1, జులై 2025, మంగళవారం

కలియుగ దైవాలు ""

 సందర్భం; జూలై...1...ప్రపంచ వైద్యుల దినోత్సవం

కవితాశీర్షిక;

    "" కలియుగ దైవాలు ""


శ్వేతవర్ణపు దుస్తులతో

మెడలో స్టేతస్కోపుతో

మోముపై చిరునవ్వుతో

మది నిండా ఆత్మస్తైర్యంతో

మానవసేవే మాధవసేవ అనే తలంపుతో

ఆరోగ్యమే మహాభాగ్యమనే దృక్పధంతో

ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆరోగ్య ప్రదాతలు వైద్యులు!

కొందరికి కొందరే దేవుళ్ళు

జనులందరికి కలియుగ దైవాలు వైద్యులు!

సంస్కరవంతులైన వైద్యులకు

నమస్కారములు సమర్పిద్దాం

కుసంస్కరులైన వైద్యులను

ఛీత్కారాలతో తిరస్కరిద్దాం!

సృస్తికర్త ఆ బ్రహ్మ

ప్రతిసృష్టికర్త ఈ అపరబ్రహ్మ

ఆయన రాసేది తలరాత

ఈయన తిరగరాస్తాడు ఆ రాత

పోయే ప్రాణాలని అవుతాడు

జీవితకాలాన్ని పెంచుతాడు!

ఈ కరోనా కష్ట కాలంలో

ప్రాణాలను ఫణంగా పెట్టి

నిరంతరం సేవలందించే వైద్యులకు

వైద్యోనారాయనో హరి అంటూ

కలియుగ దైవాలైన వైద్యులకు

పాదాభివందనములు సమర్పిద్దాం!

............................................రచన

ఆళ్ల నాగేశ్వరరావు

తెనాలి

గుంటూరు...జిల్లా

ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం

సెల్ నెంబర్.7416638823

.........................................

పై వచనకవిత నా స్వీయారచనేనని హామీ ఇస్తున్నాను

భవభూతి మహాకవి

 🙏భవభూతి మహాకవి🙏

భవభూతి పేరు తలచుకుంటే చాలు ఒళ్ళు పులకరిస్తుంది. విలక్షణము విశేష ప్రజ్ఞ కలిగిన కవి.

నాటకాలలో లక్షణ శాస్త్ర ప్రకారం ప్రధాన రసం శృంగారరసం గాని వీర రసం ఉండాలి మిగిలిన రసాలు అంగ రసాలు గానే ఉండాలి ప్రధాన రసంగా ఉండకూడదు. కానీ భవభూతి కరుణ రసాన్ని ప్రధానం చేసి ఉత్తరరామ చరిత్ర నాటకం వ్రాశాడు. లాక్షణికులు విమర్శించినా లెక్కచేయలేదు. అయితే నాటక ప్రపంచంలో అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు గడించింది. నూతన ప్రయోగం చేసి విజయం సాధించిన ఘనుడు భవభూతి.

సంస్కృత మహాకవుల ఘనసంప్రదాయ పరంపరలో వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, బాణుడు, దండి, భాసుడు, మొదలైన అద్భుత శారదా సంతతిలో ఒక దివ్యకర్పూరకళిక భవభూతి మహాకవి ఒకరు.

ఈ ఉత్తర రామాయణాన్ని భవభూతి ఆయన ఒక చోట కరుణ రసం ఒక్కటే రసం అని చెప్పాడు.


 శ్లోకం. ఏకో రస కరుణ ఏవ నివర్తి ఖేదా

     భిన్న పృథగ్ పృథగి వాశ్రయతే వివర్తా

   ఆవర్త బుద్బుద తరంగ మాయాన్ వికారాస్

     అంభో యధా సలిల మే వహి తత్సమస్తం


కరుణకు భావస్థాయి శోకం. ఎందుకంటే వాల్మీకి మొదటి శ్లోకం 

“మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః|


యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం||”


ఓ కిరాతుడా! కామమోహితమైన క్రౌంచమిథునం లోని ఒక పక్షిని చంపి, నీవు శాశ్వతమైన అపకీర్తిని పొందావు, అంటూ శోకతప్త హృదయుడైన వాల్మీకి తన ఆశ్రమానికి చేరుకున్నాడు. కాని తన మనస్సును కరుణరస పూరితమైన దృశ్యంనుండి మరల్చుకోలేక మథనపడసాగాడు. అతని మానసికస్థితిని గమనించిన బ్రహ్మ, వాల్మీకితో ‘నీవు శోకంతో ఉచ్చరించినది ఛందోబద్ధమైన శ్లోకమైంది. నీవు రామచరితమును రచింపుము. అది పర్వతాలు, నదులు ఉన్నంతవరకు శాశ్వతకీర్తిని సంపాదిస్తుంది’ అన్నాడు

 వాల్మీకి మొదటి శ్లోకం కరుణ నుంచే ఉద్భవించింది. దాశరధీ కరుణా పయోనిధీ అని జనులు రాముడ్ని ప్రార్ధించడం అందుకే. ఈ ఉత్తర రామాయణంలో సీతా రాముల వియోగం, నిర్యాణం కారణంగా కరుణ రసం పతాక స్థాయిలో ఉంది. తిక్కన సోమయాజి నిర్వచనోత్తమ రామాయణం ( వచనం లేని, కేవలం పద్యకావ్యం) రచించాడు. తరువాత కంకంటి పాపరాజు ఉత్తర రామాయణాన్ని చంపూ కావ్యంగా రాసాడు. నిజంగానే కవి అనేవాడు రాముడి మాట తలవకుండా ఉండలేడు. అంత శక్తి ఆకర్షణ ఉన్నవాడు రాముడు.

భవభూతి పేరు నుంచి ఆయన కాలం నిర్ణయంవరకు అన్నీ నిర్వివాదంగా చెప్పడం కష్టమనేచెప్పాలి. వీరు దక్షిణ భారతదేశంలోని పద్మపురంలో, వైదిక అనుష్ఠానపరులైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టేరు. వాజపేయయాగం చేసిన ఒక మహాకవి వీరి వంశపరంపరకి చెందినవారని చరిత్ర చెపుతోంది. ఈ వాజపేయ యాజివర్యుల తరంనుంచి లెక్కిస్తే భవభూతి ఐదవతరానికి చెందినవాడు. ఆ పరంపరలో భట్టగోపాలురవారు జన్మించేరు. వీరు వైదిక, లౌకిక విద్యలలో ఆరితేరి,అఖండఖ్యాతిని ఆర్జించేరు. వీరి పుత్రుడు నీలకంఠుడు కూడా తండ్రి అడుగుజాడలలో నడిచి అంతగానూ గణుతికెక్కేడు. నీలకంఠుడి కుమారుడే భవభూతి. ఐతే భవభూతి అసలుపేరు శ్రీకంఠుడు అనే వాదంవుంది. కొన్నిచాటూక్తులవల్ల ఇది నిజమేమోననిపిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం:—


“తపస్వీ కాం గతోsవస్థాం

ఇతి స్మేరాననావివ |

గిరిజాయాః స్తనౌ వన్దే

భవభూతి సితాననౌ” ||


“భవాత్ శంకరాద్వా భూతిః కావ్యనిర్మాణ దక్షతా విభూతిః ప్రజ్ఞా వా

సంప్రాప్తత్వేన భవభూతిరితి” |


“భవుడు అంటే శంకరునినుంచి, కావ్యనిర్మాణదక్షత అనే ఐశ్వర్యం లేక ప్రజ్ఞని పొందడంచేత భవభూతి అనే (పేరు వచ్చింది).” అని కొందరు నిర్వచించేరు.


భవభూతి తనరూపకాలు కాలప్రియానాథదేవ మహోత్సవాలలో భాగంగా ప్రదర్శితమైనట్లు చెప్పేడు. ఈ దేవుడు యమునాతీరంలోని “కాల్పి” లేక ‘కాలప్రియ’ లోవున్న సూర్యదేవుడని చరిత్ర నిర్ణయం.

సంస్కృతకవి ఐన భవభూతి, ప్రాకృత కవి ఐన వాక్పతిరాజు సమకాలికులే కాక వీరిద్దరూ యశోవర్మమహారాజు పాలించిన కనోజురాజ్యంలో ఆస్థానకవులుగా ప్రశస్తి పొందేరని చరిత్ర చెపుతోంది. వాక్పతిరాజు, భవభూతి రచనలగురించి ఇలాగ అన్నాడు:—


“సాగరసదృశాలైన భవభూతి రచనలు ఆఖ్యానరచనకు మార్గదర్శకాలు“. భవభూతి గురువు “జ్ఞాననిధిపరమహంస” అని తెలుస్తూంది. భవభూతి సాహిత్యంలోనేకాక వేద, వేదాంగాలలోను, వివిధశాస్త్రాలలోను అపారజ్ఞానం కలవాడు. ఆయన సాహిత్యంలో అనేకగ్రంథాలు రచించడమేకాక, అనేకశాస్త్రగ్రంథాలుకూడా వ్రాసిన దాఖలాలువున్నా,

1. “మహావీరచరితమ్ ” |

2. “మాలతీమాధవమ్ ” |

3. “ఉత్తరరామచరితమ్ ” |

అనే ఈ మూడు గ్రంథాలు మాత్రమే మనకి మిగిలేయి. మిగిలిన గ్రంథాలలోని శ్లోకాదులు అనేక ఇతర రచయితల రచనలలో ప్రాస్తావికంగానో లేక ఉదాహరణప్రాయంగానో మనలని పలకరిస్తాయి. వారి “మహావీరచరితమ్ ” రాముడి కథనే ఉత్తరకాణ్డ ముందు జరిగినది నాటకంగా మలచి మనముందుంచింది. “ఉత్తరరామచరితమ్ “లో వాల్మీకి ఉత్తరకాండలోని కథనే దృశ్యకావ్యరూపంలోపరమరమణీయంగా భవభూతి మనకి అందించేడు. కాళిదాసు, భవభూతి, భాసుడు,శూద్రకుడు వంటి నాటకకర్తలు సంస్కృత సాహిత్యంలో విశేష ఖ్యాతి గడించారు.. సోమదేవుడు, ధనంజయుడు, కుంతకుడు, క్షేమేంద్రుడు, మమ్మటుడు, మహిమభట్టు మొదలైనవారెందరో కవులు, లాక్షణికులు భవభూతిని శ్లాఘించి, వారి రచనలలోని అనేక శ్లోకాలని తమ-తమ గ్రంథాలలో ఉదాహరణాత్మకంగా వినియోగించుకున్నారు. వీటి అన్నింటిని అనుసరించి చూస్తే భవభూతి రచనాకాలం క్రీ.శ.700—730 ప్రాంతంగా చరిత్ర నిర్ణయం చేసింది. కవి,లాక్షణికుడు ఐన రాజశేఖరుడు తాను భవభూతికి అపరావతారంగా వర్ణించుకునేస్థాయికి, ఆయనకి భవభూతి పట్ల ఆరాధనాభావం వుంది.


తన తరవాత కాలంలో ఎంతో కీర్తి, ప్రతిష్ఠలు పొందిన భవభూతి, తన జీవితకాలంలో జనబాహుళ్యంలోను, రాజాస్థానాలలోను, సమకాలీన కవులలోను కూడా పేరు -ప్రఖ్యాతులు సంపాదించేడు. కాని కొందరు విమర్శకులు లేక రంధ్రాన్వేషకుల కాఠిన్యానికికూడా ఆయన గురి ఐనట్లు ఆయన రచనలలోని వారి ప్రతిస్పందనలు నిరూపిస్తున్నాయి. కవులకి, కళాకారులకి చరిత్రలో ఇవి క్రొత్త అంశాలు ఏమాత్రమూకాదు. మహాకవి భవభూతి మహామృదుహృదయుడు కావడంవల్ల వాటికి అంతగా నొచ్చుకున్నాడు. ఆయన బోధ, సందేశము మాత్రం అనితర సాధ్యమైన పని.


