20, జూన్ 2023, మంగళవారం

ఆయుర్వేదం ఔషధాలను

 * ఆయుర్వేద ఔషధాలు సేకరించే విధానము - 


 ఆయుర్వేదం ఔషధాలను ఒక ప్రత్యేక మయిన పరిస్థితులు , ఒక నిర్దిష్టమైన సమయం లొ మాత్రమే ఔషదులని గ్రహించాలి. అటువంటి ఔషధాలు మాత్రమే పరిపూర్ణం గా పనిచేస్తాయి.


      ఔషధాలు ఎంత శక్తివంతం గా పనిచేస్తాయి అనేది ఆ ఔషధి ఉన్నటువంటి నేల కూడా ప్రభావం చూపుతుంది. అటువంటి ఔషధాలను జాగ్రత్తగా తీసుకుని వచ్చి వాడినప్పుడే శరీరం పైన వాటి ప్రభావాన్ని బలం గా చూపిస్తాయి.


 *  ఔషధాలు సేకరించు స్థలం - 


 ఋతువులు సరిగా ఏర్పడుతూ ఉండాలి. వెన్నెల, నీరు , గాలి కాలానుసారం గా ఉండాలి. అట్టి స్థలం లొ ప్రదిక్షణం గా ప్రవహించుచున్న నీరు కలిగి ఉండి దర్భ మొదలయిన మొక్కలచే వ్యాపించి అట్టి మన్ను నల్లగా కానీ బంగారు రంగులొ కలిగి ఉన్నది అయ్యి సువాసనలుతో కుడుకొని ఉన్నది అయి ఉండాలి. అచ్చట గండ్ర ఇసుక, చౌడు, గులక రాళ్లు , గోతులు, పుట్టలు మొదలయినవి ఉండకుడదు. మరియు అచ్చటి భూమి  రాజవీధి , స్మశానం, ఇండ్లు, రచ్చబండ, ఉద్యానవనం వీటి సమీపం లొ ఉండకుడదు. నాగలిచే దున్నబడక వృక్షములను ఆవరించి ఉండవలెను.


       పురుగులు కలదియు, సర్వ కాలంబులు నీరుచే వ్యాప్థమైపొయి , పూర్వం చెప్పిన గుణములు లేనిది అయ్యి, పిశాచములు కలిగి ఉన్న భూమిలో పుట్టిన ఔషధాలు పనికి రావు .

      

          విస్తారంగా స్థూల వృక్షాలు, గసువు, పైరు మొదలగు వానిచే ఉండి గట్టిగా ఉండి, బరువు కలిగి అనేక పాషానాలతో ఉండి శ్యామల వర్ణం కలిగి, నల్లని వర్ణం కలిగిన భూమి లొ చాలా అదిక గుణం కలిగిన ఔషధాలు ఉండును. 

         భూమి యెక్క గుణం ఏ విదంగా ఉండునో ఆ ఔషధీ గూడా అదే విదంగా ఉండును.


 * భూమి గుణాలు - 


 పృథ్వి, ఉదక గుణములు కలిగిన భూమి యందు పుట్టిన ఔషధాలు విరేచానకారులు అవును. ఆకాశ గుణం కలిగిన భూమి యందు పుట్టిన ఔషధాలు వమన కారిణి గా ఉంటాయి. పంచ భూతముల లక్షణాలు కలిగిన భూమి లొ పుట్టిన ఔషధాలు వమన కారిణులు , విరేచన కారిణులు అవును.


*  ఔషధాలు సేకరించే విదానం -


 ఔషధాలను సేకరించాలి అనుకున్న వైద్యుడు పూర్వపు రోజున ఉపవాసం ఉండి పవిత్రుడి గా ఉండి దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, బ్రహ్మ్మను, దక్షప్రజపతిని , అశ్విని దేవతలను పూజించి నాలుగు దిశలలో బలి ని సమర్పించి ఆ ఔషధిని ఆశ్రయించి ఉండు సమస్త దేవతలను గూర్చి  " ఓ దేవతలారా నన్ను నిరపరాధుని చేసి మీరు ఆశ్రయించి ఉండు ఈ ఔషధిని విడిచి పొండు సర్వ ప్రాణ కోటికి జీవ పదార్ధంబైన ఈ ఔషధిని నేను గ్రహించేదను. మరియు ఓ దేవతలారా నేను ఈ ఔషధిని లోభం కొసం గ్రహించడం లేదు . ప్రధానం గా బ్రాహ్మ్మన రక్షణార్ధం అని ప్రార్ధించి నానా వర్ణములు గల దారాలతో ఆ ఔషధానికి రక్షాబంధనం చేసి పిమ్మట గృహమునకు పోవలెను.


           మరునాడు తను రక్షాబంధనం కట్టిన ఔషధి దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా పరిశీలించ వలెను. తాను కట్టిన రక్షాబంధం పూర్వం వలె ఉండి అక్కడ మరేటువంటి వికారములు లేకుండుట చూచి బ్రహ్మ్మనుల చేత స్వస్తివాచకం చెప్పించుకొనుచూ అక్కడికి వచ్చి సూర్యుడు ఉదయించి నడినెత్తికి రాగా "ఖనన మంత్రం " ప్రకారం ఆ ఔషధి యెక్క తూర్పు వైపు బారిన వేరును అయినా ఉత్తరం వైపు బారిన వేరును అయినా తవ్వవలెను.


 * ఖనన మంత్రం -


   ఔషధి కొసం తవ్వేప్పుడు ఖనన మంత్రం ఖచ్చితం గా పటించాలి .

 " బ్రహ్మ, విష్ణు వుని  యే హస్తం చే తవ్వేధరో అట్టి అయిదు వేళ్ళు గల చేతితో నిన్ను తవ్వేదను". ఇదియే ఖనన మంత్రం. దీని చేత ముందు చెప్పిన ప్రకారం తవ్వాలి.


*  గ్రహణ మంత్రం -


   " మంగళ కరం అగు ఔషధి నీకు నమస్కారం .మీకు శుభం ఔషదులార . బలవంతం లగుదురు కాక .ఒక్కోనియందు వీర్యం కలగ చేయుడు .మీకు ప్రార్దిన్చేదను అని మంత్రం చెప్పి ఔషధిని పట్టుకోవలెను.


 *  ఔషధిని పుచ్చుకునే ముందు మంత్రం - 


     ఔషధి శ్రేష్టమ మంగళం విగ్నములను మిక్కిలి దహించుము . మిక్కిలి నశింప చేయుము . మిక్కిలి చీల్చుము. నీకు నమస్కారము. అని ఈ మంత్రం చెప్పి ఔషధిని లొపలికి పుచ్చుకోవలెను.


*  వ్యర్ధ ఔషధాలు -  


    పురుగు కుట్టినది.  నీటిలో మునిగినది. మేకలు తినినది. పిశాచముల చేత వికారం పొందింది. ఎల్లప్పుడు నీడనే ఉన్నది. నీటిచేత తడియక ఎండినది . చెట్ల సందుల ఎందు ఉండినది. నడిచే దారిలో ఉన్నది. పది మందికి తెలిసినది సారం లేనిది గాని ఔషధములు వాడ రాదు. ఒకవేళ వాడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే చంద్రగ్రహణ సమయం లొ , మరియొక రాత్రులలో గానీ మూలికలు గ్రహింప కూడదు .


*  ములికలు గ్రహింప వలసిన కాలం - 

     


  వర్ష ఋతువు నందు కొమ్మలు, వసంత ఋతువు నందు చిగురుటాకులు, శిశిర ఋతువు నందు , గ్రీష్మ ఋతువు నందు పండుటాకులను , మొలకెత్తు ఆకులను, మూలములను గ్రహించాలి. 


      మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.


     

కైలాసం కావాలా?*

 180623g1804. 200623-4.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*కైలాసం కావాలా?*

               *వైకుంఠం కావాలా?*

                ➖➖➖✍️


*ఓసారి  భక్తతుకారామ్ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ, స్మరణ చేస్తూ వెళ్తున్నాడు.*


*అపుడు ఒకడు ఎదురు వచ్చాడు. “నువ్వు  ఈ నామాన్ని  ఇలా స్మరిస్తున్నావ్ కదా?  ఏమి కోరుకుంటున్నావ్. నీకు కైలాసం కావాలా? వైకుంఠం కావాలా? స్వర్గం కావాలా?” అని తుకారాంని అడిగేడు.*


 *“ఆ ప్రశ్నకి తుకారాం అంటాడు- “అయ్యా! నాకు కైలాసం, వైకుంఠం అంటే అర్థం కాదు. ఇక స్వర్గమంటారా? ఈ నామస్మరణ చేస్తున్నపుడు నేను అనుభవించేదే, అనుభవిస్తున్నదే ‘స్వర్గం’ అని బదులిస్తాడు. *


*భగవన్నామం    హృదయంలో నినదిస్తే,  నినాదాలు చేస్తే  అదే స్వర్గం.*


 *నామస్మరణ     మనసు పడే ఆరాటాన్ని, ఆందోళనని, అశాంతిని అణచివేస్తుంది.*


 *ఓ ఇనుప ముక్కను ఓ రాయిమీద రాస్తూ రాస్తూ పోతే    వేడి పుడుతుంది.*


 *భగవన్నామం అనే ఇనుప ముక్కతో, రాయిలాంటి మనసుని అటు ఇటు అనంతంగా, అఖండంగా రాస్తూ పోతే, 'భక్తి’ అనే వేడి పుడుతుంది.*


 *పుట్టిన భక్తి అనే వేడి, పరమాత్మునికి ఉండే వెన్నలాంటి హృదయాన్ని కరిగిస్తుంది, కదిలిస్తుంది.*


*నారదుని ఉపదేశ కారణంగా రత్నాకరుడు రామనామాన్ని స్మరించిన కారణంగా శ్లోకదాతగా మారాడే.*


 *వాల్మీకి మహర్షియై రామాయణ మహాకావ్యానికి సృష్టికర్తయ్యాడు.*


*అయితే నామస్మరణ, దైవచింతన అని రెండు ఉన్నాయి.*


*నామాన్ని జపించటం నామస్మరణ. ఆ నామం చేసిన లీలలను మహిమలను, మననం చేసుకోవటమే చింతన.*


*కృష్ణా కృష్ణా అని జపించటం స్మరణ. ఆ కృష్ణుడే ఎపుడో చేసిన లీలను మహిమలను మనం ఇపుడు మననం చేసుకోవటం చింతన.*


