30, డిసెంబర్ 2020, బుధవారం

పురుషా రాజన్,

 "సులభా: పురుషా రాజన్, 

సతతం ప్రియవాదినః !

అప్రియస్య చ పథ్యస్య

వక్తా శ్రోతా చ దుర్లభ : !!"


"ఓ రాజా, అధికారంలోవున్న నీ చుట్టూ భజనపరులు చేరి ముఖప్రీతి మాటలతో తమ పబ్బం గడుపుకుంటారు, కానీ నీ హితవు చెప్పేవారు ఉండరు, ఒకవేళ చెప్పినా వినేవారులేరు" అని శ్రీరామాయణంలో చెప్పిన మారీచుడున్నూ; మహాభారతంలో వికర్ణుడున్నూ ఈ ఉభయులు చేసిన జ్ఞానోపదేశం పెడచెవిన పెట్టిన వారికి సంప్రాప్తమైన గతి, వర్తమాన రాచకీయ యవనికపై తాము అవతార యుగ పురుషులుగా భ్రమ, మైకంలో ఉన్న వారికి రాకూడదని ....

బుధుడు

 బుధుడు : 

సోమునకును రోహిని తారకు బుదుడు  సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ద ఏకాదశిజన్మించెను బుదుని భార్య:- వైరజ కుమారుడు :- పురూరవుడు 

బుధుడు : బంధనం , హేమలాభంచ . రిపుపీడం , రిపుక్షయం

దారిద్ర్యం ,భూషణం , లాభం, మనసిద్దిం ,ధనక్షయం

ప్రమోదం, మోదసంహారం, బుదః కుర్యాత్క్రమాద్గతః


తాత్పర్యము: బుధుడు పన్నెండు రాశులలో సంచరిచు సమయములలో 1 బంధనము 2 సువర్ణ లాభము 3 శత్రుభాధలు 4 శత్రువుల నాశనము 5 దరిద్రము 6 ఆభరణ లాభము 7 లాభములను 8 సంతోషము 9 ధన నష్టము 10 ప్రమోదము 11 మోదమును 12 నాశనము కలిగించును. 


బుధ నపుంసక గ్రహం. మిశ్రమ రుచుల కారకత్వం కలిగిన వాడు. ఇరవై వయసున్న వారిని సూచిస్తాడు. వర్ణం ఆకు పచ్చ, జాతి వైశ్య, అధి దేవత విష్ణువు, గుండ్రని ఆకారం, పరిమాణం పొడుగు, ప్రకృతి కఫ, వాత, పిత్తములు కల వాడు. శరధృతువును ఉత్తర దిక్కునూ, సూచిస్తూ, పృధ్వీ తత్వం కలిగిన వాడు, గ్రహ సంఖ్య అయిదు, రత్నం పచ్చ, లోహం, ఇత్తడి, కంచు, గుణం రజో గుణం కలిగిన వాడు. లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. ఆశ్లేష, మూల, రేవతి నక్షత్రములకు బుధుడు అధిపతి. మిధున కన్యా రాశులకు అధిపతి. బుధుడు కన్యారాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ ఉచ్ఛ స్థితిని పొందుతాడు. మీనరాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ నీచను పొందుతుంది. కన్యారాశిలో పదిహేను ఇరవై డిగ్రీలు మూల త్రికోణము ఔతుంది. బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్రులు. సింహరాశి, వృషభరాశి, తులారాశులు మిత్ర స్థానములు. చంద్రుడు శత్రువు. కర్కాటక రాశి శత్రు స్థానం. బుధ గ్రహ దశ పదిహేడు సంవత్సరాలు. బుధుడు ఏడవ స్థానం మీద మాత్య్రమే దృష్టిని సారిస్తాడు. బుధుడు స్వభావరీత్యా శుభుడు, తత్వము భూతత్వం, గ్రహ స్వభావం, ఒంటరిగాపాపి శుభగ్రహములతో చేరిన శుభుడు. జీవులు పక్షులు, గ్రహ స్థానం క్రీడాస్థలాలు, జలతత్వం జలభాగం, ఆత్మాధికారం వాక్కు, పాలనా శక్తి రాకుమారుడు, గ్రహపీడ బంధువుల వలన బాధలు, గ్రహ వర్గం శని, గృహంలో భాగములు పఠనా మందిరం, దిక్బలం తూర్పు, నివాస ప్రదేశములు జనావాసాలు, చెట్లు ఫలములు లేని చెట్లు, పండ్లు సీమ చింత, ధాన్యం పెసలు, పక్షులు చిలుక, గబ్బిలం, జంతువులు మేక గొర్రె, ఇతర వస్తువులు నగలు, మిశ్ర లోహములు. వస్త్రం తడి వస్త్రం, దేవ వ్ర్గం శైవ, గ్రహ వేదం అధ్ర్వణ వేదం, గ్రహ గోత్య్రం ఆత్రేయ, అర్ధశుభుడు, అవతారం బుద్ధావతారం, గ్రహవర్ణం తాళపత్ర వర్ణం, వారం బుధవారం, మన స్థితి సాత్వికం, బలంగా ఉంటే వాక్చాతుర్యం బుద్ధి జ్ఞానం, ఋషి నారాయణుడు. హోమముకు వాడవలసిన సమిధ ఉత్తరేణి.


లగ్నములో బుధుడు ఉన్న జాతకుడు దీర్ఘాయువు, మృదుమధుర వాక్కులు పలికేవాడు, హాస్యచతురుడు ఔతాడు.

ద్వితీయస్థానమున బుధుడు ఉన్న జాతకుడు స్వశక్తితో ధనమును సంపాదించు వాడు, ఆకర్ష్ణీయంగా మాటాడు వాడు, ప్రస్పుటముగా మాటాడు వాడు, భోజన ప్రియుడు ఔతాడు.

తృతీయమున బుధుడు ఉన్న జాతకుడు ధైర్యశాలి, శౌర్యం కల వాడు, సమ ఆయుషు కలవాడు, మంచిసోదరులు కలవాడు, త్వరితంగా అలసట పొందువాడు ఔతాడు.

చతుర్ధభావమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, హాస్యవిశారదుడు, భూమి కలవాడు, మిత్రులు కలవాడు, ధాన్యసమృద్ధి కలవాడు, ఐశ్వర్యం కలవాడు, సంతోషం కలవాడు ఔతాడు.

పంచమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, సుఖవంతుడు, శైర్యవంతుడు, మంత్రవిద్యాభిలాషి, సంతానవంతుడు ఔతాడు.

ష్టమ భావమున బుధుడు ఉన్న జాతకుడు వివాదాస్పదుడు, క్రోధము కలవాడు, నిష్టుర వాక్కులు పలుకు వాడు, శత్రువులను నాశనం చేయువాడు ఔతాడు.

సప్తమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, ఔన్నత్యం కల వాడు, ధనసంపన్నత కలిఉగిన భార్య కలిగిన వాడు, అందమైన వస్తధారణ చేయువాడు ఔతాడు.

అష్టమ స్థానమున ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగిన వాడు, చిరంజీవి, కుటుంబానికి అండగా ఉండే వాడు, ప్రభువు లేక సైన్యాధ్యక్షుడు ఔతాడు.

నవమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్య, ఐశ్వర్యం, సచ్చరిత్ర, ఆచారము, ప్రావీణ్యం, స్వచ్ఛమైన పలుకులు కలిగిన వాడు ఔతాడు.

బుధుడు దశమస్థానమున ఉన్న జాతకుడు మంచి విద్య, సకలకార్య విజయం, శక్తివంతుడు, మేధా సంపన్నుడు, సుఖము కలవాడు, సత్ప్రవర్తన, సత్యవాక్కు పలుకు వాడు ఔతాడు.

ఏకాదశ స్థానమున ఉన్న జాతకుడు చిరంజీవి, సత్యసంధుడు, బహుధనవంతుడు, సుఖజీవి, సేవాజనము కలవాడు ఔతాడు.

ద్వాదశ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు కష్టజీవి, విద్యాహీనుడు, నమ్రత కలిగిన వాడు, క్రూరుడు, తేజోహీనుడు ఔతాడు.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

Valueble information


ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.


 దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం


మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం


 వేదాలు :(1) ఋగ్వే దం, 

(2) యజుర్వేదం,(3) సామవేదం,

(4) అదర్వణ వేదం


 పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,

(3) కామ,(4) మోక్షా


 పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,

(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.


  పంచేంద్రియాలు : (1) కన్ను, 

(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,

(5) చర్మం.


 లలిత కళలు : (1) కవిత్వం,

(2) చిత్రలేఖనం, (3) నాట్యం,

(4) సంగీతం, (5) శిల్పం.


 పంచగంగలు : (1) గంగ, (2)  కృష్ణ,

(3) గోదావరి, (4) కావేరి, 

(5) తుంగభద్ర.


 దేవతావృక్షాలు : (1) మందారం, 

(2) పారిజాతం, (3) కల్పవృక్షం, 

(4) సంతానం, (5) హరిచందనం.


 పంచోపచారాలు : (1) స్నానం,

(2) పూజ,  (3) నైవేద్యం,

(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.


  

పంచామృతాలు : (1) ఆవుపాలు,

(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర, 

(5) తేనె.


 పంచలోహాలు : (1) బంగారం, 

(2) వెండి,  (3) రాగి,

(4) సీసం, (5) తగరం.


 పంచారామాలు : )1) అమరావతి,

(2) భీమవరం, (3) పాలకొల్లు,

(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం


 షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు, 

(3) చేదు, (4) వగరు, 

(5) కారం, (6) ఉప్పు.


అరిషడ్వర్గాలు  షడ్గుణాలు:(1) కామం, 

(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,

(5) మదం, (6) మత్సరం.


ఋతువులు : (1) వసంత,(2) గ్రీష్మ,

(3) వర్ష, (4) శరద్ఋతువు, 

(5) హేమంత, (6) శిశిర


 సప్త ఋషులు : (1) కాశ్యపుడు,

(2) గౌతముడు,  (3) అత్రి,

(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,

(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.


తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి,

(2) నీలాద్రి, (3) గరుడాద్రి, 

(4) అంజనాద్రి, (5) వృషభాద్రి, 

(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.


సప్త వ్యసనాలు : (1) జూదం,

(2) మద్యం, (3) దొంగతనం, 

(4) వేట, (5) వ్యభిచారం, 

(6) దుబారఖర్చు,

(7) కఠినంగా మాట్లాడటం.


