7, ఆగస్టు 2020, శుక్రవారం

#మౌనం_వహించు

మౌనం వహించు - కోపం వచ్చినపుడు
మౌనం వహించు - నీకు వాస్తవాలు తెలియనప్పుడు
మౌనం వహించు - నీకు రూడీ గా తెలియనప్పుడు
మౌనం వహించు - నీ మాటలు బలహీనుడిని గాయ పరుస్తున్నపుడు
మౌనం వహించు - నువ్వు వింటున్న సందర్భంలో
మౌనం వహించు - నీ మాటలు తప్పుడు సంకేతాలను పంపిస్తూ ఉంటె
మౌనం వహించు - నీ తప్పును జోక్ గా చెప్పవలసి వస్తే
మౌనం వహించు - నీ మాటలకు తర్వాత         పశ్చాత్తాప పడవలసి వస్తుంది అనుకుంటే
మౌనం వహించు - నీకు సంబంధం లేని విషయంలో మాట్లాడవలసివస్తే
మౌనం వహించు - అబద్ధం చెప్పవలసిన సందర్భంలో
మౌనం వహించు - ఇతరుల గౌరవానికి భంగం  కలిగేలా మాట్లాడవలసివస్తే
మౌనం వహించు - స్నేహానికి భంగం కలుగుతోంది అనుకుంటే
మౌనం వహించు - క్లిష్టమైన సందర్భాలలో
మౌనం వహించు - నీవు అరచి చెప్పవలసిన సందర్భాలలో
మౌనం వహించు - భగవంతుని విషయంలో ,
మౌనం వహించు - స్నేహితుల విషయంలో, కుటుంబం విషయంలో
మౌనం వహించు -సమాధానం చెప్పలేని సందర్భంలో
మౌనం వహించు - ఒకసారి ఇంతకు ముందే చెప్పి ఉంటె
మౌనం వహించు - ఒక చెడ్డవాడిని పొగడవలసిన సందర్భంలో
మౌనం వహించు - పని చేసుకోవలసిన సందర్భంలో

(ఎవరు తన నోటినీ, నాలుకనూ అదుపులో ఉంచుకుంటారో, వారు జీవితంలో సమస్యలను దూరంగా ఉంచుకోగల్గుతారు)

రామాయణమ్. 23


..
ఓ బ్రహ్మర్షీ! నా తల్లిని రాముడు చూసినాడా? ఆమెను అనుగ్రహించినాడా?
మరల నా తండ్రి అచటికి ఏతెంచినాడా? నా తల్లితండ్రులు ఇరువురూ సంతోషముగా కలసినారుకదా!
రాముడు వారి ఆతిధ్యమును స్వీకరించెనా? నా తల్లిదండ్రులు రామునకు ఫలపుష్పాదులొసగినారుకదా!
.
ఇలా ఒకదానివెంట మరొక ప్రశ్న సంధిస్తూ వెడుతున్న శతానందులవారికి విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఒకే ఒక సమాధానం చెప్పారు.
"నాయనా ,జరుగవలసిన వెల్ల జరిగినవి నా కర్తవ్యము నేను నిర్వహించితిని. ఆ మాటలు విన్న శతానందుడు...ధన్యుడనయితిని ఓ రామచంద్రా నీవు నా తలితండ్రులకు ,కుటుంబమునకు చేసిన మేలు మరువలేనిదయ్యా!
.
నీవుకూడా ధన్యుడవయితివయ్యా! అనితర సాధ్యమైన బ్రహ్మర్షిపదాన్ని స్వయం కృషితో అందుకున్న ఈ మహాతేజోసంపన్నుడైన విశ్వామిత్రుని శిష్యరికము నీకు లభించినది.
.
ఈయన సామాన్యుడనుకున్నావా! కాదు ,కాదు! ఈయన ఒక్కడే!(unique) .చరిత్రలో మరొకరులేరు.
.
ఒక సామాన్య రాజుగా జన్మించి రాజర్షియై,ఋషియై,మహర్షియై,బ్రహ్మర్షిఅయిన ఈయన చరిత్ర అత్యంత స్ఫూర్తి దాయకం ,ఆదర్శవంతము.
.
ఒక లక్ష్యము కోసము పట్టువిడవక వేల ఏండ్లు తపస్సు చేసి సాధించిన మహోన్నతమయిన వ్యక్తి విశ్వామిత్రమహర్షి! .
.
తపస్సు ద్వారా మనస్సులోని మలినములు ఒక్కొక్కటిగా తొలగించు కుంటూ మనస్సు అత్యంత పరిశుద్ధమైన మానససరోవరంగా మార్చుకున్న వాడయ్యా ఈయన !
.
ఈయన చరిత్ర మానవాళికి అందించే పాఠం అత్యంత విలువైనది ! .ఈ చరిత్ర కార్యసాధకుడైన ప్రతి వ్యక్తి హృదయంలో స్ఫూర్తి రగిలిస్తుంది!
.
రామచంద్రా ఈ బ్రహ్మర్షిగూర్చి నీకు వివరించ ప్రయత్నం చేస్తాను.
.
అంటూ శతానందులవారు విశ్వమిత్రమహర్షి చరిత్ర చెప్పటం మొదలుపెట్టారు!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

రామాయణమ్ .22


.
గౌతమ మహర్షి ఆతిధ్యం స్వీకరించిన పిదప విశ్వామిత్ర మహర్షి ఈశాన్యదిక్కుగా ప్రయాణమయినాడు.
 అన్నదమ్ములిరువురూ ఆయనను అనుసరించినారు.
.
జనకుడి యజ్ఞ శాల ప్రవేశించారు మహర్షి!.
.
మహాత్ముడు అయిన విశ్వామిత్ర మహర్షి రాక తెలిసికొని జనకమహారాజు తన పురోహితుడైన శతానందులవారిని వెంట నిడుకొని అతిశీఘ్రముగా ఆయన వద్దకు చేరి అర్ఘ్యపాద్యాదులొసగి ఆ మహానుభావుని తగురీతిని సత్కరించి అంజలి ఘటించి నిలుచున్నాడు.
.
జనకుడిని యజ్ఞము ఏవిధముగా జరుగుతున్నదో అడిగి తెలుసుకున్నారు మహర్షి.
.
అప్పుడు జనకుడి మదిలో ఒక ఉత్సాహమేర్పడి ,
మహర్షివెంట ఉన్న ధనుర్ధారులైన రాకుమారులెవరో తెలుసుకోవాలని కోరిక కలిగింది.
.
మహర్షీ వీరిరువురూ ఎవరు?
పద్మపత్రాల వంటి కన్నులు,
అశ్వినీ దేవతల సౌందర్యం,
దేవతాసమానపరాక్రమము,
గజ సింహ సమానమయిన నడక ,
చూడగానే దేవతలవలే కనపడే ఈ బాలురెవ్వరు?
 ఎవరివారు? నీతో కాలి నడకనే ఇచ…
[7:15 am, 06/08/2020] +91 98585 53366: శుభోదయం

        అసత్యంతో సాధించిన విజయం కంటే
       సత్యమార్గంలో నడచి పొందిన ఓటమి గొప్పది.

🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
[11:03 am, 06/08/2020] +91 98585 53366: రామ జన్మభూమి ..ఇవ్వాళ మన సొంత మవడానికి కారనమైన ఒక మహానుభావుణ్ణి స్మరించుకోవడం మరిచి పోయాం...  అందుకని.

అతడు ఎవరో కాదు మన పుల్లారెడ్డి స్వీట్స్ పుల్లారెడ్డి గారు 🙏🏼

ఒకసారి వారి గురించిన క్లుప్తంగా తెలుసుకొని పునీతులవండి..

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
అయోధ్య రామ జన్మభూమి ఆందోళన అని మాట పలికితే దాని వెనుక మరొక అవి స్మరణీయ దిగ్గజం.....స్వర్గీయ పుల్లారెడ్డి గారు...

ఆ రోజుల్లో కోర్టులో కేసు వాదించడానికి రోజుకు లక్షల్లో ఖర్చు వస్తున్నందున...

ఢిల్లీ VHP కార్యాలయంలో ఆర్థిక సంకటం ఏర్పడింది.

 కోశాధికారిగా ఉన్న పుల్లారెడ్డి గారి దగ్గరికి అశోక్ సింగల్ గారు వచ్చారు .

అప్పటికి ఇరవైఐదు లక్షలు సమీకరించాలి .

లక్షల రూపాయలు సంగ్రహించడం అప్పటికప్పుడు కష్టంగా ఉన్న సమయం. బాధపడుతూ హైదరాబాద్ వచ్చారు .

పుల్లారెడ్డి గారి ఇంట్లో కూర్చొని మాట్లాడుతుండగా....

