27, ఫిబ్రవరి 2024, మంగళవారం

హనుమంతుడి సంగీతం

 🎻🌹🙏హనుమంతుడి పరిపూర్ణ సంగీతం...!!




దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు.


 తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉండేది. నారదుడి వీణ మహతి. ఇద్దరూ ముల్లోక సంచారం చేసేవారు.


 ఇంద్రాది దేవతలను తమ గానంతో, వీణానాదంతో అలరించేవారు. మహావిష్ణువును స్తుతిస్తూ కీర్తనలను గానం చేసేవారు. 


తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండటంతో ఇద్దరికీ గర్వం పెరిగింది. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికీ స్పర్థలు కూడా మొదలయ్యాయి.  

 

ఎవరు గొప్పో సాక్షాత్తు మహా విష్ణువు వద్దే తేల్చుకోవాలనే పట్టుదలతో తుంబుర నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు.


 పోటాపోటీగా గానం చేశారు. నారదుడు తనకు ఎంతటి భక్తుడైనా, విష్ణువు మాత్రం తుంబురుడి గానానికి పరవశుడై, అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. 


నారదుడు చిన్నబోయాడు. సంగీతంలో విద్వత్తు సాధించడానికి ఏం చేయాలంటూ విష్ణువునే సలహా అడిగాడు.


 ‘గానబంధు’ అనే గుడ్లగూబ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు. 


‘గానబంధు’ వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుంబురుడిని సవాలు చేసేందుకు అతడి నివాసానికి వెళ్లాడు.


అక్కడ గాయపడ్డ స్త్రీలు విలపిస్తూ కనిపించారు. ఎవరు మీరని ప్రశ్నించాడు నారదుడు.


 ‘నీ గానంతో గాయపడ్డ రాగాలం మేమంతా’ అని బదులిచ్చారు వారు. ‘ఇక్కడికెందుకొచ్చారు?’ అని ప్రశ్నించాడు నారదుడు.


 ‘తుంబురుడు గానం చేస్తే స్వస్థత పొందుదామని వచ్చాం’ అని బదులిచ్చారు. ఆ సమాధానంతో చిన్నబోయిన నారదుడు ఈసారి సంగీతం నేర్చుకోవడానికి శ్రీకృష్ణుడి పెద్ద భార్య రుక్మిణీదేవిని ఆశ్రయించాడు.


 ఆమె శిక్షణలో సంగీతంలో అపార విద్వత్తును సాధించాడు.

ఎవరు గొప్ప విద్వాంసులో సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తేల్చుకుందామంటూ తుంబురుడిని సవాలు చేశాడు నారదుడు.


 ఇద్దరూ వైకుంఠానికి బయలుదేరారు. ఇద్దరి గానాన్నీ విష్ణుమూర్తి సంతృప్తిగా ఆలకించాడు. అయితే, ఎవరు గొప్పో తాను తేల్చలేనన్నాడు. 


ఈ విషయంలో తీర్పు చెప్పగల దిట్ట హనుమంతుడు ఒక్కడేనని చెప్పాడు. దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబుర నారదులిద్దరూ హనుమంతుని వద్దకు వెళ్లారు.


 హనుమంతుడు న్యాయనిర్ణేతగా రాగా, దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది. మొదట తుంబురుడు వీణ వాయిస్తూ గానం చేశాడు.  


తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు. లోకమంతా చేష్టలుడిగి సంగీతంలో లీనమైంది.  

 

తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు. మహతి మీటుతూ గానాన్ని సాగించాడు.


 నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది. తుంబురుడి గానానికి గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి.


 నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి. ప్రకృతిలో జీవకళ ఉట్టిపడసాగింది.


 దేవతలందరూ తన్మయత్వంతో తలలూపసాగారు. నారదుడు తన గానాన్ని ముగించడంతో వారందరూ తేరుకున్నారు.


హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందోనని ఆత్రంగా చూడసాగారు. ‘ఇద్దరూ సమ ఉజ్జీలుగానే ఉన్నారు.


 ఇంకో పరీక్ష పెడతాను. మీ వీణలు ఇలా ఇవ్వండి’ అడిగాడు హనుమంతుడు. ఇద్దరూ తమ వీణలను అతడి చేతికి అందించారు.


 హనుమంతుడు రెండు వీణలనూ తీసుకుని, రెండింటిలోని చెరో మెట్టును ఊడదీసి వారికి ఇచ్చాడు. 


‘ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చేయండి’ అన్నాడు. దీంతో తుంబుర నారదులిద్దరూ అసహనానికి గురయ్యారు.


‘వీణలో అన్ని మెట్లూ ఉంటేనే కదా వాయించగలం. చెరో మెట్టు తీసేసి ఇప్పుడు వాయించమంటే ఎలా?’ అని అడిగారు.


 హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు. ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకుని, దాన్ని చీల్చాడు. దానికి తీగలు తగిలించాడు.


 ఎలాంటి మెట్లులేని వీణను తయారు చేశాడు. ఇక దానిని వాయిస్తూ గానం చేయడం మొదలుపెట్టాడు. మంద్రంగా మొదలైన స్వరఝరి క్రమంగా ఉధృతి అందుకుంది.


ఆ గానానికి వైకుంఠం నుంచి మహావిష్ణువే పరుగున అక్కడికి వచ్చినా, అతడి రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలందరూ తన్మయులయ్యారు.


 హనుమంతుడు తన గానాన్ని ముగించిన తర్వాత తుంబుర నారదులిద్దరూ సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాదని అంగీకరించారు. 


హనుమద్గానంతో తమ కళ్లు తెరుచుకున్నాయని అన్నారు. వారి మాటలతో బాహ్యస్పృహలోకి వచ్చిన దేవతలు అక్కడకు వచ్చిన మహావిష్ణువును గమనించారు.


 ఆయన అభిప్రాయం కోరారు. తుంబుర నారదులిద్దరూ తన భక్తులే అయినా, ఇద్దరిలోనూ ఇంకా అహం పూర్తిగా నశించలేదని, అందుకే వారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేక పోయారని, అహాన్ని వీడటం వల్లనే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వివరించాడు విష్ణువు..