 సప్త నదులు : (1) గంగ, 

(2) యమునా,  (3) సరస్వతి, 

(4) గోదావరి,  (5) సింధు,

(6) నర్మద,  (7) కావేరి.

            

నవధాన్యాలు : (1) గోధుమ,

(2) వడ్లు,  (3) పెసలు,

(4) శనగలు, (5) కందులు,

(6) నువ్వులు, (7) మినుములు, 

(8) ఉలవలు, (9) అలసందలు.


నవరత్నాలు : (1) ముత్యం, 

(2) పగడం, (3) గోమేధికం,

(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం, 

(7) కనకపుష్యరాగం, 

(8) పచ్చ (మరకతం), 

(9) ఎరుపు (వైడూర్యం).


నవధాతువులు : (1) బంగారం,

(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి, 

(5) ఇనుము, (6) కంచు,

(7) సీసం, (8) తగరం, 

(9) కాంతలోహం.


నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార, 

(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర, 

(6) భయానక, (7) బీభత్స, 

(8) అద్భుత, (9) వీర


నవదుర్గలు : (1) శైలపుత్రి, 

(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,

(4) కూష్మాండ, (5) స్కందమాత, 

(6) కాత్యాయని, (7) కాళరాత్రి, 

(8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.


 దశ సంస్కారాలు : (1 ) వివాహం, 

( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం , 

(4 ) సీమంతం, (5) జాతకకర్మ, 

(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం, 

(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం, 

(10) సమవర్తనం


దశావతారాలు : (1) మత్స్య,

(2) కూర్మ, (3 ) వరాహ,

(4) నరసింహ, (5) వామన, 

(6) పరశురామ, (7) శ్రీరామ,

(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.


జ్యోతిర్లింగాలు :


హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .


కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .


మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)


గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)


మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)


ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) 


తమిళనాడు ~ రామలింగేశ్వరం

 

తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ, 

(3) మంగళ, (4) బుధ, (5) గురు, 

(6) శుక్ర, (7) శని.


తెలుగు నెలలు : (1) చైత్రం,

(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం, 

(5) శ్రావణం, (6) భాద్రపదం, 

(7) ఆశ్వీయుజం, (8) కార్తీకం, 

(9) మార్గశిరం, (10) పుష్యం, 

(11) మాఘం, (12) ఫాల్గుణం.


 రాశులు : (1) మేషం,(2) వృషభం, 

(3) మిథునం, (4) కర్కాటకం,

(5) సింహం, (6) కన్య, (7) తుల, 

(8) వృశ్చికం, (9) ధనస్సు, 

(10) మకరం, (11) కుంభం, 

(12) మీనం.


తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ, 

(3) తదియ, (4) చవితి,(5) పంచమి, 

(6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి, 

(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి, 

(12) ద్వాదశి, (13) త్రయోదశి, 

(14) చతుర్దశి, 

(15) అమావాస్య /పౌర్ణమి.


నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి, 

(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర, 

(6) ఆరుద్ర, (7) పునర్వసు, 

(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ, 

(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త, 

(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ, 

(17) అనురాధ, (18) జ్యేష్ఠ, 

(19) మూల, (20) పూర్వాషాఢ, 

(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం, 

(23) ధనిష్ఠ, (24) శతభిషం, 

(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర, 

(27) రేవతి.


తెలుగు సంవత్సరాల పేర్లు :

(1) ప్రభవ :-

1927, 1987, 2047, 2107


(2) విభవ :- 

1928, 1988, 2048, 2108


(3) శుక్ల :-

1929, 1989, 2049, 2109


( 4 ) ప్రమోదూత :-

1930, 1990, 2050, 2110


( 5 ) ప్రజోత్పత్తి :-

1931, 1991, 2051, 2111


( 6 ) అంగీరస :- 

1932, 1992, 2052, 2112


( 7 ) శ్రీముఖ :-

1933, 1993, 2053, 2113


( 8 )భావ. - 

1934, 1994, 2054, 2114


9యువ.  - 

1935, 1995, 2055, 2115


10.ధాత.  - 

1936, 1996, 2056, 2116


11.ఈశ్వర. - 

1937, 1997, 2057, 2117


12.బహుధాన్య.-

1938, 1998, 2058, 2118


13.ప్రమాది. - 

1939, 1999, 2059, 2119


14.విక్రమ. - 

1940, 2000, 2060, 2120


15.వృష.-

1941, 2001, 2061, 2121


16.చిత్రభాను. - 

1942, 2002, 2062, 2122


17.స్వభాను. - 

1943, 2003, 2063, 2123


18.తారణ. - 

1944, 2004, 2064, 2124


19.పార్థివ. - 

1945, 2005, 2065, 2125


20.వ్యయ.-

1946, 2006, 2066, 2126


21.సర్వజిత్తు. - 

1947, 2007, 2067, 2127


22.సర్వదారి. - 

1948, 2008, 2068, 2128


23.విరోధి. - 

1949, 2009, 2069, 2129


24.వికృతి. - 

1950, 2010, 2070, 2130


25.ఖర. 

1951, 2011, 2071, 2131


26.నందన.

1952, 2012, 2072, 2132


27 విజయ.

1953, 2013, 2073, 2133,


28.జయ. 

1954, 2014, 2074, 2134


29.మన్మద.

1955, 2015, 2075 , 2135


30.దుర్మిఖి. 

1956, 2016, 2076, 2136


31.హేవళంబి. 

1957, 2017, 2077, 2137


32.విళంబి. 

1958, 2018, 2078, 2138


33.వికారి.

1959, 2019, 2079, 2139


34.శార్వారి. 

1960, 2020, 2080, 2140


35.ప్లవ

1961, 2021, 2081, 2141


36.శుభకృత్. 

1962, 2022, 2082, 2142


37.శోభకృత్. 

1963, 2023, 2083, 2143


38. క్రోది.

1964, 2024, 2084, 2144, 


39.విశ్వావసు.

1965, 2025, 2085, 2145


40.పరాభవ.

1966, 2026, 2086, 2146


41.ప్లవంగ. 

1967, 2027, 2087, 2147


42.కీలక. 

1968, 2028, 2088, 2148


43.సౌమ్య. 

1969, 2029, 2089, 2149


44.సాధారణ . 

1970, 2030, 2090, 2150


45.విరోధికృత్. 

1971, 2031, 2091, 2151


46.పరీదావి. 

1972, 2032, 2092, 2152


47.ప్రమాది. 

1973, 2033, 2093, 2153


48.ఆనంద. 

1974, 2034, 2094, 2154


49.రాక్షస. 

1975, 2035, 2095, 2155


50.నల :-

1976, 2036, 2096, 2156, 


51.పింగళ                 

1977, 2037, 2097, 2157


52.కాళయుక్తి         

1978, 2038, 2098, 2158


53.సిద్ధార్ధి              

1979, 2039, 2099, 2159


54.రౌద్రి                 

1980, 2040, 2100, 2160


55.దుర్మతి              

1981, 2041, 2101, 2161


56.దుందుభి             

1982, 2042, 2102, 2162


57.రుదిరోద్గారి         

1983, 2043, 2103, 2163


58.రక్తాక్షి                 

1984, 2044, 2104, 2164


59.క్రోదన                  

1985, 2045, 2105, 216


60.అక్షయ              

1986, 2046, 2106, 2166.


ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం....

పెద్దలందరికి విలువైన కొన్ని సూత్రాలు .

 60,65 సంవత్సరాలు దాటిన ఆడ,మగ పెద్దలందరికి విలువైన కొన్ని సూత్రాలు . 

*************************

1) మీరు బాత్రూంలో  వున్నప్పుడు లోపల గడియ పెట్టుకో వద్దు.మీరు లోపల వున్నట్లు తెలియటానికి మీకు వస్తే ఏదైనా కూని రాగాలు పాడుతుండడమో లేకుంటే మీ మొబైల్ తీసుకెళ్లి దాంట్లో  ఏదైనా పాట పెట్టుకోవడమో చేయండి.

2) తడిగాఉన్న నేలపై నడువ వద్దు. ఇప్పడు కట్టే అన్ని ఇండ్లలో ఫ్లోరింగ్ కు పాలిష్ బండలు గానీ , టేల్స్ గానీ, ఇంకా నునుపైన బండలు వేస్తున్నారు. నీరు పడితే కనపడవు. అందవల్ల కాలు పెడితే జారడం ఖాయం.

3) ఫ్యాన్ లు,ఫోటోలు తుడచడానికి గానీ , రిపేరు చేయటానికి గానీ , గుడ్డలు ఆరవేయటానికి గానీ            స్టూళ్ళు , కుర్చీలు, బెంచీలు ఎక్కడం మానుకోండి .

4) కారు గానీ , స్కూటర్  గానీ మీరు ఒంటరిగా నడపడం మంచిది కాదు. ఎవరో ఒకరిని తోడుగా పిలుచుకుని వెళ్ళండి. 

5) మీరు వేసుకునే మందులు ఏమైనా వుంటే డాక్టర్ చెప్పిన ప్రకారం టయానికి మరువకుండా జ్ఞాపకంగా వేసుకోండి. అన్నింటికంటే మీ ఆరోగ్యం మీకు ముఖ్యం. 

6)మిమ్మల్ని సంతోషపరిచే విషయాలలో గానీ,ఆనందపరిచే విషయాలలో గానీ , 

మనశ్శాంతిగా వుండే  విషయాలలో గానీ వేరే వాళ్ళ ఆలోచనలతో రాజీపడవద్దు. 

7) మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే బ్యాంకుకు వెళ్లినా , మార్కెట్టుకు వెళ్ళినా, షాపింగ్ కి  వెళ్ళినా ఇంక ఎక్కడకి వెళ్ళినా మీ సహధర్మచారిణిని (భార్యను)తీసుకవెళ్ళండి.

వాళ్ళూ సంతోష పడతారు. మీకు నిజమై తోడు వాళ్ళే.

8) ఇంట్లో మీరు ఒక్కరు వున్నప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తే వాళ్ళతో బాతకానీ కొట్టకండి.     వీలైనంత త్వరగా  మాట్లాడి పంపించేయండి.జాగ్రత్తగా ఉండండి. 

9) ఎప్పుడూ ఇంటి తాళాలు రెండు మెయింటేన్ చేయండి. ఒకటి మీ దగ్గర ,రెండోది మీ భార్య దగ్గర. 

