థనా*

యద్యజ్జన్మకృతం పాపం

మయా జన్మసు సప్తసు।

తన్మే రోగం చ శోకం చ

మాకరీ హన్తు సప్తమీ।। 1


ఏతజ్జన్మకృతం పాపం

యచ్చ జన్మాన్తరార్జితమ్।

మనోవాక్కాయజం యచ్చ

జ్ఞాతాజ్ఞాతే చ యే పునః।। 2


ఇతి సప్తవిధం పాపం

స్నానాన్మే సప్తసప్తికే।

సప్తవ్యాధి సమాయుక్తం

హర మాకరి సప్తమి।। 3 


*రథసప్తమీ అర్ఘ్యం*


సప్తసప్తివహ ప్రీత

సప్తలోక ప్రదీపన।

సప్తమీ సహితో దేవ

గృహాణార్ఘ్యం దివాకర।।

*దివాకరాయ నమః ఇదమర్ఘ్యం 1


*కూష్మాణ్డ దాన ప్రార్థనా*

కూష్మాణ్డం బహుబీజాఢ్యం

బ్రహ్మణా నిర్మితం పురా।

తస్మాత్ అస్య ప్రదానేన

సన్తతిః వర్ధతాం మమ।। 2

–‘‘ఈ శరీరమే చిత్రమైనది.

 ఆయనకు తన గొప్పదనాన్ని గురించిగానీ, భాగ్యాన్ని గురించి గానీ ఏమాత్రం గర్వంలేదు. ఆయనకు జ్ఞానపీఠం బహుమానం వచ్చింది. రేడియోస్టేషనుకి కార్లోపోతున్నాము. అప్పుడు మాస్టారు –‘‘ఈ శరీరమే చిత్రమైనది. ఎన్ని బాధలు పడిందో అన్ని సుఖాలూ పడింది. ఈ శరీరంలో ఉన్న సత్యనారాయణ నాటికీ నేటికీ ఒక్కడే. కాని వీడిచుట్టూవున్న సంసారం మారిపోయింది. అప్పుడు నాతో బ్రతికిన భార్య యిప్పుడు లేదు. ఇప్పుడు నా యింట్లో ఎన్ని కూరలున్నా చుట్టం వస్తే మళ్ళా ఏ బంగాళాదుంపలో ఏవో తెప్పిస్తేగాని తృప్తిగావుండదు. అప్పట్లో నా కొంపకు చుట్టంవస్తే వానికి ఏమిమర్యాద చేయగలమా అని నాకు కొంచెం కష్టంగా వుండేది. భోజనం వేళ ఆగదుగదా ! ఆ వేళకు మాఆవిడ వచ్చిన చుట్టానికి, నాకు తిండి సృష్టించేది. ఇంట్లో ఆ పదార్థాలు ఎలా ఎక్కడనుండి ఊడిపడినాయో నాకు తెలియదు. షడ్రసోపేతంగా అమ్రుతాయమానమైన తిండి సృష్టించేది. సృష్టించడమే సుమా! కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏమి కావాలో అన్నీ, ఎలా వచ్చినాయి యివన్నీ! నా బీదకాపురానికి అటువంటి సృష్టిచేయడానికి, ఆ మర్యాద దక్కించడానికి ఆ మహాయిల్లాలు పడిన శ్రమ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదంతా ఎందుకండి! నేను 1956తో మేడ కట్టాను. అప్పటివరకూ పాకలో వున్నాను. అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. కాని అప్పటి మా ఆవిడ పడినకష్టం వానకురిస్తే ఇంట్లో మోకాటిలోతు నీళ్ళు ఆ నీళ్ళు తోడేసి రాళ్ళు పేర్చి వాటిమీద యింత ఉడకేసి పెట్టాల్సివచ్చేది. అప్పటి విశ్వనాథ సత్యనారాయణకి యిప్పటి విశ్వనాథ సత్యనారాయణకి తేడా ఏమిటి? అదే శరీరం కారులో పోతుంది. రైలులో పోతుంది. కొన్ని యేండ్లుగా యిలా సుఖపడుతున్నది. లోపల ఉన్న జీవుడు ముందు స్థితి మరచిపోలేదు. మా తండ్రిగారుండగా నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. ఈ కనపడే భోగం, మేడ అంతా ఆ జీవుడినంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుఃఖమేమిటో కష్టమేమిటో తెలిసినంత సుఖం గూర్చి తెలీదు. వానికి గర్వం ఎలావుంటుంది? (అంత కష్టదశలో ఆయన చేసిన గుప్తదానాలు అనేకములు. ఆయన సంపాదన అప్పుడు ఎక్కువకాదు. దాతృత్వం ఆపుకోలేని చేయి తన యిబ్బంది తాను పడుతూనేవుంది. ఆ దానాలతో సుఖపడినవారు చాలామంది వున్నారు) బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్యలేదు. ఆమెకీ అనుభవంలేదు. ఇప్పుడింత మహాకవిని, అప్పుడూ మహాకవినే నన్ను మహాకవిని చేసినది ఆమె’’ ఈ మాటలాయన కళ్ళల్లో చెమ్మతో అన్న మాటలు. వరలక్ష్మీ త్రిశతిలో అన్నారు కదా! 