అహం ఉన్నంత కాలం ఏ విద్యలోనూ పరిపూర్ణత లభించదు. . అహం విడనాడితేనే పరిపూర్ణత సాధ్

జై శ్రీమన్నారాయణ...(సేకరణ)..🚩🌞🙏🌹🎻

మనుస్మృతి

! మనుస్మృతి ఈనాటిది కాదురా పాడయిన మొద్దు రాచ్చిప్ప మొహమా! ..మనం కొలిచే శ్రీరాముడు ఎన్నో యుగాల క్రితం ఒక కోటీ డెబ్భై అయిదు లక్షల సంవత్సరాలు క్రితం జన్మించిన వాడు అయితే..అతనికి అత్యంత పూర్వం ఆచరించబడిన వ్యవస్థ మను స్మృతి.ఇది సత్యయుగం లో ఆచరించినది.అంటే 27 మహా యుగాల క్రితం సంగతి ఇది. ఆనాటివి ఈనాటి వరకూ ఎలా వస్తున్నాయన్న తింగరి ప్రశ్నలు వేశావో తిత్తి తీస్తా! ఆ కాలములో వారి ధారణా శక్తి అద్భుతంగా ఉండేది.ఒకరి నుండి ఒకరికి మౌఖికంగానే ఇవన్నీ వచ్చాయి. మధ్యలో ఏవైనా కాలగతిలో అంతరాయాలు ఏర్పడితే ఎవరో ఒకరు తపస్సంపన్నులు తిరిగి వాటిని ఉద్ధరించారు. ప్రస్తుతం ఈ కలియుగములో.. ఆచరించదగ్గది పరాశర స్మృతి. మనకు పద్దెనిమిది పురాణాలు ఉన్నట్టే మనకు పద్దెనిమిది స్మృతులు ఉన్నాయి.అసలు స్మృతి అంటే ఏమైనా తెలుసుట్రా మిరప తోటలో పిడత మొహాలూ మీరూనూ.

స్మృతులు అంటే ఆయాకాలాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడ్డ ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు. వాటిలో మను స్మృతి ఒకటి. ఈమానవ ధర్మశాస్త్రమున విశ్వ సృష్టి నుండి అన్ని విషయాలూ చెప్పబడి ఉన్నాయి. ఇందు బ్రహ్మ,క్షత్రియ,వైశ్య, శూద్రులు అను చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వివాహక్రమఉరేయ్ నికృష్ట అక్కుపక్షీ! మనుస్మృతి ఈనాటిది కాదురా పాడయిన మొద్దు రాచ్చిప్ప మొహమా! ..మనం కొలిచే శ్రీరాముడు ఎన్నో యుగాల క్రితం ఒక కోటీ డెబ్భై అయిదు లక్షల సంవత్సరాలు క్రితం జన్మించిన వాడు అయితే..అతనికి అత్యంత పూర్వం ఆచరించబడిన వ్యవస్థ మను స్మృతి.ఇది సత్యయుగం లో ఆచరించినది.అంటే 27 మహా యుగాల క్రితం సంగతి ఇది. ఆనాటివి ఈనాటి వరకూ ఎలా వస్తున్నాయన్న తింగరి ప్రశ్నలు వేశావో తిత్తి తీస్తా! ఆ కాలములో వారి ధారణా శక్తి అద్భుతంగా ఉండేది.ఒకరి నుండి ఒకరికి మౌఖికంగానే ఇవన్నీ వచ్చాయి. మధ్యలో ఏవైనా కాలగతిలో అంతరాయాలు ఏర్పడితే ఎవరో ఒకరు తపస్సంపన్నులు తిరిగి వాటిని ఉద్ధరించారు. ప్రస్తుతం ఈ కలియుగములో.. ఆచరించదగ్గది పరాశర స్మృతి. మనకు పద్దెనిమిది పురాణాలు ఉన్నట్టే మనకు పద్దెనిమిది స్మృతులు ఉన్నాయి.అసలు స్మృతి అంటే ఏమైనా తెలుసుట్రా మిరప తోటలో పిడత మొహాలూ మీరూనూ.

స్మృతులు అంటే ఆయాకాలాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడ్డ ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు. వాటిలో మను స్మృతి ఒకటి. ఈమానవ ధర్మశాస్త్రమున విశ్వ సృష్టి నుండి అన్ని విషయాలూ చెప్పబడి ఉన్నాయి. ఇందు బ్రహ్మ,క్షత్రియ,వైశ్య, శూద్రులు అను చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వివాహక్రమ పంచమహాయజ్ఞాతిథిపూజా పార్వణవిధి శ్రాద్ధవిధాన భోజననియమాదులు, స్త్రీ,పురుషధర్మములు, రాజధర్మములు, వ్యవహార ధర్మములు, ప్రాయశ్చిత్త నియమములు మొదలగు హిందువుల వైదిక లౌకిక విషయములు అన్నియూ ఆకాలములో ఆచరించినవి ఉంటాయి.

మనుస్మృతి

బృహస్పతిస్మృతి

దక్షస్మృతి

గౌతమస్మృతి

యమస్మృతి

అంగీరసస్మృతి

యాజ్ఞవల్క్యస్మృతి

ప్రచేతస్స్మృతి

శాతాతపస్మృతి

పరాశరస్మృతి 

సంవర్తస్మృతి

ఔశనసస్మృతి

శంఖస్మృతి

లిఖితస్మృతి

ఆత్రేయస్స్మృతి

విష్ణుస్మృతి

ఆపస్తంబస్మృతి

హరీతస్మృతి 

మళ్లీ వీటిలో ఉపస్మృతులు పదునెనిమిది ఉన్నాయి.

కణ్వస్మృతి

కపిలస్మృతి

లోహితస్మృతి

దేవలస్మృతి

కాత్యాయనస్మృతి

లోకాక్షిస్మృతి

బుధస్మృతి

శాతాతపఉపస్మృతి

అత్రిస్మృతి

ప్రచేతస్మృతి

దక్షఉపస్మృతి

విష్ణుస్మృతి

వృద్ధవిష్ణుస్మృతి

వృద్ధమనుస్మృతి

ధౌమ్యస్మృతి

నారదస్మృతి

పౌలస్త్యస్మృతి

ఉత్తరాంగిరసస్మృతి

అసలు వీటి గూర్చి ఏ మాత్రమూ తెలియని ప్రతీ అక్కుపక్షీ అశుద్ధం తిన్న కాకిలా మను స్మృతి, మనువాదులు అంటూ అరుస్తారేమిట్రా పగిలిపోయిన పింగాణీ జాడీ మొహమా!!

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*సరసిజనాభ! సత్పురుషసంగ సమంచిత భక్తి యోగ వి*

*స్ఫురణ ననుగ్రహింపబడి శుద్ధము నొందినవాని చిత్త మ*

*స్థిర బహిరంగముం గనదు; చెందదు భూరి తమస్స్వరూప సం*

*సరణ గుహన్ జిరంబు గనఁజాలు భవన్మహనీయ తత్త్వమున్.*


బ్రహ్మగారి సృష్టికి కారణమైన పద్మం నాభియందు విరాజిల్లే నారాయణా! సత్పురుషుల సాంగత్యం వలన మరింత ఉజ్జ్వలంగా ప్రకాశించే భక్తియోగంతో మానవుని చిత్తం నిర్మలం అవుతుంది. అప్పుడు అది చంచలమైన వెలుపలి ప్రపంచాన్ని చూడదు. లెక్కకు అందని అజ్ఞానస్వరూపమైన సంసారమనే గుహలోనికి చేరుకోదు. అంతేకాదు, నీదైన మహనీయతత్త్వాన్ని నిత్యమూ పొందగలుగుతుంది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 35*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ।*

*యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ।।*



*భావము:* 

ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారే, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.