ఇంట్లోకి వెళ్లి వచ్చి చ…
[6:28 am, 07/08/2020] +91 98585 53366: రామాయణమ్. 23
..
ఓ బ్రహ్మర్షీ! నా తల్లిని రాముడు చూసినాడా? ఆమెను అనుగ్రహించినాడా?
మరల నా తండ్రి అచటికి ఏతెంచినాడా? నా తల్లితండ్రులు ఇరువురూ సంతోషముగా కలసినారుకదా!
రాముడు వారి ఆతిధ్యమును స్వీకరించెనా? నా తల్లిదండ్రులు రామునకు ఫలపుష్పాదులొసగినారుకదా!
.
ఇలా ఒకదానివెంట మరొక ప్రశ్న సంధిస్తూ వెడుతున్న శతానందులవారికి విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఒకే ఒక సమాధానం చెప్పారు.
"నాయనా ,జరుగవలసిన వెల్ల జరిగినవి నా కర్తవ్యము నేను నిర్వహించితిని. ఆ మాటలు విన్న శతానందుడు...ధన్యుడనయితిని ఓ రామచంద్రా నీవు నా తలితండ్రులకు ,కుటుంబమునకు చేసిన మేలు మరువలేనిదయ్యా!
.
నీవుకూడా ధన్యుడవయితివయ్యా! అనితర సాధ్యమైన బ్రహ్మర్షిపదాన్ని స్వయం కృషితో అందుకున్న ఈ మహాతేజోసంపన్నుడైన విశ్వామిత్రుని శిష్యరికము నీకు లభించినది.
.
ఈయన సామాన్యుడనుకున్నావా! కాదు ,కాదు! ఈయన ఒక్కడే!(unique) .చరిత్రలో మరొకరులేరు.
.
ఒక సామాన్య రాజుగా జన్మించి రాజర్షియై,ఋషియై,మహర్షియై,బ్రహ్మర్షిఅయిన ఈయన చరిత్ర అత్యంత స్ఫూర్తి దాయకం ,ఆదర్శవంతము.
.
ఒక లక్ష్యము కోసము పట్టువిడవక వేల ఏండ్లు తపస్సు చేసి సాధించిన మహోన్నతమయిన వ్యక్తి విశ్వామిత్రమహర్షి! .
.
తపస్సు ద్వారా మనస్సులోని మలినములు ఒక్కొక్కటిగా తొలగించు కుంటూ మనస్సు అత్యంత పరిశుద్ధమైన మానససరోవరంగా మార్చుకున్న వాడయ్యా ఈయన !
.
ఈయన చరిత్ర మానవాళికి అందించే పాఠం అత్యంత విలువైనది ! .ఈ చరిత్ర కార్యసాధకుడైన ప్రతి వ్యక్తి హృదయంలో స్ఫూర్తి రగిలిస్తుంది!
.
రామచంద్రా ఈ బ్రహ్మర్షిగూర్చి నీకు వివరించ ప్రయత్నం చేస్తాను.
.
అంటూ శతానందులవారు విశ్వమిత్రమహర్షి చరిత్ర చెప్పటం మొదలుపెట్టారు!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

ధర్మధ్వజం
హిందు చైతన్య వేదిక

శ్రీకృష్ణుని రాసలీల:

రాసలీల ఘట్టము విన్నంత మాత్రం చేత మన పాపములన్నిటిని దహించగల శక్తి కలిగినది. రాసలీలను సామాన్యమయిన స్థాయిలో విని, మనస్సును పరిశుద్ధంగా ఉంచుకొని అది ఈశ్వరుని లీల అని విన్నంత మాత్రం చేత గొప్ప ఫలితమును ఇస్తుంది. దాని లోపల ఉండే అసలయిన రహస్యమును తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తే అది ఒక దివ్యాతిదివ్యమయిన లీల. అంతకన్న గొప్పలీల సృష్టిలో ఉండదు. రాసలీల అనేసరికి కృష్ణుడు చాలామంది కాంతలతో భోగము అనుభవించుట అని అనుకుంటారు. దాని ఉద్దేశము అది కాదు.
శరత్కాలములో పౌర్ణమి వచ్చింది. మంచి వెన్నెలతో కూడిన రాత్రి. ఆ రాత్రి కృష్ణ భగవానుడు యమునానదీ సైకతమునందు ఒడ్డున నిలబడి వేణువు మీద ఒక గొప్ప మోహనగీతము నొకదానిని ఆలాపన చేశారు. అక్కడ అనేకమంది గోపాలురు ఉన్నారు గోపకాంతలు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పాలు తీయడానికి దూడలను విడిచి పెడుతున్నారు. మరికొంతమంది పాలు పితుకుతున్నారు. మరికొంతమంది పితికిన పాలను అగ్నిహోత్రం మీద పెడుతున్నారు. వేరొక ఇంట్లో చల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పని జరుగుతోంది. ఈలోగా కృష్ణ భగవానుడు ఊదిన వంశీరవము వినపడగానే ఇక్కడే మనస్సులో కృష్ణ భగవానుని దర్శనం చేసి, ఇంత గొప్ప వంశీరవమును చేస్తున్న ఆ మోహనరాగము పలుకుతున్న రూపమును చిత్రించుకుని గాఢాలింగనము చేసుకుని ఆ మైమరపుచే పరవశులై ఇక్కడే కొందరు గోపకాంతలు శరీరమును వదిలిపెట్టేశారు. మరికొంతమంది భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా కృష్ణుడితో రాసలీల చేయాలని ఆయనతో ఆనందం అనుభవించాలని వీళ్ళనందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కృష్ణుడు వీరందరినీ చూసి వేళకాని వేళలో పర పురుషుడి దగ్గరకు స్త్రీలు పరుగెట్టుకు వస్తే మానం మర్యాదలు మంట కలిసిపోవా? ఈ రాత్రివేళ మీరు ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. వారు కన్నులవెంట నీరు కారుస్తూ ‘కృష్ణా! మేము రావడానికి కారణం నీకు తెలుసు. ఇక్కడవరకు వచ్చిన తరువాత నీవలన సుఖమును పొందాలని మేము వస్తే ఎందుకు వచ్చారు అని అడుగుతావా?’ అని అడిగారు.
ఈవిషయం వినేసరికి పరీక్షిత్తుకు ఆశ్చర్యం వేసింది. కొన్ని సందేహములు కలిగాయి. కృష్ణుని అడగటమేమిటి? భగవానుడు ఈ పనులు చేయవచ్చునా? ధర్మమును ఆవిష్కరించవలసిన వాడు, ధర్మమును స్థాపించవలసిన వాడు పరకాంతలయందు ఇటువంటి మోహబుద్ధిని జనింపచేయవచ్చునా?’ అని శుకమహర్షిని అడిగాడు. శుకబ్రహ్మ ‘పరీక్షిత్తూ! నీవు తొందర పడకు. రాసలీలను జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యి. దానిని నీవు తెలుసుకుంటావు’ అన్నారు.
రాసలీల ఈశ్వరుని లీల. ఈశ్వరుడు చేసే పనియందు యుక్తాయుక్తములను విచారించే అధికారం మనకు ఉండదు. ఆయన జగత్ప్రభువు. ఆయన జగత్తునందు ఏది చేసినా అడిగే అధికారం, దానిని గురించి విమర్శ చేసే అధికారం మనకి లేదు. శుకుడు కూడా ఇదే మాట చెప్పాడు. యమునానది ఒడ్డునే వేణువును ఎందుకు ఊదాలి? సూర్యునికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు యముడు, కూతురు యమున. యమున ప్రవహించి వెళ్ళిపోయే కాలము స్వరూపము. కాలము ప్రవహించి వెళ్ళిపోతున్నప్పుడు ఉన్నామని ఈ శరీరమును చూపించిన జీవులు పడిపోతూ ఉంటారు. ఎంతమంది పడిపోతుంటారో ఎవ్వరికీ తెలియదు. ఆ లెక్కపెట్ట గలిగిన వాడు ప్రపంచమునందు ఎవ్వడూ ఉండడు. ఒక్క ఈశ్వరుడికే తెలుస్తుంది. ఎందుకనగా ఆయనే కాలస్వరూపమయి ఉన్నాడు. యమున కాలప్రవాహమునకు గుర్తు. ఎప్పుడు ఆయన తన నిర్హేతుకమయిన కృపతో కొంతమందిని ఉద్ధరించాలని అనుకున్నారు. భావనయందు ఎలా పెట్టుకున్నా సరే వస్తువు అటువంటిది. ఆయనయందు భక్తితో గుండెల్లో గూడు కట్టుకున్న వాళ్ళని ఆయన ఉద్ధరించాలని అనుకున్నారు. దీనినే ఈశ్వర సంకల్పము అంటారు. ఇలా ఎందుకు ఈశ్వరుడు సంకల్పించాలి? అలా సంకల్పించడమును ‘నిర్హేతుక కృప’ అని శాస్త్రము పేర్కొంది. శరత్కాలములో ఎందుకు ఊదాలి అంటే శరత్కాలములో ఆకాశములో మబ్బులు ఉండవు. ఆకాశమంతా నిర్మలంగా తెల్లటి వెన్నెలతో కూడి ఉంటుంది. అలాగే జీవి అంతరమునందు రజోగుణము, తమోగుణము బాగా తగ్గిపోయి సత్త్వగుణ ప్రకాశముతో ఉంటాయి. సత్త్వ గుణ ప్రకాశముతో ఉన్న మనస్సులు ఏవి వున్నాయో, ఏవి నిరంతరము కృష్ణ భావన చేస్తున్నాయో అవి ఈ వేణునాదమును విని పరుగెట్టగలవు.శబ్దము అందరికీ వినపడుతుంది. ఆ శబ్దము ఉత్తేజితము చేయవలసి వస్తే అది స్త్రీ పురుషులనందరినీ చేస్తుంది తప్ప కేవలము స్త్రీలను మాత్రమే ఉత్తేజితులను చేయడమో, కేవలము పురుషులను ఉత్తేజితులను చేయడమో ఉండదు. కృష్ణుని వేణుగానము కేవలము గోపకాంతలను మాత్రమే ఎందుకు ఉత్తేజితులను చేసింది? వాళ్లకు కేవలము ఉన్నది కామోద్రేకమే అయితే వేణునాదము విన్న తరువాత మాత్రమే కామోద్రేకముతో ఎందుకు పరుగెత్తాలి? వేరొక సందర్భములో పరుగెత్తవచ్చు కదా! కామాతురత కలిగిన వాడు అందునా పర పురుష సంగమము కోరుతున్న స్త్రీ గుప్తంగా వ్యవహరిస్తుంది తప్ప తన భర్త ఎదురువస్తే త్రోసి అవతలపారేసి పరుగెడుతుందా? అది సాధ్యమయే విషయం కాదు. కానీ ఇక్కడ కొన్ని వేలమంది గోపకాంతలు పరుగెడుతున్నారు. మరి గోపాలురు పరుగెత్తరా? వారిని అడ్డుకోరా? అలా రాసలీలలో ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే మనం వేణునాదమును వింటే గోపకాంతలకు ఏమయినదో తెలుసుకోవాలి. వేణు నాదమును వింటే గోపకాంతలకు ‘అనంగవర్ధనము” అయినదని చెప్పారు. అనంగవర్ధనమనే మాటను వాడి వ్యాసుల వారు మనందరి మీద సమ్మోహనాస్త్రమును వేసారు. కృష్ణుడు వేయలేదు ఆయన వేశారు. అనంగుడు అనగా శరీరము లేనివాడు - మన్మథుడు. మన్మథవర్ధనం జరిగినది అంటే లోపల కామోద్రేకము కలిగినదన్నది బాహ్యార్థము. రాసలీలనే శీర్షికను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే ‘అనంగ’ అనగా శరీరము కానిది అనగా ఆత్మ. అనగా అనంగవర్ధనము అనగా ఆత్మవర్ధనము. జీవి ఆత్మాభిముఖుడయినాడు. ఈశ్వరుని పిలుపునకు ఎవడు యోగ్యుడో వాడికి అందినది.
ఆత్మోన్ముఖులు అయ్యారని గోపకాంతలకు మాత్రమే చెపుతారు. పురుషులకు ఎందుకు చెప్పరు? ప్రపంచమునందు మనం అందరం కూడా బాహ్యంలో భార్యభర్త అంటాం. శాస్త్రమునందు మాత్రము భార్య భర్త ఉండరు. పురుషుడు ఒక్కడే ఉంటాడు ఆయనే పరమాత్మ. ప్రపంచంలో పరమాత్మ ఒక్కడు మాత్రమే పురుషుడు. మిగిలిన వారు అందరూ స్త్రీలే. అందరికీ ఒకడే భర్త జగద్భర్త. ఆయనే పరమాత్మ. అందరూ ఆయననే పొందాలి.
పతిం విశ్వశ్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం’
వాడు విశ్వేశ్వరుడు లేదా నారాయణుడు. ఏ పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదు. అటువంటి వాడిని పొందాలి. ఇపుడు స్త్రీయా పురుషుడా? పురుషుడిని పొందాలి కాబట్టి స్త్రీగా చెప్తారు. పరమాత్మ పురుషునిగా ఉన్నాడు. మారని వాడు మారుతున్నది శరీరము. మారుతున్న శరీరమునందు మీరు ఉండి మారని తత్త్వమయిన భగవంతుడిని అందుకోవాలి. ఇది ఎవరికో లోపల ప్రచోదనం అవుతుంది. అలా ఎవరికీ ప్రచోదనం అయిందో వారికి కృష్ణ పరమాత్మ వేణునాదము వినపడింది. వారికి అనంగవర్ధనం అయినది. పైకి కథ కామోద్రేకము కలిగినట్లు ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నది కామమా లేక మోక్షమా? వారు మోక్షమును అడుగుతున్నారు. వీరందరూ ఆత్మసుఖమును అభిలషిస్తున్నారు. ఆత్మానందమును వాక్కు చేత చెప్పడం కుదరదు. దీనిని మధురభక్తితో చెప్పాలి. మధురభక్తిని నాయిక నాయకుల వలన చెపుతారు. జీవ బ్రహ్మైక్య సిద్ధిని ప్రేయసీ ప్రియుల సమాగమముగా చెప్తారు. అందుకే జీవ బ్రహ్మైక్య సిద్ధియే కళ్యాణం. మధురభక్తిని ఆధారంగా తీసుకొని రాసలీలను వర్ణిస్తున్నారు. వ్యాసుల వారు మహాపురుషుల స్థితిని చూపిస్తున్నారు. పైకి కథ గోపికలు ఒళ్ళు తెలియని కామంతో ప్రవర్తిస్తున్న జారిణుల కథలా ఉంటుంది రాసలీల. అంతే అర్థం అయినట్లుగా మాట్లాడితే భగవంతుడి పట్ల భాగవతుల పట్ల, ముక్త పురుషుల పట్ల భయంకర అపరాధము చేశారన్నమాట.  రాసలీల గురించి తెలిస్తే మాట్లాడాలి. తెలియకపోతే ఊరుకోవాలి. అంతేకాని అందులోని పరమార్థం గ్రహించలేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు.
 గోపికలు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని అన్నారు. ‘ఎవరు నీ పాదములు పట్టుకుంటున్నారో వాళ్లకి సంసారం భయం పోతోంది’ అన్నారు.  కృష్ణ పరమాత్మ – ‘అలా మీరు రానూ కూడదు. నన్ను అడుగనూ కూడదు. ఇంతరాత్రి వేళ నేను వంశీరవము చేస్తే మీరు మీరు పరుగెట్టుకు వచ్చి నాతో సుఖము అభిలషించి నాతో ఉంటానంటున్నారు అది చాలా తప్పు. మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి’ అన్నారు. వాళ్ళు ‘ఎన్నో జన్మల తరువాత మేము చేసిన తపస్సు పండితే ఈశ్వరా! నీ పాదముల దగ్గరకు చేరుకున్నాము. మమ్మలి తిరిగి వెళ్ళిపొమ్మంటావా? వాళ్ళు లౌకికమయిన పతులు. అది సంసారమునకు హేతువు మాకు అది వద్దు. మేము జగత్పతివయిన నిన్ను చేరాలని వచ్చాము. అందుకని మాకు సంసారము వద్దు. మేము తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరకు రాలేదు. మాకు తిరిగి రావలసిన అవసరం లేని మోక్ష పదవినీయవలసినది’ అని అన్నారు.
వాళ్ళ మాటలకు పరమాత్మ ప్రీతి చెందాడు వెళ్ళడం ఒక ఎత్తు. వెళ్ళి నిలబడడం ఒక ఎత్తు. దీనికి చాలా తేడా ఉంటుంది. రాసలీల పైకి అనేకమంది గోపకాంతలు కృష్ణుడు కలిసి ఆడుతున్నట్లు కనపడుతుంది. అది నిజం కాదు సంకేతిస్తున్నారు. అలా ఆడడంలో బ్రహ్మానందమును వారు అనుభవిస్తున్నారు. మేఘము మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు.
అంగనామంగనామంతరే మాధవో మాధవమ్ 
 మాధవం మాధవం చాంతరే నాంగనా 
ఇత్థ మాకల్పితే మండలేమధగః 
సంజగౌ వేణునా దేవకీ నందనః 
గోపిక గోపిక మధ్యలో కృష్ణుడు. కృష్ణుడు కృష్ణుడు మధ్యలో గోపిక. ఎంతమందయినా ఏకకాలమునందు మోక్షమును పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు రాసక్రీడ ఆడుతున్నాడు. మోక్షమును పొందుతున్న వారిని చూసి ఇన్ని జన్మల తరువాత ఈశ్వరునితో ఐక్యమవుతున్నారని దేవతలంతా పొంగిపోతున్నారు. దేవతలు ఈ శరీరంలోనే ఉంటారు. ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క దేవత ఉంటాడు. లోపలున్న భావ పరంపరలన్నీ అణిగి పోయి, వాసనలన్నీ అణిగిపోయి, కేవలము తాను ఆత్మస్వరూపిగా నిలబడిపోయి, ఇంద్రియములన్నీ పనిచేయడం మానివేసి, సమాదియందు లోపల ఉన్న జ్యోతి స్వరూపమేదో అదే తానుగా ఉండిపోతాడు. అలా ఉండిపోయినపుడు జీవి అపరిమితమయిన ఆనందమును పొందేస్తాడు. ఆ ఆనందము చేత ఈ శరీరము పోషింపబడుతుంది. తినడం కాని, త్రాగడం కానీ ఉండవు. ఆ ఆనందము ఈ శరీరమును కాపాడుతూ ఉండడం వలన బ్రతికి ఉంటాడు. అలా ఆనందమగ్నుడయిపోయి ఉండిపోతాడు. అలా ఉండిపోయిన సమాధిస్థితిని వర్ణన చేస్తున్నారు. ఇది గోపకాంతలు కృష్ణుడితో కలిసి అనుభవించిన రాసలీల.
యమున ఒడ్డున రాసలీల జరిగింది. వాళ్లకి పట్టిన చమటను పోగొట్టడానికి వాళ్ళు పొందుతున్న ఆనందములో శరీరమునకు పట్టిన బడలికను తీర్చడానికి యమునానది నుండి చల్లటి గాలులు వీచాయి. ఆ చల్లటి గాలులచేత వారు బహిర్ముఖులయ్యారు. ‘నేను ఆత్మ దర్శనమును పొందాను’ అని ప్రతి గోపికా అనుకుంది. ఆత్మ దర్శనమును పొందిన తరువాత మళ్ళీ ఈ ‘నేను ఎక్కడి నుండి వచ్చింది’ ఆత్మగా ఉన్నాను అనాలి. నేను అనుకుంటే మరల జారుడు మెట్లు ఎక్కినట్లే లెక్క. వారందూ మేము అందరమూ కృష్ణునితో ఆనందమును అనుభవిస్తున్నాము అన్నారు. వారు అలా అనీ అనడంతోనే కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు. అనగా వారు తపస్సులో కూర్చున్నప్పుడు సమాధిస్థితి యందు కుదురుకోవడం కుదరడం లేదు. ఇపుడు వీళ్ళకి కృష్ణుడు కావాలి. ఎక్కడ ఉన్నాడని మనుష్యులను అడగడం లేదు వీళ్ళు. రకరకాల చెట్ల దగ్గరకు వెళ్ళి నీవు చూశావా? అని అడుగుతున్నారు.
నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై
జల్లెడు వాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చె నో
మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ చెప్పరే ?
వీళ్ళందరూ మల్లెపొదలను అడుగుతున్నారు. నల్లగా ఉంటాడు, చక్కటి నవ్వు నవ్వుతుంటాడు. పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు, నెమలి పింఛము ధరించిన వాడు, ఆయన అస్ఖలిత బ్రహ్మచర్యమును నిరూపించడానికే నెమలి ఈకను పెట్టుకుంటాడు. సృష్టి మొత్తం మీద స్త్రీపురుషుల సంభోగం లేకుండా పిల్లలను కనే ఏకైక ప్రాణి నెమలి. దానికి భౌతికమైన సంపర్కం లేదు. ఇదే రాసలీల. అందుకే కృష్ణుడు నెమలి ఈకను ధరిస్తాడు. కృష్ణుడు ఆడవారందరితో కలిసి జులాయిగా తిరిగిన వాడు కాదు. ఆయన పరబ్రహ్మయై జీవ బ్రహ్మైక్య సిద్ధిని ఇస్తున్నాడు. వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ అనుగ్రహమును పొందారు. జలక్రీడలు ఆడారు. దానిని రాసలీలని పిలుస్తారు.
రాసలీల అనేది ధ్యానము చేత తెలుసుకోవలసిన రహస్యము. నీవు ఎంత చెప్పినా నాకు అర్థం కావడం లేదు. ఇలా పరకాంతలతో కలిసి కృష్ణుడు ఎలా ఆడినాడని పరీక్షిత్తు పలుమార్లు శుకమహర్షిని ప్రశ్నిస్తాడు. శుకుడు ‘ఈశ్వరుడి లీల లోపల ఉండే జ్ఞానమును నీవు అందుకోలేని స్థితి ఆయినే ఒక విషయమును నీవు జ్ఞాపకం పెట్టుకో. అగ్నిహోత్రమును తీసుకువెళ్ళి శవం మీద పెట్టినట్లయితే అది శవమును కాల్చేస్తుంది. శవమును కాల్చిన అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడయినా తలస్నానం చేస్తుందా? చెయ్యదు. శవమును కాల్చిన అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. అగ్నిహోత్రం నీకు వంట చేసి పెట్టింది. అగ్నిహోత్రమునకు పుణ్యం రాలేదు. యజ్ఞంలో అగ్నిహోత్రం ఉన్నది. మీరు స్వాహా అంటూ హవిస్సును దేవతలకు ఇచ్చారు. అందువలన అగ్నిహోత్రమునకు గొప్పతనం ఏమీ రాలేదు. శవమును కాల్చినా అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. ఏ పనులు చేసినా అగ్ని మాత్రం అగ్నిగానే నిలబడుతుంది. వస్తుసంపర్కం అగ్నికి లేదు. కృష్ణుని కూడా అలా  భావించగలిగితే రాసలీల నీకు ఏమి ఇబ్బంది?’ అని అడిగాడు. ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు. కృష్ణుడు అనగా అగ్నిహోత్రము. ఎవరిని ఉద్ధరించాలని అనుకున్నాడో వారిని అలా ఉద్ధరించాడు. ఈశ్వరునికి ఏ సంపర్కము లేదు. అందుకే నెమలి ఈక పెట్టుకున్నాడు. అగ్నిహోత్రమై ఉన్నాడు. నీ కంటికి అగ్నిహోత్రం పవిత్రత పాడవకుండా కనపడుతోంది. కృష్ణుడి విషయంలో నీకు అలా ఎందుకు కనపడదు? కనపడకపోతే అది నీ దృష్టిదోషం తప్ప కృష్ణ దోషం కాదు. నీవు అలా విను.  రాసలీల నిన్ను ఉద్ధరిస్తుంది’ అని చెప్పాడు.  ఆ రాసలీల అంత పరమ పావనమయిన ఘట్టం. రాసలీల పూర్తయిపోయిన పిమ్మట కృష్ణ పరమాత్మ మరల బృందావనం చేరుకుంటాడు.