10) మీ బెడ్ రూంలో బెడ్ ప్రక్కనే ఒక కాలింగ్ బెల్ అరేంజ్ చేసుకోండి.ఎప్పుడైనా అవసరం రావచ్చు. 

11) ఇంట్లో వారితోను , బయటి వారితోను 

మాట్లాడేటప్పుడు మర్యాదగా , మృదువుగా మాట్లాడండి . కోపంగాను , రాష్ గాను మాట్లాడుతే మీ మీద గౌరవం పోయి అసహ్యించుకుంటారు.

12) ఎప్పుడు కూడా జరిగిపోయినదాని గురించి గానీ , జరిగేదాని గురించి గానీ, జరుగబోయేదాని గురించి గానీ ఆలోచించ వద్దు. జరిగేది జరుగక మానదు.

13) ఈ వయసులో  మనశ్శాంతి,మంచి ఆరోగ్యం,మంచి బంధుత్వం + మంచి స్నేహితం చాలా ముఖ్యం. 

Note = మీరు వీలు చేసుకుని  + ఓపిక చేసుకుని మీకు తెలిసిన పెద్ద వారికి అందరికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి.

అద్వైతచైతన్యజాగృతి

 *14- శ్రీ ఆదిశంకరాచార్య విరచితము అపరోక్షానుభూతి*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*శ్లో|| ఏవందేహ ద్వయాదన్య ఆత్మపూరుష ఈశ్వరః |*

*సర్వాత్మాసర్వ రూపశ్చ సర్వాతీతో೭ హోమవ్యయః ||*


*తాత్పర్య వివరణం:-*


*సూల సూక్ష్మ దేహములకంటే అతీతుడను. దేహములకు ప్రేరకుడను, జీవుడనుకాదు. ఈశ్వరస్వరూపుడను, సర్వమునకు అత్మస్వరూపుడను, నాయందే అంతయు కల్పితమైనది గనుక సర్వము నాస్వరూపమే నేను సర్వాతీతుడను అనగా ఈదృశ్య స్వరూపం నాదికాదు. దృశ్యము కంటే నేను వేరు. అధిష్ఠానము కంటే ఆరోపము ఇది వేరు కాదు గనుక నాకంటే ఇది వేరుకాదు. స్వప్రకాశ స్వరూపడను, సాక్షిని అని గ్రహించ వలయును.*




*శ్లో|| ఇత్యాత్మ దేహభాగేన ప్రపంచసైయ వసత్యతా|*

*యథోక్తాతర్కశాస్త్రేణ తతః కింపురుషార్థతా||*


*తాత్పర్య వివరణం:-*


*ఇంతవరకు మూల శ్లోకములను బట్టి ఆత్మ శరీరము కంటే ప్రపంచంకంటే వేరని తేలినది. రెండూ వేరయినప్పుడు ఆత్మవలె ప్రపంచం కూడా సత్యమని చెప్పినట్లయినది. తర్కశాస్త్రము చెప్పినట్లే చెప్పబడినది. దీనివలన మోక్షపురుషార్థ మెట్లు సిద్దించును? అని ప్రశ్నయే ఈ శ్లోకమున కర్థము.*




*శ్లో|| ఇత్యాత్మ దేహభేదేన దేహాత్మత్వం నివారితం|ఇదానీందేహ భేదస్య హ్యసత్వం స్ఫుటముచ్వ తే||*


*తాత్పర్య వివరణం:-*


*ఇంతవరకు దేహదులకంటే ఆత్మవేరని చెప్పడమైనది. అనగా ముందు అనాత్మవస్తు కంటే ఆత్మవేరుగా నున్నదని, పరిశోధన చేయవలెను. తరువాత ఆత్మకంటే అనాత్మ వేరులేదని విచారించవలయును. ఇదియే బ్రహ్మవిచారమునకు లక్షణము. ఇక ఆత్మకంటే దేహము మొదలగు దృశ్యం వేరులేదని చెప్పుచున్నారు.*




*శ్లో|| చైతన్య సై#్యకరూపత్వాద్భేదోయుక్తో నకర్హిచిత్‌ | జీవత్వం చమృషాజ్ఞేయం రజ్ఞౌ సర్పగ్రహోయథా||*


*తాత్పర్య వివరణం:-*


*ఘటము ప్రకాశించుచున్నది అనగా తెలియుచున్నది. పటముతెలియుచున్నది, అని అనుగతమైన అనుభవమునుబట్టి చైతన్యరూపమైన ఆత్మ ఏకరూపమేగాని, నానా రూపమైనది కాదు. చైతన్యరూపులైన జీవులు నానావిధముగా నున్నారు కదా. అంటే తాడుయందు పాము అను భ్రమవలే, పరమాత్మయందు జీవత్వభ్రమ కలిగినది. భ్రమవలన ఏర్పడిన జీవనానాత్వము వల్ల పారమార్థికమగు పరమాత్మ ఏకత్వమునకు విరోధము లేదు. మనముఖం ఒకటి అయినను నూరు అద్దములలో నూరుముఖములు కనిపించును, గాని అద్దములనే ఉపాధుల వలననే నానాత్వము యేర్పడినది. దానివలన ముఖం ఒకటి యనుటలో విరోధంలేదు. ఘటాకాశము మఠాకాశము అని అనేక ఉపాధులలో ఆకాశము ఉపాధి భేధముచేత అనేక ఆకాశములగా కనిపించినను, పరమార్థముగా ఆకాశం ఒకటేగాని నానాకాదు. అటులనే అజ్ఞానకల్పితమైన అంతఃకరణ లనేకములు గనుక ఆయంతఃకరణలయందు పరమాత్మ ప్రతిబింబములే ఆజీవులుగను,ఆజీవులు చాలా మందియున్నను. బింబమైన పరమాత్మ ఒకటియేగాని నానాకాదని అద్వితీయమని ప్రతిబింబ రూపులయిన జీవులందరు బింబమైన పరమాత్మకంటే వేరుకాదు. గనుక ఏకత్వమునకు భంగములేదని గ్రహించవలసిన విషయం.*


🕉🌞🌏🌙🌟🚩

15. వేదాంగములు : శిక్ష*

 *41-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*15. వేదాంగములు : శిక్ష*


((((((((((🕉))))))))))


*అక్షమాల - జపమాల :-*


*''రుద్రక్షమాల'' అంటే రుద్రాక్షలు కల జపమాల అని అర్థం - రుద్రుని కళ్ల నుండి వచ్చినవి రుద్రాక్షలు అని జనశృతి. ఇక్కడ ''అక్ష'' అంటే 'కన్ను' అని అర్థం. 'అక్షమాల' అంటే ఏమిటి? ఇక్కడ ''అక్ష''ని కన్నుగా అన్వయించుకోవటం తప్పు. ''అ'' నుండి ''క్ష'' వరకూ గల అక్షరాలకి ప్రతీక. సంస్కృతంలో మొదటి అక్షరం ''అ'' చివరిది ''క్ష''. సంపూర్ణతని సూచించటానికి ఇంగ్లీషులో ''A to Z'' అంటారు, సంస్కృతంలో ''అ"కారాది "క్ష" కారాంతః'' అంటారు. అంటే ''అ''తో ఆరంభించి ''క్ష''తో అంతమవటం. అక్షరాలన్నీ కలిపి 50, అందువల్ల అక్షమాలలో 50 పూసలుంటాయి.*



*శబ్దోచ్చారణ యొక్క ప్రాముఖ్యత :- మంత్రపఠనంలో అప్రమత్తత అవసరమని ముందు చెప్పడం జరిగింది. శబ్దోచ్చారణలో పొరపాటు జరిగితే మంత్రం సరియైన ఫలమివ్వకపోగా హానిని గాని, వ్యతిరేక ఫలితాలని గాని ఇస్తుంది. తైత్తిరీయ సంహితలో ఈ విషయాన్ని తెల్పే కథ ఒకటుంది. (2.4.12) త్వష్టుడుకి ఇంద్రునితో వైరం. ఇంద్రుని సంహరించగల కుమారుడు కావాలని కోరుకొంటాడు. అందుకని ''ఇంద్రశత్రుర్వర్ధస్వ'' అన్న మంత్రాన్ని జపిస్తూ ఒక హోమాన్ని చేశాడు. ఈ మంత్రాన్ని సరిగ్గా పఠించే పద్దతిలో పలికితే,''త్వష్టుని కుమారుడు పెరిగి ఇంద్రుని వధించుగాక'' అనే అర్థం వస్తుంది. ఆ శబ్ద ప్రాబల్యం వల్లనే ఆ కుమారుడు పెరిగి ఇంద్రుని వధింప గలిగే వాడు. కాని శబ్దోచ్చారణలో త్వష్టుడు పొరపాటు చేశాడు. అందువల్ల అర్థం తారుమారైంది. అక్షరాలూ, పదాలూ మారకపోయినా స్వరోచ్చారణ దోషం వల్ల, త్వష్టుడు ఆశించిన దానికి సరిగ్గా వ్యతిరేకం జరిగింది. అతని కుమారుని ఇంద్రుడే చంపి వేశాడు. అందువల్ల వృత్రుడన్న అతని కుమారుని వధకు త్వష్టుడే కారణమైనాడు.*



*వేదాలలోని ఈ ఉదంతాన్ని చెప్తూ, సరియైన పద్ధతిలో మంత్రాలని పలకాలంటుంది ఈ శ్లోకం :- ''మంత్రో హీనస్వరతో వర్ణతో వా మిథ్యా ప్రయుక్తో న తమర్థమాహ స వాగ్వజ్రో యజమానం హినస్తి యతేంద్రశత్రుః స్వరతో`òపరాధాత్‌''*


*కొన్ని స్వల్ప భేదాలు :- ఇప్పటి వరకూ వేద శబ్దమెంత శుద్ధంగా ఉండాలో వివరించడము జరిగింది. దీనికి నిదర్శనమిదే; రామేశ్వరం నుండి హిమాలయాల వరకూ భారతదేశంలో ఏ విధమైన సామాజిక సంపర్కమూ లేని ప్రదేశాలలో కూడా వేదాలకి గల పాఠాలని నూటికి తొంభైతొమ్మిది పాళ్లు ఒకే విధంగా అక్షరంగాని పదంగాని వ్యత్యాసం లేకుండా ఉంటాయి. ఇక్కడ వేదాలు ఒక తరం నుంచి మరొక తరానికి లిఖిత పూర్వకంగా కాక, వాక్కు వల్లనే సంక్రమించిన విషయం కూడ గుర్తుంచుకోవాలి.*