 

*వివరణ:* 

ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారే, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారే, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అశాశ్వతమునకై ఆరాటమా?

 శు భో ద యం🙏


"అశాశ్వతమునకై ఆరాటమా?


"తరగల్,పిప్పలపత్రముల్,మెఱుగుటద్దంబుల్,

మరుద్దీపముల్,/

కరికర్ణాంతము లెండమావులతతుల్,ఖద్యోతకీటప్రభల్,/

సురవీధీలిఖితాక్షరంబు లసువుల్,జ్జ్ోస్నామయః పిండముల్/

సిరు,లందేల మదాంధులౌదురుజనుల్?శ్రీకాళహస్తీశ్వరా!


శ్రీకాళహస్తీశ్వర శతకము-ధూర్జటిమహాకవి:


భావము:-ప్రాణములు, సముద్రకెరటములను,రావియాకులయంచులవలెను,తళుకుటద్దములవలెను,మెఱపులవలెను,కరికర్ణాంతములవలెను,(ఏనుగుచెవి తుదలు)ఎండమావులవలెను,మిణుగురుపురుగులకాంతివలెను,ఆకాశపువ్రాతలవలెను,చెచలమైనవి.

       సంపదలా వెన్నెలగుళికలవంటివి.మరి వానినిజూచుకొని నరులేల మదాంధులౌదురో అనూహ్యముగదా!


విశేషములు:కవి యీపద్యమున నరులప్రాణములుగానీ,సిరులుగానీ శాశ్వతమైనవి కావనిచెప్పుచు,చెంచెలమైన విషయములనుపమానములుగా చెప్పుచున్నాడు.

నదీతరంగములు,రావియాకులు,అద్దాలమెఱపులు,ఏనుగుచెవులు,ఎండమావులు,మిణుగురులకాంతి,మెఱుపులు,ఆకాశపువ్రాతలు(శూన్యంలోవ్రాత)ఇవిమిగులయస్థిరమైనవి.

        ఇక సిరులా,(భాగ్యములు) వెన్నెలగుళికలవంటివి.కొంతకాలముమాత్రమే వెన్నెలకాంతులు.అదియు శాశ్వతము గానిదే!

మరి యస్థిరమైన వీనిని నమ్ముకొని గర్వమున సంచరించు నరులు శాశ్వతుడవగు నిన్నేల మరచుచున్నారని తన ఆశ్చర్యమును ప్రకటించుచు.ప్రజలయజ్ఙానమునకు విచారమునువ్యక్త

ము చేయుచున్నాడు.🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అరణ్యవాసమునందే

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   *||శ్లోకము||*


*అత్యన్తవిముఖే దైవే వ్యర్థే యత్నే చ పౌరుషే*।

*మనస్వినో దరిద్రస్య వనాద్యన్యాత్ కుతస్సుఖమ్*॥


*||తాత్పర్యము||*


"పురుష ప్రయత్నం - {సమస్త ప్రయత్నములూ} వ్యర్థమైపోయి దైవము ప్రతికూలంగా వున్న వానికి అరణ్యవాసమునందే సుఖముగానీ మరొక చోట లేదు".....

మౌనం వహించడమే

 *శ్లోకం*:


తావన్మౌనేన నీయంతే

కోకిలశ్చైవ వాసరాః|

యావత్సర్వజనానంద

దాయినీ వాక్ప్రవర్తతే||


తనకు కూత వచ్చేవరకు కోయిల మౌనంగా ఉండి, రోజులు గడుపుతుంది. కాలక్రమంలో మధురమైన స్వరంతో అందరినీ ఆకర్షించును. అదే విధంగా, సమయం వచ్చినప్పుడే సందర్భోచితమైన మాట పలికి అందరినీ మెప్పించాలి.  సమయం సందర్భం‌ రానంతవరకు మౌనం వహించడమే ఉత్తమం.

సంకల్పము

 *శుభోదయం*

16.2291923113

Xxxxxx

 సంధ్యా వందన 

మరియు ఇతర పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.27.02.2024

మంగళ వారం (భౌమ వాసరే) 

 *******

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

మాఘ మాసే కృష్ణ పక్షే

తృతీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

*ఇతర పూజలకు*

 *శ్రీ శోభకృత్  నామ సంవత్సరే ఉత్తరాయణే*

*శిశిర ఋతౌ* 

*మాఘ మాసే* 

*కృష్ణ పక్షే  తృతీయాయాం*

*భౌమ వాసరే అని చెప్పుకోవాలి*.

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.26

సూ.అ.6.01

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

శిశిర ఋతువు

మాఘ మాసం 

కృష్ణ పక్షం తదియ రా. 11.25.వరకు. 

మంగళ వారం. 

నక్షత్రం హస్త రా.తె.5.25 వరకు. 

అమృతం రా.10.48 ల  12.34 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.43 ల 9.29 వరకు.

దుర్ముహూర్తం రా.10.58 ల 11.48 వరకు. 

వర్జ్యం ప.12.13 ల 1.59 వరకు. 

యోగం శూల మ.3.19 వరకు.  

కరణం వనజి ప. 10.26 వరకు.  

కరణం భద్ర రా. 11.25 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ఉ.7.30 ల 9.00 వరకు. 

*****************

పుణ్యతిధి మాఘ బహుళ తదియ. 

*****************

గమనిక* :౼

మా సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక  *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏

.

నువ్వు తక్కువ వాడివి కావు సామీ...

 *👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ*👏

*🤣పుల్లమామిడి, నిమ్మ, ఉసిరి, ఉప్పు, కారం సృష్టించావు. ఊరగాయ పెట్టుకునే తెలివి ఇచ్చావు. కానీ ఆశపడి తింటే అల్సర్, బి.పి బహుమతిగా ఇస్తావు.🤣* 


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏*

*🤪పంచదార, బెల్లం, తియ్యటి పళ్ళు ఇచ్చావు.  కానీ, ఆత్రపడి తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు.🤪*


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ.👏*

*😃మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు. శుచి శుభ్రత లేకపోతే, మా చెమట వాసనతోనే గుర్తుపట్టి మా నెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు.😃*


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏*

*🥱సంపదలు, ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు, చంపుకునేటట్లు చేస్తున్నావు.🥱*


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏* 

*🤣రాజ్యాలతో పాటు రాజకీయాలు సృష్టించి ఆప్తమిత్రులకు, అన్నదమ్ములకు, భార్యాభర్తలకు ఎడబాటు చేస్తున్నావు.🤣* 

*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ..👏*

*🫢నేను, నాది అనే అహం కలిగిస్తావు. అది  వదిలితే గాని నీ దగ్గరకు రానీయనంటావు🫢*. 