ఏడిద శ్రీ సంగమేశ్వర క్షేత్రం పురాతనమైన క్షేత్రం.


 ఇక్కడ శ్రీ సంగమేశ్వరలింగం ను స్వయంగా ఇంద్రుడి ప్రతిష్ట అని పురాణ ఆధారాలు ఉన్నాయి.
అగస్త్య మహాముని మేరు పర్వతం పొగరు అణచి దక్షిణ దేశాలకు వచ్చినప్పుడు తాను వచ్చిన దారిలో కదంబ వృక్షం విత్తనాలను నాటుకుంటూ వచ్చారని ప్రతీతి.... ఇక్కడ ఎక్కువగా కదంబ వృక్షాలు కనిపిస్తుంటాయి.... అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రాంతం ఇదే..
 భరద్వాజ , తుల్య భాగ నదుల అంతర్వహిక సంగమం ఈ సంగమేశ్వరం గా పేర్కొంటారు.త్రివేణి సంగమంగా కూడా ప్రసిద్ధి.ఇక్కడ ఉన్న కోనేరు లో మహా మునులు పుణ్య స్నానాలు ఆచరించే వారని చెబుతారు. శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేసిన సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించారని చరిత్ర కారులు పేర్కొంటారు. ఇక్కడ ఉన్న శ్రీ రామ పాదాలు ఆధారంగా చరిత్రకారులు శ్రీరామచంద్రమూర్తి బస చేసినట్లు చెబుతారు. ఇక్కడ మహర్షులు తపస్సు చేసిన ప్రదేశంగా పురాణ కథలు ఉన్నాయి.సంగమేశ్వర క్షేత్రం లో మరెక్కడా కనిపించని విధంగా కదంబ వృక్షాలు ప్రత్యేకంగా ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ సంగమేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం కు భక్తులు అధిక సంఖ్యలో వస్తూఉంటారు. ఈ ప్రాంతంలో షష్టి మహోత్సవాలు సంగంలో వైభవంగా నిర్వహిస్తుంటారు.దీంతో షష్టి సందడి సంతరించుకుంది.
 ప్రతి శివరాత్రికి ఊరినుండి మూడున్నర కిలోమీటర్ల దూరంలోగల సంగమేశ్వర క్షేత్రానికి ఊరి ప్రజలందరూ ఎంతో ఉత్సాహంతో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన  రథాన్ని లాక్కొని వెళతారు....శైవ క్షేత్రంలోనే రుద్ర భూమి కలిగిన.... అతి కొద్ది క్షేత్రాలలో ఇది ఒకటి..... దక్షిణ కాశీగా పేరుగాంచినది....

క్రెడిట్స్.... @సయ్యద్ హుస్సేన్ జర్నలిస్ట్, గోదారమ్మ తనయుడు....

రాజారావు-కధ



చిన్న ఆఫీసు అయినా బాగా అలంకరించారు.  మొత్తం తొమ్మిదిమంది స్టాఫ్.  ఇప్పటిలా, అప్పుడు గంటకో బదిలీ ఉండేది కాదు.  రాజారావు వాళ్ళతో కలిసి ఎనిమిది సంవత్సరాలు గా చేస్తున్నాడు.  ఆ రోజు పదవి విరమణ. బ్యాంకు మేనేజర్ గా రాజరావు బాగానే సంపాదించాడు.

ఒక కూతురు, ఒక కొడుకు.  కూతుర్ని పదేళ్ళ కిందట అమెరికా సంబంధం చూసి పెళ్లి చేశాడు.  కొడుకు విశాఖపట్నం లో బ్యాంకు మేనేజర్.  వాళ్ళ చెల్లెలి కూతుర్నే కోడలిగా చేసుకున్నాడు.  రాజారావు కి సొంత ఇల్లు విశాఖపట్నం లోనే ఉంది.  కొడుకు ఒక అపార్టుమెంటు కొనుక్కున్నా ఆయన ఇంట్లోనే ఉంటూ అపార్టుమెంటు అద్దెకి ఇచ్చేశాడు.  మొత్తానికి అంతా ఆయనగురించి గొప్పగా చెప్పి రాజమండ్రి లో మీ పని అయిపోయింది అని చెప్పి పంపించేశారు ఆఫీసువాళ్లు.  రాజమండ్రి లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది రాజారావుకి, ప్రస్తుతం అందులోనే ఉంటున్నాడు. భార్య భర్త హాయిగా ఉంటారు.