*అంటే, స్వల్ప వ్యత్యాస ముందని దీని అర్థమా? అవును, ఉన్నది. ఒక ప్రాంతంలో ఉన్న ప్రతిశాఖకీ మరొక ప్రాంతంలో కల పాఠంలో కొద్ది వ్యత్యాసముంటుంది. ఇది ఆమోద నీయమేనా? ఏ మార్పు ఉన్నా అది విపరీతాలకు దారితీస్తుందని చెప్పిన తర్వాత ఈ 1% వ్యత్యాసం మాత్రమెట్లా సహించటం? శుద్ధమైన రూపము ఒకటే ఉంటే 1%  మార్పుకూడా అనుకొన్న ఫలితాన్నివ్వక పోవచ్చు, వేరొక ఫలితాన్నివ్వవచ్చును. ఈ ప్రశ్నకి సమాధానముంది. మంత్రాలలోని పదాలను మారిస్తే ఫలితం విపరీతమవుతుంది. నిజమే - జబ్బుని కుదర్చటానికి మందుని మార్పు చేస్తే వైద్యం మారినట్టే ఇది కూడ. కాని ఇది రోగికే వర్తిస్తుంది, తనంతట తానే అతడు ఔషధాన్ని మార్చుకో కూడదు, వైద్యుడు మార్చవచ్చు. ఒక వ్యాధిని కుదర్చటానికి ఎన్నో మందు లుంటాయి. అటువంటి సమయాల్లో వైద్యుడు ఒక మందుకి బదులు మరొక దానిని సూచించటంలో తప్పేమీ లేదు. ఒకే జబ్బైనా రోగి దేహస్థితిని బట్టి ఔషధంలోని పదార్థాల మిశ్రమాన్ని కూడ వైద్యుడు మార్చవచ్చు: ఆ విధంగానే ఉద్దేశ పూర్వకంగానే ఋషులు వివిధ శాఖలలోని పదాలను మార్చారు. తమ తరువాత వచ్చేవారు వల్లించటానికి వీలుగా ఈ మార్పు చేయబడింది.*



*''ప్రాతిశాఖ్య'' పాఠాలలో ఈ మార్పులకు సంబంధించిన నియమాలు వివరింపబడ్డాయి. ''ప్రాతిశాఖ్య'' అన్న మాటకి అసలైన అర్థం ''ప్రాంతీయం'' అని. మాటలలోని తేడాలు స్వల్పము - ఆ తేడాలు గణనీయము కావు. సన్నిహిత పదాలు, ఇంచుమించు ఒకే విధంగా ఉచ్చరింపబడే పదాలనే వాడారు. వైదిక శబ్దాలూ - ప్రాంతీయభాషలూ : వేద పదాలలో ప్రాంతీయ భేదాలను దృష్టిలో పెట్టుకొని వివిధ భారతీయ భాషలలో గల తేడాలను గమనిస్తే సాంస్కృతిక భేదాలకు మూలకారణం వైదిక శబ్దాలన్న ఆశ్చర్యకరమైన విషయం బయట పడుతుంది. భాషా శాస్త్ర సంబంధమైన  పరిశోధనలివి.*



*''ద'' ''ర'' ''ల'' ''ళ'' - ఇవన్నీ ఒక దానికొకటి దగ్గరి శబ్దాలు. చిన్న పిల్లవాడిని ''రైలు'' ''రామ'' అనమంటే ''దైలు'' ''దామ'' అంటాడు. ''ద'' ''ర''లకు శబ్దపరంగా సాన్నిహిత్య ముండటమే దీనికి కారణం. ''ద'' ''ర''గా మారగలదు. కనుక 'ల', 'ద'లకు శబ్దపరంగా మారగలదు కదా! ''ల'', ''ళ''లు దగ్గర శబ్దాలు. 'ల'కి, తమిళ శబ్దం ''ళ'' (zha)కి గల సాన్నిహిత్యాన్ని వేరే చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క వేదం బాగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతాలనూ, ఆయా భాషల లక్షణాలనూ గమనిద్దాం. ఈ రోజులలో వేదాలు ఆర్యులవనీ, ద్రవిడ సంస్కృతి దానికి భిన్నమనీ ఒక ప్రచారం జరుగుతోంది. కాబట్టి సమిష్టిగా ద్రవిడ ప్రాంతమని చెప్పబడే మూడు ప్రాంతాలను తీసికుందాము. అంటే తమిళం, తెలుగు, కన్నడ భాషలను. సంస్కృతంలో ''ప్రవాల''మనే శబ్దముంది. ఇదే - తమిళంలో ''పవళం'', తెలుగులో ''పగడం'' కన్నడంలో ''హవళ''. ''ప్రవాల'', తమిళంలో 'పవళం' అయింది తెలుగులో 'పగడ'మయింది. 'వ', 'గ'గా మారింది. 'ప్రవాల' కన్నడంలో ''హవళ''గా మారినప్పుడు మొదటి అక్షరమే మారుతుంది.*



 *''ప్ర'' అన్న అక్షరం తెలుగులో, తమిళంలో ''ప''గా మారటం పెద్ద మార్పుకాదు. కాని కన్నడంలో అది ''హ'' అవుతుంది. ఇది ఆ భాష ప్రత్యేక లక్షణం. ఇతర భాషలలోని ''ప'' కన్నడంలో - 'హ'గా మారుతుంది. ''పంప'' ''హంప''గా ఇంకా ''హంపి''గా మారుతుంది. ఆర్య, ద్రావిడ అంటూ రెండు జాతులుగా కాకపోయినా భాషలను సంస్కృతంలో సంబంధమున్న భాషలనీ, కేవలం ద్రావిడ భాషలనీ వర్గీకరిస్తారు. ఇప్పటి పరిశోధనలననుసరించే ఈ వర్గీకరణం. ఇంకా కొంత పరిశోధన జరిగితే ఈ వర్గీకరణ మనకవసరమేమో ననీ, అన్ని భాషలకూ మాతృక ఒకటేనేమోననీ కూడ నిరూపించవచ్చును. పశ్చిమ భారతంలో, కర్నాటకతో సహా, ప్రాచుర్యంలో ఉండేది ఋగ్వేదం. ఋగ్వేదంలో ''ళ'' శబ్దం ఎక్కువ వాడుకలో ఉంది. ద్రావిడభాష అని అందరూ అనుకునే కన్నడలోకి ''ళ'' అట్లా వచ్చింది.*


🕉🌞🌏🌙🌟🚩

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏



పరమేశ్వరా ! నీదు పాదముల్ దర్శి0ప

            కిటిరూప మెత్తె నా కేశవుండు

శీర్ష భాగంబైన శిరమును దర్శింప

            హంసగా మారె నయ్యబ్జభవుడు

యిర్వురు వారలు యెంత శ్రమించినా

             హర పద శిరములన్నరయరైరి     

వారి కసాధ్యమై పరగిన కార్యంబు 

          శివ శివా నేనెట్లు చేయ గలను ?             

శ్రీకరా ! నేను నిన్నెట్లు చిత్తమందు

దివ్యమౌ రీతి నిక్కంబు తెలియ గలను ?

తెలియ పరచుము శంకరా ! తెల్లముగను

భక్త వత్సల ! పరమేశ ! పాహి పాహి ! 99 #



భవసేవ మగ్నులౌ బ్రహ్మాది దేవతల్

           స్తుతియించ బడదగు స్తుత్య వరుల

గణనమ్ము సల్పెడి క్షణములందున వారు

            నిను నట్గ్రగణ్యుగా నెంచినారు

మాహాత్మ్యవంతుల మహనీయపురుషుల

           చిద్విచారంబును చేయు నపుడు

ధాన్య పొల్లు పగిది తామంత విడిపోగ

           నికర ధాన్యము వోలె నిల్తు వీవు

ఉత్తమోత్తమ ఫలముగనుండినటుల

           విశ్వ దేవతలెల్ల వేద్యు లైరి

యిందు సత్యేతరము లేదు యిందు మౌళి !

స్తోత్ర మించుక లేదయ్య శోభితాంగ !

సర్వమంగళ దాత ! యో సకలవినుత !

భక్త పరిపాల ! శంకరా ! పాహి పాహి ! 100



                           శుభము

                    మంగళం. మహత్


        ✍️గోపాలుని మధుసూదన రావు🙏

Dance









 

Monkey








 

🙏 *శుభోదయమ్*🙏 🌸 *సుభాషితమ్* 🌸 శ్లో|| విష బీజం భువిన్యస్య కథం స్వాదు ఫలం లభేత్?౹ బీజం రుహ్యా త్తధా పుష్పే త్ఫలే దిత్యవాద చ్చ్రుతి:౹౹ తా|| విష బీజములు భూమిలో నాటి మధురమగు ఫలములు కావలెనన్న యెట్లు దొరుకును? మనుష్యుడు పాపమను బీజములు నాటి (అంటే పాపకర్మలు చేసి) పుణ్యము, మోక్షము ఆశించిన యెట్లు లభించును? ఎటువంటి విత్తనము నాటితే అటువంటి ఫలములే లభించును. *_సేకరణ. ప్రభాకరశర్మ_*


🌸 *సుభాషితమ్* 🌸


శ్లో|| విష బీజం భువిన్యస్య కథం స్వాదు ఫలం లభేత్?౹

బీజం రుహ్యా త్తధా పుష్పే త్ఫలే దిత్యవాద చ్చ్రుతి:౹౹


తా|| విష బీజములు భూమిలో నాటి మధురమగు ఫలములు కావలెనన్న యెట్లు దొరుకును? మనుష్యుడు పాపమను బీజములు నాటి (అంటే పాపకర్మలు చేసి) పుణ్యము, మోక్షము ఆశించిన యెట్లు లభించును? ఎటువంటి విత్తనము నాటితే అటువంటి ఫలములే లభించును.