*👏నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏*

*🤪ఇంద్రియాలను ఇచ్చావు. వాటికి రుచులు పుట్టించావు. అన్నిటిని వదిలితేగాని నీ దగ్గరకు రానీయనంటావు.🤪* 

*👏నువ్వు తక్కువ వాడివి కావు సామీ...👏* 

*😭నిన్నర్థం చేసుకోవడం మా వల్లకాదని నీకు తెలిసి ఈ నాటకాలు మాచే ఆడిస్తూ ఉంటావు.😭*


*🫡కానీ సామీ!* 

*నేనూ తక్కువవాణ్ని కాదు. నాకు బాగా తెలుసు, నీ కాళ్ళట్టుకుంటే, నీవే నన్నెత్తుకుంటావని🫡*

పరిజ్ఞానం

 *పరిజ్ఞానం* 


" *తృటి* లో తప్పిన ప్రమాదం "  అని.. అసలీ *తృటి* అంటే ఏమిటి? 


తృటి =సెకండ్ లో 1000 వంతు

100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేషం అంటే రెప్ప పాటుకాలం (నిముషం కాదు..)

3 నిమేషాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్టం

12 కష్టాలు = ఒక నిముషం 

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము,ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల.

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు

4లక్షల 32 వేల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం

పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణు కు ఒక పూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట


వేల సంవత్సరాల క్రితమే కాలాన్ని ఇంత సూక్ష్మంగా, స్థూలంగా విభజన చేసిన మన పూర్వీకుల విజ్ఞానం ఇది

వేదధ్వని

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*యత్ర వేదధ్వని శ్రాంతం* 

*న చ గోభిరలంకృతమ్*

*యన్నబాలైః పరివృతం* 

*శ్మశానమివ తద్గృహమ్*


*- _తాత్పర్యము_-* 


తా𝕝𝕝 *ఏ ఇంట్లో వేదధ్వని వినబడదో, ఏ ఇల్లు అవులతో అలంకరించబడదో, ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉండరో ఆ ఇల్లు శ్మశానము వంటిది అని అత్రిస్మృతి హెచ్చరించింది*.....


🧘‍♂️🙏🪷 ✍️🙏

ప్రకాశం పంతులు

 ప్రకాశం పంతులు గారి గొప్పతనం గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వీడియోలో చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే...


"సార్..ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూంలో పడక్కుర్చీలో నిద్ర పోతున్నారు..టికెట్ లేదు..బయటికి వెళ్లమంటే వెళ్ళట్లేదు " స్టేషన్లో వెయిటింగ్ రూములను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్ కి కంప్లైంట్ చేసింది 


అది రాజమండ్రి స్టేషన్ 

సమయం తెల్లవారి ఐదు గంటలు 


'సరే నేను వస్తా పద 'అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూంకి వెళ్ళాడు 


అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడక్కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు 


ఆ ముసలాయన్ని చూసి స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యాడు 


ఆ ముసలాయన ఎవరో కాదు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు 


ప్రకాశం గారు చనిపోవడానికి ఏడాది ముందు జరిగింది ఈ సంఘటన 


వెంటనే స్టేషన్ మాస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నమస్కరించి " అయ్యా మీరా ? నేను రాజేశ్వరరావు గారి అబ్బాయిని మీ శిష్యుడిని " అని నమస్కారం చేశాడట 


ప్రకాశం గారు కళ్ళు తెరిచి " ఏరా.. భోంచేశావా ?" అని అడిగాడట 


పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్ కి అర్థం కాలేదు 


'తెల్లారి ఐదు గంటలకు ఎవరైనా కాఫీ తాగావా ? అంటారు లేకపోతే టిఫిన్ తిన్నావా ? అని అడుగుతారు..మరి పంతులు గారేంటి భోంచేశావా ? అని అడుగుతున్నారు..బహుశా వయసు మీద పడటంతో ఏం అడగాలో తెలీక ఇలా అడిగారేమో


 అనుకుని పంతులు గారితో ,


"అయ్యా ఇప్పుడు సమయం తెల్లారి ఐదు గంటలు..మీరు కాఫీ తాగావా అని అడగబోయి భోంచేశావా ? అని అడిగినట్టున్నారు "అని అన్నాడు


దాంతో పంతులు గారు ,


"ఏరా మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా ? నేను నిన్నేమ్ అడిగాను..భోంచేశావా ? అనడిగా..దానికి నువ్వేం చెప్పాలి..నేను భోంచేశా.. మీరూ చేసారా ? "అని కదా అడగాల్సింది 


స్టేషన్ మాస్టర్ కి విషయం అర్థమైంది 


పంతులు గారు ఆకలి బాధతో ఉన్నారని అర్థమైంది 


వెంటనే ఆయనకు కావాల్సిన పదార్దాలను వండటానికి ఇళ్ల దగ్గర మనుషులకు పురమాయించారు 


ఈలోపు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి జనాలు పోటెత్తారు 


"ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారు ?" అని ఒక పెద్దమనిషి పంతులు గారిని అడిగారు 


"విజయవాడ వెళ్తా.."అన్నారు పంతులు గారు 


పంతులు గారి దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడే జనం తలా రెండు రూపాయలు..ఐదు రూపాయలు వేసుకుని మొత్తం 72 రూపాయలు పోగు చేసి పంతులు గారి జేబులో పెట్టి విజయవాడ రైలు ఎక్కించారు 


రైలు బయలుదేరుతుందనగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారి కాళ్ళమీద పడి,

 " పంతులు గారూ.. మీరు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి పది మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా..భార్య కాన్సర్ తో బాధ పడుతుందయ్యా ..అంటూ పెద్దగా ఏడవటం మొదలెట్టాడు 


పంతులు గారు వాడ్ని లేపి " ఏరా మనుషులన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా ? ఇదిగో ప్రస్తుతానికి ఈ 72 రూపాయలు ఉంచు..అని జేబులో ఉన్న 72 రూపాయలు వాడి చేతిలో పెట్టాడు 


ఇదంతా చూసిన ఓ పెద్దమనిషి " అయ్యా పంతులు గారు..మీ జేబులో ఉన్న మొత్తం వాడి చేతిలో పెట్టారు..మీకంటూ కనీసం ఓ పది రూపాయలన్నా ఉంచుకోవాలి కదండీ..సరే..ఎలాగోలా విజయవాడ చేరతారు..మళ్లీ అక్కడ ఎవరో ఒకళ్ళు మీకు అన్నం పెట్టాలి..ఇంకొందరు పూనుకుని మిమ్మల్ని రైలెక్కించాలి..ఎంతో గొప్పగా బతికిన మీకు ఈ ఖర్మ ఏంటి పంతులు గారూ " అంటూ భోరున ఏడిస్తే ,


పంతులు గారు ఆయన భుజం మీద చెయ్యేసి ' ఏరా నాకేమన్నా అయితే చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు.. పాపం వీడికెవరు ఉన్నార్రా ?" అని కళ్లనీళ్ల పర్యంతం అయ్యారట 


ఆ రోజుల్లో తమకోసం కాకుండా జనం కోసం నాయకులు బతికేవాళ్ళు 


ముఖ్యమంత్రి పదవి చేసినప్పటికీ తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయాడు పంతులు గారు 


మరి ఇప్పుడు అయితే?

