24, డిసెంబర్ 2020, గురువారం

ధార్మికగీత - 118*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                             *ధార్మికగీత - 118*    

                                       *****

    *శ్లో:- వదనం ప్రసాదసదనం౹ సదయం*

           *హృదయం ౹ సుధాముచో వాచః ౹* 

           *కరణం పరోపకరణం౹ యేషామ్*

           *కేషామ్   న   తే   వంద్యా: ౹౹*

                                  *****

*భా:-లోకంలో కొందరిని చూసినా, మాట్లాడినా, భావసారూప్యం కలగలిపినా జీవితంలో మరచిపోలేము. వారి సుగుణాలు నిశితంగా పరిశీలన చేస్తే 1."వదనం":-వారి ముఖంలో స్వచ్ఛత,పవిత్రత,ప్రశాంతత,ఆనందం సదా వెల్లివిరుస్తుంటుంది. చూడగానే మన పాపాలు, తాపాలు పూర్తిగా సమసి పోయినంత తృప్తి కలుగుతుంది. 2. "హృదయం":- ఎటువంటి తప్పునైనా, చల్లని చూపులతో  క్షమించగల 'దయాగుణం' వారి డెందములో  తొణికిసలాడు తుంటుంది. మన అంతరంగాన్ని ద్రవింప జేస్తుంది. 3."వాక్కు":- వారి మృదు మధుర వాక్కులు అమృత తుల్యములై మన మదికి రసానుభూతిని, ఆహ్లాదాన్ని కలిగిస్తూ, చింతలను దూరం చేస్తాయి.  4." కరణం":- వారి చేతలు ఆపన్నులకు, సమాజానికి,లోకానికి హితములై,  కళ్యాణ కారకములై భాసిస్తుంటాయి. చిర స్మరణీయంగా నుతింప బదుతుంటాయి.5.అలాంటి మహనీయులు తమ దర్శన, స్పర్శన, భావన, భాషణ లాలిత్యం వల్ల అందరి ఉల్లాలను పల్లవింప జేస్తూ,హృదయాలను పరవశింప జేస్తూ వారు,వీరు అనే తేడా లేకుండా ఎల్లరకు, ఎల్లప్పుడు పూజనీయులు, వందనీయులు కాగలరని సారాంశము*.

                                  *****

                   *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

ప్రారబ్దం

 ప్రారబ్దం శరీరానికి సంబంధించినదని కొందరు అనుకుంటారు. కానీ, ప్రారబ్దం శరీరానికి సంబంధించినది కాదు. అది ఆత్మసంబంధమైనది. జీవి జన్మించి, తన బుద్ధితో పుణ్య పాప కర్మలను ఆచరించటం జరుగుతుంది. ఆత్మ స్వయంగా కర్మాచరణము చేయలేదు. ఎందుకంటే ఆత్మ, బుద్ధి ,మనస్సు ఇవన్నీ భౌతికమైనది కావు.  అందుకే ఇవి కర్మాచరణకు శరీరం అనే సాధనాన్ని ఉపయోగించుకొని కర్మలను చేయిస్తాయి. సంకల్పం వీటిదే అయినా, చేసేది శరీరమే. కానీ ఈ కర్మఫలాలు శరీరానికి అంటవు. కర్మాచరణ తరువాత (జన్మాంతంలో) ఆ శరీరం నశిస్తుంది. కర్మఫలం మాత్రం జీవుడిని (ఆత్మను) అంటుకొని ఉంటుంది. ప్రారబ్దం శరీరానికి సంబంధించినదైతే అది శరీరం నశించగానే ప్రారబ్దం నశించాలి. కానీ జీవిని అంటిపెట్టుకొని ఉండి మరలా జన్మించి శరీరధారి అయినప్పుడు ఆ పూర్వకర్మల ఫలితాలు అనుభవానికి వస్తాయి. అవి అనుభవించుటవలననే కర్మఫలం నశిస్తుంది. ఆ విధంగా ఒకజన్మ నుండి మరొకజన్మకు సంక్రమిస్తుంది కనుకనే అది ప్రారబ్దం అని పిలువబడుతోంది. ఈ విషయాన్ని ఎఱిగి మానవుడు కర్తృత్వభావనగానీ, కర్మఫలాపేక్షగానీ లేకుండా తాను ఆచరించవలసిన కర్మలను ఆచరించాలి. గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పినది ఇదే.