*_సేకరణ.   ప్రభాకరశర్మ_*

దండనీతి

 మహాభారతంలో భీష్ముడిని ధర్మరాజు పితామహా ! రాజు దండనీతిని ఎలా అమలుచేయాలో తెలియచెయ్యండి అని అడిగాడు. భీష్ముడు ధర్మనందనా ! కృతయుగం నుండి రాజు దండనీతిని ధర్మమైన పద్ధతిలో అమలు చేస్తున్నాడు. రాజు దండనీతిని ధర్మబద్ధంగా ఆచరించడం వలన ధర్మనిరతి పెరుగుతుంది. మనం చేసే కర్మలు సత్ఫలితాలను ఇస్తాయి. ఋతువులు చక్కగా శుభం చేకూరుస్తాయి. ప్రజల జీవితకాలం పెరుగుతుంది. దున్నకుండానే భూమి ఫలసాయం అందిస్తుంది. తరువాత వచ్చిన త్రేతాయుగంలో ధర్మం క్షీణిస్తూ వచ్చి మూడు పాదాలతో నడుస్తుంది. ప్రజలు దానితోనే సంతృప్తి పడతారు. ఇక ద్వాపరయుగంలో రాజు ధర్మాన్ని రెండు పాదాలతో మాత్రమే నడుపుతాడు. ప్రజలు దానితో సంతృప్తి పడతారు. ఇక రాబోవు కలి యుగంలో రాజులో ధర్మాచరణ మీద శ్రద్ధ క్షీణిస్తుంది. ప్రజలలో అధర్మం పెరుగుతుంది. వర్ణాశ్రమధర్మాలు గతి తప్పుతాయి. ఇదంతా కాలగతిలో జరిగే మార్పులను అనుసరించి జరుగుతుంది కాని రాజైన వాడు రాజు ధర్మాన్ని కృతయుగంలో లాగా ఆచరించిన ధర్మంవర్ధిల్లి నాలుగు పాదములతో నడుస్తుంది. లేకున్న కాలగతిలో క్రమక్రమంగా క్షీణిస్తుంది. రాజు ప్రజలు చేసే తప్పులను జాగ్రత్తగా పశీలించాలి. ఎవరైనా తనను తాను పొగొడుతున్నాడంటే అతడికి మదము, అహంకారం, లోభము, దుర్మార్గం ఎక్కువగా ఉంటుందని తెలుసు కోవాలి. అవి లేని వాడు తనను తాను పొగుడుకొనడు. సజ్జనుడైన రాజు నియమ నిబద్ధంగా జీవిస్తాడు. అతడికి పరాక్రమం ఉంటుంది కాని గర్వం ఉండదు. అతడు పరస్త్రీని కోరడు, కోపించడు, సామంతులను ధనం కొరకు వేధించడు. రాజుకు వేదవేదాంగ పారతుడైన పురోహితుడు అవసరం. పురోహితుడు ఎప్పుడూ పురంలో ఉంటూ పురం క్షేమం కోరుతూ రాజును సక్రమ మార్గంలో నడిపించాలి. సామంత రాజుల నుండి కప్పం, కానుకలు స్వీకరించే పనిని రాజు దయ, కరుణ, చతురత కలిగిన మంత్రులకు అప్పగించాలి. రాజు పన్నుల కొరకు ప్రజలను పీడించడం ఆవు పొదుగును కోయడంతో సమానం. తోటమాలి చెట్ల నుండి పండ్లు కోసినంత సున్నితంగా రాజు ప్రజల నుండి పన్నులను వసూలు చేయాలి. ముందు ప్రజలకు అవసరమైన సౌకర్యములు, రక్షణ కల్పించిన తరువాత ప్రజల నుండి పన్నులు గ్రహించాలి. అది రాజుకు ముఖ్యమైన బాధ్యత. ఎన్ని యజ్ఞ, యాగములు దానితో సరి తూగవు.


*బ్రాహ్మణ క్షత్రియులు:*


తిరిగి భీష్ముడు ధర్మనందనా ! ఇలాదేవికి పురూరవుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడు ఈ భూమినంతా పాలించాడు. అతడు ఒక నాడు వాయువును భూమి బ్రాహ్మణ, క్షత్రియులలో ఎవరి సంపదగా విరాజిల్లుతుంది అని. వాయుదేవుడు బ్రహ్మముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించారు. ఉత్కృష్టమైన ముఖం నుండి జన్మించిన బ్రాహ్మణుడు ఈ భూమి మీద ఉన్న సకలసంపదలను అనుభవించుటకు వాటిని దానం చేయుటకు అర్హుడు. దండనీతిని అమలుచేయుటకు క్షత్రియుడిని, సహజంగా శాంతి కాముకుడైన బ్రాహ్మణుడిని అతడి పురోహితుడిగా నియమించాడు. అటువంటి పురోహితుడికి సకల సంపదలను సమకూర్చి అతడి అడుగు జాడలలో రాజ్యపాలన చేయు రాజు ఈ లోకంలో పరలోకంలో సుఖసంతోషాలు పొందగలడు. ప్రజల యొక్క భయమును పోగొట్టి రక్షించడమే రాజు యొక్క పరమధర్మం అని వాయుదేవుడు పురూరవునికి చెప్పాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.


*బ్రాహ్మణ ధర్మం:*


తరువాత భీష్ముడు ధర్మనందనా ! పూర్వం శుక్రాచార్యుడు పురోహితుడికి చెప్పిన మాటలు నేను నీకు చెప్తాను. రాజు పురోహితుడి ఆధ్వర్యంతో యజ్ఞ, యాగాదులు చేసి దేవతలను, గరుడ, గంధర్వ, విద్యార్ధులను తృప్తిపరచవలెను. పురోహితుడు లేని రాజ్యాన్ని రాక్షసులు, పిశాచాలు పీడిస్తాయి. రాజుకు అను దినము కలిగే అశుభములను పురోహితుడు శాంతి హోమములతో రక్షించి శత్రు రాజులను పురోహితుడు మంత్ర తంత్రములతో నాశనం చేస్తారు. కనుక ధర్మనందనా ! నీవు ఉత్తముడైన పురోహితుడిని నియమించి రాజ్యపాలన చెయ్యి అన్నాడు భీష్ముడు. కాని పరిశుద్ధుడు కాని పురోహితుడు రాజుకు హాని కలిగించి తానూ నాశనం ఔతాడు. కనుక రాజు బుద్ధిమంతుడు, ఆరోగ్యవంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు అయిన బ్రాహ్మణుడిని నియమించుకోవాలి. సకల కార్యములలో రాజు, పురో హితుడు ఒకే మాట మీద నిలిచి ఆ కార్యమును నిర్వర్తించాలి. ధర్మనందనా ! దీని గురించి ఒక ఇతిహాసం చెప్తాను విను. బ్రాహ్మణుడికి క్షత్రియుడికి ఉన్న సంబంధం గురించి కశ్యప ప్రజాపతి ఇలుడికి ఇలా చెప్పాడు. క్షత్రియుడు బ్రాహ్మణుడి నుండి పుట్టాడు. బ్రాహ్మణుడు క్షత్రియుడి వలన నియమించ బడతాడు. కనుక బ్రాహ్మణుడు, క్షత్రియుడు ఒకరి మీద ఒకరు ఆధార పడి జీవిస్తారు. రాజు పురోహితుడు ఒకరిని ఒకరు గౌరవించుకుంటే ప్రజలు వారిని గౌరవిస్తారు. అధర్మం ప్రజ్వరిల్లుతుంది. రాజు పురోహితుల మధ్య సఖ్యత లేకున్న రుద్రుడు ఆగ్రహిస్తాడు. రుద్రుడు ఆగ్రహిస్తే ప్రపంచం సర్వనాశనం ఔతుంది.


*ముచికుందుడు:*


భీష్ముడు ఇంకా ఇలా చెప్పాడు కుబేరుడు పురోహితుడు ఎలా ఉండాలన్న విషయం ముచికుందుడు తో ఇలా చెప్పాడు. పూర్వకాలంలో ముచికుందుడు అనేరాజు రాజ్య కాంక్షతో కుబేరుడి మీద దండెత్తాడు. కుబేరుడు తన సైన్యమును పంపి ముచికుందుడిని ఓడించాడు.*ికి కోపం వచ్చి తన ఓటమికి కారణం పురోహితుడని అనుకుని అతడిని నిందించాడు. ముచికుందుడి పురోహితుడు ముచికుందుడి చేత హోమములు, పూజలు, తపస్సు చేయించి తన మంత్రశక్తితో ముచికుందుడి సైన్యాలకు బలపరాక్రమాలను చేకూర్చాడు. ముచికుందుడు తిరిగి తన సైన్యముతో కుబేరుడి మీదకు దండెత్తాడు. అప్పుడు కుబేరుడు ముచికుందుడితో నీవు నీ పురోహితుడి మంత్రశక్తితో, తపో బలంతో నా మీద యుద్ధానికి వచ్చావు కాని నీ స్వశక్తితో రాలేదు అని అవహేళన చేసాడు. అప్పుడు ముచికుందుడు కుబేరునితో బ్రాహ్మణుడు, క్షత్రియుడు వేరు వేరు కాదు. ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు అని ఆ బ్రహ్మ అనుగ్రహించాడు. మారు మాటాడక నాతో యుద్ధానికి రా అన్నాడు. కుబేరుడు నీతో నేను యుద్ధం చేయను. నీకు కావలసింది నా రాజ్యమే కదా ! దానిని తీసుకో అన్నాడు. ముచికుందుడు నీ దయాబిక్షతో వచ్చే రాజ్యం నాకు వద్దు. నిన్ను జయించి నీ రాజ్యం తీసుకుంటాను అన్నాడు. ముచికుందుడి పరాక్రమానికి సంతోషించిన కుబేరుడు నేను ఓడాను అని అంగీకరించాడు. ముచికుందుడు సంతోషించి ఈ సమస్త భూమండలాన్ని అనేక సంవత్సరాలు పాలించాడు. కనుక ధర్మనందనా ! నీవు ఎల్లప్పుడూ ఈ ప్రజలకు అభయ హస్తమిచ్చి, రక్షించి ఈ భూమిని పాలించుటయే రాజధర్మం అని భీష్ముడు చెప్పాడు.