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

27-02-2024 మంగళవారం (భౌమ వాసరః) రాశి ఫలితాలు

 *శుభోదయం*

16.2291923113

**********

27-02-2024

మంగళవారం (భౌమ వాసరః)

రాశి ఫలితాలు

**********

మేషం

కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చిన్ననాటి  మిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు. వాహన సంభంధిత వ్యాపారాలు రాణిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం

సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందుతారు

---------------------------------------

మిధునం

సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో దృష్టి సారించడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. కీలక వ్యవహారాలలో బద్దకించడం మంచిది కాదు. కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.

---------------------------------------

కర్కాటకం

చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  వృత్తి వ్యాపారాలలో నిదానంగా వ్యవహారించాలి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత  పెరుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

-------------------------------------

సింహం

సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దైవ  కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

---------------------------------------

కన్య

చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి.  సోదరులతో  కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ  వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి.

---------------------------------------

తుల

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.  నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమాకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. చిన్ననాటి  మిత్రుల నుండి ధన  సహయం  అందుతుంది.  స్ధిరాస్తి  క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

---------------------------------------

వృశ్చికం

వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన  వ్యవహారాలలో  తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బందులు తప్పవు.

-------------------------------------

ధనస్సు

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.  విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు.

--------------------------------------

మకరం

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో  పెద్దలతో  సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.

---------------------------------------

కుంభం

ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.  వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

---------------------------------------

మీనం

గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి. వాహన ప్రయాణ   విషయంలో జాగ్రత్త వహించాలి.  ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.  నూతన రుణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారస్థులకు గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------

*గమనిక* :౼

మన సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక  *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

⚜ శ్రీ శుక్రలా మాత ఆలయం

 🕉 మన గుడి : నెం 239


⚜ జమ్మూకాశ్మీర్  : బిల్లవార్


⚜ శ్రీ శుక్రలా మాత ఆలయం



💠 శుక్రలా మాత వైష్ణో దేవికి  అక్క అని గట్టి నమ్మకం. 

దేవిమా సుక్రాలను అత్యంత భక్తిపూర్వకంగా జగత్ జననీ, రాజర్జస్వరీ మాత అని సంబోధిస్తారు, ఇక్కడ భక్తులు పవిత్ర దర్శనం కోసం వేల సంఖ్యలో తరలివస్తారు.

 

💠 సుక్రాల మాత మందిరం జమ్మూలోని కతువా జిల్లాలో బిల్లవార్‌లో ఉంది.

ఈ పుణ్యక్షేత్రం 3500 అడుగుల ఎత్తులో కొండపై ఉంది.


💠 ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది, ఎందుకంటే మీరు పవిత్రమైన మరియు నిజమైన హృదయంతో కోరుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.


⚜ బిల్లవర్ సుక్రాల మాత కథ  ⚜


💠 500 సంవత్సరాల క్రితం త్రిలోచన అనే మహాకవి సుక్రాల గ్రామంలో నివసించాడు.

తన చిన్న వయస్సులోనే విద్యను అభ్యసించడానికి కాశ్మీర్‌కు వెళ్లాడు.

తన ధార్మిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన తరువాత అతను తన గ్రామానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు.

అతను బారాముల్లా చేరుకున్నప్పుడు అతను హవాన్ (పూజా సమగ్ర్) కొనుగోలు చేసి అక్కడ హవాన్ ప్రారంభించాడు. అతను పూజలో తన మనస్సును కేంద్రీకరించాడు మరియు మొత్తం హవాన్ (పూజా సామగ్రి) అయిపోయింది మరియు హవాన్ స్థానంలో తన శరీర ముక్కలను అందించడం ప్రారంభించాడు మరియు చివరికి అతను తన తలను సమర్పించడానికి తనను తాను సిద్ధం చేసుకున్నాడు, అయితే అతను తన తలని కత్తిరించడానికి తన పదునైన ఆయుధాన్ని ఎత్తినప్పుడు మాతా శుక్రలా ( మాతా వైష్ణో యొక్క సోదరి) కనిపించి అతన్ని ఆపింది.

ఈ విధంగా మాతా సుక్రాల (మాత మాల్) భగత్ త్రిలోచనకు దర్శనం ఇచ్చింది.


💠 భగత్ త్రిలోచన్ మాతను బిల్లవర్ (జమ్మూ ప్రావిన్స్)లోని సుక్రాల్స్‌లో స్థిరపడమని బలవంతం చేశాడు. మాత అతని  కోరికను అంగీకరించి, అక్కడ స్థిరపడతానని వాగ్దానం చేసింది, మీ మూడవ (3వ) తరానికి చెందిన పురుషుడు నా పూజారి అవుతాడు.

ఈ మాటలు పలికిన తర్వాత మాత అతని దృష్టిలోంచి మాయమైంది.


💠 భగత్ త్రిలోచన్ యొక్క మూడవ తరంలో అతని మనవడు శివ నందన్ మాత పూజారి (భగత్) అయ్యాడు. అతను కూడా తన తాత త్రిలోచన వలె గొప్ప పండితుడు.

ఒకరోజు కలలో పూజారి శివ నందన్ మాతా శుక్రలను చూసి, త్రిలోచన మూడవ (3వ) తరంలో ఒక పురుషుడు నా పూజారి అవుతాడని తన తాతతో చేసిన వాగ్దానం గురించి చెప్పి శివ నందన్‌ను అడవికి (అడవి) వెళ్ళమని ఆదేశించింది.


💠 మరియు అక్కడ మీకు తెల్లటి పూల లత కనిపిస్తుంది మరియు ఆ లత కింద ఒక అసాధారణ మూర్తి (విగ్రహం) పడుకుని ఉంది. కలలో ఇచ్చిన మాత సూచన మేరకు అతను ఆ ప్రదేశానికి చేరుకున్నాడు మరియు అక్కడ మాతా సుక్రాల యొక్క ఒక అసాధారణ విగ్రహం కనుగొన్నాడు. భగత్ శివ నందన్ ఎటువంటి విరామం లేకుండా పూజలు ప్రారంభించారు.


💠 ఒకరోజు యువరాజు మెహద్ సింగ్ తన బృందంతో కలిసి దట్టమైన అడవికి వెళ్లి 120 (నూట ఇరవై) అడవి మేకలను చంపాడు. అతను తన బృందంతో కలిసి అడవి  నుండి బయటకు వచ్చినప్పుడు తన కడుపులో తీవ్రమైన నొప్పిని అనుభవించాడు. 

అతనిని బిల్లావర్ వద్దకు తీసుకువెళ్లారు మరియు అతని చికిత్స కోసం వైద్యులును సంప్రదించారు, కానీ తీవ్రమైన నొప్పికి పరిష్కారం కనుగొనడంలో విఫలమయ్యారు.

చివరగా మాతా సుక్రాల శివ నందన్ పూజారి యువరాజు  నొప్పి చికిత్స గురించి సలహా ఇవ్వాలని అభ్యర్థించారు. 