వాల్మీకి రామాయణంలోని ఉత్తర రామాయణ కథను ఇతివృత్తంగా గ్రహించిన భవభూతి ఆ మూలకథలో అనేక మార్పులు ప్రవేశపెడుతూ, కొత్త పాత్రలను కల్పిస్తూ, కొత్త కల్పనలను చేరుస్తూ ఉత్తరరామచరిత్ర నాటకాన్ని అద్వితీయంగా రచించాడు. మూలకథకు భిన్నంగా ఉత్తరరామచరిత్ర నాటకంలో సృష్టించిబడిన ప్రధాన మార్పులు, కల్పనలు చూద్దాము.


వాల్మీకి ఉత్తరరామాయణ కథ సీతా మరణంతో విషాదాంతం కాగా భవభూతి 'ఉత్తరరామచరిత్ర' సీతారాముల పునఃకలయికతో సుఖాంతం అవుతుంది.

వాల్మీకి ఉత్తరరామాయణ కథ సీతా ప్రాధాన్యంతో సీతా చరిత్రగా కొనసాగితే, భవభూతి 'ఉత్తరరామచరిత్ర' రాముడు ప్రధానంగా రామచరిత్రగా కొనసాగుతుంది.

మూలకథలో లేని ఆత్రేయి, తరళ, వాసంతి, తమస వంటి కొత్త పాత్రలు నాటకీయత కొరకు ఉత్తరరామచరిత్రలో కల్పించబడ్డాయి.

మూలకథకు భిన్నంగా కొత్త సన్నివేశాలను కల్పించబడ్డాయి: ఉదాహరణకు

వాల్మీకి ఆశ్రమంలో విదిచిపెట్టబడిన సీత గంగానదిలో దూకడం, గంగానదిలోనే ప్రసవించడం,

పాతాళలోకంలో సీత ఎవరికీ కనబడకుండా వుండటం,

పాతాళలోకంలో సీత భూదేవి, గంగలతో కలసి వుండటం,

రాముని విరహవేదనను, సీతావియోగ విలాపాన్ని అత్యంత కరుణరసభరితంగా వర్ణించడం

బాలుడైన చంద్రకేతువును యాగాశ్వానికి రక్షణగా పంపడం

సీతారాముల కలయిక సన్నివేశం మొదలైనవి

.

నభూతో నభవిష్యతిగా కరుణరసానికి పట్టం కట్టిన ఈ నాటకంలో చిత్రితమైన మహోన్నత పాత్రలు, ఉదాతమైన విలువలు, కళాత్మకత, అత్యంత కరుణరస ప్లావితమైన కథా సంవిధానం మొదలైనవి ఈ నాటకాన్ని మహత్తర నాటక కావ్యంగా, సంస్కృత సాహిత్యంలో అత్యధిక నాణ్యత సరసన సమున్నతంగా నిలబెట్టాయి. ఈ సంస్కృత నాటకం అన్ని భారతీయ భాషలలోనే కాకుండా ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ తదితర యూరోపియన్ భాషలలో సైతం అనువదించబడింది. ఈ నాటక రచనలో భవభూతి చూపిన ఒరవడి ఇతర నాటక కర్తలకు ప్రేరణ కలిగించింది.

భవభూతి రచించిన ఉత్తరారామచరిత్ర నాటకాన్ని ఆదర్శంగా తీసుకొన్న తరువాత తరం కవులు భవభూతి వలె మూల రామాయణంలో మార్పులు చేరుస్తూ, కొత్త సన్నివేశాలను సృష్టిస్తూ, మూలకథకు భిన్నంగా సరికొత్త రూపాలలో సంస్కృత రామాయణ నాటకాలను రాయడం ప్రారంభించారు. వీరిలో శక్తి భద్రుడు (ఆశ్చర్యచూడామణి), మాయురాజు (ఉదాత్త రాఘవం), రాజశేఖరుడు (బాల రామాయణం), దిజ్ఞాగుడు (కుందమాల) మొదలైనవారు ముఖ్యులు. అయితే భవభూతి పెట్టిన ఒరవడిలో అనుకరిస్తూ వచ్చిన తదనంతర రామాయణ నాటకాలలో దిజ్ఞాగుని "కుందమాల" లాంటివి కొన్ని తప్ప మిగిలినవి అంతగా ప్రజాదరణను పొందలేకపోయాయి.

కుందమాల గురించి వేరే వ్యాసం వ్రాస్తాను.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

శ్రీమాత్రేనమః

 శ్రీమాత్రేనమః. బాబు దేవీదాస రావు .         


మ ||అణువున్ బ్రాణము నాదమున్ బలము వృత్తాకార మౌ చక్రమం 


దున బింద్వాకృతినొంది విందుగనలందున్ జ్ఞానమున్ జూడగా 


నన నొప్పారెడు చొప్పుగంటి నెదలో నన్నాను , నన్నాను న 


చ్చిన నన్మెచ్చిన , ఆత్మకూరునిలయా శ్రీ రాజరాజేశ్వరీ ! 


భావము :-అమ్మా ! శ్రీరాజరాజేశ్వరీ ! నేను శ్రీచక్రములోని కేంద్రబిందువును , అణుబిందువుగను , జీవ బిందువుగను , శక్తిబిందువుగను , శబ్దబిందువుగను కన్పించు చు ఆ నాలుగు సృష్టుల రహస్యములను మాకు తెలియ జేయుచున్నదని దర్శించితిని . ఇది యంతయును సాధన చేత ఆత్మానుభవమునకు వచ్చినదను సత్యమును పలికితిని. నీకీ సత్య కథనము నచ్చినచో మరియు నీవు నన్ను మెచ్చినచో నీవు ఈ నాలుగు విధములుగా నాలో నిలిచి యుండుమని ప్రార్థించుచున్నాను.

తేనె ఉపయోగాలు honey

 తేనె ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . 


       తేనె మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు. తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక గుణములు , ఔషధగుణములు ఉన్నాయి . తియ్యదనానికి అర్థం చెప్పే పదార్థం కాబట్టి దీనిని మధు అంటారు. 


        ఆయుర్వేదంలో ఆరోగ్య పరిరక్షణకు వ్యాధి నివారణకు కూడా తేనె ప్రాచుర్యం పొందినది. ఆహారమున ఔషధముగా , ఔషధాలకి అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె కీలకపాత్రను పోషిస్తుంది . చలువ చేస్తుంది . ఆకలిని పుట్టిస్తుంది. బలమును కలిగించును. హృదయమునకు మంచిది . నేత్రములకు మంచిది . చర్మానికి కాంతిని కలిగించును . శరీరంలో కొవ్వుని పెరగనివ్వదు. పుండ్లను మాన్పును . ఇలా ఎన్నో గొప్ప ఔషధ గుణాలు తేనెలో కలవు. 


                  స్వచ్చమైన తేనెలో శరీరముకు కావలసిన పోషకపదార్ధాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధముగా ఆహారపదార్ధాల కంటే తేనెలో కెలోరిక్ విలువలు ఎక్కువుగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక కిలో ( 900ml ) పాలలో 620 క్యాలరీలు , ఆపిల్ పండులో 420 క్యాలరీలు , నారింజలో 230 క్యాలరీలు ఉండగా ఒక కిలో తేనెలో 3 ,150 నుండి 3 , 360 క్యాలరీక్ విలువ ఉండును. తేనె అనేక వ్యాధులలో పనిచేస్తుంది అని ఎన్నో పురాతన ఆయుర్వేద గ్రంథాలలో ఉన్నది. నోటిలో పుండ్లకు , దద్దులకు తేనె అత్యుత్తమంగా పనిచేయును . నోటిపూతకు తేనె రాస్తే నోటిపూత తగ్గును . 


                సాధారణముగా వచ్చే దగ్గులలో తేనె , అల్లంరసం కలిపి ఇస్తే దగ్గులు తగ్గును. వాంతులు తగ్గును. ప్రతిరోజు పొద్దున్నే చల్లటినీటిలో తేనె , నిమ్మరసం కలిపి తాగితే శరీరపు లావు తగ్గును. ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు. ప్రతినిత్యం తేనె , నిమ్మరసంతో తీసుకుంటుంటే వ్యాధి తీవ్రత తగ్గుటయే కాక వ్యాధి కూడా తగ్గును . 


                   పుండ్లు , చర్మవ్యాధులు , మొటిమలు , తలనొప్పి , దగ్గు , జ్వరము , రక్తహీనత , న్యుమోనియా , గుండెజబ్బు మొదలగు వ్యాధులకు తేనె దివ్యౌషధముగా పనిచేయును . తులసిరసముతో , తేనె కలిపి తీసుకుంటే శ్వాసకోశ , న్యుమోనియా మొదలగు వ్యాధులు నివారించబడును. తేనె , తులసిరసము , పసుపు కలిపి ఇస్తే ప్లేగు వంటి సాంక్రమిక వ్యాధులు కూడా నివారణ అగును. మధుమేహ వ్యాధి ఉన్నవారు రోజు కొద్దిగా తేనె తాగుట వలన మంచిఫలితాలు కనిపించును. ముఖ్యముగా ఒక్కవిషయం గుర్తించుకోవాలి మార్కెట్లో దొరికే తేనెలో పంచదరపాకం కలిపి ఉంటుంది. అది మధుమేహరోగులు తీసుకోరాదు . దానివల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కలదు. కావున స్వచ్చమైన తేనెని ఎంచుకొనవలెను . 


              Low - Bp సమస్యతో బాధపడువారు , నిద్ర సరిగా పట్టనివారు రోజూ తేనెని తీసుకోవడం చాలా మంచిది . ప్రతినిత్యం తేనెని తీసుకోవడం వలన చక్కటినిద్ర రావడమే కాకుండా సుఖవిరేచనం అగును. తేనె వ్రణారోపణం కలిగి ఉంది. వ్రణారోపణం అంటే పుండ్లును త్వరగా మాన్పుగుణం అని అర్థం . కాలిన గాయాలను , పుండ్లను , కురుపులను తేనె వెంటనే మాన్పును . లొపల చెడు ఉన్నటువంటి పుండ్లు కూడా త్వరగా మానును . 


                    సౌందర్య సాధనములలో కూడా తేనె ఎంతో ప్రయోజనకారిగా పేరు పొందినది. తేనెలో ఎన్నో విటమిన్లు , పోషకాలు ఉన్నవి. బంగారుఛాయలో సన్నగా ఉండాలనుకునే స్త్రీలు తప్పకుండా నిత్యం తేనెని తీసుకోవడం చాలా మంచిది . చర్మసౌందర్యానికి , శరీర ఆరోగ్యానికి అవసరం అయిన Riboflavin తేనెలో అధికంగా ఉన్నది. పెదవులను కూడా పగుళ్లు లేకుండా చేస్తుంది . అదేవిధముగా మొటిమల సమస్యతో ఇబ్బంది పడువారు ప్రతిరోజు క్రమంతప్పకుండా ఒక గ్లాసు నీళ్లలో ఒకస్పూను నిమ్మరసం , ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ విధముగా కొంతకాలంపాటు చేయుచున్న మంచి ఫలితం కనిపించును. అలానే తేనెలో పసుపు కలిపి ఉండలుగా చేసుకుని తినుచున్న మొటిమలు తగ్గును. 