*బ్రాహ్మలను దండించే విధానం:*


ధర్మరాజుభీష్ముడితో పితామహా ! బ్రాహ్మణులు మొదలైన వారు తమ తమ వృత్తి ధర్మములు కుల ధర్మములు విడిచి ప్రవర్తించిన ఏమి చేయవలెను. వివరించండి అని అడిగాడు. భీష్ముడు ధర్మనందనా ! ఆపదలు సంభవించిన సమయంలో ఏ కులము వారైనా తమ తమ కుల ధర్మములను విడిచి ప్రవర్తించిన వారికి ఏ పాపం అంటదు. కాని క్షత్రియుడు పట్టవలసిన కత్తి బ్రాహ్మణుడు పడితే అతడు తన బ్రాహ్మణత్వం కోల్పోయి క్షత్రియుడౌతాడు. అలాగే బ్రాహ్మణుడు తన కులధర్మం వదిలి వైశ్యధర్మమైన వ్యాపారం చేపడితే అతడు వైశ్యుడు ఔతాడు. అలాగే బ్రాహ్మణుడు ధనార్జన నిమిత్తం ఒకరికి ఊడిగం చేసిన అతడు శూద్రుడు ఔతాడు. ఇలాగే తక్కిన వారు కూడా వారి ధర్మం వీడి పరధర్మం ఆచరించిన కులహీనులు ఔతారు. అటువంటి వారు మరలా తమతమ కర్మలను ఆచరించుటకు అర్హులు కారు. రాజు ఈ విషయములు అన్ని తెలుసుకుని ఎవరూ తమ ధర్మం తప్పకుండా చూడాలి. ప్రజలు సంపాదించుకున్న పుణ్యములో కాని పాపములో కాని నాలుగవ వంతు రాజుకు చేరుతుంది. కనుక వర్ణాశ్రమ ధర్మములు తప్పి చరించిన పాపములో నాల్గవవంతు రాజుకు చేరుతుంది కనుక రాజు అనుభవించాలి అన్నాడు.

సప్త చిరంజీవులు

 సప్త చిరంజీవులు..!!


హనుమంతుడు:.💐

శివుని తేజస్సుతోనూ, 

వాయుదేవుని అంశతోనూ జన్మించిన 

ఈ కేసరీనందనుడిది రాముని జీవితంలో ఓ ప్రముఖ పాత్ర. 

సాధారణంగా ఎవరన్నా నవవిధ భక్తుల్లోని ఏదో ఒక రూపంలో భగవంతుని కొలుచుకుంటారు. 

కానీ హనుమంతుడు మాత్రం రాముని కొలిచేందుకు 

ఏ అవకాశాన్నీ జారవిడుచుకోలేదు. 

కీర్తనం, 

స్మరణం, 

దాస్యం... 

ఇలా రాముని పరిపరివిధాలా సేవించి, 

భక్తులకు నిదర్శనంగా నిలిచాడు హనుమంతుడు. 

ఆ భక్తి కారణంగానే చిరంజీవిగా నిలిచాడు. 

ఇక చిరంజీవిగా ఉండిపొమ్మంటూ చిన్నప్పుడు సకలదేవతలూ ఆయనకు అందించిన వరాలు 

ఎలాగూ ఉన్నాయి.


విభీషణుడు:.💐

రావణాసురునికి సొంత తమ్ముడే అయినా, 

ధర్మం తప్పిన అన్నగారిని కాదని రాముని చెంతకు చేరినవాడు విభీషణుడు. 

ధర్మం కోసం చివరి వరకూ పట్టుపట్టినవాడు. 

ఆ విభీషణుడే కనుక రావణాసురుని మరణరహస్యాన్ని, రాముని చెవిన వేయకపోతే... 

రావణునికి మరణమే ఉండేది కాదంటారు. 

శత్రువర్గం వాడైనప్పటికీ, 

రాముని అభయాన్ని పొందాడు 

కాబట్టి చిరంజీవిగా నిలిచిపోయాడు.


బలి చక్రవర్తి:.💐

ప్రహ్లాదుని మనవడైన బలి అవడానికి రాక్షసుడే అయినా తాతలోని సద్గుణాలన్నింటినీ పునికి పుచ్చుకున్నాడు. కానీ త్రిలోకాధిపత్యం కోసమని ఏకంగా స్వర్గాన్నే జయించడంతో, 

బలిని సంహరించక తప్పింది కాదు విష్ణుమూర్తికి. అందుకోసం వామనుడి అవతారంలో వచ్చిన విష్ణువు తనకు మూడడుగుల స్థలం దానంగా కోరుకుంటాడు. 

ఆ తరువాత కథ అందరికీ తెలిసిందే! 

మొదటి పాదంతో ఆకాశాన్నీ, 

రెండో పాదంతో భూమినీ కప్పివేసి 

ఇక మూడో పాదం కోసం అడగగా... 

తన శిరస్సునే చూపుతాడు బలి చక్రవర్తి. 

తన దానగుణంలో ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. 

చిరంజీవివి కమ్మంటూ వరాన్ని పొందుతాడు.


పరశురాముడు:.💐

విష్ణుమూర్తి దశావతారాలలో ఒక భిన్నమైన అవతారం పరశురాముని అవతారం. 

రేణుక, జమదగ్నులకు జన్మించిన పరశురాముడు 

తన తండ్రిని వధించారన్న కోపంతో ముల్లోకాలలోని రాజులందరినీ వధిస్తాడు. 

అందుకోసం ఆయన ధరించిన పరశు (గండగొడ్డలి) కారణంగానే ఆయనకు పరశురాముడు అన్న పేరు వచ్చింది. 

అసలే విష్ణుమూర్తి అవతారం, 

ఆపై అపారమైన భుజశక్తి. 

ఆ భుజశక్తికి తోడు అమిత తపస్సు... 

ఇక పరశురాముడు చిరంజీవి కాక మరేమవుతాడు!


కృపాచార్యుడు:.💐

శరధ్వంతుడు అనే ఋషి అంశతో రెల్లుగడ్డి నుంచి జన్మించినవాడు కృపాచార్యుడు. 

దిక్కు లేకుండా పడి ఉన్న ఆ శిశువుని అటుగా వేటకు వచ్చిన శంతనమహారాజు చూసి తన రాజ్యానికి (హస్తినాపురం) తీసుకువెళ్తాడు. 

హస్తినాపురంలో సకల విలువిద్యలలోనూ ఆరితేరిన కృపాచార్యుడు తరువాతి కాలంలో కౌరవ, పాండవులకు ధనుర్విద్యలను నేర్పాడు. 

కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరఫున పోరాడినప్పటికీ, యుద్ధం ముగిసిన తరువాత సజీవంగా ఉన్న 

అతి కొద్దిమందిలో కృపాచార్యుడు ఒకరు. మానవగర్భమందు జన్మించకపోవడం వల్ల 

ఆయనకు మానవులకు ఉండే చావు కూడా ఉండదని పురాణాలు పేర్కొంటున్నాయి.


వేదవ్యాసుడు:.💐

 వ్యాసుడు లేనిదే భారతమే లేదు. 

ఎందుకంటే ఆయన అంశతోనే కౌరవుల తండ్రి అయిన దృతరాష్ట్రుడు, పాండవుల తండ్రి అయిన పాండురాజు జన్మించారు కాబట్టి. 

భారతంలో అడుగడుగునా వ్యాసుని ప్రస్తావన ఎలాగూ ఉంది. 

దానికి తోడు ఆ భారతాన్ని అక్షరబద్ధం చేసిన వ్యక్తి కూడా ఆయనే! 

కేవలం భారతం మాత్రమే కాదు అష్టాదశ పురాణాలని కూడా రాశారు. 

వేదాలను క్రమబద్ధీకరించి ‘వేద వ్యాసుడు’ అనే బిరుదాన్ని గ్రహించారు. 

ప్రపంచాన్ని అజరామరమైన జ్ఞానాన్ని అందించారు 

కాబట్టి చిరంజీవిగా మిగిలిపోయారు.


అశ్వత్థామ:.💐

ఇప్పటివరకూ చెప్పకొన్న చిరంజీవులు అంతా తమతమ ప్రతిభతో ఆ స్థాయిన చేరుకుంటే... 

శాపవశాన చిరంజీవి అయిన చిత్రమైన వృత్తాంతం అశ్వత్థామది. 

కౌరవులకు, పాండవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడే అశ్వత్థామ. 

తన తండ్రి చావుకి కారణమైన పాండవులను సంహరించి తీరాలనే క్రోథంతో అశ్వత్థామ యుద్ధధర్మాన్ని విస్మరించి రాత్రివేళ పాండవుల శిబిరం మీద దాడి చేస్తాడు. 

ఆ శిబిరంలో ఉన్న ఉపపాండవులనే పాండవులనుకొని వారిని నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు. 

ఫలితం! చిరకాలం కుష్టువ్యాధితో జీవచ్ఛవంలా ఉండమని కృష్ణుని శాపాన్ని పొందుతాడు.

ఓం నమః శివాయ..!!🙏please join in హిందూ ఉపాధ్యాయ..share the valuble msgs.🙏🙏🙏

నవగోప్యాలు

 *ఈ తొమ్మిదింటిని రహస్యంగా దాచాలంట....* 

మీకు తెలుసా ⁉️


👉 ఆయువు,


👉 విత్తము,


👉 ఇంటిగుట్టు,


👉 మంత్రం,


👉 ఔషధం,


👉 సంగమం,


👉 దానం,


👉 మానము,


👉 అవమానం


🌷 అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచా ల్సినవి.


🌷 భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.


🌷 రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు.


🌷 ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగా రంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.


🌷 అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగు తుంది.


🌷 ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.


🌷 సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.


🌷 ‘మననం చేసేది మంత్రం’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.


🌷 ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.


🌷 సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.


🌷 దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.


🌷 మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.


🌷 అలాగే తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవ మానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతనేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం కదా.


🌷 ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధను మనం తప్పక ఆచరించాలి.లోకాన్ సమస్తాన్ శుఖినోభవంతూ

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*769వ నామ మంత్రము* 30.12.2020


*ఓం యజ్ఞరూపాయై నమః*


విష్ణుస్వరూపురాలు (నారాయణి), యజ్ఞములే తన స్వరూపంగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *యజ్ఞరూపా* యను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం యజ్ఞరూపాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునకు  ఆ తల్లి సుఖసంతోషములను ప్రసాదించును. ఆత్మానందానుభూతిని కలుగజేయును.


హరివంశమునందు పద్మపురాణములో శంకరుని ఆపాదమస్తకమూ యజ్ఞాంగములతో సమానముగా వర్ణింపబడినది. పరమేశ్వరుని అర్ధాంగి యగుటచే పరమేశ్వరికూడా యజ్ఞస్వరూపురాలుగా చెప్పబడినది. గనుక పరమేశ్వరిని *యజ్ఞరూపా* యని అన్నాము.