*నామాన్ని మనోభావంగా ఉచ్చరించాలి. పెదవులనుండి కాక హృదయంలోంచి ఉచ్ఛరించాలి.*


 *ఆర్తితో ఉచ్ఛరించాలి.*


 *అనుభవిస్తూ ఉచ్ఛరించాలి.*


 *అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉచ్ఛరించాలి.*


*మనసనే సరస్సులో నామం      ఓ తామరపూవు.*


 *తామరపూవులోని మకరందాన్ని త్రాగడానికి భక్తులు ఐహిక భావనలు వదిలి తుమ్మెదలవలె పరుగుతీయాలి.*


 *హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే భగవంతుడు మన పూజ గది ముందు దాసుడిగా వేచి ఉంటాడు...నిజమే కదా... *✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

ఆచార్య సద్బోధన:*

 


            *ఆచార్య సద్బోధన:*

                ➖➖➖✍️


```

‘ఈ ప్రపంచంలో గొప్ప సుఖం పొందగలిగేది ఎవరు?’అని భీష్ముణ్ని ధర్మరాజు ప్రశ్నిస్తాడు. 


‘నిందాస్తుతులను సరిసమానంగా భావించడం, నిర్వికారంగా ఉండటమే సుఖమయ జీవితానికి మొదటి సోపానం’ అని బదులిచ్చాడు భీష్ముడు. 


జీవితంలో సుఖసంతోషాలే కాదు... కష్టాలను కూడా సహనంతో భరించడం నేర్చుకోవాలి. కష్టాలు, బాధలు మనిషి జీవితంలో అలజడి సృష్టిస్తుంటాయి. నిజమే.. 


కానీ, అవి మనిషి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి పరోక్షంగా తోడ్పడతాయి. 


కష్టాలను భగవంతుడి దీవెనలుగా, వరాలుగా స్వీకరించాలంటారు సద్గురువులు.


ఒకసారి మహాభక్తురాలైన కుంతీదేవిని పలకరించడానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. ‘అత్తా, నీకేం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను’ అన్నాడు శ్రీకృష్ణుడు. 


అప్పుడు కుంతీదేవి ‘కృష్ణా, నాకెప్పుడూ కష్టాలు, దుఃఖాలు ఉండేటట్లు అనుగ్రహించు’అంది. 


శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి ‘అత్తా, ఏమిటి నీ విపరీతమైన కోరిక?’ అన్నాడు. 


దానికి కుంతీదేవి‘నాయనా!మేము కష్టాలలో ఉన్నప్పుడే కదా నీవు పరుగులు తీస్తూ మా వద్దకు వచ్చావు... నీ దర్శనాన్ని కలిగించే కష్టాలే కావాలి!’ అంది.✍️```

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

తలాపిడికెడు

 : తిలాపాపం తలాపిడికెడు.


ఒక గద్ద ఒక పామును తన్నుకుని పోతూంది, ఆహారంగా. చావుకి దగ్గరగా ఉన్న పాము తనలో విషాన్ని వదలిపెడుతుంది. ఆ విషం కిందనే పాలూ, పెరుగు అమ్మకానికి పట్టుకెడుతున్న గొల్లభామ తలమీది గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది. అదే సమయానికి, గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవడం మూలంగా. ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణునికి అమ్ముతుంది, గొల్ల భామ. ఆ పెరుగును ఆ బ్రాహ్మణుడు, తన తండ్రి ఆబ్దీకానికి భోక్తగా వచ్చిన మరొక బ్రాహ్మణుడికి భోజనం లో వడ్డించగా, ఆ బ్రాహ్మణుడు విషపూరితమైన పెరుగు తిని కాలం చేసేడు. పితృ శేషం తిన్న బ్రాహ్మణుడూ మరణించాడు. పాము ముందే మరణించింది, గొల్లభామ, గద్ద కూడా మరణించారు.


ఇప్పుడు యమధర్మరాజు దగ్గర విచారణ ప్రారంభమయింది,ఈ బ్రహ్మ హత్యాపాతకాన్ని ఆబ్దీకం పెట్టిన బ్రాహ్మణుని కాతాలో రాసేడు, చిత్రగుప్తుడు. బ్రాహ్మణుని పాపాల చిట్టా చదువుతున్నాడు, చిత్రగుప్తుడు. అప్పుడు బ్రాహ్మణుడు, ధర్మ ప్రభో! ఇది అన్యాయం,ఈ బ్రహ్మహత్యా పాతకం నాది కాదు, నేను పితృకార్యం కోసం పిలిచి ఆయనకు భోజనం పెట్టేను తప్పించి, ఆ పెరుగులో విషం ఉందని నాకు తెలియదు, అందుకు తప్పు నాది కాదు కనక పాపం నాది కాదన్నాడు.పెరుగులో విషం ఉందన్న సంగతి నాకు తెలియదు, గొల్ల భామను విచారించాలి ప్రభో, అన్నాడు. గొల్ల భామను పిలిచి ఈ పాపం నీ కాతా లో రాస్తాము, విషమున్న పెరుగు అమ్మేవు కనక, అదీ కాక సరిగా మూత వేయక అశ్రద్ధ చేసేవు కనక అంటే, బాబోయ్! నాది తప్పు కాదండి, నేను పాలు పెరుగు అమ్ముకుంటాను, నాకు ఆ ముంతలో విషం పడిందని తెలియదు, తెలిస్తే అది బ్రాహ్మణునికి అమ్మను కదా, నేను జాగ్రత్తగానే ముంత మీద గుడ్డ కప్పేను. గాలికి ఎగిరిపోతే తప్పునాది కాదు, అందుకు నాది తప్పు కాదు, కనక పాపం నాకు సంబంధం లేదంది. గుడ్డ తొలగిపోయేలా వీచిన గాలిదా తప్పని, *గాలిని పిలిచారు. గాలి వచ్చి దేవా! వీచడం నా లక్షణం, నా ధర్మం, నేను స్థంభిస్తే ప్రాణికోటి జీవించదు ప్రభూ, అని మొరపెట్టుకున్నాడు. సరే అయితే విషం వదిలిపెట్టిన పాముదా పాపం? అని పిలిచారు, పాముని. పాము, ధర్మ ప్రభూ! నా ప్రాణం పోతున్న సమయం, గద్ద కాళ్ళలో ఉన్నాను, ఏమి జరుగుతున్నది నాకేతెలియని స్థితి, ఎక్కడ విషం వదలిపెడుతున్నదీ కూడా చూడగల సమయం కాదు కనక, తప్పు నాది కాదు, ఈ బ్రహ్మ హత్యా పాతకం నాది కాదని మొర పెట్టుకుంది. అప్పుడు, ఇక మిగిలింది గద్ద కనక,గద్దను పిలిచారు, ఈ పాపం నీదేనా? అన్నారు. మహాప్రభో! పాము నా అహారం, గగన విహారం నా లక్షణం, పాము విషం వదులుతోందో లేదో నేను చూడలేదు, అందు చేత పాపం నాది కాదు అంది. మరి ఇంతకీ ఈ బ్రహ్మ హత్యా పాతకం ఎవరి కాతాలో రాయాలో యమధర్మ రాజుకు కూడా బోధ పడలేదు, సమవర్తి అయివుండి కూడా.


అప్పుడు సమవర్తి, చిత్రగుప్తుడిని, ఈ విషయం మీద గూఢచారులు ఇచ్చిన సమాచారం చెప్పమన్నారు. చిత్రగుప్తుడు ఆ నివేదిక చూసి, ప్రభూ! భూలోకంలో ప్రజలు ఈ విషయంమీద భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఒకరు, గద్దది తప్పన్నారు, మరొకరు పాముది తప్పన్నారు, కొందరు గాలిది తప్పన్నారు, మరికొందరు గొల్ల భామ తప్పన్నారు, బుద్ధిమంతులు భోజనం పెట్టిన బ్రాహ్మణునిది తప్పన్నారు. అందరూ సమానంగా స్పందించారు ప్రభూ! అని నివేదికలో సంగతి చెప్పేడు. మరికొంత అయోమయంలో పడ్డాడు యమధర్మరాజు. ఈ పాపాన్ని ఎవరో ఒకరి కాతాలో రాయాలి కనక, తప్పు ఎవరిదో ఇదమిద్ధంగా తేలలేదు కనక ఈ విషయం గురించి పూర్తిగా తెలిసీ, తెలియక తీర్పులిచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసిన వారందరికీ సమానంగా పంచిపెట్టమన్నాడు. అలా ఆ బ్రహ్మహత్యా పాతకం అందరికీ సమానంగా పంచబడింది. దీనినే తిలా పాపం తలా పిడికెడు అని అంటారు.* 

 ☝ సుభాషితాలు☝

భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలులో

 భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలులో....

అక్టోబర్‌ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు


''సప్తమోక్ష క్షేత్ర యాత్ర''  చేయండి...


ద్వారక, పుష్కర్‌, మాతృగయ, కురుక్షేత్ర, హరిద్వార్‌, మధుర, ఉజ్జయని, నాగేశ్వరం, ఓంకారేశ్వరం క్షేత్రాల సందర్శన నిమిత్తం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడమైనది.


యాత్ర వివరాలు

----------

అక్టోబర్‌ 1వ తేదీన చెన్నై ఎగ్మోర్‌ నుంచి ఈ ప్రత్యేక రైలు బయలుదేరును...


దారి పొడవునా అంటే నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, బాపట్ల, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాద్‌, కాజీపేట, రామగుండం, సరిపూర్‌ కాగజ్‌నగర్‌ల మీదుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న భక్తులను ఎక్కించుకొని వెళ్ళును....


భోజనం

------

ఉదయం - కాఫీ / టీ / పాలు / అల్పాహారం

మధ్యాహ్నం - రుచికరమైన బ్రాహ్మణ భోజనం

సాయంత్రం - స్నాక్స్‌ /టీ/కాఫీ/పాలు

రాత్రి - అల్పాహారం

ప్రత్యేకంగా బ్రాహ్మణ వంటవారిచే రైలులో ఏర్పాటు చేయబడిన కిచెన్‌లో ఆహార పదార్ధములు తయారు చేయబడును. (ఉల్లి/వెల్లుల్లి నిషిద్ధం)


బస

---

క్షేత్రాల సందర్శన సమయాల్లో ప్రత్యేక బస ఏర్పాటు

స్లీపర్‌ క్లాస్‌ వారికి నాన్‌ ఏసీ రూమ్‌లు

ఏసీ క్లాసుల వారికి ఏసీ రూమ్‌లు ఇవ్వబడును

ఇద్దరికి కలిపి ఒక గది ఇవ్వబడును 


యాగాలు / దర్శనం 

-----------

1. పది మంది పురోహితుల బృందం

2. ప్రతి క్షేత్రంలో ప్రత్యేక పూజలు /హోమాలు

3. మహాలయ పక్షం కావడంతో మన పురోహితుల ఆధ్వర్యంలో  పితృతర్పణాలు


ప్రత్యేకతలు

-------

బృందావన క్షేత్రంలో పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారి చేతుల మీదుగా

''మహా సుదర్శనహోమం'' వేదాశీర్వచనం ఏర్పాటు చేయడమైనది.


యాత్ర పొడవునా... హిందూధర్మ ప్రచారకులు శ్రీ రాధామనోహర్‌దాస్‌ గారి సత్సంగాలు


భద్రత

----

1.రైలులో ప్రతీ భోగీలో రైల్వేస్‌ తరపున ఒక మేనేజరు.