              ఆయుర్వేదంలో తేనె బలాన్ని కలిగిస్తూ లేఖన గుణము కలిగి ఉంటుంది అని వివరించబడినది. లేఖన గుణము అనగా శరీరానికి శక్తిని ఇస్తూ శరీరమును సన్నబడునట్లు చేయునది అని అర్థం . ఈవిధముగా శక్తిని కోల్పోకుండా శరీరపు లావును తగ్గించటంలో తేనె అత్యుత్తమముగా పనిచేయును . ముఖసౌందర్యము కొరకు పాలను తేనెలో కలిపి ముఖంపై రాసుకుని కొద్దిసేపు అయ్యాక కడిగివేసిన ముఖము సౌందర్యముగా కనిపించును. తేనె కలిపిన పాలు ముఖమునకు రాసుకుని కొంచం ఆగి మెత్తటి పెసరపిండితో ముఖమును కడుగుచున్న ముఖం కాంతివంతమగును. 


             ఈవిధముగా ఆహారం , ఔషధముగా , ఔషధాలకు అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె ప్రాముఖ్యత వహించడం వలనే మన ప్రాచీనులు తేనె , ఆవుపాలు , ఆవువెన్న , ఆవునెయ్యి , ఆవుపెరుగులతో పాటు చేర్చి పంచామృతాలుగా చెప్పారు . 


             సంపూర్ణం     


  

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

శ్రీరుద్రం sreerudram

 శ్రీరుద్రం - నమకం - చమకం - తాత్పర్య సహితం


రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.


మహాన్యాసము

నారుద్రో రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.


మరి ఈ మహాన్యాసము అంటే?

మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.


రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు కలిగినది.

౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు కలది

౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది

౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది

౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది

౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము పంచాంగన్యాసము కలది


ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు. 


శ్రీరుద్రధ్యానమ్

బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచో - భాసమానా భుజంగైః

కంఠేకాలాః కపర్దాకలిత శశికలా - శ్చండకోదండ హస్తాః

త్ర్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరాః - శాంభవా మూర్తిభేదాః

రుద్రాః శ్రీ రుద్రసూక్తప్రకటిత విభవా - నః ప్రయచ్ఛంతు సౌఖ్యం

తాత్పర్యము: బ్రహ్మాండము నందంతటను వ్యాపించిన దేహము కలవారును, భస్మము చేత మంచుకాంతి వంటి దేహకాంతి కలవారును, సర్పములతో ప్రకాశించువారును, తమ కంఠములందు నలుపు వన్నె కలవారును, జటా ఝూటము నందు చంద్ర కళలు కలవారును, భయము గొలుపు ధనుస్సులు తమ హస్తములందు కలవారును, మూడు కన్నులు కలవారును, రుద్రాక్షలు తమ అలంకారములుగా కలవారును, తమ విషయమున ప్రణమిల్లిన వారి భయమును పోగొట్టువారును, పూజ్యమగు రుద్రసూక్త మంత్రములచే ప్రకాశింప జేయబడిన వైభవము కలవారును అగుచు శంభుని మూర్తి భేదములే అగు రుద్రులు మాకు సౌఖ్యమును కలిగింతురు గాక!


ప్రకారాంతరేణ శ్రీరుద్రధ్యానమ్

శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్

తాత్పర్యము: శుద్ధ స్పటికమువలె ప్రకాశించు వానిగా, మూడు కన్నులు, ఐదు ముఖములు, పది భుజములు కలవానిగా, సర్వాభరణములతో అలంకరించబడిన వానిగా, నీలకంఠముతో, చంద్రుని ఖండపు గుర్తుతో, సర్పపు యజ్ఞోపవీతము, నాగాభరణములు, పులిచర్మపు ఉత్తరీయము, హస్తములందు కమండలము, జపమాల, అభయము, వరదానము తెలిపే హస్త ముద్రలు, హస్తమునందు శూలము కలిగి ప్రజ్వలించుచు కపిల వర్ణము (ఎరుపు పసిమి కలిసిన) కళ జడలును, పైకి ఎత్తి కట్ట బడిన శిఖ కలిగి, నంది వృషభపు మూపును ఆరోహించి దేహార్ధమున ఉమను కలిగి అమృతముతో తడిసిన వానిగా హర్షము, దివ్యభోగాములు కలిగి దిగ్దేవతలతో కూడి సురాసురుల నమస్కారములను అందుకొనువానిగా, నిత్యునిగా, శాశ్వతునిగా, శుద్దునిగా, సర్వవ్యాపియగు ఈశానునిగా సకల జగద్రూపునిగా రుద్రుని భావించి ధ్యానించ వలెను. 


రుద్రాధ్యాయములో (శ్రీ రుద్రం) నమకం-చమకం ముఖ్యమైనవి. 'నమ' తో అంతమయ్యే శ్లోకాలు నమకము గాను, 'చమే' తో అంతమయ్యే శ్లోకాలు చమకంగా చెప్పబడ్డాయి. ఇందులో నమకము రుద్రునికి భక్తుని ప్రార్థనగా, చమకము భక్తునికి రుద్రుని ఆశీర్వచనం గా చెప్పబడ్డాయి. ఈ నమక చమకాలు ఏ విధంగా పఠనం చేయాలి అన్నది చేసే రుద్ర విధిని బట్టి ( లఘు రుద్రం, మహా రుద్రం, అతి రుద్రం, శత రుద్రం ) ఉంటుంది.


శ్రీ రుద్ర ప్రశ్నః

కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితా

చతుర్థం వైశ్వదేవం కాణ్డమ్ పఞ్చమః ప్రపాఠకః


నమకం

మొదటి అనువాకము: 

ఓం నమో భగవతే’ రుద్రాయ || నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’ | నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముత తే నమః’ | యా త ఇషుః’ శివత’మా శివం బభూవ’ తే ధనుః’ | శివా శ’రవ్యా’ యా తవ తయా’ నో రుద్ర మృడయ | యా తే’ రుద్ర శివా తనూరఘోరా‌உపా’పకాశినీ | తయా’ నస్తనువా శన్త’మయా గిరి’శంతాభిచా’కశీహి | యామిషుం’ గిరిశంత హస్తే బిభర్ష్యస్త’వే | శివాం గి’రిత్ర తాం కు’రు మా హిగ్‍మ్’సీః పురు’షం జగ’త్| శివేన వచ’సా త్వా గిరిశాచ్ఛా’వదామసి | యథా’ నః సర్వమిజ్జగ’దయక్ష్మగ్‍మ్ సుమనా అస’త్ | అధ్య’వోచదధివక్తా ప్ర’థమో దైవ్యో’ భిషక్ | అహీగ్’‍శ్చ సర్వాం”జమ్భయన్త్సర్వా”శ్చ యాతుధాన్యః’ | అసౌ యస్తామ్రో అ’రుణ ఉత బభ్రుః సు’మఙ్గళః’ | యే చేమాగ్‍మ్ రుద్రా అభితో’ దిక్షు శ్రితాః స’హస్రశో‌உవైషాగ్ం హేడ’ ఈమహే | అసౌ యో’‌உవసర్ప’తి నీల’గ్రీవో విలో’హితః | ఉతైనం’ గోపా అ’దృశన్-నదృ’శన్-నుదహార్యః’ | ఉతైనం విశ్వా’ భూతాని స దృష్టో మృ’డయాతి నః | నమో’ అస్తు నీల’గ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే” | అథో యే అ’స్య సత్వా’నో‌உహం తేభ్యో’‌உకరన్నమః’ | ప్రముం’చ ధన్వ’నస్-త్వముభయోరార్త్ని’ యోర్జ్యామ్ | యాశ్చ తే హస్త ఇష’వః పరా తా భ’గవో వప | అవతత్య ధనుస్త్వగ్‍మ్ సహ’స్రాక్ష శతే’షుధే | నిశీర్య’ శల్యానాం ముఖా’ శివో నః’ సుమనా’ భవ | విజ్యం ధనుః’ కపర్దినో విశ’ల్యో బాణ’వాగ్మ్ ఉత | అనే’శన్-నస్యేష’వ ఆభుర’స్య నిషఙ్గథిః’ | యా తే’ హేతిర్-మీ’డుష్టమ హస్తే’ బభూవ’ తే ధనుః’ | తయా‌உస్మాన్, విశ్వతస్-త్వమ’యక్ష్మయా పరి’బ్భుజ | నమ’స్తే అస్త్వాయుధాయానా’తతాయ ధృష్ణవే” | ఉభాభ్యా’ముత తే నమో’ బాహుభ్యాం తవ ధన్వ’నే | పరి’ తే ధన్వ’నో హేతిరస్మాన్-వృ’ణక్తు విశ్వతః’ | అథో య ఇ’షుధిస్తవారే అస్మన్నిధే’హి తమ్ || ౧ ||


శమ్భ’వే నమః’ | నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యమ్బకాయ’ త్రిపురాన్తకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’ నీలకణ్ఠాయ’ మృత్యుంజయాయ’ సర్వేశ్వ’రాయ’ సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ నమః’ ||


తాత్పర్యము:

భగవంతుడైన రుద్రునికి నా నమస్కారములు. ఓ రుద్ర! నీ శరములకు, ధనుస్సుకు, బాహువులకు నమస్కారము. ఎంతో శుభకరమైన నీ అమ్ముల పొది, అస్త్ర శస్త్రముల్తో మాకు ఆనందాన్ని కలిగించు. వెండి కొండ పైనుండి మమ్మల్ని ఆనంద పరిచే ఓ రుద్రా! ఎంతో శాంతి కలిగిన, శుభకరమైన, పాపరహితమైన, మోక్షకరమైన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే నీ వీక్షణములను మా వైపు ప్రసరించు. మాకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించు. ధవళగిరిపై కూర్చుని మాకు ఆనందము, ఉపశమనము కలిగించే, పాపులను నాశనం చేయటానికి పొందిన అస్త్రాలను శాంతింప చేయుము. నిన్ను కాన్చుటకు మేము నిన్ను స్తుతించి, నుతించు చున్నాము. ప్రసన్నుడవై మమ్ము, మా బంధువులను, గోవులను కాపాడి మాకు రోగములనుండి విముక్తి కలిగించుము. మేము ప్రేమతో ఉండునట్లుగా చేయుము. అన్నిటా ప్రథముడై, దేవతలలో దైవత్వమై, భక్తుల రోగాలను బాపే వైద్యుడై, భక్తుల సత్కార్యములను పొగడే వాడి, వారి పాపములను పోగోట్టేవాడైన ఓ రుద్ర! అసురులను, క్రూర మృగములను నాశనము చేసి మమ్ము కాపాడుము. ఎరుపు, బంగారపు వర్ణములో ఉండి, తానే సూర్యుడై ఉన్నాడు ఆ రుద్రుడు. అటువంటి సహస్ర దిక్కులలో ఉన్న సహస్ర రుద్రులకు మా నమస్కారములు. వారంతా శాంతిన్చెదరు గాక. గరళము కంఠం నందు కలిగి పశుకాపరులకు, స్త్రీలకు కూడా ఎర్రని కాంతితో రాగి రంగులో సూర్యుని వలె కనిపించే ఆ రుద్రుడు మా అందరికి ఆనందమునిచ్చు గాక. నీలకంఠుడు, వేయి కన్నులు కలవాడు, అనంతమైన వరాలు ఇచ్చేవాడు అయిన ఆ రుద్రునికి, ఆయన భక్తులకు నా నమస్కారములు. ఓ దేవా! ధనుస్సు యొక్క తాడు ముడి తీసి, దానిని దించి, అస్త్రములను అమ్ములపొదిలో ఉంచి దానిని పక్కకు పెట్టుము. బాణముల పదునైన మొనలను త్రుంచి, ధనుస్సును దించి, శాంత రూపంతో మమ్మల్ని ప్రసన్నించు. అస్త్రములు, ఆయుధములు అన్ని శాంతించి, వాటి స్థానాల్లో ఉండు గాక. భక్తుల కోర్కెలను తీర్చే ఓ రుద్రా! మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు. నీ ఆయుధాలకు, ధనుస్సుకు నా వందనములు. నీ అస్త్ర శస్త్రాలు మా శత్రువులను నాశనము చేయు గాక (శత్రువులంటే పాపములు). అవి మా నుండి దూరముగా వెళ్ళు గాక. జగత్పతి, దేవాదిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, ప్రళయాగ్ని రూపుడు, నీలకంఠుడు, యముని జయించిన వాడు, అన్నిటికి నాథుడు, శాంతముర్తి, సమస్త శుభకరుడు అయిన రుద్రునికి నా నమస్కారములు.