దశమహా విద్యలు*



*దశమహా విద్యలు*


విద్య అంటే సరైన జ్ఞానం. మన చుట్టూ ఉన్న మాయను పటాపంచలు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహా విద్య. జ్ఞాన స్వరూపిణి అయిన శక్తి ధరించిన పది రూపాలే దశ మహా విద్యలు. తంత్ర శాస్త్రం లో శక్తి ఉపాసనను విద్య అంటారు. తోడల తంత్రం లో దశమహా విద్యల సాధన ఉంటుంది.


అజ్ఞానం పాపానికి కారణమౌతుంది. పాపం దుఃఖానికి కారణం. జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది. పరమానందాన్ని కలిగిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని అమ్మవారు పది అవతారాలలో ప్రసాదిస్తుంది. ఆ అవతారాలనే దశ మహా విద్యలన్నారు. జ్ఞానానికి పది అవతారాలు ఎందుకు? మహా విద్య పది రూపాలను ఎందుకు సంతరించుకుంది?


మహా విద్య పది అవతారాలు – ఒక్కో అవతారం యొక్క అంతరార్థం


మహావిద్య పది అవతారాలలో ఒక్కో అవతారం ఒక్కో విధమైన శక్తికి ప్రతీక.


కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ


భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా


భగళా సిద్ధ విద్యాచ మాతంగీ కమలాత్మికా


యథా దశమహా విద్యాః సిద్ధి విద్యా ప్రకీర్తితా ||


కాళి – బ్రహ్మానికి అసలు రూపం. కాల స్వరూపం కాళిక. కాళిక వాక్కుకు శక్తినిస్తుంది.


తార – తార అభయప్రదాత. ఆమె ఆపదలనుండీ కాపాడుతుంది. మోక్షజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.


త్రిపుర సుందరి/ షోడశి– ఈమెను తాంత్రిక పార్వతి అంటారు. అమ్మ త్రిభువన సౌందర్య రాశి.


భువనేశ్వరి – సకల భువనాలకు భువనేశ్వరీ దేవి అధిదేవత. సకల సృష్టి అమ్మ రూపం లో ఇమిడి ఉంటుంది.


భైరవి– దుష్టులను శిక్షించి, సజ్జనులను రక్షించడం భైరవి లక్షణం. దుష్టులు అంటే మనలోని దుష్టమైన ఆలోచనలను నశింపజేసి సద్బుద్ధిని కలిగిస్తుంది. చెడుతో పోరాడే శక్తినిస్తుంది.


ఛిన్న మస్త– ఛిన్న అంటే తెగిన అని అర్థం. మస్త అంటే మస్తకం. ఈమె తన తలను తానే ఖండించుకుని మొండెం నుండీ చిందుతున్న రక్తాన్ని ఖండించబడ్డ శిరసుతో తాగుతూ కనిపిస్తుంది. శరీరం తో ముడిపడ్డ మోహాన్ని, అహాన్ని ఖండించి ఆత్మ జ్ఞానాన్ని అందించడమే ఛిన్నమస్త రూపం లోని ఆంతర్యం.


ధూమవతి – ఈమె వైధవ్యం లో ఉన్న వృద్ధ స్త్రీ రూపం లో ఉంటుంది. ఈమెను మృత్యుదేవత అని కూడా అంటారు.


భగళా ముఖి – భగళాముఖి శత్రువులను నిర్వీర్యం చేసే శక్తినిస్తుంది.


మాతంగి– అమ్మ శ్యామల రూపంతో మరకత మణివలే ప్రకాశిస్తుంది. అందుకే శ్యామలా దేవి అంటారు. నీల సరస్వతి అని అమ్మకు పేరు. ఈమె సకల విద్యా దాత్రి. వనవాసినియై ఉంటుంది.


కమలాత్మిక– ఈమె లక్ష్మీ దేవికి తాంత్రిక రూపం.


3. దశమహావిద్యలను సామాన్యులు ఆరాధించవచ్చా?

దశ మహావిద్యలను నిరభ్యంతరంగా ఎవరైనా ఆరాధించవచ్చు. అమ్మను కొలవడానికి అందరం అర్హులమే. ఆరాధించ దలచినవారు ముందుగా ఎవరైనా ఉపాసకులను , గురువులను దర్శించి విధి విధానాలను తెలుసుకోవడం మాత్రం తప్పనిసరి. దశమహావిద్యా స్తోత్రాన్ని పఠించడం వల్ల విద్యా, సంపదలు ఆ ఇంట వెల్లివిరుస్తాయి.