2.మన తరపున ఒక వాలంటీరు

3.ఆయా క్షేత్రాల్లో ఆ భోగీలోని వారిని దగ్గరుండి దర్శనానికి తీసుకువెళ్లడం

తిరిగి రైలుకు చేర్చడం ద్వారా భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడటం జరుగుతుంది.

4. రైలులో సమయానికి ఆహారం, మంచినీరు, టాయిలెట్ల పరిశుభ్రత అన్నిటినీ వాలంటీర్లు పర్యవేక్షించడం జరుగుతుంది.

5.రైలులో సీసీ కెమెరాలు, మైక్‌ ఏర్పాటు చేయడమైనది.

6. రైలు ఆయా క్షేత్రాల్లో చేరిన సందర్భంల మీ లగేజీ రైలులో ఉంచినను ఎటువంటి ఇబ్బంది ఉండదు. 

7. ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రయాణ ఇన్స్యూరెన్స్‌ వర్తించును.

8. ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు మిమ్మల్ని పరీక్షించడానికి రైలులో డాక్టరు సదుపాయం.


ప్రత్యేకతలు

-------

1. మొదట బుక్‌ చేసుకున్నవారికి బెర్తుల కేటాయింపులో ప్రధాన్యత ఇవ్వబడును.

2. 60 సంవత్సరములు పైబడిన వారికి లోయర్‌ బెర్తుల కేటాయింపుకు ప్రాధాన్యత ఇవ్వబడును

3. గ్రూప్‌ బుక్కింగ్‌ చేసుకొనేవారికి (ఐదుగురు అంతకంటే ఎక్కువ) కన్షెషన్‌ కలదు


బుకింగ్‌ విధానం

---------

1. ఆధార్‌ కార్డు పంపించాలి.

2. బుకింగ్‌ సమయంలో ప్రయాణ ఛార్జీలో 50 శాతం చెల్లించాలి.

3. ప్రయాణానికి 30 రోజుల ముందు మిగిలిన 50 శాతం చెల్లించాలి.

4. మీ వాట్సప్‌ నెంబరుకు బుకింగ్‌ కూపన్‌, రైలు ప్రయాణానికి వారం రోజుల ముందు టిక్కెట్‌, బెర్తు నెంబరు పంపబడును.

5.  మీ బోగీలో మీకు రక్షణగా ఉండే వాలంటీర్‌ నెంబరు ముందుగానే పంపబడుతుంది.

6. మీరు ఏ స్టేషన్‌లో రైలు ఎక్కాలో టిక్కెట్‌తోపాటు సూచించబడుతుంది...


టిక్కిట్‌ ధరలు (ఒక్కరికి)

--------

ఈ పన్నెండు రోజుల యాత్రకుగాను

1st AC........Rs.63,000/-

2nd AC........Rs.58,000/-

3rd AC........Rs.50,000/-

Sleeper.......Rs.38,000/-గా నిర్ణయించడమైనది...


పరిమిత సీట్లు మాత్రమే కలవు...


మహాలయ పక్షాల్లో సప్తమోక్ష క్షేత్రాలను సందర్శించడం అనేది పూర్వజన సుకృతం. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చేసే ఈ యాత్రను ఎటువంటి కష్టం లేకుండా అన్నిచోట్లా దర్శనాలు, హోమాలు, తర్పణాలు జరిగేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. 


వెంటనే సంప్రదించండి..

రమేష్‌ అయ్యంగార్‌, 83310 08686, 83320 08686

కోరికలు

 శ్లోకం:☝️

*న జాతు కామః కామానాం*

    *ఉపభోగేన శామ్యతి l*

*హవిషా కృష్ణవర్త్మేవ*

    *భూయ ఏవాఽభివర్థతే ll*

    - మనుస్మృతి 2-94


భావం: కోరికలు ఎన్నటికీ అనుభవించుటచేత ఉపశమించవు. నేయి పోసిన కొద్దీ అగ్ని ప్రజ్వరిల్లునట్లు, అనుభవించిన కొద్దీ కోరికలు పెరుగుచునే యుండును. కనుక

కోరికలను ఎంత అదుపులో ఉంచుకోగలిగితే ప్రాణానికి అంత సుఖంగా ఉంటుంది. అందుచేత ఆ దిశగా ప్రయత్నం చేద్దాం.

కలిపెడిది ఆవకాయట

 “ఆవకాయ “ 

కలిపెడిది ఆవకాయట😀😀😀


ఆవకాయ మీద తెలుగు భాషలో ఎంతో సాహిత్యం ఉద్భవించింది.


ఈ క్రింది పద్యాలని చూడండి


కం.

కలిపెడిది ఆవకాయట

కలిపించెడి వారు మామ గారట మరి నే

కలిపిన రుచికరమగు నట

కలుపగ వేరొండు గాయ కలుపగ నేలా


కం.

ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!


కం.

ఇందువల దందు బాగని

సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం

బెందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!


కం.

చారెరుగనివాడును, గో

దారిన తా నొక్కమారు తడవని వాడున్,

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, తెలుగు వాడు  కాడోయ్!


కం.

శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!


కం.

ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!


కం.

బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!


ఆవకాయ అవతరణ:


కం.

చప్పటి దుంపలు తినుచును,

తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో

గొప్పగు మార్గం బొక్కటి

చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్


ఆవకాయ ఇష్టం లేదని ఎవరైనా అంటే వానిని ఒక కవి ఏకంగా శపించేస్తున్నాడు చూడండి


కం.

ముక్కోటి దేవులందరు

మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా

చక్కనిది ఆవకాయన

ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!


ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:


కం.

చెక్కందురు డిప్పందురు

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్

డొక్కందురుగ  మామిడి

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!


మరొక మంచి గేయ కవితని చూడండి.


ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది

మాగాయ పేరిన నేయ్యితో మంతరిస్తుంది

మెంతికాయ  మోజు పెంచేస్తుంది

తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది

కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది

బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది

పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది

పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది


చింతకాయ చింతించినా చూడరు

ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు

గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు

కొరివికారం కొరకొర చూసినా చలించరు

టమాటా టక్కుటమారాలు చేసినా పడరు

నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా

అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు

వంకాయ బండపచ్చడి బాధపడినా


నువ్వు పచ్చడి నువ్వులేక నేను లేనన్నా

దోసావకాయ దోరగా నవ్వినా

నారింజకారం కవ్వించినా 

కొత్తిమీరపచ్చడి కొంటెగా విజిలేసినా

పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా

క్యాబేజి పచ్చడి  ఘుమఘుమలాడినా

కొబ్బరిపచ్చడి  కూతపెట్టి పిలిచినా

బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా

కన్నెత్తయినా చూడని ఋష్యశృంగుడిలా

వేసవికాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా

వడగళ్ల జడివానలు కురుస్తున్నా

చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా

అన్ని ఋతువుల అమృతమనుచు

మామిడికాయ తో కలిపిన ఆవకాయలకే


అగ్ర తాంబూలమిచ్చే ఆంధ్రులందరికీ

ఎన్నెన్ని రుచులు ఇల లో ఉన్నా

కంటికింపుకాదు నోటికి రుచికాదు

మనసుకి తృప్తికలుగదన్నది నిక్కమని

ఇంతటి మహత్తరమైన ఆవకాయని, ఇంతమంది అంతగా అందరూ పొగిడే ఆవకాయని మనం వదిలి పెట్ట గలమా! నిస్సందేహంగా వదలలేం.


పదార్థాలని తినేప్పుడు అందరూ ఆవకాయని నంజుకుని తిని ఆవకాయ రుచిని ఆస్వాదించండి. చక్కటి వరి బియ్యం అన్నంలో ఆవకాయని కలిపి కమ్మని ఆవు నేయితో నిజమైన ఆవకాయ రుచిని ఆశ్వాదించండి.


– O.V.L.N. Murthy,

WordPress.com.

రోజు పద్యము

 196వ రోజు: (జయ వారము) 20-06-2023

మన మాతృ భాష సేవలో

ఈ రోజు పదము:

సోదరి (Sister): తోడబుట్టువు, తోడచూలు, తోడు, తోబుట్టు, సకుక్షి, సహజ, సహోదరి, సైదోడు. 


 ఈ రోజు పద్యము:


పెద్దలు విచ్చేసినచో 

బద్దకముననైన దుష్ట పద్దతి నైనన్, 

హద్దెఱిఁగి లేవకున్నన్ 

మొద్దువలెం జూతు రాని ముద్దు కుమారా!


 ఓ కుమారా!  పెద్దలు నీ దగ్గరకు వచ్చినపుడు సోమరితనము చేతగనీ, దుర్మార్గవృత్తితో గానీ, మర్యాదతో లేవకున్న యెడల నిన్ను వారు మొద్దురీతిగా జూతురే గాని  నీవొక ప్రాణము గల మనిషివని తలంపరు.

మనవారి #మేధస్సు

 *#ఇదండీ #మనవారి #మేధస్సు👇*


*తృటి =సెకండ్ లో 1000 వంతు*

*100 తృటులు =1 వేద*

*3 వేదలు=1 లవం*

*3 లవాలు=1 నిమేశం, రెప్ప పాటుకాలం*

*3 నిమేశాలు=1 క్షణం*

*5 క్షణాలు=1 కష్ట*

*15 కష్టాలు=1 లఘువు*

*15 లఘువులు=1 దండం*

*2దండాలు=1 ముహూర్తం*

*2 ముహూర్తాలు=1 నాలిక*

*7 నాలికలు=1యామము, ప్రహారం*

*4 ప్రహరాలు=ఒక పూట*

*2 పూటలు=1 రోజు*

*15 రోజులు=ఒక పక్షం*

*2 పక్షాలు=ఒక నెల*

*2 నెలలు=ఒక ఋతువు*

*6 ఋతువులు=ఒక సంవత్సరం.*

*10 సంవత్సరలు= ఒక దశాబ్దం*

*10 దశాబ్దాలు= ఒక శతాబ్దం.*

*10 శతాబ్దాల= ఒకసహస్రాబ్ది*