పెరట్లో ఇంటావిడ మంచి కూర మొక్కలు, పాదులు పెట్టింది.  ఇంక మన రాజారావు కి వ్యాపకం లేదు, వేరే బ్యాంకు వాళ్ళు అడ్వైసర్ గా రమ్మన్నా కొంత కాలం ఇంట్లోనే వుంటాను అంటూ నిరాకరించాడు.  పొద్దున్నే లేచి ఓ గంట పార్కు లో నడక, వచ్చాక స్నానం, పూజ, టిఫిన్.  కొత్తగా భార్య దగ్గర కూర్చుని, కూరలు తరిగి ఇవ్వటం, స్టౌ మీద పాలు చూడటం లాంటివి నేర్చుకున్నాడు. భోజనం చేసాకా భార్య, భర్త కలిసి ఏ చాగంటి వారిదో ఒక గంట ప్రవచనం విని పడుకుంటారు.  లేచి మొక్కల పని, సాయంత్రం ఓ గంట, పెన్షన్ కాయితలు వాటి కధ కమామీషు, రాత్రి ఏడున్నరకి భోజనం, ఎనిమిదిన్నర దాకా పిల్లల తో మనవలతో కబుర్లు, ఇంక నిద్ర.  ఈ పద్దతి ఇద్దరికీ నచ్చింది. ఎంతో కాలానికి కాస్త విశ్రాంతి గా ఉంది.

పెన్షన్ శాంక్షన్ అయింది.  ఇంకా చాలా డబ్బులే వచ్చాయి.  కూతురికి ఇవ్వాలనుకున్నది భార్యకి చెప్పాడు రాజారావు.  ఆవిడ కూతురితో మాట్లాడి వాళ్ళ పేరున వైజాగ్ లోనే ఒక ఫ్లాట్ తీసుకోమంది. ఇక కొడుక్కి ఇవ్వాలనుకున్నది కొడుక్కి ఇచ్చేశాడు. వాళ్ళకి మందులకి, వైద్యాలకి అంటూ కొంత ఎఫ్‌డి చేసి కొడుకుని వారసుడిగా పెట్టాడు.

రాజారావు కి ఒక చిన్న మారుతి 800 కారు వుంది.  భార్య భర్త బాగానే నడుపుతారు.  చాలా కాలంగా రాజారావుకి కాశీ వెళ్లాలని కోరిక.  వెడదాం అనుకుని బయలుదేరారు. పెద్దగా డ్రైవ్ చేసేవారు కాదు. మహా అయితే రోజుకో ఆరు గంటలు అంతే. దారిలో కనపడిన క్షేత్రాలు అన్నీ చూసుకుంటూ మొత్తానికి ఒక నాలుగు రోజుల్లో చేరారు.

పవిత్రత, ప్రశాంతత, భక్తి మనలోనే ఉంటాయిట.  మనం బైట వెతుకుతాము.  ఎవరో అన్నారు 'తింటే సూరత్ లోనే తినాలి, పోతే కాశీ లోనే పోవాలి' అని.  పోదామని కాదు కానీ ఒక తొమ్మిది నెలలు ఉందామని అనుకుని ఎవరో తెలుసున్న తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఒక చిన్న అపార్టుమెంటు అద్దెకి తీసుకుని దాంట్లో చేరారు.  అపార్టుమెంటువాళ్లు కొంత ఫర్నిష్ చెయ్యడం తో పెద్ద పని లేక పోయింది.  వెళ్లారో లేదో “అమ్మగారూ” అంటూ ఒక పది పన్నెండు యేళ్ళ తెలుగు కుర్రాడు పలకరించాడు రాజారావు భార్యని.

ఉతికిన పంచ ఒకటి గోచి పెట్టుకుని, నున్నటి గుండు, వెనుక చక్కగా ముడి వేసిన పిలక, మెడలో యజ్ఞ్యోపవీతం, భుజాన ఉత్తరియం, నుదుట, చేతులు, గుండెల మీద వీభూది తో  అడ్డ నామాలు, చిన్న విష్ణు నామం తిలకం బొట్టు, చెవులకు పోగులు, కాళ్ళకి వెండి కడియాలు, మెడలో ఒక తులసి మాల, చేతికి చుట్టిన రుద్రాక్షలు చూస్తే ఆ వామనుడే దర్శనం ఇచ్చేశాడా అన్నట్టు ఉన్నాడా కుర్రాడు.

మళ్ళీ అన్నాడు, “చతుర్వేది గారు చెప్పారమ్మా, మీరు వస్తున్నారని.  ఇక్కడ నేను మీకు కావలసిన సరుకులు అవి తెచ్చి పెడతాను, సాయంత్రం ఆరు గంటల నుండి, ఉదయం 8 గంటల వరకు మీకు సాయంగా మీఇంట్లోనే ఉంటాను. మిగతా సమయాల్లో స్కూలుకి వెడతాను” అన్నాడు.

అప్పుడన్నాడు రాజారావు భార్యతో “శేఖరం చెప్పాడే, మనతో తోడుగా ఉండటానికి ఒక కుర్రాడిని మాట్లాడనని వీడెనేమో. మరీ చిన్నపిల్లడిలా ఉన్నాడు.”

సావిత్రమ్మగారు (రాజారావు భార్య) అంది “మనకేమన్నా గుళ్ళు ఎత్తాలా, గోపురాలు ఏత్తాలా, వీడు చాలులెండి” అని “ఏరా నీపేరు ఏవిటి” అని అడిగింది ఆ కుర్రాడిని.

“షణ్ముఖ శర్మ అమ్మగారు.  మా నాన్నగారు ఇక్కడ పితృకార్యాలు అవి చేయిస్తారు.  అమ్మా, అక్క ఇంట్లోనే ఉంటారు. ఇక్కడనుండి ఒక ఐదు నిమిషాలు నడిస్తే మా ఇల్లు వచ్చేస్తుంది” అన్నాడు ఆ కుర్రాడు.

అపార్టుమెంటు అయినా కిందే అడిగారు రాజారావుగారు. సావిత్రమ్మగారికి కీళ్లనెప్పులు, ఆయాసం ఉన్నాయి. ఆవిడ గురించి ఆలోచించే ఒక గదిలో ఏసిా కూడా కావాలన్నాడు.

సావిత్రమ్మగారికి షణ్ముఖుడు చాలా నచ్చాడు.  రోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే ఆవిడతో పాటు వంటింట్లో చేరిపోయేవాడు. వాడికిరాని విద్య లేదు. కూరలు తరుగుతాడు, వంట చేస్తాడు, ఆవిడకి ఉత్తర భారతదేశపు వంటలు నేర్పుతాడు, మొత్తం కాశీ లో జరిగే విశేషాలన్నీ వాడిదగ్గరే ఉంటాయి. ఆవిడకి మంచి కాలక్షేపం, సాయం కూడా. రాత్రిళ్ళు, ఆవిడకి ఏవో ఆయుర్వేద మూలికల తో చేసిన నూనెలు మద్దనా చేస్తాడు.  ఉదయం రాజారావు గారికి పడక కుర్చీ వేసి, కాఫీ తాగుతోవుంటే  పేపరు చదివి వినిపిస్తాడు.  వాడంటే ఇద్దరికీ ఒకరకమైన ప్రేమ ఏర్పడి పోయింది.  రాజారావు గారి కొడుక్కి , కూతురికి పిల్లలున్నా రాకపోకలు తక్కువ. ఎంతసేపు ఆ వీడియోలలో మాట్లాడుకోవడమే. మొత్తానికి మనవడి ప్రేమ ఇలా దొరికింది వాళ్ళకి.

ఒకరోజు సాయంత్రం షణ్ముఖుడు రాలేదు. రాజారావుగారికి రాత్రిళ్ళు కొద్దిగా బైటకి వెళ్లాలంటే చూపుతో ఇబ్బంది. అయినా  వాచ్ మన్ సాయం తిసుకుని, షణ్ముఖుడి ఇంటికి బయలుదేరాడు, సావిత్రమ్మగారి ఖంగారు పడలేక.

కొద్దిగా ఇబ్బంది కరమైనదారుల్లో సన్న సందుల్లో మొత్తానికి వాళ్ళ ఇల్లు చేరారు.  వాచ్ మన్ పిలిచాడు “ శర్మాజీ” అంటూ. నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. శర్మగారి భార్య, ఆయనని  చూస్తూనే, “రండి” అని లోపలికి పిలిచింది. శర్మగారు లోపల మంచం మీద ఉన్నారు. నెమ్మదిగా చెప్పింది శర్మ గారి భార్య. గంగలో స్నానం చేస్తూ జారిపోయారట. కాలు, చెయ్య ప్లాస్టరు వేశారు. రెండు నెలలు కదలద్దని చెప్పారట. వారి కుటుంబానికి ఆయనే సంపాదన. షణ్ముఖనికి మేము పెద్ద ఇవ్వకపోయినా వాడి ఖర్చు గడిచి పోతుందని మా ఇంట్లోనే ఉంచారు. పరిస్తితి అర్ధం అయింది రాజారావుకి. షణ్ముఖుడిని తనతో రమ్మన్నాడు. వాడికి ఒక కవరు ఇచ్చి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇమ్మని చెప్పాడు. దాంట్లో వాళ్ళ కుటుంబానికి ఒక ముడునెలలకి భుక్తికి సరిపోయే డబ్బు పెట్టాడు రాజరావు.