-: దశ మహావిద్యా స్తోత్రం :-


దశమహావిద్యాస్తోత్రమ్ ॥


ఓం నమస్తే చండికే చండి చండ ముండవినాశిని ।


నమస్తే కాలికే కాలమహాభయవినాశిని ॥ 1॥


శివే రక్ష జగద్ధాత్రి ప్రసీద హరవల్లభే ।


ప్రణమామి జగద్ధాత్రీం జగత్పాలనకారిణీమ్ ॥ 2॥


జగత్ శోభకరీం విద్యాం జగత్సృష్టివిధాయినీమ్ ।


కరాలాం వికటాం ఘోరాం ముండమాలావిభూషితామ్ ॥ 3॥


హరార్చితాం హరారాధ్యాం నమామి హరవల్లభామ్ ।


గౌరీం గురుప్రియాం గౌరవర్ణాలఙ్కారభూషితామ్ ॥ 4॥


హరిప్రియాం మహామాయాం నమామి బ్రహ్మపూజితామ్ ।


సిద్ధాం సిద్ధేశ్వరీం సిద్ధవిద్యాధరఙ్గణైర్యుతామ్ ॥5॥


మన్త్రసిద్ధిప్రదాం యోనిసిద్ధిదాం లిఙ్గశోభితామ్ ।


ప్రణమామి మహామాయాం దుర్గాం దుర్గతినాశినీమ్ ॥ 6॥


ఉగ్రాముగ్రమయీముగ్రతారాముగ్రగణైర్యుతామ్ ।


నీలాం నీలఘనశ్యామాం నమామి నీలసున్దరీమ్ ॥ 7॥


శ్యామాఙ్గీం శ్యామఘటితాం శ్యామవర్ణవిభూషితామ్ ।


ప్రణమామి జగద్ధాత్రీం గౌరీం సర్వార్థసాధినీమ్ ॥ 8॥


విశ్వేశ్వరీం మహాఘోరాం వికటాం ఘోరనాదినీమ్ ।


ఆద్యామాద్యగురోరాద్యామాద్యనాథప్రపూజితామ్ ॥ 9॥


శ్రీం దుర్గాం ధనదామన్నపూర్ణాం పద్మాం సురేశ్వరీమ్ ।


ప్రణమామి జగద్ధాత్రీం చంద్రశేఖరవల్లభామ్ ॥ 10॥


త్రిపురాం సున్దరీం బాలామబలాగణభూషితామ్ ।


శివదూతీం శివారాధ్యాం శివధ్యేయాం సనాతనీమ్ ॥11॥


సున్దరీం తారిణీం సర్వశివాగణవిభూషితామ్ ।


నారాయణీం విష్ణుపూజ్యాం బ్రహ్మవిష్ణుహరప్రియామ్ ॥12॥


సర్వసిద్ధిప్రదాం నిత్యామనిత్యాం గుణవర్జితామ్ ।


సగుణాం నిర్గుణాం ధ్యేయామర్చితాం సర్వసిద్ధిదామ్ ॥ 13॥


విద్యాం సిద్ధిప్రదాం విద్యాం మహావిద్యాం మహేశ్వరీమ్ ।


మహేశభక్తాం మాహేశీం మహాకాలప్రపూజితామ్ ॥ 14॥


ప్రణమామి జగద్ధాత్రీం శుమ్భాసురవిమర్దినీమ్ ।


రక్తప్రియాం రక్తవర్ణాం రక్తబీజవిమర్దినీమ్ ॥ 15॥


భైరవీం భువనాం దేవీం లోలజివ్హాం సురేశ్వరీమ్ ।


చతుర్భుజాం దశభుజామష్టాదశభుజాం శుభామ్ ॥ 16॥


త్రిపురేశీం విశ్వనాథప్రియాం విశ్వేశ్వరీం శివామ్ ।


అట్టహాసామట్టహాసప్రియాం ధూమ్రవినాశినీమ్ ॥ 17॥


కమలాం ఛిన్నభాలాఞ్చ మాతఙ్గీం సురసున్దరీమ్ ।


షోడశీం విజయాం భీమాం ధూమాఞ్చ వగలాముఖీమ్ ॥ 18॥


సర్వసిద్ధిప్రదాం సర్వవిద్యామన్త్రవిశోధినీమ్ ।


ప్రణమామి జగత్తారాం సారాఞ్చ మన్త్రసిద్ధయే ॥ 19॥


ఇత్యేవఞ్చ వరారోహే స్తోత్రం సి


ద్ధికరం పరమ్ ।


పఠిత్వా మోక్షమాప్నోతి సత్యం వై గిరినన్దిని ॥ 20॥


ఇతి దశమహావిద్యాస్తోత్రం సమ్పూర్ణమ్ ।


ఓం శ్రీ మాత్రే నమః

భాష్యములు


*భాష్యములు – వ్యాఖ్యానములు*.