*100 సహస్రాబ్ది=ఒక ఖర్వ, లక్ష సంవత్సరాలు*

*4లక్షల 32 వేల సంవత్సరాలు= కలియుగం*

*8లక్షల 64 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం*

*12లక్షల 96 వేల సంవత్సరాలు=త్రేతాయుగం*

*17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం*


*పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం. (చతుర్యుగం) 71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం*

*14 మన్వంతరాలు = ఒకకల్పం*

*200 కల్పాలు ఐతే = బ్రహ్మరోజు*

*365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం*

*100 బ్రహ్మ సంవత్సరాలు= బ్రహ్మసమాప్తి*

*ఒక బ్రహ్మసమాప్తి= విష్ణుపూట*

*మరోబ్రహ్మఉద్బవం= విష్ణువుకు మరో పూట*


*విదేశీయులు మాత్రమే కనుగొన్నట్లుగా చెప్పుకనేటటువంటి ఎన్నో విషయాలు మన యోగులు మునులు ఏనాడో కనుగొనినారు. అందుకు మనమందరము గర్వరడాలి.*


*🙏🙏సేకరణ 🙏🙏*

విత్తనం

 బీజం తు వర్ధతే శాన్త్యా

పతన్తి ధ్వనినా ద్రుమాఃl

వృద్ధిర్భవతి శాన్త్యా చ

వినాశః ధ్వనినా సహll


విత్తనం నిశ్శబ్దంగా మొలకెత్తుతుంది. అలాగే నిశ్శబ్దంగానే మహావృక్షమై ఎదుగుతుంది. అది వృక్షమై కాలాంతరంలో పడిపోయినప్పుడు పెద్దశబ్దంతో కూలిపోతాయి.

(వినయవిధేయతలే అభివృద్ధికి హేతువులు. అవి లేనినాడు పతనం అనివార్యం‌!)

*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

అనుష్టానం మానరాదు

 అనుష్టానం మానరాదు


1963లో పరమాచార్య స్వామివారు కుంబకోణం దగ్గర్లోని మరుదనల్లూర్ లో మకాం చేస్తున్నారు. అప్పుడు కుంబకోణంలోని కుంబేశ్వర ఆలయంలో ‘తిరుప్పావై - తిరువెంబావై’ సదస్సులు వైభవంగా జరుగుతున్నాయి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం మరియు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి తిరుప్పణి (ఆలయ సంబంధిత పనులు) చేసిన పి.టి. రాజన్ ఆ సదస్సుకు వచ్చారు.


అప్పుడు సాయం సంధ్యా సమయం. మహాస్వామి వారి ఉపన్యాసం వినాలని వారి వద్దనే కూర్చుని ఉన్నాను. స్వామివారు ఉపన్యాసం మొదలుపెట్టబోతూ నావైపు తిరిగి, చేతులతో ఆచమనం చేస్తున్నట్టుగా చూపిస్తూ వెళ్ళి సంధ్యావందనం చెయ్యమని ఆజ్ఞాపించారు. స్వామి ఉపన్యాసం వినాలనే కోరికతో నేను సంధ్యావందనం మాని అక్కడ కూర్చున్నానని స్వామివారు అర్థం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితులలోను అనుష్టానం మానవద్దు అని నన్ను హెచ్చరించటం. స్వామివారి ఆజ్ఞ ప్రకారం సంధ్య వార్చడానికి నేను కొలను వద్దకు వెళ్ళాను. 


ఆ రోజు రాత్రి పదిగంటలప్పుడు మేము ఆహ్వానించకుండానే స్వామివారు మేలకావేరిలోని మా ఇంటికి విచ్చేశారు. దాదాపు ఒక గంట పాటు అనుగ్రహ భాషణం చేశారు. మేము పరమానంద భరితులమయ్యాము. అలా స్వామివారు బ్రాహ్మణుడికి సంధ్యావందనం వంటి నిత్యకర్మల కంటే మేలైనది విలువైనది వేరొక్కటి లేదని సెలవిచ్చారు. అలా ధర్మానుష్టానం చేసిన వారి వద్దకు స్వామివారే వచ్చి అనుగ్రహం ఇస్తారు. అలా ఆచరించని వారు మాత్రమే స్వామిని వెతుక్కుంటూ వెళ్ళాలి. 


--- యస్. పంచపకేశ శాస్తిగళ్, కుంబకోణం. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

 ఐప్పాసిలో, [తమిళనాడులో] కురువ వరిని పండిస్తారు. 

ఇది మనం తీసుకునే ముందు "ఆశ్వయుజి" అనే వ్రతంలో మొదట ఈశ్వరునికి సమర్పించబడుతుంది. 

అదేవిధంగా మార్గశిర మాసంలో అగ్రహాయణి చేసిన తర్వాతనే సాంబ అన్నం తింటారు.



హవిర్యజ్ఞలు సోమయజ్ఞాల వలె పెద్ద పరిమాణంలో లేనప్పటికీ, మరింత విస్తృతమైనవి. 

యాగంలో అర్పించే దేనినైనా "హవిస్" అంటారు. 

తిరుక్కురల్ వంటి తమిళ రచనలలో దీనిని "అవి" అని పిలుస్తారు. 

అయితే, నెయ్యి


ప్రత్యేకంగా "హవిస్" గా సూచిస్తారు. 

సోమరసాన్ని అర్పించే యజ్ఞాలను సోమయజ్ఞాలు అని మరియు విపులంగా లేని వాటిని పాకాయజ్ఞలుగా వర్గీకరించారు. 

ఇప్పుడు నలభై సంస్కారాలలో ఇతర శ్రౌత యాగాలను హవిర్యజ్ఞలు అంటారు.

శంకరుని దర్శనం..

 అంత్య ఘడియలలో అపర శంకరుని దర్శనం...

పరమశివ భక్తుడైన అరుణగిరినాధర్ రచించిన తిరుప్పుగళ్ పాటలకు అత్యంత ప్రచుర్యాన్ని కల్పించిన ముఖ్యలలో కృష్ణ స్వామి ఒకరు. అందుకే ఆయనను "తిరుప్పుగళ్ మణి "అంటారు. ఆయన భార్య పరమాచార్య వారి భక్తురాలు. ఆమెకు ఉబ్బస వ్యాధి తీవ్రంగా రావటం తో మదనపల్లి టి. బి ఆసుపత్రి లో చేర్చారు. అదే సమయంలో స్వామి వారు కాశీ యాత్రకు పోతూ మధ్యలో మదనపల్లి వచ్చారు. స్వామి వారు అక్కడికి వచ్చారని తెలిసి తాను వారి దర్శనానికి వెళ్లలేక పోయినానని ఆమె ఎంతో బాధ పడింది. ఆసుపత్రి మంచం పై నుంచే స్వామి వారిని ప్రార్ధించేది."పెరియవ కాలుణ్ణి చూచే ముందే మహా కాలుని (శంకరుడు ) అవతారమైన మీ దర్శన భాగ్యం పొందలేని దురదృష్ట

వంతురాలిని "అని దుఖించేది.

మదనపల్లిలో మకాం చేసి ఉన్న స్వామి, శిష్యుణ్ణి పిలిచి టి. బి ఆసుపత్రి అధికారులనుంచి ఒక రోగిని చూడడానికి అనుమతి పత్రం తెమ్మని ఆదేశించారు. అధికారులు అనుమతించాక స్వామి పల్లకిలో కూర్చొని ఆమె ఉన్న పడకకు దగ్గరగా పొమ్మని ఆదేశించారు. ఆమె అదృష్టం ఏమని చెప్పాలి.  చివరి ఘడియలలో ఉన్న తనకు స్వామి వారు ఆమె పడకకు దగ్గర గా వెళ్లి దర్శనం అనుగ్రహించారు. ఆమె ఎంతో శాంతి తో కన్ను మూసింది.

***స్వామి వారి మొత్తం చరిత్రలో అంత్య దశలో ఉన్న రోగి వద్దకు తామే వెళ్లడం అనేది ఈ సందర్భంలో తప్ప మరి జరగలేదు.

జగన్నాథుడి రథ చక్రాలు

 *వస్తున్నాయి పూరీ జగన్నాథుడి రథ చక్రాలు....!!*



🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


 🌿ఇది అత్యంత ప్రాచీనమైన రతయాత్రల్లో ఒకటి. ఇది ఎప్పుడు ప్రారంభమయిందో ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు.


🌸 వేల సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండో రోజున పూరీ జగన్నాథుడి రతయాత్ర  నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


 🌿ఈ ఏడాది కూడా రతయాత్రకు సమయం ఆసన్నమైంది. మంగళవారం (జూన్ 20)న ఈరోజు  ఈ యాత్ర జరగనుంది. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఈ యాత్రలో పాల్గొంటుంటారు.


🌸 లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇప్పటికే భక్తులతో పూరీ జగన్నాథుడి ఆలయం కిటకిటలాడుతోంది.

 మరింత కోలాహాలంగా ఉండనుంది.


🌿మంగళవారం జన్నాథుడితోపాటు బలరాములు, సుభద్రలను కూడా వేర్వేరు రథాలపై ఊరిగిస్తారు. అయితే ప్రపంచంలో ఏ ఆలయంలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరిగింపుకు ఉపయోగిస్తారు. 


🌸కానీ పూరీలో అలకాదు. సాక్షాత్తు గర్భగుడిలో ఉండే స్వామిఅమ్మవార్లనే బయటకు తీసుకొచ్చి ఊరేగిస్తారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి గర్భగుడిలో ప్రతిష్టిస్తారు. 


🌿అలాగే ఈ రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను ఆలయ నిర్వాహకులు తయారు చేస్తారు. వీటి తయారీని అక్షయతృతీయ రోజున మొదలు పెడుతారు. 


🌸ఇక్కడ రథాలకు పేర్లు కూడా ఉంటాయి. జగన్నాథుడి ఊరేగింపు కోసం చేసే రథాన్ని గరుడధ్వజం అని.. బలభద్రుని కోసం చేసే రథాన్ని తాళధ్వజం అని.. సుభద్ర కోసం చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు. ఇప్పటికే ఈ ఏడాది రథయాత్ర కోసం ఆలయ నిర్వాహకులు రథాలను సిద్ధం చేశారు..

గాడిదలదే తప్పంతా..

 సింహం అడవి దారినుండి వెళ్తుంది 

అనుకోకుండా నక్క కనిపించింది 

సింహం పరిగెత్తి నక్కని పట్టుకుంది


ఆకలితో ఉన్న సింహం నక్కతో ఇలా అన్నది. 

నిన్ను చూస్తే జాలేస్తుంది నీకు ఒక అవకాశం ఇస్తున్నాను 


ఏదన్నా జంతువుని తీసుకొని వస్తావా  లేకపోతే నిన్ను తింటాను అన్నది. 


మహాప్రభో అదే మహాభాగ్యం 

ఇప్పుడే వెళ్లి దేనినైనా తీసుకొని వస్తాను అని బయలుదేరింది


నక్క వెతగ్గా ఒక గాడిద కనబడింది. 

సింహం నిన్ను తన వారసుడిగా నిన్ను ఈ అడవికి రాజును చేస్తానన్నది, నాతో రా! అన్నది. నక్క


గాడిదను చూడగానే దాడి చేసి దాని చెవులు కొరికేసింది సింహం

గాడిద పారిపోతూ నక్కతో కోపంగా: 

ఇంత మోసం చేస్తావా అన్నది.


పిచ్చిదానా! కిరీటం పెట్టడానికి చెవులడ్డమని కోరికిందంతే ఏం సందేహించకు అని నచ్చ చెప్పి మళ్ళీ తీసుకొచ్చింది. 