ఆయన పెన్షన్ గురించి కొడుకు అడగడు. ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన భార్యకే చెప్పడు. ఆవిడ అడిగితే ఇస్తాడు అంతే. ఆవిడకి పుట్టింటి ఆస్తి, ఇంకా ఆయన ఆవిడ పేరున కొన్న పొలం మీద వచ్చే సొమ్ము ఆవిడది.

మొత్తానికి మర్నాడు ఉదయం షణ్ముఖుడు వచ్చేశాడు. సావిత్రమ్మ గారికి కాళ్ళు చేతులు ఆడటం మొదలయ్యాయి. రాజారావుగారు ఉదయం ఇంటి దగ్గరే ఉన్న టి దుకాణానికి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. కొన్ని కుటుంబాలతో స్నేహం, సలహాలు సంప్రదింపులు, మంచి మాటలతో రోజులు గడిచి పోతున్నాయి. శర్మ గారి  ఆరోగ్యం కుదుటపడింది. నెమ్మదిగా వైదీకానికీ వెళ్ళటం ప్రారంభించాడు.

ఒక నెల ఉందాం అని బయలుదేరిన రాజారావుగారు, ఆర్నెల్లు ఉండేసరికి, కొడుకు రాజమండ్రి లో ఇల్లు అద్దెకి ఇచ్చేద్దాం అని వెళ్ళి, సామాను అంతా ఒక గది లో సర్ది, మిగతా పోర్షన్ అద్దెకి ఇచ్చేశాడు.

సావిత్రమ్మ గారికి కాస్త కాళ్ళ నెప్పులు తగ్గాయి, ఆయాసం కూడా చాలా నెమ్మదించినట్టే. శర్మగారి తండ్రిది ఆయుర్వేద వైద్యం . ఆయన మందులు ఆవిడకి పడ్డాయి. చూస్తూ చూస్తూ ఆరేళ్లు గడిచి పోయాయి కాశీ లో రాజారావుగారికి. నాలుగైదుసార్లు కొడుకు వచ్చి చూసి వెళ్ళాడు. వాళ్ళు అద్దెకున్న పోర్షన్ కొనేసుకున్నారు రాజారావు గారు. ఆవిధంగా కాశీ నివాసస్తులయ్యారు.

ఇంటి నుండి విశ్వేశ్వరుడి గుడికి వెళ్లాలంటే, సావిత్రమ్మగారికి, శర్మ గారి ఇల్లు ఒక మజిలీ. శర్మగారి భార్య, ఆవిడా కలసి వెళ్ళేవారు. వారం లో ఒక రెండు రోజులు గుళ్ళు గోపురాలు తిరిగేది. కాశీ నుండి మొదలు పెట్టి చుట్టుపక్కలవున్న ప్రదేశాలన్నీ రాజారావు గారితో తిరిగింది.

ఇంక ఇద్దరికీ ఓపికలు తగ్గుతున్నాయి.  స్నేహితులు, రాజారావుగారి ఇంటి బైట రెండు సోఫాలేసుకుని కూర్చుని కబుర్లు చెప్పేవారు. షణ్ముఖుడు ఇంజనీరింగ్ లో చేరాడు. శర్మగారు ఆయన బార్య తమ్ముడి కూతురు సీతని, రాజారావు గారి ఇంట్లో కుదిర్చాడు.  సరుకులు, కూరలు ఫోన్లో చెబితే తెస్తున్నారు. వారానికి నాలుగు రోజులు శర్మగారింటి నుండి భోజనం వస్తోంది. చనువు ఎంతగా పెరిగిందంటే, ఈరోజు భోజనం నువ్వు పంపేయి అని చెప్పవారు సావిత్రమ్మగారు ఫోన్ చేసి.

షణ్ముఖుడి చదువు సంధ్య అంతా రాజారావు గారే చూసుకునేవారు.  శర్మ గారి అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. కాశీ లో కుటుంబమే. వాళ్ళు అక్కడి వాళ్ళే. మొత్తానికి రాజారావుగారి సాయం తో పెళ్లి చేసేశాడు శర్మగారు.

శర్మ గారి తండ్రి ఈమద్య కాలం చేశారు. షణ్ముఖుడి ఇంజనీరింగ్ పూర్తి అయ్యింది. సావిత్రమ్మ గారికి ఆయాసం పెరిగింది. అల్లోపతీ డాక్టరు వచ్చి చూసి పోతున్నాడు. వయసు అయిపోయింది, గుండె బలహీనం గా ఉంది. ఏదైనా పెద్ద ఆస్పత్రి లో చేర్పించమని సలహా ఇచ్చాడు. సావిత్రమ్మ గారు ససేమిరా అంది. నన్ను ప్రశాంతంగా పోనివ్వండి, ఆ సూదులు, మత్తుమందులు వద్దని గొడవ చేసింది రాజారావుగారితో. పది రోజులు కాకుండానే, రాజారావుగారిని వంటరిగా వదిలేసి ఆవిడ వెళ్లిపోయింది. చిత్రం, ఆవిడ పోయేముందు కూడా షణ్ముఖుడినే తలుచుకుంది కానీ సొంతపిల్లల గురించి అనుకోలేదు. కొడుకు, కోడలు, మనవలు వచ్చారు. కూతురు వీడియో లో చూసి శోకాలు పెట్టింది. పదోరోజులోపు వస్తున్నా అని చెప్పింది. కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. కూతురు, తండ్రిని అమెరికా వచ్చెయ్యమంది. డభై ఏళ్ల వయసులో వైధవ్యం అంటే చాలా కష్టకాలం వచ్చినట్టే.

కొడుకు రాజారావుగారికి నచ్చచెప్పి, విశాఖపట్నం తీసుకుపోయాడు. ఆయన కారు షణ్ముగాన్ని వాడుకోమని ఉంచేశారు. ఆయన వేడుతోంటే కనీసం ఒక వందమంది వచ్చారు, వీడ్కోలు చెప్పడానికి. అందరూ ఒకటే మాట త్వరగా వచ్చ్హెయ్యండి అని.

కొడుకు ఇల్లు చాలా పెద్దది, ఐదు బెడ్ రూములు ఉన్నాయి. ఒక అవుట్ హావుసు కూడా ఉంది. ఈ పదిఏళ్లల్లో ఒక మంచి ఇండిపెండెంట్ హోవుసు కట్టాడు రాజారావుగారి కొడుకు. ఆయనని అడిగితే అవుట్ హావుస్ లో ఉంటానన్నాడు.

తెల్లారింది. నెమ్మదిగా లేచి గడియారం చూశాడు రాజారావుగారు. అప్పుడే పది అయ్యింది. కడుపంతా ఖాళీగా వుంది. నెమ్మదిగా లేచి మొహం కడుక్కుని, ఇంట్లోకి వెళ్ళాడు. మావయ్య లేచావా అంటూ కోడలు కాఫి తీసుకొచ్చింది. డీకాషన్ ఎక్కువ తాగుతారు అనుకుంటా వీళ్ళు. నెమ్మదిగా విషం మింగినట్టు మింగి బయలు దేరాడు తన గదికి. స్నానం చేసి వచ్చి, కాశీ నుండి తెచ్చుకున్న భార్య దేముడి సామాను నెమ్మదిగా ఒక ములా పేర్చి, ఒక నమస్కారం చేశాడు. వీళ్ళ టైమింగులు ఏమిటో తెలీదు, ఆకలి దంచేస్తోంది అనుకుంటూ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి, సోఫాలో పేపరు తిరగెస్తు కూర్చున్నాడు.  నెమ్మదిగా ఉప్మా తీసుకు వచ్చింది కోడలు. అసలు పెళ్ళైన తరువాత ఒక్కసారి చేసింది సావిత్రమ్మ గారు ఉప్మా, ఆయన చూసిన చూపుకు, మళ్ళీ ఉప్మా చెయ్యలే. ఒకవేళ చేసినా ఆయనకి వేరే టిఫిన్ చేసేది. రాజారావుగారు మాట్లాడలేదు, నెమ్మదిగా అది దిగమింగి తన గదికి వేడిపోయాడు.

సహజంగా మనుషులు రెండు రకాలు. ఒకళ్ళు, ఎదుటి వాళ్ళు మనలా మారిపోవాలి అని కోరుకునేవాళ్లు. రెండు ఎదుటి వారిలా మనం మారిపోదాం అనుకూనే వాళ్ళు. సావిత్రమ్మ గారు రెండో రకం అయితే, కోడలు మొదటి రకం. రాజారావు గారికి వచ్చిన వారనికే పులి తెనుపులు, కడుపులో మంట మొదలయ్యాయి. కొడుకింట్లో రాత్రి ఒంటి గంటకి పడుకుంటారు, ఉదయం ఎనిమిది దాకా లేవరు. టిఫిన్ పది గంటలకి, భోజనం మద్యాహ్నం రెండు గంటలకి , రాత్రి పదింటికి మొదలుపెట్టి ఎవరికి కావలసినది వాళ్ళే ప్లేటులో పెట్టుకు పదకొండు దాకా తింటారు. ఎవరి బట్టలు వాళ్లే మిషన్ లో వేసుకుని ఆరేసుకుంటారు. ఆయనకి ఈ అలవాట్లు లేవు. కాశీ లో సీత ఉండేది, అన్నీ అదే చేసేది, ఐరన్ కూడా. రాజారావుగారి కి ఏదో వంకన భార్య మళ్ళీ కిందకి వచ్చేస్తే బావుంటుందనిపించింది.