యజ్ఞములు  *పాకయజ్ఞములు, హవిర్యాగాలు, సోమ సంస్థలు* అని మూడు ప్రధాన రకములు గలవు.


*పాక యజ్ఞాలు*


1) ఔపాసన, 2) స్థాలీపాకము, 3) వైశ్వదేవము, 4) అష్టకము, 5) మాస శ్రాద్ధము,  6) సర్పబలి, 7) ఈశాన బలి.


*హవిర్యాగాలు*


1) అగ్నిహోత్రాలు, 2) దర్శపూర్ణిమాసలు, 3) అగ్రయణం, 4) చాతుర్మాస్యాలు, 5) పిండ, పితృ యజ్ఞాలు, 6) నిరూఢ పశుబంధము, 7) సౌత్రామణి


*సోమ సంస్థలు*


1) అగ్నిష్టోమము, 2) అత్యగ్నిష్టోమము, 3) ఉక్థము, 4) అతిరాత్రము, 5) ఆప్తోర్యామం,  6) వాజపేయం, 7)  పౌండరీకం


*పంచమహాయజ్ఞములు*


పంచ మహాయజ్ఞములు అనగా హిందూ ధర్మశాస్త్రాలననుసరించి గృహస్థు ఆచరించవలసిన ఐదు యజ్ఞములు.


*బ్రహ్మ యజ్ఞము* ఈ యజ్ఞము ద్వారా గృహస్థుడు అనేక కొత్త విషయములను తెలుసుకుంటాడు. అంతేకాక మిగిలినవారికి కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఈ యజ్ఞంలో భాగంగా గృహస్థుడు జ్ఞానమును ఆర్జిస్తాడు, అందరికి పంచి పెడతాడు. బ్రహ్మ యజ్ఞమనగా వేదాధ్యయనము. రామాయణ, భాగవతాద్యుద్గ్రంథములను పఠించడం.


*దేవ యజ్ఞము* ఇవి భగవదనుగ్రహం కోసం, ఇష్టకార్యార్ధ సిద్ధి కోసం చేస్తారు. గృహస్థులయితే తమ గార్హపత్యాగ్ని లో హవిస్సును సమర్పిస్తారు. బ్రహ్మచారులయితే లౌకికమైన అగ్నితోనే చేస్తారు. ఇక శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలమును ఇస్తుంది.  దేవ యజ్ఞమనగా ఆజ్యము, లాజలు (పేలాలు) వంటితో హోమం జరిపించుట


*పితృ యజ్ఞము* ఇవి తమను వదలి పరలోకమునకు చేరిన తమ పితృదేవతల కొరకు చేస్తారు.  *ఐతే తండ్రి బ్రతికి ఉండగా ఇట్టి  యజ్ఞమును చేయుటకు పుత్రునికి అధికారం లేదని చెప్పెదరు*. పితృ యజ్ఞమనగా శ్రాద్ధము, తర్పణములు మొదలైన కార్యక్రమాలు జరిపి పూర్వీకులను సంతృప్తి పరుచుట.


*భూత యజ్ఞము*  తనతో పాటుగా ఈ భూమిమీద ఉన్న సకల చరాచర జీవరాశులకు ఉపయోగపడేలా తాను నడుచుకోవాలి. భూత యజ్ఞమనగా సకల భూతములకు బలిదానములు ఇచ్చుట


*నృయజ్ఞము* ఈ యజ్ఞమునే అతిధి యజ్ఞం అనికూడా పిలుస్తారు. మన ఇంటికి వచ్చిన అతిధిని గౌరవంగా చూసుకోవాలి.  ఈ యజ్ఞము ద్వారానే గృహస్తుడు మిగిలిన మూడు ఆశ్రమములవారికి ఆధారం అవుతున్నాడు. నృయజ్ఞమనగా అతిథి పూజాదులు నిర్వర్తించడం.


పైన చెప్పిన వివిధరూపాలైన యజ్ఞములన్నియు సాక్షాత్తు పరమేశ్వరీ స్వరూపమే గనుక శ్రీమాత *యజ్ఞరూపా* యని అనబడినది.


*యజ్ఞోవై విష్ణుః* వేదములో యజ్ఞమే విష్ణువని చెప్పబడినది. భగవద్గీతలోకూడా తానే యజ్ఞస్వరూపుడనని భగవానుడే చెపుతాడు. జగన్మాత విష్ణుస్వరూపిణి గనుక *యజ్ఞరూపా* యని అన్నారు.


జగన్మాతకు నమస్కరించు నపుడు *ఓం యజ్ఞరూపాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

మొగలిచెర్ల

 *పటమూ..పరివర్తన..*


"స్వామివారి పల్లకీసేవ లో నా పేరు నమోదు చేయండి..నేను పాల్గొంటాను.." అంటూ నా వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులలో ఒకతను అడిగాడు.."మీ పేరు..?" అన్నాను నేను.."తిరుపయ్యండి..ఇతను నా స్నేహితుడు, గురుమూర్తి.."అన్నాడు..మా సిబ్బంది వద్దకు వెళ్లి, తన పేరు నమోదు చేయించుకోమని చెప్పి పంపాను..ఇద్దరూ వెళ్లారు..మరి కొద్దిసేపటికి ఆ ఇద్దరిలో గురుమూర్తి అనే అతను నాదగ్గరకు వచ్చి, "నేను ఈ ప్రాంతానికి కొత్త..ఈ క్షేత్రం గురించి వివరాలు తెలుపగలరా..?" అని అడిగాడు..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేసుకునే నాటి నుంచి, కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దాకా జరిగిన చరిత్రను అతి క్లుప్తంగా చెప్పాను..శ్రద్ధగా విన్నాడు..


"ఈరోజుల్లో కూడా ఇలాటి సిద్ధులు, అవధూతలు, సాధకులు ఉన్నారా?..మీరంటే ఈ స్వామివారిని చూసారు కాబట్టి మీరు నమ్మడం లో అర్ధం ఉంది..మాలాంటి వారికి ఏదైనా దృష్టాంతరం కనబడితే..అప్పుడు విశ్వసిస్తాము..నా వరకూ నేను కళ్ళతో చూసేదాకా ఏదీ నమ్మనండీ..అది తప్పో ఒప్పో తెలీదు..నా పద్ధతి అలాంటిది.." అన్నాడు.."మిమ్మల్ని నమ్మించాలని నేను ప్రయత్నం చేయటం లేదండీ..మీరు అడిగారు కాబట్టి స్వామివారి గురించి చెప్పాను..నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం.." అన్నాను..ఇక అతనితో ఎక్కువ సంభాషణ చేయదల్చుకోలేదు..అతనూ తన స్నేహితుడి వద్దకు వెళ్ళిపోయాడు..


ఆరోజు సాయంత్రం పల్లకీసేవలో తిరుపతయ్య ఒక్కడే పాల్గొన్నాడు..గురుమూర్తి పల్లకీసేవ జరిగే విధానాన్ని చూస్తూ దూరంగా నిలబడ్డాడు..పల్లకీ స్వామివారి మందిరం చుట్టూరా మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసుకొని, ముఖద్వారం  వద్దకు వచ్చింది..అక్కడ పల్లకీ మోసే వాళ్ళు, పల్లకీని పైకెత్తి పట్టుకుంటారు..అప్పటిదాకా పల్లకీ తో పాటు ప్రదక్షిణాలు చేసిన భక్తులు ఒక వరుసలో నిలబడి..ఒక్కొక్కరుగా పైకెత్తి పట్టుకున్న పల్లకీ క్రింద నుంచి, నమస్కారం చేసుకుంటూ ఇవతలికి వస్తారు..అలా పల్లకీ క్రింద నుంచి వస్తే..తమకు మేలు జరుగుతుందనే భావన ఎప్పటినుంచో భక్తుల మనస్సులో నాటుకొని ఉన్న సాంప్రదాయం..తిరుపతయ్య తాను కూడా పల్లకీ క్రింద నుంచి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చాడు..గురుమూర్తి దూరంగా వున్నాడు..


ప్రక్కరోజు ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి సమాధికి అర్చక స్వాములచే అభిషేకము, హారతులు పూర్తయ్యాక..తిరుపతయ్య స్వామివారి సమాధి దర్శనానికి వెళ్లి వచ్చాడు..ఆ తరువాత ఇద్దరు మిత్రులూ స్వామివారి ముందున్న మంటపం లో కూర్చున్నారు..కొద్దిసేపటి తరువాత..ఇద్దరూ నాదగ్గరకు వచ్చి, తాము తమ ఊరికి తిరిగి వెళుతున్నామని చెప్పారు..తిరుపతయ్య అత్యంత భక్తితో.."ఈరోజు స్వామివారి సమాధి దర్శనం చాలా బాగా జరిగిందనీ..వీలైతే త్వరలో మళ్లీ వస్తాననీ " చెప్పాడు..ఇద్దరూ వెళ్లిపోయారు..


సరిగ్గా ఆరు రోజుల తరువాత.."ప్రసాద్ గారూ..నా పేరు గురుమూర్తి అండీ..పోయినవారం నేనూ, నా స్నేహితుడు తిరుపతయ్య స్వామివారి వద్దకు వచ్చాము..రేపు శనివారం నాడు నేను వస్తున్నాను..నేను స్వామివారి పల్లకీసేవ లో పాల్గొని, సమాధి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను.." అని ఫోన్ లో చెప్పాడు..నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది..తనకు ఏదైనా ఋజువు కనబడితేనే నమ్ముతానని చెప్పిన వాడు, ఇలా హఠాత్తుగా ఫోన్ చేసి స్వామివారి వద్దకు వస్తానని చెప్పడానికి ఏదో ఒక కారణం ఉంటుందని అనుకున్నాను..