ఈసారి దాడిలో దాని తోక దొరికితే కొరికి తెంపేసింది. మళ్ళీ పారిపోతూ కోపంతో బాధతో వెంట వస్తున్న నక్కతో: 

మళ్ళీ మోసం చేశావు కదూ! అంది గాడిద


నక్క ఛీ! ఛీ! అదేంలేదు. నీన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తోక అడ్డమని కొరికేసిందంతే! అన్నది.


సరే అని మళ్ళీ వచ్చిన గాడిదని సింహం చంపేసి నక్కతో: దీని చర్మం వలిచి మెదడు, గుండె, లివరు ఊపిరితిత్తులు తీసుకురమ్మన్నది.


నక్క మెదడు తాను తినేసి 

మిగిలినవి పట్టుకొచ్చింది. అవి చూసి సింహం: 

వీటిలో మెదడేది?  అని అడిగింది.


నక్క: ప్రభూ! దీనికి మెదడే లేదు. 

ఉండి ఉంటే మీరు దాడి చేస్తున్నా మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేది కాదు కదా!  అన్నది.


నిజమే! అన్నది సింహం.


సందేశం: 


మోసం చేసిన నక్క లాంటి అవినీతి నాయకులది గొప్పతనం కాదు

పదే పదే వాళ్ళ మాటలు నమ్మి 

డబ్బు కొరకు 

మద్యం కొరకు ఓట్లసే గాడిదలదే తప్పంతా..

రూపాయి

 🧏‍♂️ *రూపాయి* 🧏                

                 🤫🤫


*ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు.* 


*అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో, రొప్పుతూ వస్తూ కనిపించాడు.*


*వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి - - -* 

*"ఏం జరిగింది ఎందుకలా భయపడుతున్నారు?"* 

*అని అడిగారు.*


*అందుకాయన…*

*"అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది" అన్నాడు.*


*వాళ్ళిద్దరూ భయంతో - -* 

*"అంటే అక్కడ పులి ఉందా?"* 

*అని అడిగారు.*


*”కాదు - - కానీ దానికన్నా ప్రమాదకరమైనది!* 

*నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది!” అన్నాడాయన.*

 

*”ఇంతకీ ఏమిటది? అని అడిగారు వాళ్ళిద్దరూ, కంగారుగా…*

*”బంగారు నాణేల గుట్ట!” అన్నాడు సన్యాసి.*

*వాళ్ళిద్దరూ సంతోషంగా "ఎక్కడ?" అని అడిగారు.*


*”అదిగో ఆ పొదల్లోనే!”* 

*అని వేలు చూపించి, తన దారిన పోయాడా సన్యాసి.*


*అప్పుడు వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే, నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి!*


*"ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు!?* 

*బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి!?అన్నాడొక మిత్రుడు.*


*”అతడి సంగతి వదిలేయ్! ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం! పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది" అన్నాడు.* 


*"మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం!”*

*అన్నాడు మరో మిత్రుడు.*


*అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు.*

*రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు.* 


*ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు…* 

*“ఛ..! ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు.”* 

*అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.*


*ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన ఇలాఉంది….* *"వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు! వాడికేమో అప్పులు లేవు, ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు.  కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి..! కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు"* 

*అనుకున్నాడు.*


*అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.*

*అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు.*


*”పిచ్చివాడు సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు! ఇంక నేను భోంచేస్తాను.”* 

*అనుకుని ఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు.*

*అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.*

 

*”సన్యాసి మాటలు ఎంత నిజమో కదా!” అనుకున్నాడు చివరి క్షణాల్లో!*


*రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు?* 

*అని అడిగితే - - -*


*హరిశ్చంద్రుని చేత అబద్దం ఆడిస్తాను!*

*భార్యా భర్తల మధ్య చిచ్చు పెడతాను!*

*తండ్రి బిడ్డల్ని విడదీస్తాను!*

*అన్నదమ్ముల మధ్య వైరం పెడతాను!*

*ఆఖరికి ప్రాణ స్నేహితులను విడగొడతాను!* 

*అందిట ఆ రూపాయి - - -* 


*కాబట్టి  - - -* 

*రూపాయి విషయంలో జాగ్రత్త!!*

అష్ట సిద్ధులు

 నిత్యాన్వేషణ:


అష్ట సిద్ధులు అంటే ఏమిటి? నేను ఆ శక్తిని ఎలా పొందగలను?


సిద్ధి అనగా శక్తి ని జాగృతి చేయడం. అష్ట సిద్ధులు అనగా ఎనిమిది రకాల సిద్ధులు(శక్తులు) హిందు పురాణాల ప్రకారం అష్ట సిద్ధులు: అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. మొదట ఈ సిద్ధులు శ్రీ మహా విష్ణువు మరియు మహా శివుని వద్ద మాత్రమే ఉండేవి. వీరి నుండి విశ్వకర్మ ఈ సిద్ధులను పొంది తన కుమారుడైన సూర్య భగావానుడికి అనుగ్రహించాడు. ఆ తరువాత సూర్య భగావానుడు తన శిష్యుడైన హనుమంతుడికి ప్రసాదించాడు.

శ్లోకం:

*అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా*

*ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః*


*అణిమ:*

అణిమ సిద్ధి అనగా శరీరమును అణువు కంటే సూక్ష్మముగా మార్చడం అంటే శరీరమును చిన్నదిగా మార్చుట.

హనుమంతుడు లంకా నగరంలో ప్రవేశించినప్పుడు తన శరీరమును ఈ అణిమ సిద్ధిని ఉపయోగించే చిన్నగా మార్చాడు.


*మహిమ:*

ఈ సిద్ధి వలన శరీరమును అతి పెద్దగా మార్చవచ్చు.

హనుమంతుడు సీతమ్మ తల్లి జాడను వెతకడం కోసం లంక కీ వెల్లేటప్పుడు సముద్రాన్ని దాటడానికి తన శరీరాన్ని ఈ మహిమ సిద్ధిని ఉపయోగించే పెద్దగా మార్చాడు.

*గరిమ:*

గరిమ సిద్ధి అనగా శరీరము బరువును విపరీతముగా పెంచుట


*లఘిమ:*

లఘిమ సిద్ధి అనగా శరీరమును అతి తేలికగా చేయుట

ఈ సిద్ధిని ఉపయోగించి వాయుమార్గం లో తేలుతు ప్రయాణించవచ్చు. నీటిపైన నడువవచ్చు.


*ప్రాప్తి:*

ప్రాప్తి అనగా పొందడం. ఈ సిద్ధి వలన దేనినైన ఏ వస్తువునైన పొందవచ్చు.


*ప్రాకామ్యం:*

ఈ సిద్ధి వలన దూరదర్శనము, దూర శ్రవణము, వంటి దివ్య శక్తులు పొందవచ్చు అనగా మనమున్నచోటు నుండే ఇతర ప్రదేశాలలో ఏమి జరుగుతున్నదో చూడవచ్చు అక్కడి మాటలు వినవచ్చు.


*ఈశత్వం:*

ఈ సిద్ధి ద్వార ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందవచ్చు.


*వశిత్వం:*

ఈ సిద్ధి వలన అన్ని భూతములను, జీవులను లోబరచుకొనవచ్చు. అంటే సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తిస్తాయి.


ఈ సిద్ధులను అష్టాంగ యోగ పద్దతి ద్వార సాధన చేసి కుండలినీ జాగృతం చేయడం ద్వార పొందవచ్చు. అయితే ఈ పద్దతి లో కుండలినీ జాగృతం చేయడం అన్నది అంత సులువు కాదు.దీనిని అర్హులైన గురువు సమక్షంలో మాత్రమే సాధన చెయ్యాలి అని మన శాస్త్రాలు చెప్పుతున్నాయి.

ఈ సిద్ధులను భక్తియోగం, ఙ్ఞాణయోగం ద్వార కూడ పొందవచ్చు.

సుభాషితమ్

 .                      🕉️

              _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*సర్వం పరవశం దుఃఖం* 

*సర్వం ఆత్మవశం సుఖమ్।* 

*ఏతత్విద్యాత్సమానేన* 

*లక్షణం సుఖదుఃఖయోః॥*


*తా𝕝𝕝 "మనదయినది.., ఇతరులు గనుక తీసుకుంటే, ఇక అది దుఃఖాన్నే కలిగిస్తుంది.... మనకు దక్కింది* మాత్రమే సుఖాన్ని ఇస్తుంది....సుఖదుఃఖాలను ఇలాగే నిర్వచించుకోవాలి. అంటే, మనవద్ద లేనివాటికోసం దిగులు పడకూడదని, ఉన్నవాటితో సంతృప్తిగా ఉండాలని " భావం*.....

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 96*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 96*


♦️ ప్రభుత్వోద్యోగులు నలభై విధాలుగా అవినీతికి పాల్పడి, అక్రమ సంపాదన ఆర్జిస్తారు. అవి... 


🔸పూర్వకాలపు దస్తావేజులను నేటి కాలమువిగా వ్రాయడం.


🔸నేటి కాలానికి పూర్వకాలం నాటివిగా వ్రాసి చూపడం. 


🔸ఆక్షేపణలు లేని పనిని పూర్తి చేయకుండుట. 


🔸 ఆక్షేపణులన్న దానిని పూర్తి చేయడం. 


🔸స్వల్ప మొత్తాన్ని లెక్కల్లో పెద్ద మొత్తంగా చూపడం. 


🔸పెద్ద మొత్తాన్ని స్వల్ప మొత్తంగా మార్చి వేయడం. 