ఒక నెలలో రాజారావు గారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక ఆదివారం, ఆరు గంటలకి లేచి కొడుకు ఇంట్లోకి వెడదామని చూస్తే ఎవరూ లేవలేదు. అప్పుడు గుర్తొచ్చింది. ఆదివారం, పదకొండు అయితే గాని లేవరని. నెమ్మదిగా చిల్లర జేబులో వేసుకుని, వీధి చివర టీ కొట్టు కి బయలుదేరి ఒక టీ తాగి మళ్ళీ తన గదికి చేరుకున్నారు. ఒకసారి సద్దిన సామానులు, టికెట్ చూసుకున్నారు. సంతృప్తిగా నవ్వుకున్నారు.

మొత్తానికి ఒంటి గంటకి మనవడొచ్చి పిలిచాడు, తాతగారు టిఫిన్ అంటూ. రాజారావుగారు సోఫాలో కూర్చుని కొడుకుని, కొడలిని పిలిచాడు. నెమ్మదిగా అన్నాడు, “శేఖరం, మీ అమ్మ బాగా గుర్తొస్తోందిరా. కొన్నాళ్లు కాశీ వెళ్ళి ఉండాలని ఉంది. మళ్ళీ వస్తాలే ఒక నెలా రెండు నెలల్లో” అని. ఆయనకి తెలుసు ఇంక రాడని. “సరే నాన్న టికెట్ బుక్ చేస్తాలే, మరి అక్కడ భోజనం అది ఎలా” అన్నాడు కొడుకు. ఆయన నవ్వి, “షణ్ముగం ఉన్నాడుకదరా వాడే చూస్తాడులే ఏదో ఒకటి. టికెట్ షణ్ముగం బుక్ చేశాడు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లయిట్. వాడు అక్కడ నన్ను తీసుకెడటానికి వస్తాడు” అన్నాడు రాజారావు గారు. కొడుక్కి అనిపించింది, నాన్న వెళ్ళట్లేదేమో, పారిపోతున్నాడేమో అని. నిజమే ఆయన పారిపోతున్నాడు.

మొత్తానికి షణ్ముగం వచ్చి తీసుకెళ్ళాడు, ఆయన కారులోనే. ఇంట్లోకి వెళ్ళగానే కళ్ల నీళ్ళు తిరిగాయి సావిత్రి గుర్తుకి వచ్చి ఆయనకి. అంతలోనే ఏడు అయ్యిందో లేదో వేడి వేడి పూరీలు, కూర, ఒక గ్లాసు మజ్జిగ తో వచ్చింది సీతా, తాతగారు భోజనం అంటూ.

కాశీ గాలికేమో, ఆరింటికే మెళుకువ వచ్చేసింది రాజారావుగారికి. అలా లేచాడో లేదో, కాఫీ తాతగారు అంటూ వచ్చింది సీత. రాజారావుగారు, రాజుమాదిరిగానే, విశాన్ని మింగుదామని నోట్లో పెట్టుకున్నాడు. సన్నగా నవ్వొచ్చింది. మాటలా మరి సీతకి ట్రైనింగ్ ఇచ్చినదేవరు, సావిత్రమ్మగారు.

ఏంటో జీవితం అంటే భయం పోయినట్టనిపించింది రాజారావుగారికి. అప్పుడన్నాడు సీతతో, “సీతా నాకు కూడా వంట నేర్పరా” అని. “అదేంటి తాతా నేవున్నాగా చేసిపెడతా” అంది. “లేదులే, నేర్చుకొనీ, నీ పెళ్లయ్యాకా కూడా నే బతికే ఉంటే” అని పెద్దగా నవ్వాడు రాజారావు. అప్పుడే వచ్చిన షణ్ముగం అన్నాడు “అదెక్కడికి పోతుందిలే, పెళ్లైనా తాత దగ్గరే ఉంటుందిలే, నాతోపాటు” అని మరదలిని చూసి నవ్వుతూ.

ఒక వయసు దాటాక మన సమస్యలు, అలవాట్లు తెలుసున్నవాళ్ళు వెళ్ళిపోతే ఆ నరకం ఏమిటో ఒంటరి మగాడికి తెలిసినంతగా ఒంటరి ఆడవాళ్ళకి తెలియదు.  భార్య కంటే భర్త ముందుపోవడం లో ఉన్న సుఖం ఒంటరి మగవాడికే అర్ధం అవుతుంది.   

శిక్ష- కధ



ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లడు పొగ త్రాగడం  నేర్చుకున్నాడు 

15 ఏళ్లకే  మందు తాగడం నేర్చుకున్నాడు

ఎలాగోలా స్కూల్  చదువు నుండి కాలేజీ కి వచ్చాడు

అక్కడ పేకాట  పడుచుపిల్లల్తో  ఆటలు నేర్చుకున్నాడు.

దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది.

20 ఏళ్ళకే డబ్బుకోసం దొంగతనం నేర్చుకున్నాడు.

అది సరిపోక  హత్యలు చేయడము  మొదలెట్టాడు.

దొంగ ఎన్ని రోజులో  దొరలాగా  తిరగలేడు కదా...

ఒకరోజు దొరికిపోయాడు.

మూడేళ్ళ విచారణ  తరువాత అతనికి ఉరిశిక్ష  పడింది.

మళ్ళీ ఎన్ని అప్పీళ్లు  పెట్టుకున్న అవన్నీ  కొట్టేసి  ఉరిశిక్షనే ఖరారూ చేసీ ఆ    రోజును చెప్పేసారు

చివరగా  అతని కోరిక ఏమని అడగగా

 తన తల్లిదండ్రులను చూడాలని కోరాడు 

అతని కోరిక మేరకు వారిని పిలిపించారు 

కన్నవాళ్ళు కదా  కన్నపిల్లలు రాక్షసులైన  ప్రేమిస్తారు 

పోలీసులు  లాయర్లు  సాక్షులు  అందరూ మోసం చేసి నీ ఉరికి  కారణమయ్యారని  ఏడ్చారు తల్లి తండ్రులు

అప్పుడు అతను వారు కాదు నా మరణానికి  కారణం మీరే అని చెప్పాడు

ఐదేళ్ల వయసులో ఉపాధ్యాయుడు  కొట్టడాడని చెప్పగానే బంధువులతో కలిసి వెళ్లి పోలీస్ కంప్లైంట్  చేసి మరి అతన్ని నిందించారు.

అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం

ఈరోజు ఉరితాడు  నా మెడకు  రావడానికి  కారణం మీరే అని కంటతడి పెట్టాడు

ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు 

చిన్న తప్పులే కదా అని వెనుకేసుకురాకండి అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి..🙏🏻💐💐💐

భయానక సమయం... జరభద్రం.



(✍ఈ నాలుగు మాటలు జాగ్రత్తగా చదవండి✍)

ఇది చాలా విషమ పరిస్థితి. ముఖ్యంగా నగరాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

👉మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం. టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు లక్షల్లో మనమధ్యే ఉన్నారు.

👉దయచేసి ఎవరి ఇంటికి వెళ్ళకండి. తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి. చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి. ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి.

👉ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి. చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి. ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడి వెళ్ళండి.

👉అంతేకానీ చొరవతో తగుదునమ్మా అంటూ నేరుగా కిచెన్ లోకి, బెడ్ రూమ్ లోకి వెళ్లి, ఏమిటి కబుర్లు అంటూ సొల్లు విషయాలు మాట్లాడకండి. వారు మొహమాటంతో ఆ సమయంలో మిమ్మల్ని ఏమీ అనకపోయినా, మీరు వెళ్లి పోయిన తర్వాత మిమ్మల్ని తిట్టుకోవడం ఖాయం.

👉వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా...మీరు గౌరవంగా...పర్వాలేదు మరో సారి వస్తానని చెప్పి వెళ్ళండి.
అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు.

👉మీరు వారికి ఎంత ప్రాణ స్నేహితులైనా కావచ్చు. లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు. వారిని ఎట్టి పరిస్థితుల్లో కలవకండి.

👉ఇక ఇరుగుపొరుగువారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి. అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి. ఈ ఇచ్చి పుచ్చుకోవడాలు కొంతకాలం ఆపేయండి. ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి.

👉స్నేహితులతో కలిసి మందు పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి. ఈ మద్యం పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

👉అవసరం లేకపోయినా రోడ్డుమీదకు వెళ్ళకండి. వాకింగ్ కూడా మానేయండి. ఇంట్లో యోగ, మెడిటేషన్, వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేయండి.

👉నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే.