‘‘వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి

…….ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను

నేలుకొనిన నా పట్టమహిషి’’


‘‘నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా

లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు’’


అని చెప్పారు. శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరుఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకుకూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగమహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన.


(విశ్వనాథవారి వ్యక్తిత్వం వారిని పై పై చూపులతో చూసినవారికి అర్థం కాలేదు. వారికి అత్యంత సన్నిహితుడైన శిష్యుడు, వారి రచనలు చాలావాటికి లేఖకుడు, స్వయంగా గొప్ప కవిపండితుడు ఐన శ్రీ పేరాల భరతశర్మ గారు విశ్వనాథవారి గురించి మనసుని తాకే వ్యాసాలు కొన్ని రాశారు. అందులో ఒకదాని నుండి చిన్న భాగం ఇది.

పుస్తకం.నెట్ నుండి సంగ్రహించి ఇక్కడ పెడుతున్నాను, వారికి కృతజ్ఞలతో)

వసంత పంచమి

 


శ్రీభారత్ వీక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు 🌹సరస్వతి, లక్ష్మీ దేవి, పార్వతీ దేవి..ముగ్గురమ్మలు సమానంగా పూజలందుకొనే వేడుక. ఆ ముగ్గురూ ఒక్కటే. అయినా వారిని విడివిడిగా అర్చించడంలోనే అందరికీ అపరిమితమైన ఆనందం. వివిధ రాష్ట్రాల్లో ముగ్గురమ్మలకు ఎలాంటి వేడుకలు ఎంత ఘనంగా జరుపుతారో వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. మన్మధుని శివుడు తన మూడోకంటితో ఎందుకు భస్మం చేశాడో, పార్వతిని ఎలా పరిణయమాడాడో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

Panchaag


 

సరస్వతీ నమస్తుభ్యం*

 🌹 *సరస్వతీ నమస్తుభ్యం* 🌹

*(3.2.25 నాడు శ్రీపంచమి)*


విద్యాభ్యాసానికి ప్రారంభం అక్షరాభ్యాసం.

అక్షరాలను దిద్దించడంతో విద్యాభ్యాసం ప్రారంభం అవుతుంది. *అక్షరం* అంటే క్షయం లేనిది, నాశనం లేనిది అని అర్ధం. 

మనం సంపాదించే సంపదల్లో ఏదైనా నశిస్తుంది కానీ, అక్షర సంపద, విద్యా సంపద మాత్రం నశించదు. అటువంటి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించే ముందు

*సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి*

*విద్యారంభం కరిష్యామి సిద్ధి ర్భవతుమే సదా*

అని చదువుల తల్లి అయిన 

శ్రీసరస్వతీదేవిని ప్రార్ధించడం ఆచారం. 

చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణి, జ్ఞానప్రదాయిని అయిన శ్రీసరస్వతి జన్మదినం - *మాఘ మాసం శుక్ల పక్ష పంచమి*

 ఈ సందర్భంగా జరుపుకునే పండుగే - *శ్రీ పంచమి* .

 దీనికే *వసంత పంచమి* 

అని కూడా పేరు. 

విద్యలకు అధిదేవత అయిన 

శ్రీసరస్వతీదేవి బ్రహ్మదేవుడి దేవేరి. తెల్లటి పద్మంపైన కూర్చుని, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దానిపైన అడ్డముగానూ ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకాలను చేతులలో ధరించి ఉంటుందని శ్రీసరస్వతీదేవిని గురించి పద్మ పురాణం పేర్కొంది. అంటే సరస్వతీదేవి అహింసాదేవత! చల్లనితల్లి! బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఈ విషయమే ఉంది. ఈ పురాణంలో దుర్గ, సావిత్రి, శ్రీమహాలక్ష్మి, సరస్వతి, శ్రీరాధాదేవి అనే ఐదుగురు ప్రకృతిశక్తు లనీ, వీరిలో మూడవ దేవత సరస్వతి పరమాత్మ నుంచి ఉద్భవించిన వాణికి, విద్య, జ్ఞానబుద్ధులను చెప్తోంది. అటువంటి జ్ఞానప్రదాయిని కరుణ వుంటేనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతా యని అని పురాణ వచనం. శ్రీసరస్వతీ దేవి జన్మదిన మైన 