రెండవ అనువాకము:

నమో హిర’ణ్య బాహవే సేనాన్యే’ దిశాం చ పత’యే నమో నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యః పశూనాం పత’యే నమో నమః’ సస్పిఞ్జ’రాయ త్విషీ’మతే పథీనాం పత’యే నమో నమో’ బభ్లుశాయ’ వివ్యాధినే‌உన్నా’నాం పత’యే నమో నమో హరి’కేశాయోపవీతినే’ పుష్టానాం పత’యే నమో నమో’ భవస్య’ హేత్యై జగ’తాం పత’యే నమో నమో’ రుద్రాయా’తతావినే క్షేత్రా’ణాం పత’యే నమో నమః’ సూతాయాహం’త్యాయ వనా’నాం పత’యే నమో నమో రోహి’తాయ స్థపత’యే వృక్షాణాం పత’యే నమో నమో’ మన్త్రిణే’ వాణిజాయ కక్షా’ణాం పత’యే నమో నమో’ భువన్తయే’ వారివస్కృతా-యౌష’ధీనాం పత’యే నమో నమ’ ఉచ్చైర్-ఘో’షాయాక్రన్దయ’తే పత్తీనాం పత’యే నమో నమః’ కృత్స్నవీతాయ ధావ’తే సత్త్వ’నాం పత’యే నమః’ || ౨ ||


తాత్పర్యము:

స్వర్ణ భుజములు కలిగి, సేనాపతి, దిక్కులకు అధిపతి, వృక్షముల వలె ప్రకాశించు వాడు, ఆకులను జుట్టుగా కలవాడు, అన్ని జీవరాసులకు పతి, లేత చిగురుల వలె పచ్చగా, ఎర్రగా ఉన్నవాడు, మిక్కిలి ప్రకాశించేవాడు, మనలను సమస్త మార్గములలో నడిపే వాడు, నందిని అధిరోహించే వాడు, శత్రువుల పాలిటి రోగము వంటి వాడు, సమస్త ఆహారములకు అధిపతి, నల్లని జుట్టు కలవాడు, ఉపవీతమును ధరించిన వాడు, శక్తిమంతులకు అధిపతి, భవసాగరాన్ని దాటించేవాడు, ధనుస్సును ధరించిన వాడు, క్షేత్రములకు అధిపతి, జీవితమనే రథాన్ని నడిపించే వాడు, అజేయుడు, అరణ్యమునకు అధిపతి, ఎరుపు వర్ణము కలిగిన వాడు, అన్నిటికి అధిపతి, వృక్షములకు అధిపతి, మంత్రి, వ్యాపారి, చెట్టు చేమకు అధిపతి, చుట్టూ సైన్యము ఉండే వాడు, భక్తులను కాపాడే వాడు, మంచి వారికి అధిపతి అయిన రుద్రునికి నా నమస్కారము. 


మూడవ అనువాకము: 

నమః సహ’మానాయ నివ్యాధిన’ ఆవ్యాధినీ’నాం పత’యే నమో నమః’ కకుభాయ’ నిషఙ్గిణే” స్తేనానాం పత’యే నమో నమో’ నిషఙ్గిణ’ ఇషుధిమతే’ తస్క’రాణాం పత’యే నమో నమో వఞ్చ’తే పరివఞ్చ’తే స్తాయూనాం పత’యే నమో నమో’ నిచేరవే’ పరిచరాయార’ణ్యానాం పత’యే నమో నమః’ సృకావిభ్యో జిఘాగ్‍మ్’సద్భ్యో ముష్ణతాం పత’యే నమో నమో’‌உసిమద్భ్యో నక్తఞ్చర’ద్భ్యః ప్రకృన్తానాం పత’యే నమో నమ’ ఉష్ణీషినే’ గిరిచరాయ’ కులుఞ్చానాం పత’యే నమో నమ ఇషు’మద్భ్యో ధన్వావిభ్య’శ్చ వో నమో నమ’ ఆతన్-వానేభ్యః’ ప్రతిదధా’నేభ్యశ్చ వో నమో నమ’ ఆయచ్ఛ’ద్భ్యో విసృజద్-భ్య’శ్చ వో నమో నమో‌உస్స’ద్భ్యో విద్య’ద్-భ్యశ్చ వో నమో నమ ఆసీ’నేభ్యః శయా’నేభ్యశ్చ వో నమో నమః’ స్వపద్భ్యో జాగ్ర’ద్-భ్యశ్చ వో నమో నమస్తిష్ఠ’ద్భ్యో ధావ’ద్-భ్యశ్చ వో నమో నమః’ సభాభ్యః’ సభాప’తిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యో‌உశ్వ’పతిభ్యశ్చ వో నమః’ || ౩ ||


తాత్పర్యము:

శత్రువులను సంహరించేవాడు, అటువంటి వారికి అధిపతి, ఉన్నతమైన వాడు, ఖడ్గమును, అమ్ముల పొది, ధనుస్సును ధరించేవాడు, తస్కరులకు అధిపతి, మోసము చేసే వాడు, మోసగాళ్ళకు అధిపతి, అడవులను దోచుకునే వారికి అధిపతి, నిశాచరుడు, హంతకులకు అధిపతి, తలపాగా ధరించే వాడు, అడవులలో నివసించేవాడు, ధనుస్సును, బాణములను ధరించి సంధించే వాడు, చేదించేవాడు, స్థిరాసనంలో ఆసీనుడై ఉన్నవాడు, పడుకొని ఉన్నవాడు, నిద్ర, చేతనావస్థలో ఉండేవాడు, స్థిరముగా ఉన్నవాడు, పరుగెత్తే వాడు, సభలో ఉన్నవాడు, సభాధ్యక్షుడిగా ఉన్నవాడు, సదాత్మల పట్ల ఆదరం చూపేవాడు, దురాత్మల పట్ల ఆగ్రహం చూపేవాడు, తానే ఆశ్వమైన వాడు, ఆశ్వపతి అయిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.


నాలుగవ అనువాకము: 

నమ’ ఆవ్యాధినీ”భ్యో వివిధ్య’న్తీభ్యశ్చ వో నమో నమ ఉగ’ణాభ్యస్తృగం-హతీభ్యశ్చ’ వో నమో నమో’ గృత్సేభ్యో’ గృత్సప’తిభ్యశ్చ వో నమో నమో వ్రాతే”భ్యో వ్రాత’పతిభ్యశ్చ వో నమో నమో’ గణేభ్యో’ గణప’తిభ్యశ్చ వో నమో నమో విరూ’పేభ్యో విశ్వరూ’పేభ్యశ్చ వో నమో నమో’ మహద్భ్యః’, క్షుల్లకేభ్య’శ్చ వో నమో నమో’ రథిభ్యో‌உరథేభ్య’శ్చ వో నమో నమో రథే”భ్యో రథ’పతిభ్యశ్చ వో నమో నమః’ సేనా”భ్యః సేనానిభ్య’శ్చ వో నమో నమః’, క్షత్తృభ్యః’ సఙ్గ్రహీతృభ్య’శ్చ వో నమో నమస్తక్ష’భ్యో రథకారేభ్య’శ్చ వో నమో’ నమః కులా’లేభ్యః కర్మారే”భ్యశ్చ వో నమో నమః’ పుఞ్జిష్టే”భ్యో నిషాదేభ్య’శ్చ వో నమో నమః’ ఇషుకృద్భ్యో’ ధన్వకృద్-భ్య’శ్చ వో నమో నమో’ మృగయుభ్యః’ శ్వనిభ్య’శ్చ వో నమో నమః శ్వభ్యః శ్వప’తిభ్యశ్చ వో నమః’ || ౪ ||


తాత్పర్యము:

దుష్ట శక్తుల పాలిటి శత్రువు, వాటిని ఎదుర్కునే వాడు, ఉపకారము చేసే ఆత్మయే తానై, ఆ యాత్మలకు సహకరించే వాడు, అనుబంధములు కలిగిన వాడు, అట్టి వారికి అధిపతి అయిన వాడు, రకరకములైన జీవరాసుల సమూహము అయిన వాడు, అట్టి సమూహములకు అధిపతి అయిన వాడు, గణములో సభ్యుడు, గణములకు అధిపతి అయిన వాడు, సామాన్యమునగాను, భయానకముగాను కనిపించే వాడు, ఉత్తమమైన ఆత్మగా, బలహీనంగా కనిపించేవాడు, రథమును అధిరోహించే వాడు, రథము లేని వాడు, తనే రథమైన వాడు, రథపతి అయిన వాడు, తానే సైనికుడు, సేనాధిపతి అయిన వాడు, తానే రథమును నడిపేవాడు, రథమును ఆపగలిగిన శక్తి గలవాడు, కుమ్మరి వాడు, స్వర్ణకారుడు, వేటగాడు, మత్స్యకారుడు, ధనువు, బాణములు తయారు చేసే వాడు, శునకముల కాపరి, తానే శునకరుపమై, వాటిని కాపాడే వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.


అయిదవ అనువాకము:

నమో’ భవాయ’ చ రుద్రాయ’ చ నమః’ శర్వాయ’ చ పశుపత’యే చ నమో నీల’గ్రీవాయ చ శితికణ్ఠా’య చ నమః’ కపర్ధినే’ చ వ్యు’ప్తకేశాయ చ నమః’ సహస్రాక్షాయ’ చ శతధ’న్వనే చ నమో’ గిరిశాయ’ చ శిపివిష్టాయ’ చ నమో’ మీఢుష్ట’మాయ చేషు’మతే చ నమో” హ్రస్వాయ’ చ వామనాయ’ చ నమో’ బృహతే చ వర్షీ’యసే చ నమో’ వృద్ధాయ’ చ సంవృధ్వ’నే చ నమో అగ్రి’యాయ చ ప్రథమాయ’ చ నమ’ ఆశవే’ చాజిరాయ’ చ నమః 

శీఘ్రి’యాయ చ శీభ్యా’య చ నమ’ ఊర్మ్యా’య చావస్వన్యా’య చ నమః’ స్త్రోతస్యా’య చ ద్వీప్యా’య చ || ౫ ||


తాత్పర్యము:

సృష్టి కారకుడు, దుఃఖమును పోగొట్టేవాడు, పాపములను తొలగించే వాడు, జగత్తుకు అధిపతి, నీలకంఠుడు, భస్మమును దేహమంతా కలిగిన వాడు, కపాలములు ధరించి, కేశములు ముడి వేసుకొన్న వాడు, వేయి కన్నులు, వందల అస్త్రములు కలవాడు, గిరీశుడు, కాంతితో సమానమైన వాడు, సువృష్టి కురిపించే వాడు, చిన్నగాను, పొట్టిగాను ఉండేవాడు, పెద్దగా ఉండేవాడు, సర్వ సులక్షణ సంపన్నుడు, వృద్ధునిగా కనిపించే వాడు, అనంతమైన యశస్సు కలవాడు, సృష్టి కన్నా ముందే ఉన్నవాడు, దేవతలలో ప్రథముడు, అంతటా ఉన్నవాడు, వేగముగా కదిలేవాడు, వేగమైన ప్రవాహములో ఉన్నవాడు, అట్టి ప్రవాహంలో ఈదగలవాడు, అలలలో, నిశ్చలమైన నీటిలో, సెల ఏళ్ళలో, ద్వీపములలో ఉన్నరుద్రునికి నా నమస్కారములు.