🔸ఒకరి పేరున ఉన్న దానిని మరొకరి పేరున ఉన్నట్లు రాయడం. 


🔸పరిహారము చెల్లించకుండానే చెల్లించినట్లు వ్రాయడం. 


🔸తక్కువ పరిహారమిచ్చి ఎక్కువ ఇచ్చినట్లు రాయడం. 


🔸మొత్తము ఆదాయాన్ని చిల్లర పద్ధతులుగా వ్రాయడం. 


🔸 చిల్లర పద్దును మొత్తము ఆదాయముగా చూపడం వంటివి వీటిలో కొన్ని.... 


ఇట్టి అవినీతి పనులకు రాజసేవకులు పాల్పడకుండా ప్రభుత్వం వారికి తగిన విధంగా జీతభత్యములనిస్తూ వృత్తి యందు వారి నిజాయితీనీ ప్రత్యేక బహుమతుల ద్వారా ప్రోత్సహించవలెను.


♦️ పది గ్రామములకు ఒక గ్రామపరిషత్తు, పది గ్రామ పరిషత్తులకు ఒక మండల పరిషత్తు, వంద మండల పరిషత్తులకు ఒక ఖర్వాటకము (జిల్లాపరిషత్తు) ఎనిమిది వందల జిల్లా పరిషత్తులకు ఒక స్థానీయము (రాష్ట్రము) ఏర్పాటు చేయవలెను. ప్రతి గ్రామము నందు పురోహితుడు, వైద్యుడు, కరణము, మునసబు, వెట్టి అను వారలను ప్రభుత్వ ఖర్చుతో నియమించవలెను. 


♦️గ్రామస్తులు తామే సహకార పద్ధతిన నీటి వనరులు ఏర్పాటులకు ఆనకట్టలు నిర్మించుకోవలెను. ప్రభుత్వం కూడా లాభాపేక్ష లేకుండా ప్రజాహితంకోరి ఇట్టి నిర్మాణములకు తగిన ధన సహాయము, నిపుణుల సహాయము అందించవలెను. 


♦️రహదారులు, అతిథిగృహాలు, ధర్మసత్రాలు, ప్రయాణ సౌకర్యాలు, రవాణా, వార్త, భూ జల మార్గ రవాణా సౌకర్యములు, తపాలా, విద్యాలయాలు, వైద్యశాలలు, చెరువులు, బావులు తదితర త్రాగునీటి సౌకర్యాల వంటివన్నీ ప్రభుత్వం లాభనష్టాలు భేరీజు వేసుకోకుండా ప్రజలకు కల్పించాలి. అయితే వీటిని ఏర్పాటు చెయ్యడానికయ్యే ఖర్చు నిమిత్తం ధనిక వర్గాలు, వాణిజ్య వ్యాపార వర్గాల వారి నుండి వృత్తిపన్ను, వ్యాపార పన్ను, ఆదాయపు పన్ను వసూలుచేసి వచ్చిన ధనాన్ని ప్రజాసంక్షేమ కార్యక్రమాలకి ఉపయోగించాలి. 


♦️దిక్కులేని అనాధలను, వృద్ధులను, గర్భిణీలను, దీర్ఘరోగులను ప్రభుత్వమే పోషించవలెను. వీరి కోసం విడివిడిగా ఆశ్రయాలు నిర్మించవలెను. 


♦️ప్రభుత్వ ఆదాయ వ్యయములను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలు అందించడానికి కేంద్ర స్థాయిలో కేంద్ర గణాంగికుడు (ఆడిటర్ జనరల్) మొదలుకొని క్రింది స్థాయిలో రాష్ట్ర గణాంగికుడు (ఆడిటర్ జనరల్ ఇన్చార్జి ఫర్ స్టేట్) వరకూ వివిధ స్థాయిలలో గణాంకులని నియమించి వారిని విత్త మంత్రి (ఫైనాన్స్ మినిస్టర్) పర్యవేక్షించవలెను. ఆదాయ వ్యయములు సక్రమముగా లేకున్న ప్రభుత్వము పనిచేయుట కష్టం. 


♦️ 'అష్టవర్షాత్ భవేత్కన్యా...' అను పురాతన సాంప్రదాయము మారవలెను. పన్నెండు సంవత్సరములు నిండిన తర్వాత స్త్రీకి, పదహారు సంవత్సరములు నిండిన తర్వాత పురుషునికి వివాహయోగ్యత సిద్ధించును. కాలమార్పును అనుసరించి దీనిని సవరించుకొనవలెను. 


♦️స్త్రీకి పునర్వివాహము - నీచుడు, దేశాంతర గతుడు, రాజద్రోహి, వ్యసనపరుడు, నపుంసకుడు, ఘాతకుడు అయిన భర్తను వదిలిపెట్టి స్త్రీ మరియొకరిని వివాహం చేసుకొనవచ్చును. ఇట్లే పరస్త్రీ పొందుకోరు భర్త లేదా పరపురుషుని పొందుకోరిన భార్య నేరంలో రుజువైన వారిని కఠినముగా శిక్షించవలెను. వీరిని బహిరంగంగా దండించి మరెవ్వరూ అటువంటి నేరాలకు పాల్పడకుండా హెచ్చరించవలెను. 


♦️కులములను బట్టి కాక గుణమునుబట్టి తమ ప్రభువును ప్రజలు ఎన్నుకొనవచ్చును. అయితే వంశాచారముననుసరించి గుణవంతుడైన రాజు లభించినచో అతనిని రాజుగా అంగీకరించవలెను. 


♦️ జ్యేష్టుడికే అధికారము అనునది ఒకప్పటి సాంప్రదాయము. జ్యేష్టుడు దుర్భిద్ది గలవాడైనప్పుడు, సత్పురుషుడైన కనిష్టుడికి రాజ్యాధికారము కట్టబెట్టవలెను. అట్టి సత్పుత్రులు లేకున్న ప్రజాభీష్టంమున గ్రహించి ప్రజలలో ఒకనిని రాజుగా అభిషేకించవలెను. అంతేకానీ దుర్జనుడైన కుమారునికి అధికారమప్పగించి కులముతోపాటు రాజ్యము చెడును. 

(ఇంకా ఉంది)..🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

హాస్యాన్ని లాస్యం

 హాస్యాన్ని లాస్యం చేయించగలదిట్ట!!


అమరుడు జంధ్యాల – భండారు శ్రీనివాసరావు 

(ఈరోజు  జూన్ 21 జంధ్యాల వర్ధంతి) 

బెజవాడ  ఎస్సారార్  కాలేజీలో నా క్లాస్ మేట్ జంధ్యాల రాసిన ‘సంధ్యారాగంలో శంఖారావం’ నాటకం రిహార్సల్స్ హనుమంతరాయ గ్రంధాలయంలో వేస్తుంటే వెంట నేనూ వుండేవాడిని, ఏ వేషమూ వేయకపోయినా. ఏదో కవితలు గిలకడం వచ్చనే పేరు నాకూ వుండేది. దాంతో మా స్నేహం మరింత చిక్కబడింది. డిగ్రీ తరువాత మా దారులు వేరయ్యాయి. నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. ఆయన కధ సినిమా మలుపులు తిరుగుతూ చెన్నై చేరింది.

కట్ చేస్తే...

మద్రాసులో చందమామ రామారావు గారింట్లో ఒక ముందు గదిలో జంధ్యాల అఫీసు తెరిచాడు. నేనొకసారి వెళ్లాను. గది బయట ‘జంధ్యాల, స్క్రిప్ట్ రైటర్’ అనే నేమ్ ప్లేటు. గదిలో ఒక మేజా బల్ల. దాని వెనుక కుర్చీలో కూర్చుని రాసుకుంటున్న జంధ్యాల అనే జేవీడీఎస్ శాస్త్రి. వెనుకటి రోజుల్లోల్లా లేడు. మామూలుగానే మంచి ఛాయ కలిగిన మనిషి. కాకపోతే జుట్టు కాస్త పలచబడింది. మోహంలో నవ్వు, ఆ నవ్వులో అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. హాయిగా పలకరించాడు. హాయిగా కబుర్లు చెప్పుకున్నాము. హాయిగా నవ్వించాడు. హాయిగా నవ్వుకున్నాను. ఆ హాయి మనసంతా నింపుకుని బెజవాడ తిరిగొచ్చాను.

మళ్ళీ కట్ చేస్తే...

నేను బెజవాడ ఆంధ్రజ్యోతిని ఒదిలి, హైదరాబాదు రేడియోలో చేరాను. జంధ్యాల మద్రాసులో సినిమాల్లో బిజీ అయిపోయాడు. పదేళ్ళలో రెండువందల సినిమాలకు మాటలు రాశాడంటే ఎంతపని రాక్షసుడిగా మారివుండాలి!

ఒకసారి హైదరాబాదు వచ్చాడు. రేడియో స్టేషన్ కు వచ్చాడు. తన దర్శకత్వంలో మొదటి సినిమా ‘ముద్దమందారం’ తీస్తున్నట్టు చెప్పాడు. ఒక గ్రామ ఫోను రికార్డు ఇచ్చి తన సినిమా పాటలు రేడియోలో వచ్చేలా చేయడం కుదురుతుందేమో చూడమన్నాడు. ఎలాగూ వచ్చాడు కదా అని రేడియోలో ఇంటర్వ్యూ రికార్డు చేసాము. స్టేజి నాటకానికీ, రేడియో నాటకానికీ వుండే తేడా ఆయన అందులో విడమరచి చెప్పిన తీరు నన్ను విస్మయపరిచింది. నాకు తెలిసిన జంధ్యాల, ఇప్పుడు చూస్తున్న జంధ్యాల ఒకరేనా అనిపించింది. ఒకటి రెండు హోటళ్ళలో ఆయనకు పర్మనెంటు గదులు ఉండేవి. ఇంకోసారి కట్ చేస్తే...

ఓసారి ఢిల్లీలో కలిశాడు. హైదరాబాదుకు చెందిన ఓ లాయర్ తో కలిసి, నేనూ జ్వాలా ఫైవ్ స్టార్ హోటల్లోని పుస్తకాల షాపులో తిరుగుతుంటే, తెలుగులో మాట్లాడుతున్న మమ్మల్ని గుర్తుపట్టి అదే హోటల్ ల్లోని తన గదికి తీసుకుపోయాడు.

గదికి వెళ్ళగానే, మాతో వచ్చిన లాయరు గారు ఎలాటి మొహమాటం లేకుండా, కొత్త చోటనికానీ, కొత్త మనిషని కానీ సందేహించకుండా ‘ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా’ అని అడుగుతూనే జవాబుకోసం ఎదురుచూడకుండా అందులో దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే ఆ గదిలో పరచిన తివాచీ పై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్త మాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగిపోయాయి. చిన్న తల, పెద్ద బొజ్జ, అంత భారీ కాయంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెర పోయారు.

తరువాత వారిరువురి నడుమ సాగిన కవి పండిత చర్చ విని తీరాలి. అప్పటికే ‘శంకరాభరణం’ సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల, విశ్వనాద్ గారిదే మరో సినిమా ‘సప్తపది’కి మాటలు రాస్తున్నాడు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ జరిగిన సంభాషణ నిజానికి ఇద్దరు పండిత శ్రేష్ఠుల మధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకర్ని మించి మరొకరు అక్షర లక్షలు చేసే తర్కవిన్యాసాలు ప్రదర్శించారు. ‘సప్తపది’ సినిమా క్లైమాక్స్ లో ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన ఈ అంశాలలో కొన్నింటిని జంధ్యాల పొందుపరచినట్టున్నారు కూడా.

ఈ చర్చ సాగిన తీరు గమనిస్తే, నాకు కాలేజీలో తెలిసిన శాస్త్రి, ఇప్పుడు చూస్తున్న ఈ జంధ్యాల, ఈ ఇద్దరూ ఒకరేనా అన్న సందేహం కలిగింది. అంతటి పరిణతి ఆయనలో కనబడింది.

మరోసారి కట్ చేస్తే....