మాతా సుక్రాల ఆలయాన్ని నిర్మిస్తే నొప్పి తొలగిపోతుందని పలికారు.

మెహద్ సింగ్ శుక్రాల వద్ద మాత ఆలయాన్ని నిర్మిస్తానని వాగ్దానం చేశాడు. అతను మాత శుక్రల కోరికను అంగీకరించినప్పుడు, యువరాజు యొక్క బాధ మాయమై పోయింది


💠 మెహద్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణీత సమయంలో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. 


💠 ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత పెద్ద పండితులు, పండితులు పాల్గొనే పెద్ద హవనాన్ని ఏర్పాటు చేశారు. హవాన్ పూర్తయినప్పుడు, మాత రాజు మెహద్ సింగ్ మరియు అతని కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు మరియు చంబా రాజ్యాన్ని మరియు దాని ప్రజలను చూడమని కూడా వారిని కోరింది.


💠 ఈ ఆలయ ప్రస్తావన వేదాలు మరియు పురాణాలలో ఉంది. శివుడు, గణేశుడు, హనుమంతుడు, పార్వతి అందాలు, కళలు మరియు మూర్తిలు చూడదగ్గవి. మీరు శుక్రాలను సందర్శిస్తే, శివుడు మరియు మాతా శుక్రాల అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరుతాయి. 


💠.ఇత్తడి సింహంపై వెండి తలపై కూర్చున్న షిల్లా (రాతి పలక) ఆకారంలో దేవత ఇక్కడ ప్రత్యక్షమైంది. దాని వెనుక మహిషాసుర ముర్దిని (మహా-లక్ష్మి యొక్క పునః అవతారం) మహిషాసురుడు, రాక్షస రాజు శరీరంపై నిలబడి ఉన్న చిత్రం కూడా ఉంది. 

దేవి ఒక చేతిలో కత్తితో నాలుగు ఆయుధాలు ధరించి ఉంది. 


💠 ప్రతి సంవత్సరం పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. నవరాత్రుల సమయంలో వారి సంఖ్య 50 వేలకు పైగా ఉంటుంది.

 

💠 ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బిల్లవార్ నుండి 9.60 కి.మీ మరియు కతువా నుండి 75 కిమీ, జమ్మూ నుండి 80 కి.మి.

రష్యాలో వివాహాలు.