ఆరవ అనువాకము: 

నమో” జ్యేష్ఠాయ’ చ కనిష్ఠాయ’ చ నమః’ పూర్వజాయ’ చాపరజాయ’ చ నమో’ మధ్యమాయ’ చాపగల్భాయ’ చ నమో’ జఘన్యా’య చ బుధ్ని’యాయ చ నమః’ సోభ్యా’య చ ప్రతిసర్యా’య చ నమో యామ్యా’య చ క్షేమ్యా’య చ నమ’ ఉర్వర్యా’య చ ఖల్యా’య చ నమః శ్లోక్యా’య చా‌உవసాన్యా’య చ నమో వన్యా’య చ కక్ష్యా’య చ నమః’ శ్రవాయ’ చ ప్రతిశ్రవాయ’ చ నమ’ ఆశుషే’ణాయ చాశుర’థాయ చ నమః శూరా’య చావభిన్దతే చ నమో’ వర్మిణే’ చ వరూధినే’ చ నమో’ బిల్మినే’ చ కవచినే’ చ నమః’ శ్రుతాయ’ చ శ్రుతసే’నాయ చ || ౬ ||


తాత్పర్యము:

అందరికన్నా పెద్ద వాడు, మరియు చిన్న వాడు, అన్నిటికన్నా ముందు జన్మించిన వాడు, తర్వాత జన్మించిన వాడు, మధ్య వయస్కుడు, అతి పిన్నవాడు, మూలమునుంచి మరియు మధ్య నుంచి జన్మించిన వాడు, భూ మరియు ఇతర లోకముల నుండి జన్మించిన వాడు, నరకమున శిక్ష వేసి స్వర్గమున సుఖమును ఇచ్చేవాడు , పొలములలోను , వనములలోను ఉండే వాడు, వేదములలో, వాటి శాంతి మంత్రములలో పొగడబడిన వాడు, అడవులలోని వ్రుక్షములలోను, చిన్న పొదలలో ఉండేవాడు, శబ్దము మరియు ప్రతిధ్వనిలోను ఉండేవాడు, వేగముగా నడిచే సైన్యము, ఆయుధాలలో ఉండేవాడు, వీరులు మరియు రాజుల రూపములో ఉండేవాడు, అస్త్ర శాస్త్రములు కలిగి రథమును అధిరోహించిన వాడు, శిరస్త్రాణము మరియు కవచము ధరించిన వాడు, గొప్ప యశస్సు మరియు సేన కలిగిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.


ఏడవ అనువాకము:

నమో’ దుందుభ్యా’య చాహనన్యా’య చ నమో’ ధృష్ణవే’ చ ప్రమృశాయ’ చ నమో’ దూతాయ’ చ ప్రహి’తాయ చ నమో’ నిషఙ్గిణే’ చేషుధిమతే’ చ నమ’స్-తీక్ష్ణేష’వే చాయుధినే’ చ నమః’ స్వాయుధాయ’ చ సుధన్వ’నే చ నమః స్రుత్యా’య చ పథ్యా’య చ నమః’ కాట్యా’య చ నీప్యా’య చ నమః సూద్యా’య చ సరస్యా’య చ నమో’ నాద్యాయ’ చ వైశన్తాయ’ చ నమః కూప్యా’య చావట్యా’య చ నమో వర్ష్యా’య చావర్ష్యాయ’ చ నమో’ మేఘ్యా’య చ విద్యుత్యా’య చ నమ ఈధ్రియా’య చాతప్యా’య చ నమో వాత్యా’య చ రేష్మి’యాయ చ నమో’ వాస్తవ్యా’య చ వాస్తుపాయ’ చ || ౭ ||


తాత్పర్యము:

పెద్ద నగారా నుంచి వెలువడే శబ్దము నందు ఉన్న వాడు, ఆ నగారా మోగించే ఓడు నందు ఉండే వాడు, సమరభూమి నుంచి పారిపోని వాడు, వేగు తెచ్చిన సమాచారాన్ని పరిశీలించేవాడు, దూత మరియు సేవకుని రూపములో ఉండేవాడు, ఖడ్గము, అమ్ముల పొది కలిగిన వాడు, పదునైన బాణములు మరియు ఇతర అస్త్రములు కలిగిన వాడు, ఉత్తమమైన ధనుస్సు మరియు ఇతర శస్త్రములు కలిగిన వాడు, విశాలమైన మరియు ఇరుకైన మార్గములందు వెళ్లే వాడు, కాలువలలోను, సెలయేటి లోను ఉండేవాడు, నీటి మడుగులోను, సరస్సులోను ఉండేవాడు, నదులలోను, ఏటి లోను ఉండేవాడు, బావిలోను, జలపాతములలోను ఉండేవాడు, వర్షములోను, ఎడారిలోను ఉన్నవాడు, మేఘము మరియు మెరుపులో ఉన్నవాడు, నిర్మలమైన శరదృతు ఆకాశాములోను, వర్షములోను, సూర్యుని లోను ఉన్నవాడు, భీకర వర్షపు గాలిలోనూ, వేడి వడగాల్పు లోను ఉన్నవాడు, గృహ నిర్మాణములో ఉండే ప్రతి వస్తువులోను, వాస్తు పురుషుడి రూపంలో గృహాన్ని కాపాడే వాడు అయిన ఆ రుద్రునికి నా నమస్కారములు.


ఎనిమిదవ అనువాకము:

నమః సోమా’య చ రుద్రాయ’ చ నమ’స్తామ్రాయ’ చారుణాయ’ చ నమః’ శఙ్గాయ’ చ పశుపత’యే చ నమ’ ఉగ్రాయ’ చ భీమాయ’ చ నమో’ అగ్రేవధాయ’ చ దూరేవధాయ’ చ నమో’ హన్త్రే చ హనీ’యసే చ నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యో నమ’స్తారాయ నమ’శ్శమ్భవే’ చ మయోభవే’ చ నమః’ శంకరాయ’ చ మయస్కరాయ’ చ నమః’ శివాయ’ చ శివత’రాయ చ నమస్తీర్థ్యా’య చ కూల్యా’య చ నమః’ పార్యా’య చావార్యా’య చ నమః’ ప్రతర’ణాయ చోత్తర’ణాయ చ నమ’ ఆతార్యా’య చాలాద్యా’య చ నమః శష్ప్యా’య చ ఫేన్యా’య చ నమః’ సికత్యా’య చ ప్రవాహ్యా’య చ || ౮ ||


తాత్పర్యము:

ఉమాపతి, దుఃఖములను పోగొట్టే వాడు, సూర్యోదయ, అస్తమయ సమయము నాటి సూర్యుని వర్ణము కలిగిన వాడు, సంతోషాన్ని కలిగించే వాడు, రక్షకుడు, ఉగ్రముగాను, భయానకముగాను ఉన్నవాడు, నాయకుడు, శత్రు సంహారము చేసే వాడు, దూరము నుండి మాట్లాడే వాడు, ప్రళయ కారకుడు (పూర్తి విధ్వంసం), కర్మ యనే సువ్రుక్షమైన వాడు, ఓంకార ప్రకాశకుడు, భోగ కారకుడు, మోక్ష కారకుడు, అనేక లోకముల భోగమునిచ్చే వాడు, శుభమైన వాటిలో ఉన్నవాడు, శుభకరుడు, పవిత్రమైన జలము లో ఉన్నవాడు, ప్రవాహముల వద్ద అర్చించ బడే వాడు, సిద్ధి పొందిన వారిచే నుతించ బడిన వాడు, కామ్యప్రదుడు, భవ సాగరాన్ని, పాపాలను దాటించి, మోక్షాన్ని కలిగించే వాడు, ఆత్మలను ఈ ప్రపంచములోకి పంపించే వాడు, కర్మ ఫలములను అనుభవింప చేసే వాడు, రెల్లుగడ్డి లోను, నీటి ప్రవాహపు నురగలోను, నదులయందు ఇసుకలోను, నీటి ప్రవాహంలో ఉండేవాడు అయిన రుద్రునికి నా నమస్కారములు


తొమ్మిదవ అనువాకము:

నమ’ ఇరిణ్యా’య చ ప్రపథ్యా’య చ నమః’ కిగ్ంశిలాయ’ చ క్షయ’ణాయ చ నమః’ కపర్దినే’ చ పులస్తయే’ చ నమో గోష్ఠ్యా’య చ గృహ్యా’య చ నమస్-తల్ప్యా’య చ గేహ్యా’య చ నమః’ కాట్యా’య చ గహ్వరేష్ఠాయ’ చ నమో” హృదయ్యా’య చ నివేష్ప్యా’య చ నమః’ పాగ్‍మ్ సవ్యా’య చ రజస్యా’య చ నమః శుష్క్యా’య చ హరిత్యా’య చ నమో లోప్యా’య చోలప్యా’య చ నమ’ ఊర్మ్యా’య చ సూర్మ్యా’య చ నమః’ పర్ణ్యాయ చ పర్ణశద్యా’య చ నమో’‌உపగురమా’ణాయ చాభిఘ్నతే చ నమ’ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ నమో’ వః కిరికేభ్యో’ దేవానాగ్ం హృద’యేభ్యో నమో’ విక్షీణకేభ్యో నమో’ విచిన్వత్-కేభ్యో నమ’ ఆనిర్ హతేభ్యో నమ’ ఆమీవత్-కేభ్యః’ || ౯ ||


తాత్పర్యము:

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నివసించేవాడు, మార్గములో నడిచేవాడు, ఎడారుల్లో, ఉన్నతమైన ప్రదేశాల్లో నివసించేవాడు, జటా ఝూటములు కలిగి, భక్తులను కాపాడుటలో ముందుండే వాడు, గృహములలోను, పాకలలో, గుహలలోను నివసించేవాడు, తల్పముపై ఉండేవాడు, అలంకరిచబడిన మందిరములలో, ముళ్ళ పొదలలో నివసించేవాడు, లోతైన నీటి మడుగుల్లో, హిమ బిందువుల్లో ఉన్నవాడు, ధూళిలో , బురద మట్టిలో, ఎండిపోయిన చెక్కలో, పచ్చి కొమ్మలో, నేలలో, పచ్చికలో, మైదానములో, నీటి తరంగాలలో, పచ్చని ఆకులలో, ఎండుటాకులలో ఉండేవాడు, అస్త్రములు ధరించి శత్రు సంహారం చేసే వాడు, ఎక్కువ బాధ పెట్టని వాడు, పెట్టే వాడు, భక్తులకు సకల సంపదలు ఇచ్చే వాడు, దేవతల ఆత్మలలో ఉన్నవాడు, నాశనములేని వాడు, దేవతల హృదయంలో ఉన్నవాడు, కోర్కెలు తీర్చే వాడు, పాపములను తొలగించే వాడు, సర్వాంతర్యామి అయిన రుద్రునకు నా నమస్కారములు.   