సర్వేజనా సుఖినోభవంతు
🙏🏻🙏🏻🙏🏻

మాట జాగ్రత్త.*

*పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే మనుషులు నాలుక కారణంగా చిక్కుల్లో పడతారు. అందుకే మాట జాగ్రత్త.*

*కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసినవాడు పక్కనోడిని దోచుకోడు.*
*ఇవ్వడంలో ఉన్న ఆనందం ఎరిగినవాడు ఉన్నది దాచుకోడు.*

*నీఅంగీకారం లేకుండా నీ ఆత్మ గౌరవాన్ని ఎవరు తగ్గించలేరు.*

*శాంతంగా వుండేవారి మనసు*   
*స్వర్గంలా వుంటుంది.*

*తనకంటే.చిన్నవారిని ఆదరించడం వల్ల ఒక పెద్దమనిషి గొప్పతనం తెలుస్తుంది..*

*గెలవాలన్న తపన గెలవగలనన్న నమ్మకం నిరంతరసాదన ఈమూడే నిన్ను గెలుపుకు దగ్గర చేస్తాయి..*

*జారిన మాట  గతించిన కాలం పోగొట్టుకున్న ఆవకాశం తిరిగి లభించవు.*

అవార్డులు,రివార్డులు మనజీవితానికి కొలబద్ద కాదు.మనం మనతో ఎంత ఉన్నాం అన్నదే అసలైన అవార్డు రివార్డు..

అంతా రామమయం

అంతా రామమయం !.. మన బతుకంతా రామమయం* !!

ఒక దేశానికి, జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే *రామాయణం.*

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ *రాముడు మనవెంట నడిచిన దేవుడు !*

మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన *ఆదర్శ పురుషుడు.*

మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన *అద్దం రాముడు.*

ధర్మం పోత పోస్తే *రాముడు !*

ఆదర్శాలు రూపుకడితే *రాముడు !*

అందం పోగుపోస్తే *రాముడు !*

ఆనందం నడిస్తే *రాముడు !*

వేదోపనిషత్తులకు అర్థం *రాముడు !*

మంత్రమూర్తి *రాముడు !*

పరబ్రహ్మం *రాముడు !*

లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు *రాముడు !*

ఎప్పటి త్రేతాయుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ??
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా *రాముడే.*

చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట - *శ్రీరామరక్ష సర్వజగద్రక్ష !*

బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట - *రామాలాలి - మేఘశ్యామా లాలి.*

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు *శ్రీరామ రక్ష - సర్వ జగద్రక్ష.*

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - *అయ్యో రామా.*

వినకూడని మాట వింటే అనాల్సిన మాట - *రామ రామ.*

భరించలేని కష్టానికి పర్యాయపదం - *రాముడి కష్టం.*

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - *రాముడు.*

కష్టం గట్టెక్కే తారక మంత్రం - *శ్రీరామ.*

విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - *శ్రీరామ శ్రీరామ శ్రీరామ.*

అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - *అన్నమో రామచంద్రా !*

వయసుడిగిన వేళ అనాల్సిన మాట - *కృష్ణా రామా !*

తిరుగులేని మాటకు - *రామబాణం.*

సకల సుఖశాంతులకు - *రామరాజ్యం.*

ఆదర్శమయిన పాలనకు - *రాముడి పాలన.*

ఆజానుబాహుడి పోలికకు - *రాముడు.*

అన్నిప్రాణులను సమంగా చూసేవాడు - *రాముడు.*

*రాముడు* ఎప్పుడూ మంచి బాలుడే.

చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా  - *రామా కిల్డ్ రావణ* ; *రావణ వాజ్ కిల్డ్ బై రామా.*

ఆదర్శ దాంపత్యానికి - *సీతారాములు.*

గొప్ప కొడుకు - *రాముడు.*

అన్నదమ్ముల అనుబంధానికి - *రామలక్ష్మణులు.*

గొప్ప విద్యార్ధి - *రాముడు* (వసిష్ఠ , విశ్వామిత్రలు చెప్పారు).

మంచి మిత్రుడు - *రాముడు* (గుహుడు చెప్పాడు).

మంచి స్వామి *రాముడు* (హనుమ చెప్పారు).

సంగీత సారం *రాముడు* (రామదాసు, త్యాగయ్య చెప్పారు).

నాలుకమీదుగా తాగాల్సిన నామం *రాముడు* ( పిబరే రామ రసం - సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు).

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - *రాముడు.*

నోరున్నందుకు పలకాల్సిన నామం - *రాముడు.*

చెవులున్నందుకు వినాల్సిన కథ - *రాముడు.*

చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - *రాముడు.*

జన్మ తరించడానికి - *రాముడు, రాముడు, రాముడు.*

*రామాయణం పలుకుబళ్లు*

మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో *రామాయణం* ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే.

ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా *రామాయణం* విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది.

చెప్పడానికి వీలుకాకపోతే - అబ్బో అదొక *రామాయణం.*

జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - *సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ.*

ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక *పుష్పకవిమానం.*

కబళించే చేతులు, చేష్ఠలు - *కబంధ హస్తాలు.*

వికారంగా ఉంటే - *శూర్పణఖ.*

చూసిరమ్మంటే కాల్చి రావడం - *హనుమ.*

పెద్ద పెద్ద అడుగులు వేస్తే - *అంగదుడి అంగలు.*

మెలకువలేని నిద్ర - *కుంభకర్ణ నిద్ర.*

పెద్ద ఇల్లు - *లంకంత ఇల్లు.*

ఎంగిలిచేసి పెడితే - *శబరి.*

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - *ఋష్యశృంగుడు.*

అల్లరి మూకలకు నిలయం - *కిష్కింధ కాండ.*

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - *అగ్ని పరీక్షలే.*

పితూరీలు చెప్పేవారందరూ - *మంథరలే.*

యుద్ధమంటే - *రామరావణ యుద్ధమే.*

ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - *రావణ కాష్ఠాలే !*

కొడితే బుర్ర *రామకీర్తన* పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు.

బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు.

ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.

ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు.

ఒక ఊళ్లో నీళ్ళు తాగి ఉంటారు.

ఒంటిమిట్టది ఒక కథ..

భద్రాద్రిది ఒక కథ...

అసలు రామాయణమే మన కథ.

*అది రాస్తే రామాయణం - చెబితే మహా భారతం.*

శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయం, దువ్వ

💐💐💐💐

ఈ ఆలయాన్ని 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. 1967 కి ముందు వనదేవత దానమ్మ రూపంలో భక్తులు పూజించే చెట్టు ఉండేది. ఈ చెట్టు 1967 లో కూలిపోయింది. అప్పుడు స్థానిక భక్తులు ఒక ఆలయాన్ని నిర్మించి శ్రీ దనేశ్వరి అమ్మవరును స్థాపించారు. ప్రధాన దేవత పక్కన సరస్వతి దేవి మరియు లక్ష్మీ దేవి దేవాలయాలు ఉన్నాయి. ప్రధాన ద్వారం తరువాత కోనేరు ఉంది.

దుర్వాస మహర్షి ఇక్కడ యజ్ఞం చేశాడని నమ్ముతారు. యజ్ఞం చేస్తున్నప్పుడు ఒక దైవిక శక్తి అగ్ని నుండి ప్రసాదంగా బయటకు వచ్చి ధన్యేశ్వరి అమ్మవారు అని నమ్ముతారు మరియు తరువాత దీనిని దానేశ్వరిగా మార్చారు. దుర్వాస మహర్షి  ఇక్కడ తపస్సు చేయడంతో ఈ ప్రదేశాన్ని దుర్వాసపురి అని పిలుస్తారు మరియు తరువాత దీనిని దువ్వాగా మార్చారు.

శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు అనేక నామాలతో పిలవబడుతూ .. అనేక రూపాల్లో కొలవబడుతూ వుంటుంది. అలా అమ్మవారు 'దానేశ్వరి'గా పిలవబడుతోన్న క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా 'దువ్వ'లో కనిపిస్తుంది. ఇక్కడి ఆలయ ప్రాకారాలపై అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటుంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి కనిపిస్తుంది.

గర్భాలయంలో అమ్మవారి మూర్తి చాలా చిన్నదిగా దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి మహిమలు అపారమని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. చాలాకాలం క్రితం అమ్మవారు ఇక్కడ 'ధాన్యేశ్వరి'గా పూజలు అందుకునేదట. అమ్మవారిని పూజించడం వలన ధన ధాన్యాలకు లోటు ఉండదని భక్తులు విశ్వసిస్తుంటారు.

కాలక్రమంలో అమ్మవారు 'దానేశ్వరి'గా పిలబడుతోంది. ఇప్పటికీ అమ్మవారిని 'వనదేవత'గానే ఆరాధిస్తుంటారు. వానలు కురిసేది .. పంటలు బాగా పండేది .. సంపదలు వృద్ధి చెందేది ఈ అమ్మవారి అనుగ్రహం వల్లనే అని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి వైశాఖ మసంలో 5 రోజులు జరుపుకునే బ్రహ్మోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. దువ్వలో దానేశ్వరి అమ్మవారి ఆలయానికి ఏటా రూ. కోటికి పైగా ఆదాయం వస్తుంది. జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆమె అనుగ్రహం పొందుతుంటారు.

రోడ్డు మార్గం ద్వారా
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన ప్రదేశాల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయానికి సమీప పట్టణాలు అయిన తనుకు (12 కి.మీ) మరియు ఎలురు (70 కి.మీ) నుండి తరచుగా బస్సులు నడుస్తాయి.

రైలులో సమీప రైల్వే స్టేషన్ 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న తనకు రైల్వే స్టేషన్. ఆలయానికి చేరుకోవడానికి బస్సులు అందుబాటులో ఉన్నాయి.

సమీప విమానాశ్రయం 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి విమానాశ్రయం. ఆలయానికి చేరుకోవడానికి బస్సు, టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి.
పూర్తి సేకరణ.