ఇన్ఫోసిస్ సుధానారాయణమూర్తి



           *రష్యాలో వివాహాలు..*

               ➖➖➖✍️


*సుధా నారాయణమూర్తి ఒక స్వీయ అనుభవాన్ని పంచుకుంటూ ఇలా రాశారు:*

```

“ఇటీవల నేను రష్యాలోని మాస్కోలో ఉన్నప్పుడు... ఓ రోజు ఆదివారం అక్కడి పార్కుకి వెళ్లాను.


వేసవి నెల, కానీ వాతావరణం చల్లగా ఉంది, కొద్దిగా చినుకులు పడుతున్నాయి.  నేను గొడుగు కింద నిలబడి     ఆ ప్రాంత అందాలను ఆస్వాదిస్తున్నప్పుడు, అకస్మాత్తుగా నా దృష్టి ఒక యువజంట మీద పడింది. వాళ్ళు కొత్తగా పెళ్లి అయిన వారని స్పష్టంగా తెలుస్తోంది. ఆ అమ్మాయికి దాదాపు ఇరవై ఏళ్లు ఉంటాయి. అబ్బాయి కూడా దాదాపు అదే వయసులో, చాలా అందమైన సైనిక యూనిఫాంలో ఉన్నాడు.


ఆ అమ్మాయి ముత్యాలు, అందమైన లేస్‌తో అలంకరించబడి, శోభాయమానంగా ఉన్న అందమైన తెల్లటి శాటిన్ గౌను ధరించి ఉంది.  ఆమె వెనుక, ఇద్దరు తోడుపెళ్లి కూతుర్లు నిలబడి, పెళ్లి గౌను మురికి కాకుండా దాని అంచుని ఎత్తిపట్టుకున్నారు.


ఆ కుర్రాడు తడవకుండా తలపై గొడుగు పట్టుకున్నాడు.  అమ్మాయి ఒక పూల గుత్తిని పట్టుకొని ఉంది. ఇద్దరూ చేతులు ముడుచుకుని నిలబడ్డారు. ఆ దృశ్యం చాలా అందంగా ఉంది. నేను వారిని చూసి చాలా ఆశ్చర్యపోయాను, ‘పెళ్ళైన వెంటనే ఈ వర్షంలో ఇక్కడ ఈ పార్కుకు ఎందుకు వచ్చారా’ అని ఆశ్చర్యపోయాను. వారు కావాలనుకుంటే దీనికంటే ఇంకా ఆనందకరమైన ప్రదేశానికి వెళ్లి ఉండవచ్చు.  నేను చూస్తూండగా వారిద్దరూ కలిసి పార్క్ లో ఉన్న ఒక స్మారక చిహ్నం దగ్గర ఉన్న ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తూ వెళ్లి, పుష్పగుచ్ఛాన్ని అక్కడ ఉంచి, మౌనంగా తలవంచుకుని, నెమ్మదిగా వెనక్కి వచ్చారు.


నేను ఈ దృశ్యాన్ని చాలాసేపు ఆస్వాదించాను.  కానీ నాకు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది.


నవ వధూవరులతో కలిసి నిలబడి ఉన్న ఓవృద్ధుడిపై నాచూపు పడింది. ఆ పెద్దాయన కళ్ళు నా చీర మీద పడగానే, "మీరు భారతీయులా?" అని అడిగాడు.


“అవును నేను భారతీయురాలినే” అని నమ్రతగా బదులిచ్చాను. 


చాలా ఆప్యాయంగా ఇద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఈలోగా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుదామని ఎదురుచూస్తూ, కుతూహలంగా, అతనికి ఇంగ్లీష్ ఎలా తెలుసు అని అడిగాను.


అతను చాలా మర్యాదపూర్వకంగా ఇలా బదులిచ్చాడు: 

"నేను విదేశాలలో పనిచేశాను."


దానితో, నేను, “ఈ యువ జంట తమ పెళ్లి రోజున యుద్ధ స్మారక చిహ్నం వద్దకు ఎందుకు వచ్చారో దయచేసి నాకు చెప్పగలరా?" అని అడిగాను.


“ఇది రష్యా ఆచారం, ఇక్కడ వివాహాలు తరచుగా శనివారం లేదా ఆదివారాలు జరుగుతాయి!” అని అతను చెప్తూ, "ఇక్కడ వివాహ కార్యాలయంలో రిజిస్టర్‌పై సంతకం చేసిన తర్వాత, ప్రతి వివాహిత జంట      వాతావరణంతో సంబంధం లేకుండా సమీపంలోని ప్రముఖమైన జాతీయ స్మారక చిహ్నాలను సందర్శించాలి.   ఈ దేశంలోని ప్రతి అబ్బాయి కనీసం రెండేళ్లపాటు సైన్యంలో పనిచేయాలి.  అతని హోదా ప్రకారం, వివాహానికి తన సర్వీస్ యూనిఫాం మాత్రమే ధరించాలి", అని వివరించాడు.


నేను చాలా ఆశ్చర్యపోయాను, "ఇక్కడ అలాంటి ఆచారం ఎందుకు ఉంది?" అని అడిగాను.


అది విని, "ఇది కృతజ్ఞతాభావం. మా పూర్వీకులు రష్యా చేసిన వివిధ యుద్ధాలలో తమ ప్రాణాలను అర్పించారు. వాటిలో కొన్ని మేం గెలిచాం, కొన్ని ఓడిపోయాం, కానీ వారు ఎల్లప్పుడూ దేశం కోసమే త్యాగం చేశారు. కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్క జంట తమ పూర్వీకుల త్యాగం వల్లే తాము శాంతియుతమైన, స్వేచ్ఛాయుత రష్యాలో జీవిస్తున్నామని గుర్తుంచుకోవాలి. అందుకే వారి ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలి."


“పెళ్లి వేడుకలకంటే దేశం పట్ల ప్రేమే ముఖ్యమని ఇక్కడి మాపెద్దల నమ్మకం. అందుకే మాస్కో అయినా, సెయింట్ పీటర్స్‌బర్గ్ లేదా రష్యాలోని మరే ఇతర ప్రాంతంలో అయినా, పెళ్లి రోజున సమీపంలోని యుద్ధ స్మారక చిహ్నం వద్దకు వెళ్లే, ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని మేం పట్టుబడుతున్నాం.”


ఆ పెద్దాయనతో మాట్లాడిన తర్వాత నా మనసులో ఒక్కటే మెదిలింది, ఇక్కడ మన దేశంలో మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం? మన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజున మన అమరవీరులను స్మరించుకునే రివాజు మనకు ఉందా? మన దేశంలో వివాహాల సమయంలో, చీరల కోసం షాపింగ్ చేయడం, ఆభరణాలను కొనుగోలు చేయడం,  విస్తృతమైన వంటకాలను సిద్ధం చేయడం, డిస్కోలలో పార్టీలు చేసుకోవడం మొదలైన వాటితో తీరిక లేకుండా గడుపుతాం.

బహుశా మనం దాని గురించి ఎప్పుడూ ఆలోచించమేమో.

ఈ సంఘటన నా కళ్ళను నీళ్లతో నింపింది. ఈ గొప్ప ఆలోచన, ఆచారం గురించి మనం కూడా రష్యన్‌ల వద్ద నుండి నేర్చుకోవాలని నేను కోరుకున్నాను.

మన దేశం కోసం,  మన ఈ రోజు కోసం, మన రేపటి కోసం - ప్రాణత్యాగం చేసిన అమరవీరులను మనం కూడా గౌరవించవచ్చు,...!```

                       ➖🌷➖

                 

ఒక ఉదాత్తమైన కార్యం జరిగినప్పుడు దాని వలన కలిగే ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి. అప్పుడు చైతన్యం నిరంతరంగా పెరుగుతుంది.✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

హెయిర్ ఫాల్

 

       హెయిర్ ఫాల్ గురించి బాధపడుతూ నన్ను అడుగుతూ ఉన్నారు . వారికి అప్పటికప్పుడు కొన్ని తాత్కాలిక పరిష్కారాలు చెప్తూ ఉన్నాను. కాని అవి శాశ్వతంగా పరిష్కారం చూపలేకపోయేవి . మార్కెట్లో దొరికే వివిధ రకాల ఆయిల్స్ వాడి విసిగిపోయిన వారికోసం ఒక కేశతైలం తయారుచేసాను. దానితో పాటు పూర్తి ఒక షాంపూ కూడా తయారుచేశాను. 


        ఈ రెండు పూర్తి ప్రకృతిసిధ్ధ వనమూలికలతో 

తయారుచేయబడినవి. ఇది అత్యంత ప్రాచీన గ్రంధాలననుసరించి 12 రకాల మూలికలు కలిపి  ప్రాచీనపద్ధతులను అనుసరించి తయారుచేశాను. 


  కేశవృద్ధితైలం ఉపయోగాలు - 


 *  వెంట్రుకలు రాలిపోవడం ఆపుతుంది.


 *  బరకగా ఉన్న వెంట్రుకలను మృదువుగా మారుస్తుంది. 


 *  వెంట్రుకల మందాన్ని పెంచుతుంది. 


 *  వెంట్రుకల కుదుళ్లకు బలాన్ని చేకూర్చడమే కాకుండగా వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.