పదవ అనువాకము:

ద్రాపే అన్ధ’సస్పతే దరి’ద్రన్-నీల’లోహిత | ఏషాం పురు’షాణామేషాం ప’శూనాం మా భేర్మా‌உరో మో ఏ’షాం కించనామ’మత్ | యా తే’ రుద్ర శివా తనూః శివా విశ్వాహ’భేషజీ | శివా రుద్రస్య’ భేషజీ తయా’ నో మృడ జీవసే” || ఇమాగ్‍మ్ రుద్రాయ’ తవసే’ కపర్దినే” క్షయద్వీ’రాయ ప్రభ’రామహే మతిమ్ | యథా’ నః శమస’ద్ ద్విపదే చతు’ష్పదే విశ్వం’ పుష్టం గ్రామే’ అస్మిన్ననా’తురమ్ | మృడా నో’ రుద్రోత నో మయ’స్కృధి క్షయద్వీ’రాయ నమ’సా విధేమ తే | యచ్ఛం చ యోశ్చ మను’రాయజే పితా తద’శ్యామ తవ’ రుద్ర ప్రణీ’తౌ | మా నో’ మహాన్త’ముత మా నో’ అర్భకం మా న ఉక్ష’న్తముత మా న’ ఉక్షితమ్ | మా నో’‌உవధీః పితరం మోత మాతరం’ ప్రియా మా న’స్తనువో’ రుద్ర రీరిషః | మా న’స్తోకే తన’యే మా న ఆయు’షి మా నో గోషు మా నో అశ్వే’షు రీరిషః | వీరాన్మా నో’ రుద్ర భామితో‌உవ’ధీర్-హవిష్మ’న్తో నమ’సా విధేమ తే | ఆరాత్తే’ గోఘ్న ఉత పూ’రుషఘ్నే క్షయద్వీ’రాయ సుమ్-నమస్మే తే’ అస్తు | రక్షా’ చ నో అధి’ చ దేవ బ్రూహ్యథా’ చ నః శర్మ’ యచ్ఛ ద్విబర్హా”ః | స్తుహి శ్రుతం గ’ర్తసదం యువా’నం మృగన్న భీమము’పహన్తుముగ్రమ్ | మృడా జ’రిత్రే రు’ద్ర స్తవా’నో అన్యన్తే’ అస్మన్నివ’పన్తు సేనా”ః | పరి’ణో రుద్రస్య’ హేతిర్-వృ’ణక్తు పరి’ త్వేషస్య’ దుర్మతి ర’ఘాయోః | అవ’ స్థిరా మఘవ’ద్-భ్యస్-తనుష్వ మీఢ్-వ’స్తోకాయ తన’యాయ మృడయ | మీఢు’ష్టమ శివ’మత శివో నః’ సుమనా’ భవ | పరమే వృక్ష ఆయు’ధన్నిధాయ కృత్తిం వసా’న ఆచ’ర పినా’కం బిభ్రదాగ’హి | వికి’రిద విలో’హిత నమ’స్తే అస్తు భగవః | యాస్తే’ సహస్రగ్‍మ్’ హేతయోన్యమస్మన్-నివపన్తు తాః | సహస్రా’ణి సహస్రధా బా’హువోస్తవ’ హేతయః’ | తాసామీశా’నో భగవః పరాచీనా ముఖా’ కృధి || ౧౦ ||


తాత్పర్యము:

పాపులను నరకంలో శిక్షించే, భక్తులకు ఆహారాన్ని ఇచ్చే, జ్యోతి స్వరూపుడవు, నీలకంఠుడవు, ఎరుపు వర్ణము కలవాడవు అయిన ఓ దేవా! భక్తులకు భయము, మృత్యువునీయకు, రోగముల నుండి కాపాడు. ఓ రుద్రా! జగత్పాలక! జనన మరణాల నుండి ముక్తిని కలిగించే, నీలో ఉన్న, పార్వతి దేవితో కూడిన రూపమును మాకు అనుగ్రహించుము. మేము ఎలా జీవించాలో అలా జీవించే వరం ప్రసాదించు. ఓ రుద్రా! జగత్పాలక! జటా ఝూటములు కలిగిన, ధ్యానములో ఉన్న తపస్వీ, వ్యాకులమైన మా మనస్సులను నీ మీదకు మరల్చు. నీ ధ్యానముతో మాకు, గోవులకు సకల పాపములు తొలగి, శుభములు కలిగి, ఆరోగ్యవంతులమగుదుము, మరల మాకు రోగములు రావు. ఓ రుద్రా! జగత్పాలక! మాకు ఆనందము కలిగించు, మోక్షము కలిగే అవకాశాలు పెంచి, పాపములు చేసే అవకాశాలు తగ్గించు. మాకు ఆనందము, మోక్షము కలిగించుటకు నీకు మరోసారి మా ప్రణామములు. ఓ రుద్రా! జగత్పాలక! వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు, గర్భము నందున్న శిశువులకు, తల్లీ, తండ్రులకు ఎప్పుడు హాని కలగకుండా చూడు. మాకు ప్రియమైన ఈ శరీరమునకు హాని కలుగకుండా చూడు. ఓ రుద్రా! జగత్పాలక! మా సంతానమునకు శోకము కలుగ కుండా కాపాడు. ఆవులను, ఆశ్వములను కాపాడు. కోపాగ్నికి మా సేవకులను గురి చేయకు. నీకు పవిత్రమైన వస్తువులు, నమస్కారములు సమర్పిస్తాము. ఓ రుద్రా! జగత్పాలక! నీ భయానక తత్వము మాకు, మా సేవకులకు దూరముగా ఉండు గాక. నీ శుభ తత్వము మాతో ఉండు గాక. నీ కరుణ ఎల్లప్పుడూ మాతో ఉండు గాక. మాకు సకల లోకాల సుఖాలు అందించు. ఓ మనసా! నీ హృదయ కమలములో యున్న, నిత్య యౌవనుడైన, సింహమువలె శత్రువులను సంహరించే, అమితమైన యశస్సు కల్గిన ఆ రుద్రుని ధ్యానము చేయుము. ఓ రుద్రా! నీ సైనికులచే మా శత్రువులను సంహరించు. రుద్రుని ఆయుధములు మా నుండి దూరముగా ఉండు గాక. శత్రు సంహారము చేయగల ఆ రౌద్ర రూపము మానుండి దూరముగా ఉండు గాక. ఓ రుద్ర! నీ రౌద్ర రూపమును మిమ్ము ప్రార్థించే, హవనము సమర్పించే మా పట్ల శాంతింప చేయుము. మా పుత్ర పౌత్రాదులను కాపాడుము. భక్తుల కోర్కెలను తీర్చతంలో అగ్రుడవైన ఓ రుద్రా! శుభ వీక్షణములు కలిగిన ఓ రుద్ర! నీ అస్త్రములు వృక్షముపై ఉంచి, పులి చర్మము ధరించి, పినాకము అలంకారముగా ఉంచుకొని మా వద్దకు శుభకరుడవై రమ్ము. మాకు సంపదలు ఇచ్చే, ఎరుపు వర్ణములో ఉన్న ఓ రుద్రా! నీకు మా నమస్కారములు. నీ ఆయుధములు మా శత్రువులను నాశనం చేయు గాక. వేల రకాల, వేల ఆయుధాలు కలిగిన ఓ రుద్రా! నీ అస్త్రాలు మమ్ములను దాడి చేయకుండు గాక.


పదకొండవ అనువాకము: 

సహస్రా’ణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యా”మ్ | తేషాగ్‍మ్’ సహస్రయోజనే‌உవధన్వా’ని తన్మసి | అస్మిన్-మ’హత్-య’ర్ణవే”‌உన్తరి’క్షే భవా అధి’ | నీల’గ్రీవాః శితికణ్ఠా”ః శర్వా అధః, క్ష’మాచరాః | నీల’గ్రీవాః శితికణ్ఠా దివగ్‍మ్’ రుద్రా ఉప’శ్రితాః | యే వృక్షేషు’ సస్పిఞ్జ’రా నీల’గ్రీవా విలో’హితాః | యే భూతానామ్-అధి’పతయో విశిఖాసః’ కపర్ది’నః | యే అన్నే’షు వివిధ్య’న్తి పాత్రే’షు పిబ’తో జనాన్’ | యే పథాం ప’థిరక్ష’య ఐలబృదా’ యవ్యుధః’ | యే తీర్థాని’ ప్రచర’న్తి సృకావ’న్తో నిషఙ్గిణః’ | య ఏతావ’న్తశ్చ భూయాగ్‍మ్’సశ్చ దిశో’ రుద్రా వి’తస్థిరే | తేషాగ్‍మ్’ సహస్రయోజనే‌உవధన్వా’ని తన్మసి | నమో’ రుధ్రేభ్యో యే పృ’థివ్యాం యే”‌உన్తరి’క్షే యే దివి యేషామన్నం వాతో’ వర్-షమిష’వస్-తేభ్యో దశ ప్రాచీర్దశ’ దక్షిణా దశ’ ప్రతీచీర్-దశో-దీ’చీర్-దశోర్ధ్వాస్-తేభ్యో నమస్తే నో’ మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ’ నో ద్వేష్టి తం వో జమ్భే’ దధామి || ౧౧ ||


త్ర్యం’బకం యజామహే సుగన్ధిం పు’ష్టివర్ధ’నమ్ | ఉర్వారుకమి’వ బన్ధ’నాన్-మృత్యో’ర్-ముక్షీయ మా‌உమృతా”త్ | యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓష’ధీషు యో రుద్రో విశ్వా భువ’నా వివేశ తస్మై’ రుద్రాయ నమో’ అస్తు | తము’ ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వ’స్య క్షయ’తి భేషజస్య’ | యక్ష్వా”మహే సౌ”మనసాయ’ రుద్రం నమో”భిర్-దేవమసు’రం దువస్య | అయం మే హస్తో భగ’వానయం మే భగ’వత్తరః | అయం మే” విశ్వభే”షజో‌உయగ్‍మ్ శివాభి’మర్శనః | యే తే’ సహస్ర’మయుతం పాశా మృత్యో మర్త్యా’య హన్త’వే | తాన్ యఙ్ఞస్య’ మాయయా సర్వానవ’ యజామహే | మృత్యవే స్వాహా’ మృత్యవే స్వాహా” | ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా’ విశాన్తకః | తేనాన్నేనా”ప్యాయస్వ ||


ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యు’ర్మే పాహి ||


సదాశివోమ్ |


ఓం శాంతిః శాంతిః శాంతిః


తాత్పర్యము:

ఓ రుద్రా! వేల కొలది, వేల రకాల ఆయుధాలు కలిగి ఉన్న వేల మంది నీ సైనికులను మాకు వేల మైళ్ళ దూరమున ఉంచు. ఈ విశ్వములో ఉన్న అనంతమైన రుద్రుని సైనికులు - కంఠములు నీలము, తెల్లగను గలిగిన వారు, పాతాళంలో, స్వర్గంలో ఉండే వారు, కంఠములు నీలము, ఎరుపుగాను ఉండి వ్రుక్షములపై ఉన్నవారు, ముడి వేసుకున్నవారు, కేశములు లేని వారు, జనులను బాధించి వారు పాత్రలనుండి ఆహారము, నీరు తీసుకునే వారు, అన్ని మార్గములలో నున్న వారిని రక్షించే వారు, కాపాడే వారు, పదునైన ఆయుధములు కలిగిన వారు, పవిత్రమైన జలాలను కాపాడే వారు - వివిధ దిక్కులలో నున్న వీరందరినీ, వారి ఆయుధాలను మానుండి దూరముగా ఉంచుము. భూమి, ఆకాశము, ఇతర లోకములలో ఉండి మమ్మల్ని కాపాడే సైనికులకు మా వ్రేళ్ళతో, చేతులతో, దిక్కు దిక్కున నమస్కారములు. మాకు వారు ఆనందము కలిగింతురు గాక. వారికి మేము మా శత్రువులను ఆహారముగా సమర్పిస్తున్నాము. సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!. సమస్త జగత్తు యందు ఉన్?