శ్రీపంచమిని దక్షిణభారతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

 శ్రీపంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే అపార మైన జ్ఞానం లభిస్తుంది. నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది అని శాస్త్రవచనం. ఈ రోజున ఉదయమే లేచి, స్నానాది క్రతువులు తీర్చుకుని, అమ్మవారి పూజలు తెల్లటి వస్త్రాలు, పూసలతో అలంకరణ చేసి, పాలు, వెన్న మొద లైన పదార్థాలు నివేదన చేసి, ఆ తరువాత చిన్న పిల్లలకు విద్యారంభం చేస్తే, ఆ చిన్నారులకు ఆసరస్వతీదేవి విద్యను ప్రసాదిస్తుంది. 

ఈ రోజున,

శ్రీసరస్వతీదేవితో పాటు, వినాయకుడు, శ్రీమహావిష్ణువు, పరమశివుడు, సూర్య భగవానుడు కూడా ప్రత్యేకపూజలు అందుకుంటారు.


*యా కుందేందు తుషార హార* *ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా*

*యా వీణా వరదండమండిత కరా యా శ్వేత పద్మాసనా*

*యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా*

*సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా!*


కొందరు 2న, కొందరు 3న జరుపుకుంటారు. 

         🌹🙏🌹

పాలాశ కుసుమం వృథా*

:-

*పాలాశ కుసుమం వృథా*


సంస్కృత మహాకావ్యాలకు వ్యాఖ్యానం రచించిన మల్లినాథ సూరి తండ్రేమో మహా పండితుడు. ఈయనకు మాత్రం విద్యాగంధం అబ్బలేదట. పెళ్లయ్యాక ఆయన జీవితం మారిపోయింది. ఓరోజు అత్తారింటికి వెళ్తే, పూజకు పూలు తెమ్మని కోరింది భార్య. ఎర్రగా మెరుస్తున్న మోదుగుపూలను తెచ్చాడు. ఈయనకు శాస్త్రజ్ఞానం లేదని గ్రహించి, ఈ శ్లోకం చెప్పింది భార్య.

రూప యౌవన సంపన్నా, విశాల కులసంభవా

విద్యావిహీన శోభంతే, పాలాశ కుసుమం వృథా

–ఇదేమిటో సూరికి అర్థం కాలేదు. కానీ అసాధారణ ధారణ వల్ల పాదాలు గుర్తుపెట్టుకుని, ఊళ్లోని మరో పండితుడిని అర్థమడిగాడు. ‘అందము, యౌవనము కలిగి ఎంత మంచి వంశంలో జన్మించినా, విద్య లేకపోతే శోభించడనీ, అలాంటివాడు పూజకు పనికిరాని మోదుగుపువ్వు లాంటివాడనీ అర్థం చెప్పాడాయన. తనకు చదువులేదని భార్య ఎత్తిపొడిచిందని అర్థం చేసుకున్న సూరి ఎవరికీ చెప్పకుండా కాశీకి వెళ్లిపోయి, పన్నెండు సంవత్సరాల పాటు చదువుకుని, తిరిగి అత్తగారింటికి వచ్చి, వారి అరుగు మీద కూర్చున్నాడు. ఎవరో యాత్రికుడనుకుని ఇంట్లోకి భోజనానికి పిలిచారు. భార్యే వడ్డించింది. చారులో ఉప్పు లేదు. అప్పుడు సూరి–

చారు చారు సమాయుక్తం హింగు జీర సమన్వితం

లవణ హీన నరుచ్యంతే పాలాశ కుసుమం వృథా

(చారు ఎంత కంటికింపుగా ఉన్నా, ఇంగువా జీలకర్రా వేసినా, ఉప్పు లేకపోతే రుచిగా ఉండదు. అది పనికి రాని మోదుగు పువ్వుతో సమానం)

అని శ్లోకం చెప్పగానే, ‘పాలాశ కుసుమం వృథా’ మాట ఎక్కడో విన్నట్టుగా ఉందే అని ఆయన ముఖం వంక తేరిపార జూసి, అతిథి భర్తే అని గ్రహించి, మహాపండితుడై తిరిగి వచ్చినందుకు ఆమె పరమానంద పడిందని కథ.


*సేకరణ* 👆