 *  తలలోని వేడిని తీసివేస్తుంది. తలలోని వేడివల్ల వచ్చే తలనొప్పిని నివారిస్తుంది.


 *  తలకు చల్లదనాన్ని ఇస్తుంది.


  హెర్బల్ షాంపు ఉపయోగాలు  - 


  *  చుండ్రుని శాశ్వతంగా పోగొడుతుంది.


  *  వెంట్రుకలకు అమితమైన బలాన్ని ఇస్తుంది. 


  *  వెంట్రుకలు చిట్లడం  ఆపుతుంది. 


     ఈ రెండిటి కాంబినేషన్ గతకొంతకాలంగా కొంతమంది మీద ప్రయోగించి చూసాను. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మీ అందరికి అందుబాటులో తీసుకుని వస్తున్నాను. 


       నా అనుభవంతో చెప్తున్నాను ఇది తప్పకుండా వెంట్రుకల సమస్యలపైనా బ్రహ్మస్త్రంలా పనిచేస్తుంది. అతి తక్కువకాలంలోనే మీ వెంట్రుకల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుంది.

 

  

  ఈ తైలం ఒక ప్రాచీన ఫార్ములాతో తయారుచేయబడినది. దీనిని వాడటం వలన సైడ్ అఫక్ట్స్ వంటివి ఉండవు. నిర్భయంగా వాడవచ్చు . ఇది పూర్తిగా 100% శుద్ధ ఆయుర్వేద మూలికలతో తయారుచేయబడినది. షాంపు కూడా పూర్తి ఆయుర్వేద మూలికలతో రూపొందించబడినది. చుండ్రు సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ షాంపు వాడటం వలన చుండ్రుసమస్య నుంచి బయటపడగలరు.


   ఈ షాంపు మరియు తైలం కావలిసిన వారు 9885030034  నెంబర్ నందు సంప్రదించగలరు .


గమనిక  - 


      రెండు నుంచి మూడు నెలలపాటు ఆపకుండా వాడటం వలన ఇంకా గొప్ప ఫలితాలు చూడగలరు . వేడి నీటితో తలస్నానం నిషిద్ధం . 


        కేశవృద్ధి తైలం మరియు షాంపు కావలసిన వారు 9885030034 ఫోన్ నంబర్ నందు డైరక్టుగా సంప్రదించగలరు . 


   కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


        9885030034

అష్టసిద్ధులు

 అష్టసిద్ధులు - కుండలినీ శక్తి జాగరణ .


        హిమాలయ పర్వతాలలో రహస్య గుహలు చాలా ఉన్నాయి. వాటి గురించి సామాన్య మానవులైన మనం ఎంతమాత్రమూ తెలుసుకోలేము. ఆ గుహలలో అత్యంత కఠిన సాధన చేస్తూ ధ్యానంలో ఉండు మహాయోగులు ఎంతో మంది ఉన్నారు . వీరు సామాన్యంగా జనబాహుళ్యంలోకి రారు. రావలసి వస్తే అదృశ్యరూపములో వచ్చి తమ కార్యం నిర్వర్తించుకొని పోగల గొప్ప శక్తి కలిగి ఉంటారు . వీరిలో వందల సంవత్సరాల వయస్సు కలిగినవారు కూడా ఉన్నారు . మరి వీరు ఇన్ని వందల సంవత్సరాలు ఎలా బ్రతికి ఉన్నారు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం . ఈ విషయం పైన అనేకమంది పాశ్చత్య పరిశోధకులు పరిశోధనలు కూడా చేశారు . దీని గురించి నేను కొన్ని పురాతన గ్రంథాలు పరిశీలించినపుడు కొంత వివరణ నాకు దొరికింది. దానిలో ఈ విధముగా ఉన్నది. ప్రతి మనిషి యొక్క ఆయష్షు అనేది బ్రహ్మ సంవత్సరాల పరంగా రాయడు. పుట్టిన ప్రతి జీవి ఇన్ని లక్షల ఉచ్చ్వాస , నిశ్చ్వాసాలు తీసుకుంటాడు అని మాత్రమే రాస్తాడు. మనిషి తన ఆయష్షు పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది తన శ్వాస మీద అధారపడి ఉంటుంది . ఆ ఉచ్చ్వాస , నిశ్చ్వాసాలు సమాప్తి అయ్యాక జీవి తన శరీరాన్ని వదిలి పరమాత్మని చేరుతుంది.


               ఈ సిద్ధాంతం ఖచ్చితంగా యోగుల విషయంలో పనిచేస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఎలా అంటే ఒక యోగి ధ్యానం చేస్తూ సమాధి స్థితిలో ఉన్నప్పుడు అతని యొక్క శ్వాస అనేది క్రమక్రమంగా తగ్గుతూ చివరికి పూర్తిగా ఆగిపోతుంది. అతని శరీరంలోని అవయవాల పనితీరు ఏ మాత్రం చెడిపోదు. శ్వాస ఆగుతుంది చుట్టూ ఉన్న కాలం ఆగదు.అతని ఉస్చ్వాస , నిశ్చ్వాసాలు యొక్క సంఖ్య తరగదు. ఈ విధముగా ఎంతకాలం గడిచినను అతను జీవించే ఉంటాడు. యోగం చేయువారు ప్రధానముగా తన శ్వాసని అదుపులో పెట్టుకొనే శక్తిని కలిగి ఉండాలి .


                        పైన చెప్పిన విధానంలో యోగుల ఆయష్షు పెరుగును . వీరిలో చాలా మంది కుండలీ శక్తిని మేల్కొలిపినవారై ఉంటారు . ఈ దశలో వీరికి అష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి . ముందు మీకు కుండలినీ శక్తి గురించి వివరిస్తాను. ఆ తరువాత కుండలిని శక్తి గురించి చెప్తాను .


        సిద్ధులను పొందినవాడు సిద్దుడు అవుతాడు. కొంతమంది కొన్నిరకాల సిద్ధులతో సంతృప్తి పడి ఆగిపోతారు. కాని కొందరు మాత్రమే అన్నిరకాల సిద్ధులను సాధించే వరకు విశ్రమించరు . ఈ సిద్ధులలో బేధాలు కలవు. ఇవి మొత్తం 8 రకాలు .అందుకే వీటిని "అష్టసిద్దులు " అని పిలుస్తారు . ఇవి వరుసగా  


 * అణిమ .


 * మహిమా .


 * చైవ .


 * గరిమ .


 * లఘిమ .


 * తథా .


 * ప్రాప్తిహి . 


 * ప్రాకామ్య .


 * మీశిత్వం .


 * వశిత్వం .


 * చాష్ట భూతయః .


 అష్టసిద్దులు యొక్క వివరణ -


   శరీరమును చాలా చిన్నదిగా చేసుకొను ప్రక్రియయే "అణిమ " .


 తన స్వరూపమును చాలా పెద్దగా చేసుకొను ప్రక్రియను " మహిమ" అని పిలుస్తారు .


  తన శరీరంను చాలా బరువుగా చేసుకొను ప్రక్రియను " గరిమ" అని పిలుస్తారు .


  తన యొక్క శరీరంను అత్యంత తేలికగా చేసుకొను ప్రకియనే " లఘిమ" అని పిలుస్తారు .


  తన యొక్క జ్ఞానేంద్రియాలు , కర్మేంద్రియాలు సహయముతో ఎంత దూరం ఉన్న విషయములనైను గ్రహించుటయే "ప్రాప్తి" .


  తను కోరిన కోరికలు అన్నింటిని పొందుటనే "ప్రాకామ్యము" .


  తనశక్తిని ఇంకొకరి యందు ప్రసరింపచేయు సిద్ధిని "ఈశిత్వము " అందురు.


  సర్వ భూతములు అన్నియు తనకు వశం అగుటను "వశిత్వము" అందురు.


          ఈ 8 రకాల సిద్ధులను "అష్టసిద్దులు" అందురు. ఈ అష్టసిద్ధులు ను సాధించినవాడు మహాయోగి అగును. ఇవియే గాక సూక్ష్మ శరీరముతో లోకలోకాంతరములు అన్నింటిని దర్శించుట, దూరశ్రవణము , దూరదర్శనము , ఆకలిదప్పికలు లేకపోవుట , ధ్యానావస్థలో కొత్తకొత్త విఙ్ఞాన విషయాలు తెలుసుకొనుట, మరొక లోకములలో నివశించుతున్న మహాపురుషులను సందర్శించి వారితో సంభాషించటం , తన సంశయములకు సమాధానములు వారి నుంచి పొందుట , ఎక్కువ సమయములో అనుభవించదగిన ప్రారబ్ద కర్మను తక్కువ సమయములోనే అనుభవించి ముగింపచేయుట , అనేక మంది దుఃఖితుల యొక్క దుఃఖాన్ని దూరం చేయుట , పూర్వజన్మ , రాబోవు జన్మ గురించి తెలుసుకొనుట , త్రికాల జ్ఞానము మొదలగునవి ఉపసిద్దుల కిందికి వచ్చును. అష్టసిద్దులు సాధించు సమయంలో తన యొక్క ప్రయత్న స్థితిని బట్టి ఈ ఉపసిద్దులు కూడా యోగికి వచ్చును.


  

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034