మోక్షము సిద్ద వస్తువా లేక సాద్య వస్తువా

 మోక్షము సిద్ద వస్తువా లేక సాద్య వస్తువా 


చాలామంది సాధకులను తొలచివేసే ప్రశ్న ఇది దీనిని గురియించి వివరంగా తెలుసుకుందాం. భక్తి మార్గంలో వుండే సాధకునికి నిరంతర భక్తి వలన ఒక విషయం అవగాహనకు వస్తుంది అదేమిటంటే భక్తికన్నా భిన్నంగా మరియు గొప్పగా మరేదో వున్నదని భావన ఆ భావన కలిగిన సాధకుడు మాత్రమే మోక్షం వైపు వెళ్లగలడు. అప్పుడు ఆలోచనలో పడతాడు ఆ ఆలోచన ఎలావుంటుందంటే ఏమిటి నేను నిత్యం ఈశ్వరునికి పూజ చేస్తున్నానే ఎలా చేస్తున్నాను శివలింగానికి జలంతో, పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాను, పుష్పాలతో అలంకరిస్తూ ఆనందిస్తున్నానే ఇదేనా పరమార్ధం లేక ఇంకా వేరే ఏమైనా ఉన్నదా అనే మీమాంసలో పడతాడు. అప్పుడు మొదలౌతుంది తెలుసుకోవాలనే తృష్ణ వెంటనే ఉపనిషత్తుల వద్దకు వెళతాడు. ముందుగా ఆవిర్భవించినది తరిమ్పచేసేది అయినా " ఈశావాసోపనిషత్'" మొదటి మంత్రం చదివేసరికి తలా తిరిగిపోతుంది సాధకునికి ఎందుకంటె ఆ మంత్రం ఏమి చెప్పుతున్నదంటే


1. ఓం ఈశా వాస్య మిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్

తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనం

అర్థం:


జగత్తులో ఏవేవైతే ఉన్నవో అన్నీ భగవంతుడై వున్నాయి. భగవంతుడు కానిది ఏదిలేదు ఇక్కడి సంపదలు, ధనము సర్వము కూడా భగవంతునివై వున్నాయి. అప్పుడు సాధకుని ఆలోచనలో కొత్త విషయాలు ఆవిశృభవిస్తాయి. నేను యెంత ముర్కుడిని నేను నీళ్లతో, పాలతో పంచామృతాలతో ఈశ్వరుడి అభిషేకించానని అనుకుంటున్నానే, పూలతో భగవంతుని అలంకరించానని అనుకుంటున్నానే భగవంతుడు కానిది, భగవంతునిది కానిది ఏది లేదని కదా ఈ మంత్రము చెపుతున్నది. అట్టి తరి నేను నీళ్లు, పాలు, పంచామృతాలు ఎక్కడినుండి ఎవరివి తీసుకొని వచ్చాను. నేను నా ద్రవయంతో కొన్నాను అని సమాధానం చేసుకుంటే నాకు ద్రవయం ఎలావచ్చింది అనే ప్రశ్న ఉదయిస్తుంది. నేను కష్టపడ్డాను కాబట్టి అని సమాధాన పరచుకుంటాను. అప్పుడు మొదలవుతుంది అసలు ప్రశ్న నేను ఎవరును. ఈ జగత్తు మొత్తము ఈశ్వరుడే అయితే నేను ఈశ్వరునికన్నా బిన్నంగా ఎలావున్నాను. లేనుకదా అటువంటప్పుడు నేను కూడా ఈశ్వరుడినిలో అంతర్భాగం కదా మరి నేను కష్టపడటం ఏమిటి. అది ఎలా సాధ్యం. ఇటువంటి ఆలోచన సాధకుని మరొక మెట్టు ఎక్కిస్తుంది. 


సాద్య వస్తువు:  సామాజిక అర్ధంలో వస్తువు అంటే ఒక పదార్ధ నిర్మితమైనది అని పదార్ధము కానిది వస్తువు కాదు అని మనము అర్ధము చెప్పుకుంటాము. ఎవరైనా సాధకుడు సాద్య వస్తువు, సిద్ధవస్తువు అని నీవు అంటున్నావు కదా మోక్షము నీ దృష్టిలో వస్తువా అని ప్రశ్నించవచ్చు. అందులకు సందేహం లేదు. కానీ ఆధ్యాత్మిక అర్ధంలో వస్తువు అనే దానిని మనం ఎలా అర్ధం చేసుకోవాలంటే సాద్య వస్తువు అంటే సాధ్యం అనగా సాధనావల్ల లభించునది అని సిద్ధవస్తువు అంటే అది అంతకుముందే నీ వద్ద వున్నది కేవలము నీవు దానిని తెలుసుకోవటమే. మీ ప్రాంతంలో వర్షాలు పడటంలేదు అప్పుడు వరుణ యాగం చేశారు యాగ ఫలితంగా వెంటనే అక్కడ వర్షాలు పడ్డాయి అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమిటంటే వరుణ యాగం చేయటం అంటే వరుణ యాగము అనే ఒక కర్మ చేశారు వారికి కర్మ ఫలితంగా వర్షాలు పడ్డాయి. అంటే వర్షాలు పడతాము అనేది సాద్య వస్తువు. ఇదే విధంగా నీకుమార్తె  వివాహం కాలేదు   నీ మిత్రుడు సత్యనారాయణ వ్రతం చేయమని నిన్ను ప్రోత్సహించాడు. నీవు ఆ వ్రతాన్ని ఆచరించవు వ్రత ఫలితంగా నీ కుమార్తె వివాహం అయ్యింది ఇవ్వన్నీ సాద్య వస్తువులుగా ఆధ్యాత్మిక జ్ఞానులు అభివర్ణించారు. 


సిద్ధవస్తువు.: సిద్ద వస్తువు అంటే సిద్ధంగా ఉన్నదానిని నీవు తెలుసుకోవటమే. తెలుసుకోవటమే కదా ఇందులో కష్టం యేమివున్నది అని నీవు అనుకోవచ్చు. కానీ అందులో కష్టంకాదు వున్నది అజ్ఞానం ఆ అజ్ఞానాన్ని పారద్రోలితే అప్పుడు నీకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ఒక చిన్న ఉదాహరణతో దీనిని తెలుప ప్రయత్నిద్దాము. 


నీవు వీధిలో ఏదో వస్తువు కొనటానికి వెళ్ళావు వస్తువును కొని దాని మూల్యం చెల్లించటానికి నీ జేబుచుసుకున్నావు అక్కడ నీ పర్సు కనిపించలేదు. వెంటనే నీకు ఇంట్లో నీవు పర్సు పెట్టుకున్న ప్యాంటు కాకుండా ఇంకొక ప్యాంటు వేసుకున్నట్లు మనస్సుకు తట్టింది. అప్పుడు ఏమిచేయాలా అని నీవు అనుకుంటున్నప్పుడు నీ మదిలో ఇంకొకటి స్ఫురణకు వచ్చింది నీకు బెల్టులోపల వుండే జేబులో కొంత ద్రవ్యాన్ని అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడేటట్లు పెట్టుకునే అలవాటు  వుంది. వెంటనే నీవు అక్కడ తడిమి చూసావు నీకు వంద నోట్లు తగిలాయి.  బ్రతుకు జీవుడా అని ఆ డబ్బులు ఇచ్చి నీవు కొనుక్కున్న వస్తువుతో ఇంటికి వెళ్లవు. ఇక మోక్షంకుడా నీలోనే వుంది అది ఎలావుందంటే నీ బెల్టు క్రింద జేబులో వంద నోట్లు వున్నట్లుగా నీవు చేయవలసిందల్లా కేవలం దానిని గుర్తించటమే. అది యెట్లా వున్నది అనేది గుర్తించటానికి మనకు జ్ఞానం కావలి. జ్ఞానం మనకు శాస్త్రం నుండి లభ్యమవుతుంది.

నాట్లువేయగ వచ్చినారలు

 నాట్లువేయగ వచ్చినారలు నాతులందరు గుంపుగా


పాట్లు లేకను సాళ్ళు సాళ్ళుగ పద్ధతిన్ వరి నాటి, సా


పాట్లకై తమ మూట విప్పిరి పంచు కొందురు ప్రేమతో


గట్లపైననె కూరుచుండిరి కష్టజీవులు తిండికై.


అల్వాల లక్ష్మణ మూర్తి.

ఇష్ట కామేశ్వరి అమ్మవారు*

 *ఇష్ట కామేశ్వరి అమ్మవారు* 


భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడా మరో ఆలయం కనిపించదు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరిదేవి దర్శనం చేసుకోలేరు సుమా. అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. 


భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలు అయినా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది. భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టుపెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా, ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది.


ఇష్ట కామేశ్వరీ దేవాలయం అడవుల మధ్యలో పులుల సంచారం ఎక్కువ ఉన్న చోట ఉండడంతో అటవీశాఖ అనుమతి లేనిదే ఆ దేవాలయాన్ని సందర్శించలేము. నేను ఒక పదుహేను సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ప్రైవేటు జీపులలో వెళ్ళడానికి అనుమతించేవారు. ఇప్పుడైతే అటవీశాఖయే వారి వాహనాలలోనే రవాణా సౌకర్యం కల్పించిందని విన్నాను. ఎలా వెళ్ళినా ఆలయానికి ఒక కిలోమీటరు ముందుదాకే అన్ని వాహనాలు ఆగిపోతాయి. ఆ తరువాత వాహనాలు వెళ్ళడానికి దారి సరిగ్గా లేనందున ఇక కాలినడకనే. అయినా ఆ దారిలో రాళ్ళు రప్పలు విపరీతంగా ఉండడంతో యుక్త వయస్కులు సునాయాసంగా వెళ్ళగలరేమో కాని వయోవృద్ధులు నడవలేనివాళ్ళు ఒక్క అడుగు కూడా వేయలేరు. 


మేము వెళ్ళినప్పుడు మా కుటుంబీకులు ఎటువంటి ఇబ్బందులు లేక ఆ దారిని అధిగమించినా నన్నైతే జీపులో మాతోబాటు పయనించిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి (ఒంగోలుకు చెందిన వ్యక్తి) తన భుజాలపై మోసుకెళ్ళడం, దర్శనం అయిన తర్వాత మళ్ళీ వెనక్కు తీసుకొని రావడం ఎన్నటికీ మరువలేని సంఘటన. వారితో అడపాదడపా చరవాణిలో సంభాషించేవాణ్ణి. అప్పుడప్పుడు ఈ చరవాణులు మార్చడంతో వారి నెంబరును కోల్పోయాను. 


ఈ ఆలయం గురించి ఇప్పుడే విన్న కొత్త వార్త ఏంటంటే జులై 1 నుంచి శ్రీశైలంలోని ఈ ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రకు బ్రేక్ పడినట్టు వింటున్నాను. జులై 1 వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ యాత్రను నిలిపి వేసారట అటవీశాఖ అధికారులు. పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు విరామం కల్పించారని వినికిడి. 