నా మకాం మాస్కోకి మారింది. జంధ్యాల మద్రాసుకి అతుక్కుపోయాడు. క్షణం తీరిక లేని జీవితచట్రంలో ఒదుగుతూ, ఎదుగుతూ ఏళ్ళతరబడి ఉండిపోయాడు. కధా చర్చలు జరపడం కోసం, రాసుకోవడం కోసం ఒకటి రెండు పెద్ద పెద్ద హోటళ్ళలో ఆయనకు పర్మనెంటు గదులు ఉండేవి. మాస్కో నుంచి విశ్వప్రయత్నం చేస్తే మద్రాసులో ఏదో ఒక అయిదు నక్షత్రాల హోటల్లో దొరికేవాడు. అంత దూరం నుంచి ఫోను చేస్తున్నందువల్లనో ఏమో, కాసింత తీరిక చేసుకుని లైన్లోకి వచ్చి మాట్లాడేవాడు. అప్పటికే ఆయన బిజీ డైరెక్టర్ల కోవలోకి చేరిపోయాడు. మాస్కో థియేటర్లో శంకరాభరణం చూశానని చెబితే ఎంతో సంబరపడ్డాడు. మాస్కో రమ్మని, అక్కడి మంచు వాతావరణంలో ఒక తెలుగు సినిమా తీయమని అనేక మార్లు చెప్పాను. రెండేళ్ళదాకా కొత్త సినిమాలు గురించి ఆలోచించే తీరుబాటు లేదని చెప్పేవాడు.

సోవియట్ యూనియన్ పతనానంతరం నేను హైదరాబాదు తిరిగి వచ్చిరేడియోలో చేరాను. జంధ్యాల మకాం కూడా చెన్నై నుంచి భాగ్యనగరానికే మారింది. సినిమాల హడావిడి కొంత తగ్గినట్టు వుంది. ఎప్పుడయినా వెళ్లి కలిసినా తీరిగ్గానే కనిపించేవాడు.

తరువాత చాలా సార్లు కలుసుకున్నాము. భక్త రామదాసు ప్రాజెక్టు కోసం తరచూ ఖమ్మం వెడుతుండేవాడు. ఆయన కారులోనే అప్పుడప్పుడు ఖమ్మం వెళ్లి వస్తుండేవాణ్ని. దోవలో ఎన్నో జోకులు చెప్పేవాడు. చెప్పే సంగతులు మారేవి కానీ చెప్పే తీరులో మాత్రం తేడాలేదు. 

ఇరవైనాలుగు గంటలు బిజీ బిజీగా అనేక సంవత్సరాలు గడిపిన మనిషి ఖాళీగా వుండడం ఎంత బాధాకరంగా వుంటుందో ఎప్పుడూ నవ్వుతుండే ఆయన మోహంలో అప్పుడప్పుడూ లీలగా కానవచ్చేది.

నిండు నూరేళ్ళ జీవితం అనుకుంటే జంధ్యాల బతికింది యాభయ్ యేళ్ళే. కానయితేనేమి నూరేళ్ళకు సరిపడా నవ్వులు నలుగురికీ పంచి పెట్టిపోయాడు.

ఆరోజు నాకు బాగా జ్ఞాపకం వుంది. నేను రేడియోలో వుంటే, రాంపా ఫోను చేసి జంధ్యాల పోయాడని చెప్పాడు. నేను వెంటనే వార్త రాసి ఇచ్చేసి రాజభవన్ రోడ్డులోని వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పుడే కబురు తెలిసి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఓ కుర్చీలో జంధ్యాల నాన్నగారు నారాయణమూర్తి గారు కూర్చుని వున్నారు. కానీ ఆయనకు ఏదీ తెలియని పరిస్తితి. జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. ఏమి జరిగిందన్నది, ఒక్కగానొక్క కొడుకు పోయాడన్నది అర్ధం చేసుకునే స్తితి కాదు. ఏమిటో ఈ జీవితం అనిపించింది.

జంధ్యాల చనిపోయిన రెండేళ్లకు వేటూరి సుందరరామమూర్తి ఇలా గుర్తుచేసుకున్నారు.

“హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసం, నిన్నటి దరహాసం జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు. ఎంత కాదనుకున్నా కన్నీళ్ళు కళ్ళతోనే మింగటం కన్నా శరణ్యం లేదు”.

తెలుగుజాతి ‘చిరునవ్వు’, జంధ్యాల అన్నారు వేటూరి.

ఆ వేటూరిగారు కూడా ఇప్పుడు లేరు. జంధ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.

కాని, ఆయన అన్నట్టు జంధ్యాల మార్కు నవ్వుకు మాత్రం మరణం లేదు.

తోక టపా :

" నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినాకూడా, వంట చేస్తున్న మా అమ్మగారు. ‘పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు’ అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని. 

ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే !”

అమ్మ ప్రేమ గురించి ఇంత గొప్పగా చెప్పడం ఆ 

 సాధ్యం!

వే దాం గ ము లు

 వే దాం గ ము లు !


వేదరాశి సహజమైన శబ్దాలు. అందులో ఎంతో జ్ఞానం నిగూఢమై ఉంది. మరి ఆ అర్థాన్ని ఎట్లా తెలుసుకోవడం ?  వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంథాలను ఇచ్చారు. వేద రాశి యొక్క అర్థ నిర్ణయాని కొరకు. వీటినే వేదాంగాలు అని అంటారు. అవి ఆరు.


1. శిక్షా


వేద శబ్దాల మూలాలు, ధాతువులని బట్టి ఆయా శబ్దాల  ఉచ్చారణ, స్వరములని చెప్పేది. వేదాన్ని ఎట్లా పలకాలో తెలుపుతుంది.


2. వ్యాకరణం


కొన్ని శబ్దాలు ఒక్కో చోట ఒక్కోలా ఉచ్చరించాల్సి ఉంటుంది, అవి ఎట్లాలో చెప్పేది వ్యాకరణం. ఎన్నో ధాతువుల నుండి అర్థాన్ని చెబుతాయి. ఉదాహరణ మనవ అనే పదం మను అనే మహర్షి యొక్క సంతతి కనక మానవ అయ్యింది.


3. కల్పం


వేద యజ్ఞంకోసం చేయాల్సిన యాగ శాల, వేదిక ఎట్లా ఉండాలి అనే విషయాలను తెలిపేది కల్పం.


4. నిరుక్తం


పదాలు ఎట్లా తయారు అయ్యాయో తెలుపుతుంది. మనుష్య అనే పేరు ఎట్లా వచ్చింది అంటే 'మత్వా కర్మాణి సేవ్యతి'. లోకానికి ఏది కావాలో ముందే ఆలోచించి చేసే వాడు కనక మనిషి అని పేరు.


5. ఛందస్సు


ఛందస్సు అనేది వేద మంత్రాలలోని అక్షరాలను కొలిచేది, శబ్దాల అర్థాలను వివరిస్తుంది. విష్ణుసహస్రనామాలు ఉండేవి అనిష్టుప్ ఛందస్సు, అంటే శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. నాలుగు భాగాలు చేస్తే ఒక్కో భాగానికి 8 అక్షరాలు ఉంటాయి. గాయత్రి మంత్రానికి పేరు ఛందస్సుతో ఏర్పడింది. గాయత్రి అనేది ఛందస్సు. కొందరు గాయత్రి మంత్రం అనగానే ఒక స్త్రీమూర్తిని బొమ్మగా వేసి చూపిస్తారు, కాని అది తప్పు. గాయత్రి మంత్రం ప్రతిపాదించే దేవత నారాయణుడు. అందుకే సంధ్యావందనం చేసేప్పుడు సూర్యమండలం మధ్యవర్తిగా ఉండి నడిపేవాడు నన్నూ ప్రేరేపించుగాక అని కోరుతారు. నారాయణుడు ఆ మంత్రం యొక్క దేవత. ఉత్పలమాల, చంపకమాల అనేవి తెలుగులో ఛందస్సు. ఆ పదాలు స్త్రీలింగ శబ్దాలు, అట్లానే గాయత్రి ఛందస్సు కూడా.


6. జ్యోతిషం


మనం ఆచరించాల్సిన పనులు ఎప్పుడు, ఏమి, అట్లా చేయాలో తెలిపేది. చంద్రుడిని బట్టి, సూర్యుడిని బట్టి, ఋతువులని బట్టి కాలాన్ని చెబుతుంది.


వీటినే షడంగాలు అని చెబుతారు. ఇవి వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించేవి.  

                                  స్వస్తి!🙏

వారణాసి కాశీ వైభవం :

 వారణాసి కాశీ వైభవం :---



కాశీవైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం


కాశీపట్టణం గొడుగు లాంటి పచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది.కాశి బ్రహ్మదేవుని సృష్టి లోనిది కాదు.విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచ సాంస్కృతిక నగరం 

స్వయంగా శివుడు నివాసముండే నగరం.


ప్రళయ కాలంలో మునుగని అతి  ప్రాచిన పట్టణం శివుడు ప్రళయ కాలంలో తన తన త్రిశూలం తో కాశిని పైకెత్తి కాపాడతాడు. 


కాశి భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశి పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది పద్నాలుగు భువన బాండాలలో విశేషమైన స్థలం.


కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం.


ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని  కాశి లోనికి అనుమతించడు

కాశి లో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.


కాశి ప్రవేశించిన జిీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది. డిండి గణపతి కాల బైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షసులు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశి దాటి వెళ్లి పోయినా పాపలు అంటకుండా రక్ష నల్లని కాశీదారం కడతారు


కాశీవాసం చేసే వారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.


కాశీలో మరణించిన ప్రతి జిీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు

అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీపూరిలో గడుపుతారు.


మరణించిన వారి ఆస్తికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మల్లి కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.


గోముకం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మల్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశిీపట్టన్నాని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.


శివుని కాశిలోని కొన్ని వింతలు

కాశీలో గ్రదలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.


కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సంధులు కలిగి అట్టి సంధులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ గూడి జాడ దొరకకుండా ఉంటుంది.

కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు పులచెట్లు మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగలాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.


అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు అస్సలు ఇ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి  

అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు అంత పరిజ్ఞ్యానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.


కాశీ విశ్వేసురునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు 


కాశీలోని పరాన్న బుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లబిస్తుంది


కాశి క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రేట్లు ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రేట్ల పాపం అంటుతుంది.


విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి

ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు

జగత్అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశీ..


ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశిలోనే వున్నది


కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి ఇందులో దేవతలు,ఋషులు,రాజులూ, తో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించిన వి ఎన్నో వున్నాయి

అందులో కొన్ని 

1, దశాశ్వమేధఘాట్ బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే.. రోజు సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2,ప్రయాగ్ ఘాట్ ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి

3, సోమేశ్వర్ ఘాట్ చంద్రుడు చేత నిర్మితమైనది 

4,మీర్ ఘాట్ సతి దేవీ కన్ను పడిన స్థలం విశాలాక్షి దేవి శక్తి పీఠం.

ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది

5,నేపాలీ ఘాట్ పశుపతి నాథ్ మందిరం బంగారు కళశంతో నేపాల్ రాజులూ కట్టినాడు

6, మని కర్ణికా ఘాట్ ఇది కాశీలో మొట్ట మొదటిది దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రం తో  తవ్వి నిర్మించాడు ఇక్కడ సకల దేవతలు స్నానమ్ చేస్తారు .ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపలు తొలిగి పోతాయి జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట

7, విష్వేవర్ ఘాట్ ఇప్పుడు సిందియా ఘాట్ అంటారు ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు

8, పంచ గంగా ఘాట్ ఇక్కడే బూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి

9,గాయ్ ఘాట్ గోపూజ జరుగుతున్నది

10,తులసి ఘాట్ తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం  పొందినది

11,హనుమాన్  ఘాట్ ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది ఇక్కడే శ్రీ వల్లబచార్యులు జన్మించారు.

12,అస్సి ఘాట్ పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది

13,హరిశ్చంద్ర ఘాట్ సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహనం కూలీగా పని చేసి దైవ పరక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు

నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది

14,మానస సరోవర్ ఘాట్ ఇక్కడ కైలాసపర్వతం నుండి బుగర్భ జలాధార కలుస్తున్నది ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లబిస్తున్నది

15,నారద ఘాట్ నారదుడు లింగం స్థాపించాడు.

16, చౌతస్సి ఘాట్ ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం

ఇక్కడ స్నానం చేస్తే పాపలు తొలిగి 64 యోగినిలు శక్తులు ప్రాప్తిస్తాయి.

17,రానా మహల్  ఘాట్ ఇక్కడే పూర్వం బ్రమ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విజ్ఞాలను తొలగించమని వక్రతుండ వినాయకున్నీ తపస్సు చేసి ప్రసన్నున్ని చేసుకున్నాడు

18, అహిల్యా బాయి ఘాట్ ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ

విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము. కాశీలోని గంగా నది ప్రవాహంలో                     అనేక ఘాట్ల ద్ధగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి 


పూర్వం కాశిలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది 

కానీ  మొహమ్మదీయ దండ యాత్రికులు కాశిని లక్ష్యంగా  చేసుకొని దాడులు చేసి  ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము 


విశ్వనాథ ,బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు నేటికీ విశ్వనాథ మందిరంలొ నంది మజిీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశుాలం తో త్రవ్విన జ్ఞ్యాన వాపి తీతం బావి ఉంటుంది 


ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిరం అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాని శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు.


(సేకరణ)🙏🙏🌷

రాజ్యేన కిమ్

 

శుభోదయం🙏

ఉద్దండ  కవితా విహారం!

      
          ఉ:  భోజుఁడు  మంకు ,  ధర్మజుఁడు బొంకు ,  శచీపతి రంకు ,  కల్వపూ

                రాజు  కళంకు ,  దైవత ధరాజము  డొంకు , పయోధియింకు ,   అం

               భోజ భవుండు పంకు,  ఫణి భూషణ దేవుడు  సంకు ,      పద్మినీ

               రాజ హితుండు  గ్రుంకు ,  సరిరారు  గుణంబుల   నీకు  ధారుణిన్; 

                 చాటు పద్యము---  వేముల వాడ భీమకవి ; 

                                 ఇది  యొక  చాటుపద్యం. వేములవాడ  భీమకవిపేర  చెలామణీలో  ఉంది. నాకైతే  రచయిత విషయంలో అనుమానమే!  ఎందుకంటే  ఇంత సౌమ్యంగా వేములవాడ  కవిత్వం చెప్పిన దెప్పుడు? ఆ ఉద్దండత్వం  అంతగా యిందులో కాన
రాకపోవటం,  ఇలాంటిపద్యాలే  అడిదము సూరకవి  చెప్పటం  కారణాలు. పూసపాటివారి దగ్గరకు అడిదము సూరకవి బోయినప్పుడు ఆరాజుగారిని పొగడుతూ-

                      "రాజు కళంకమూర్తి,  రతిరాజు శరీర విహీను డంబికా
                       రాజు దిగంబరుండు'--- ఇలా పద్యం చెప్పాడు. మాటలతేడా తప్ప దాని శైలికీ  దీనిశైలికీ  భేదం అంతగా నాకు
కనిపించదు. ఆవిషయాలు అటుంచితే  -పద్యం మంచి భావనా పుష్ఠితో సాగింది. భావం వినండి!

             కవి పండిత పోషకుడు భోజుడున్నాడే  వట్టి మంకుపట్టుదల కలవాడు. పోనీ దేవేంద్రుడా? వాడు వ్యభిచారి. చంద్రుడా  కళంకుడు. మేరుపర్వతమా  వట్టిడొల్ల. రాముడు విరచిపారేశాడు అవలీలగా. ఇకసముద్రమా  దానికి  యింకిపోయే స్వభావం గలది.
( ఆటు పోటు లున్నాయని భావం) బ్రహ్మగారా  యెప్పుడూ బురద లోనే ఉంటాడు. (ఆయన కూర్చుండే పద్మం బురదలోనే ఉంటుందని భావం)  శంకరుడా  యెల్లవేళలా శంఖమూదుకొని తిరిగే బిచ్చగాడాయె. సూర్యని చెపుదామా ఆయన సాయంత్రానికి
అస్తమిస్తాడాయె. కాబట్టి సుగుణాలలో  నీకు  వీరెవ్వరూ సాటిరారు. అనిభావం.

వివరణము:విద్యా పోషణలో భోజుడు ప్రసిధ్ధుడు. ఈరాజుగారు అంతకన్నాగొప్పవారని చెప్పటం. ధర్మజుడు ఆడితప్పాడు. సత్యసంథతలో అతడు సరిగాడనటం. శచీపతి పరదారాభిలాషి  నీవు  వ్యభిచార దోషాతీతుడవు. ఉత్తమ శీల సంపదకలవాడవనుట. చంద్రునియందైనా కళంకం ఉందేమోకాని  నీయందు దోషములెన్ను నవకాెశములేదనుట. బ్రహ్మ పంకంలో ఉంటాడంటే ,బురద పాపానికి చిహ్నం . నీవు పాపాలు చేయనివాడవనటం. ఫణిభూషణదేవుడు శంఖధారి . జగందేవరలను  నడిచే శివునిగా భావిస్తారు. వాళ్ళు శంఖమూదుతో యింటింటా భిక్షమెత్తుతుంటారు. నీవు నీచమైన భిక్షాటనాది కృత్యరహితుడవు శంకరునికన్న మిన్న వనుట.  ఇంక తేజంలో సూర్యని పోలుచుటకు గూడా  అవకాశంలేదు. సాయంత్రమయ్యేసరకల్లా ఆయన  అస్త
మిస్తాడు. నీపరాక్రమం రేయింబవళ్ళు( యెల్లవేళలా)నీయందు కనిపిస్తుంది.

                             ఇలా  యెవరిని చూచినా యేవో  కొరతలు కనిపిస్తాయి ,కానీ  , నీయందుమాత్రం  యేకొరతా కనిపించదయ్యా!  ఉత్తమ గుణగరిష్ఠుడవు. నిన్నుబోలువారులేరని చెప్పుట ఫలితార్ధం. పొగడ్తలకు లొంగనివారుందురా? యీపద్యమును వినినరాజెవరో గాని యాకవిని  ఘనముగా సత్కరించియే యుండును.

                       " సుకవితా యద్యస్తి  రాజ్యేన కిమ్"- అన్నారుగదా పెద్దలు!

                                                        స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👌