ఆ ప్రక్కరోజు శనివారం నాటి సాయంత్రం గురుమూర్తి తన కుటుంబం తో సహా మందిరానికి వచ్చాడు..నేరుగా నేను కూర్చున్న చోటుకే వచ్చి, "ప్రసాద్ గారూ..పోయినవారం నేను స్వామివారి సన్నిధికి వచ్చి కూడా దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళాను..ఇంటికి వెళ్ళేసరికి మా ఇంట్లో స్వామివారి పటం వుందండీ..నాకు విపరీతంగా ఆశ్చర్యం వేసింది..ఈ పటం ఎలా వచ్చింది అని మా భార్యను ఆడిగానండీ..ఆదివారం ఉదయం మా వీధిలో ఒక సాధువు వచ్చాడట..మా యింటి ముందు నిలబడితే మా ఆడవాళ్లు భిక్షకో..డబ్బులు అడగడానికో వచ్చాడనుకొని ఓ పదిరూపాయలు ఆయన చేతిలో పెట్టిందట..ఆయన తన సంచీలోంచి, స్వామివారి చిత్ర పటం మా వాళ్ళ చేతిలో పెట్టి, ఇంట్లో పెట్టుకొని రోజూ నమస్కారం చెయ్యి..మంచి జరుగుతుందని చెప్పి వెళ్లిపోయాడట..ఆ పటం ఇంటికొచ్చిన కొద్దిసేపటి కే మా అబ్బాయికి బెంగుళూరు లో ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లు మెయిల్ వచ్చింది..సాక్షాత్తు స్వామివారే నడిచి మా యింటికి వచ్చారని మా ఆవిడ అన్నది..నాకూ నిజమనిపించింది..నేను పొరపాటు చేశానని అర్ధం చేసుకొని, ఈరోజు ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని, క్షమాపణ చెప్పుకొని వెళదామని వచ్చాను..నాతో పాటు ఆమెనూ పిల్లలనూ తీసుకొని వచ్చాను.." అన్నాడు..ఆ మాటలు అతను చెప్పేటప్పుడు గురుమూర్తి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి..అతని స్వరం లో పశ్చాత్తాపం స్పష్టంగా తెలుస్తోంది..


అతనిలో పరివర్తన రావడానికి స్వామివారే చొరవ తీసుకున్నారు..ఇక నేను వివరించడానికి ఏమీ మిగలలేదు..గురుమూర్తి తో పాటు స్వామివారికి నేనూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..సెల్ : 94402 66380 & 99089 73699).

సప్త ఋషులు

 అత్ర్యాది సప్త ఋషయః సమపాస్య సంఘాః అని వేంకటేశ్వర సుప్రభాతం రూపంలో వేద వచనం. అత్రి మెు దలగు సప్త ఋషులు 7 కొండలుగా వెలసి మౌనంగా తపస్సు చేసే కొండలు. ఋషులు కొండలుగా వెలసిరి. అనగా ఋషి అనగా అనంతమైన శక్తిని సూత్రపాయ్రంగా దర్శించుట. అనంతకోటి బ్రహ్మాండమైన శక్తి గల వేంకటాచలమును ఉపాసన ద్వారా మాత్రమే తెలియగలము. అటువంటి శక్తిని దర్శించుట యే జీవ లక్షణము. అనగా బ్రహ్మ మే బ్రహ్మ మునుండి విడిచి బ్రహ్మమును చూచు చున్నది. కాని భౌతికంగా చూచుటకు ప్రయత్నం. అది సూత్రప్రాయంగా మాత్రమే శక్తి చూడవలెను గాని భౌతికంగా చూచుటకు వీలులేదు. అందుకే అన్నమయ్య అన్నట్లుగా వేదములే శిలలై వెలసినదియని ఆచార్యులవారి సప్తఋషి మండలము నుండి సప్తగిరులపైనున్న శక్తి కూడా వకటే అచ్చటనుండే శక్తి ప్రసారణ వివరణ.ఋషులు తపస్సు చేయుదురే గాని భోగములు అనుభవించరు.భోగి యెూగి కాడు. యత్ ఏదైతే జీవ లక్షణము గ అంతటా వ్యాపించియున్నదో కలదో దాని లక్షణమును లేదా దాని గమనమును దర్శించు వాడు యెూగి అనే అర్ధం. అంతేగాని యీ భోగము ఆ భోగము అనే మాయమాటలు అనగా మాయలో పడవేయుట కాదు. పర తత్వమును దర్శించుటయే ఆత్మ తత్వం. అదే సప్తగిరుల లక్షణము వాటి మూలశక్తియైన వేంకటాచల తత్వం.

జీవిత పాఠాలు

 మా పల్లెలు నేర్పిన జీవిత పాఠాలు


పొలం గట్లపై నడిపించి,  

తడబడకుండా నిలదొక్కుకోవటం  నేర్పింది.


అకాల వర్షాలకు, గాలి దుమారాలకు పంటలు పాడై పొతే,

నష్టాలకు నిలదొక్కుకునే స్థైర్యం నేర్పింది.


వాగు పక్కన నీటి  చెలిమలు తీయించి,

శోధించే తత్వం నేర్పింది.


సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి,

అన్వేషణ నేర్పింది.


తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో,

జీవితం పూలపాన్పు కాదని నేర్పింది.


వేరుశనగ కాయ కొట్టించి, సోలెడు పల్లీలు  తీయించి,

ఐదు పైసల సంపాదన నేర్పింది.


ఆవులతో,  గేదెలతో, కోళ్లతో స్నేహం చేయించి,

ప్రాణికోటి పై బాధ్యత పెంచింది,  ప్రేమతత్వాన్ని నేర్పింది.


రాగడి  మట్టితో బండి గిర్రలు చేయించి, 

మొక్కజొన్న సొప్ప బండ్లకు తొడిగించి,

పనితనం నేర్పింది.


వేలాడే పిచుక గూళ్ళు, చెట్ల కొమ్మల పంగల మధ్య కొంగ గూళ్ళు చూపించి

బొమ్మరిల్లు కట్టించి, 

చిన్నప్పుడే సివిల్ ఇంజనీరింగ్ నేర్పింది.


బతుకమ్మ తంగేడు గునుగు పూల కోసం,

తెల్లవారుతూనే  పొలం బాట పట్టించి,

ఇంటి ఆడబిడ్డల బాధ్యతను నేర్పింది.


పొలం పనుల్లో చిన్న చిన్న దెబ్బలు తగిలితే,

నల్లాలం  ఆకు పసరు పోయించి,

చిన్న చిన్న ఇంటి వైద్యం చిట్కాలు నేర్పింది.


చెట్టుమీద మామిడికాయ

గురిచూసి కొట్టడం,  లక్ష్యాన్ని ఛేదించడం నేర్పింది.


నిండు బిందెను నెత్తి మీద పెట్టి, నీళ్లు మోయించి,

జీవితమంటే బరువు బాధ్యత అని నేర్పింది.


కటిక  ముడి, దుస్సు ముడులు నేర్పించి

పాల శిక్కం కట్టించి, కాగితం పొట్లాలు కట్టటం నేర్పించి

చలి కాలంలో  అరికంట్లం కట్టించి, 

ఒడుపు  నేర్పింది.


బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి,

బాలన్స్ గా బరువు లాగటం నేర్పింది.


ఇంటి ముంగిటకు  అతిథి దేవతలు

హరిదాసులు గంగిరెద్దులను రప్పించి,

ఉన్న దాంట్లో కొంత  పంచుకునే గుణం నేర్పింది,


ఇసుకలో పిట్ట గూళ్ళు కట్టించి,

ఒక ఇంటి వాడివి కావాలి అనే స్పృహను నింపింది.


పచ్చపచ్చని నిగనిగలాడే మోదుగాకుల  విస్తరిలో,

అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా తినే

ఒద్దికను నేర్పింది.


మోదుగాకులు తెంపించి, ఎండబెట్టించి, 

కట్టలు కట్టించి, విస్తరాకులు కుట్టించి,

అతిథులకు ఎంగిలి కాని పాత్రల్లో భోజనం వడ్డించడం నేర్పింది.


ఉన్న ఒక్క పిప్పర్మెంట్ ను, అంగీ బట్ట వేసి, కొరికి ముక్కలు చేసి,

కాకి ఎంగిలి పేరుతొ దోస్తులతో పంచుకోవటం నేర్పింది.


ముళ్ళు గుచ్చుకోకుండా,  ఒక్కటొక్కటిగా రేగ్గాయలు తెంపే 

ఓర్పును నేర్పింది.


ఎండా కాలంలో తుమ్మ చెట్ల బంక సేకరణ,

స్వయం సంపాదన ధోరణి నేర్పింది.


మైదాకును తెంపించి, దంచించి, చేతులకు అద్దించి,

వికసించడం చూపించింది.


వాయిలి బరిగెలతో, సుతిలి దారంతో విల్లును చేయించి,

వస్తు తయారీ మెళకువలు నేర్పింది.


అత్తా, మామా, అన్నా  వదినా,  అమ్మమ్మా, నాయినమ్మా, తాతయ్యా వరుసలతో,

ఊరు ఊరంతా ఒక కుటుంబమనే ఆత్మీయత నేర్పింది.


మా ఊరు నాకు ఎంత ఇష్టం అంటే,

మా అమ్మా బాపు ఎంత ఇష్టమో, అంత ఇష్టం 


ధైర్యంగా  బ్రతికే  పాఠాలను నేర్పిన

మా ఊరుకు పల్లెకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం. 


నేను గ్రామం లో (పల్లెలో) పుట్టి పెరిగాను అని చెప్పటానికి సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా.

ఆనందం

 👉    *ఆనందం*     👈 

  

 అరటిపండ్ల వ్యాపారి పగలంతా పళ్ళు అమ్మి,  రాత్రికి ఇంటికి వెళ్లే ముందు మిగిలిన సరుకులు లో నుండి పాడైనవి ,  కుళ్ళిపోయినవి  తీసేస్తాడు. నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు. మరునాడు అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు. వాటినీ నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు.  'అయ్యో! పడేస్తున్నాననే బాధ ఉండదు.  వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే,  మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది.


 జీవితానుభవాలు అంతే.  బాధ కలిగించే ఆలోచనలను,  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను , మనసులోంచి తీసేయాలి.


 ఏరోజు చిట్టాపద్దులు ఆరోజే పూర్తి చేయాలి. క్షమించాల్సిన వాటిని క్షమించాలి . సానుభూతి చూపాల్సిన వారిపై,  సానుభూతి చూపాలి. విస్మరించిన వాళ్లను,  విస్మరించాలి.  ప్రశంసించిన వాళ్లను,  ప్రశంసించాలి. 


మంచి అనుభూతులను చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి. చెత్త వెళ్లిపోయాక బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం  పెరుగుతుంది.  చిరునవ్వు,  ఆనందం కవల పిల్లలు.  ఒకటి లేకుండా మరొకటి లేదు.

🌻🌺🌸🌼🌺🌸🌻