బ్రహ్మసూత్రాలకు అనేక భాష్యాలు వెలువడ్డాయి. త్రిమతాచార్యులైన *శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు - ముగ్గురూ భాష్యాలు వ్రాశారు*.

ముందుగా *శంకరభగవత్పాదులవారు 'అద్వైత' పరంగా భాష్యం* వ్రాశారు. అప్పటికి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అనే సిద్ధాంతాలే లేవు. అప్పుడున్నది *అభేద వాదం, భేదా భేద వాదం, భేదవాదం* అనే వాదాలు మాత్రమే. ఆ తరువాత దాదాపు మూడువందల సంవత్సరాలకు *శ్రీ రామానుజాచార్యుల వారు 'విశిష్టా ద్వైత' పరంగా బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాశారు. ఆ తరువాత 400 సంవత్సరాలకు 'ద్వైత' పరంగా శ్రీ మధ్వాచార్యుల వారు భాష్యం* వ్రాశారు. ఇలా ముగ్గురు ఆచార్యులు బ్రహ్మసూత్రాలకు తమ తమ సిద్ధాంతాల (మతముల) పరంగా భాష్యాలందించారు.

శంకరాచార్యులవారికి ముందుకూడా బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాసిన వారున్నారు. దాదాపు 10 భాష్యాలున్నాయి. అయితే వాటికి అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది. శంకరుల వారి భాష్యం వచ్చేటప్పటికి అవి అసలు అదృశ్యమై పోయాయి. అవి సర్వాంగీకారంగా లేకపోవటం వల్లను, సూత్రాలకు భాష్యాలను అంత తృప్తికరంగా అందించలేకపోవటం వల్లను అవి కనుమరుగైపోయినవి. ఇప్పుడివి ఎంత వెతికినా కనిపించే స్థితిలో లేవు.

ఇక శంకరుల తరువాత కాలంలో కూడా దాదాపు 10 భాష్యాలు వచ్చాయి. అవి కూడా భేదవాదం, భేదాభేదవాదం, అభేదవాదం మొ||న అనేక వాదాలను ఆధారం చేసుకొనే వచ్చాయి. అవి కూడా అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. కారణం సూత్రాలకు అవి తాత్పర్యంగా, సర్వాంగీకారంగా లేకపోవుటే. వీటిలో *కొన్ని భాష్యాలు మాత్రం ప్రచారంలోకి* వచ్చాయి. మొత్తం భాష్యాలు: ( మనకు అందినంతవరకు)

1. *అద్వైతపరంగా శంకరాచార్యుల వారి 'శారీరక మీమాంస'* (భాష్యం)

2. *విశిష్టా ద్వైత పరంగా రామానుజాచార్యుల వారి శ్రీ భాష్యం*

3. *ద్వైత పరంగా మధ్వాచార్యుల వారి 'పూర్ణ ప్రజ్ఞ భాష్యం'*

4. *ద్వైతాద్వైత పరంగా నింబార్కుల వారి భాష్యం*.

5. *శైవ విశిష్టా ద్వైత పరంగా శ్రీ కంఠుల భాష్యం- 'శైవ భాష్యం'* .

6. *శ్రీ పతి వారి 'శ్రీకర భాష్యం' వీరశైవ విశిష్టా ద్వైతం*.

7. *విజ్ఞాన భిక్షు భాష్యం. 'విజ్ఞానామృతం' (అవిభాగా ద్వైతం)*

8. *భాస్కరాచార్యుల వారి భాస్కర భాష్యం. భేదాభేదం*.

9. *వల్లభాచార్యుల అణు భాష్యం. శుద్ధా ద్వైతం*.

10. *బలదేవాచార్యుల వారి గోవిందభాష్యం- అచింత్య భేదాభేదం*.

ఇలా అనేక భాష్యాలు వెలువడ్డాయి. అయితే *అన్నింటిని పరిశోధించిన మహాత్ములు శంకర భాష్యమే సూత్రాలకు అనుగుణంగా ఉన్నదని తేల్చారు*.

శంకరభాష్యం బ్రహ్మసూత్రాలకు పరమతాత్పర్యం అని పండితులు, మహాత్ములు నిగ్గు తేల్చారు. *ఇతర భాష్యాలన్నీ 'శిశువులు' అన్నారు*.