ఏది ఎలా ఉన్నా శ్రీశైల యాత్రతో బాటు ఇష్టకామేశ్వరీ దేవి ఆలయ సందర్శనం ఓ మరువలేని జ్ఞాపకంగా మదిలో చిరస్థాయిగా నిలిచి.నట్టే.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం -‌ షష్ఠి - పూర్వాఫల్గుణి -‌‌ భౌమ వాసరే* (01.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🍁మంగళవారం 1 జూలై 2025🍁*

``

            *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

      *వాల్మీకి రామాయణం*                

              *85వ భాగం*

```

అప్పుడు సుషేణుడు… 

“పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలని విశేషమైన అస్త్రాలతో బాధించారు. ఎందరో దేవతలు ప్రాణాలు విడిచిపెడుతుంటే, శరీరాలు దెబ్బతింటుంటే దేవగురువైన బృహస్పతి విశల్యకరణి, సంజీవకరణి, సంధానకరణి అనే ఓషధులు కలిగిన మొక్కలని రసం పిండి వాసన చూపిస్తే ఆ దేవతలందరూ మళ్ళీ జీవించారు. ప్రస్తుతం అవి పాల సముద్రంలో ఉండే రెండు పర్వత శిఖరాల మీద ఉన్నాయి. మన దగ్గర ఉన్న వానర సైన్యంలో హనుమ, సంపాతి, ఋషభుడు, నీలుడు మొదలగు వారు మాత్రమే వెళ్ళి ఆ ఓషధులని గుర్తుపట్టగలరు. వాటిని తీసుకొచ్చి రాముడికి, లక్ష్మణుడికి వాసన చూపిస్తే వారు జీవించే అవకాం ఉంటుంది" అన్నాడు.


సుషేణుడు చెప్పిన ప్రకారం వెళదామని వారు అనుకుంటుండగా అక్కడ ఒక గొప్ప నాదం వినపడింది. ఎక్కడిదీ ధ్వని అని అందరూ ఆ సముద్రం వైపున చూడగా, బ్రహ్మాండమైన కాంతితో, రెక్కలు అల్లారుస్తూ ఒక మహా స్వరూపం వస్తోంది. అది వస్తున్నప్పుడు దాని కాంతి చేత, వేగం చేత సముద్రపు ఒడ్డున ఉన్న కొన్ని వేల వృక్షములు నేలన పడిపోయాయి. కాంతివంతమైన స్వరూపంతో గరుత్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయనని చూడగానే అందరూ ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు. అప్పటివరకూ రామలక్ష్మణులని గట్టిగా పట్టుకుని ఉన్న నాగములు గరుత్మంతుడు వచ్చి అక్కడ వాలగానే వాళ్ళని విడిచిపెట్టేసి పారిపోయాయి. 


నాగములు విడిచిపెట్టగానే రామలక్ష్మణులు స్వస్థత పొంది పైకి లేచారు. అప్పుడు గరుత్మంతుడు వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకొని వాళ్ళిద్దరి ముఖాలని తన చేతులతో తడిమాడు. 


గరుత్మంతుడు అలా కౌగాలించుకోగానే, ఇంతకముందు రాముడికి ఎంత బలం ఉండేదో, ఎటువంటి పరాక్రమము ఉండేదో, ఎటువంటి బుద్ధి ఉండేదో, ఎటువంటి తేజస్సు ఉండేదో వాటికి రెండింతలు పొందాడు. వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయములన్నీ మానిపోయాయి.


అప్పుడు గరుత్మంతుడు…  

“నాయనా రామా! ఇకమీద నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. కద్రువ యొక్క సంతానమైన భయంకరమైన కోరలున్న పాములని తన మాయ చేత ఇంద్రజిత్ బాణములుగా మార్చుకున్నాడు. ఈ నాగపాశం నుండి దేవేంద్రుడు కూడా విడిపించుకోలేడు. యక్ష, గంధర్వ, కిన్నెరులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చినా ఈ నాగపాశములను విడదీయలేరు. ఇది కేవలం నన్ను చూసి మాత్రమే విడివడుతుంది” అన్నాడు.


అప్పుడు రాముడు… “మీరు ఎవరు?” అని అడిగాడు.


గరుత్మంతుడు అన్నాడు… "నేను గరుత్మంతుడిని, నేను ఎందుకు వచ్చాను అని ఇప్పుడు అడక్కు. నీకు నాకు ఒక గొప్ప స్నేహం ఉంది. నీకు నాకు ఉన్న అనుబంధమేమిటో యుద్ధం అయ్యాక చెబుతాను. ఇప్పుడు చెప్పడం కుదరదు, నువ్వు నన్ను అడగనూ కూడదు. కొద్దికాలంలోనే ఈ లంకలో వృద్ధులు, బాలురు తప్ప ఓపికున్న రాక్షసుడు ఎవ్వడూ ఉండకుండా నువ్వు కొట్టేసి సీతమ్మని పొందుతావు. మరి నేను బయలుదేరడానికి నాకు అనుమతిని కటాక్షించు రామా" అన్నాడు.


రాముడు… “చాలా సంతోషం, మీరు వెళ్ళండి” అన్నాడు.


గరుత్మంతుడు ఎలా వచ్చాడో అలా తన బంగారు రెక్కలను ఊపుకుంటూ సముద్రం మీద నుంచి వెళ్ళిపోయాడు.


రెట్టింపు ఉత్సాహంతో, బలంతో ఉన్న రామలక్ష్మణులని చూడగానే అక్కడున్న వానరులందరూ ఆనందంతో భేరీలు మ్రోగించారు, కుప్పిగంతులు వేశారు, పాటలు పాడారు, పెద్ద పెద్ద కేకలు వేశారు. లోపల సంతోషంగా కూర్చుని ఉన్న రావణుడికి ఈ కేకలు వినపడి…  

“ఏమి జరిగిందో చూడండి!” అన్నాడు. 


అప్పుడు అక్కడున్న రాక్షసులు ప్రాసాదం మీదకి ఎక్కి చూసేసరికి, రెండు ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలా రామ లక్ష్మణులిద్దరు నిలబడి ఉన్నారు. 


వాళ్ళు వెంటనే చూసిన విషయాన్ని రావణుడికి చెప్పారు. 


ఆ మాటలు విన్న రావణుడు మొదట ఆశ్చర్యాన్ని పొంది తరువాత ఆగ్రహంతో ఊగిపోయాడు.


అప్పుడు రావణుడు ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి… “నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని సంహరించి తిరిగిరా, నీకన్నా బంధువు నాకు లేడు. నువ్వు అపారమైన శౌర్యం ఉన్నవాడివి, నీకు కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళు” అన్నాడు.


అప్పుడా ధూమ్రాక్షుడు పశ్చిమ ద్వారంగుండా బయటకి వెళ్ళాడు. ఆయన అలా బయటకి వెళ్ళగానే ఆకాశం నుండి ఒక మేఘం వచ్చి రక్తాన్ని వర్షించింది. ఆకాశంలో తిరుగుతున్న ఒక గ్రద్ద వాడి రథం మీద వాలింది. రక్తంతో తడిసిపోయిన ఒక తెల్లటి మొండెం సూర్యమండలంలో నుంచి వాడి రథం ముందు పడింది. ఇన్ని అపశకునములు కనపడినా ఆ ధూమ్రాక్షుడు యుద్ధానికి వెళ్ళాడు.


ఆ ధూమ్రాక్షుడు తన యొక్క బాణములతో వానరులని కొట్టి వాళ్ళ శరీరాలని చీల్చేస్తున్నాడు. 


అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద శిలని పెకలించి పరుగు పరుగున వచ్చి దానిని ధూమ్రాక్షుడి మీదకి విసిరాడు. 


హనుమ వేసిన శిలని గమనించిన ధూమ్రాక్షుడు ఆ రథం నుంచి బయటకి దూకేశాడు. ఆ రథం తుత్తునియలు అయిపోయింది. తరువాత ఆ ధూమ్రాక్షుడు కొన్ని బాణములతో హనుమంతుడిని కొట్టాడు. 


వెంటనే హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పీకి ఆ ధూమ్రాక్షుడి మీద వేశాడు. 


నుజ్జునుజ్జయిపోయి ఆ ధూమ్రాక్షుడు మరణించాడు.


తరువాత రావణుడు వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపాడు. అప్పుడాయన సైన్యంతో కలిసి దక్షిణ ద్వారంగుండా బయటకి వచ్చాడు. ఆ వజ్ర దంష్ట్రుడు బయటకి రాగానే అరణ్యంలో ఉన్న నక్కలు అరిచాయి, అన్ని మృగాలు ఏడిచాయి. ఆ వజ్ర దంష్ట్రుడు ఒకేసారి 7-8 బాణములని ప్రయోగించేవాడు. అన్ని వైపులకి బాణములని ప్రయోగం చేసి వానరములని కొట్టాడు. ఇక వీడిని ఉపేక్షించకూడదని అంగదుడు భావించి, ఒక పెద్ద వృక్షాన్ని పట్టుకొచ్చి వజ్ర దంష్ట్రుడిని కొట్టబోయాడు. కాని ఆ వృక్షాన్ని తన బాణముల చేత వజ్ర దంష్ట్రుడు నరికేశాడు. తరువాత అంగదుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొచ్చి దానిని విసిరేశాడు. ఆ దెబ్బకి వజ్రదంష్ట్రుడి రథం ముక్కలయిపోయింది. మళ్ళి అంగదుడు ఒక పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి విసిరేసరికి దాని కిందపడి వజ్ర దంష్ట్రుడు మరణించాడు.


ఈసారి రావణుడు అకంపనుడు అనే రాక్షసుడిని పంపాడు. ఆ అకంపనుడు యుద్ధానికి వస్తుండగా ఆయన ఎడమ కన్ను అదిరింది, అకారణంగా వాడి కంఠం బొంగురుపోయింది, పక్షులు, మృగాలు ఆయన చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తున్నాయి, ఎత్తుపల్లాలు లేని మార్గంలో వెళుతున్న గుర్రాలు తొట్రుపడి మోకాళ్ళ మీద కిందపడి పైకి లేచాయి. ఈ అకంపనుడు కూడా పశ్చిమ ద్వారంగుండానే బయటకి వెళ్ళాడు. ఆయన కొంతసేపు భయంకరమైన యుద్ధం చేసి వానరాలని కొట్టాడు. తరువాత హనుమంతుడు ఆయన మీదకి ఒక పర్వతాన్ని విసరగా దానిని ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు వేసిన ఒక పెద్ద చెట్టుని 14 బాణములతో కొట్టి బద్దలుచేశాడు. ఆ తరువాత హనుమంతుడు ఇంకొక పెద్ద చెట్టుని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తూ దారిలో ఉన్న రాక్షసులని కొట్టుకుంటూ, ఏనుగుల్ని ఎడమ చేతితో విసిరేస్తూ మహా రౌద్రరూపంతో ఆ చెట్టును పట్టుకెళ్ళి అకంపనుడిని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు పచ్చడై చనిపోయాడు.


అప్పుడు రావణుడు తన సర్వసైన్యాధికారి అయిన ప్రహస్తుడిని పిలిచి… “ప్రహస్తా! యుద్ధం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళాలి, కుంభకర్ణుడు వెళ్ళాలి, నికుంబుడు వెళ్ళాలి లేకపోతే తత్తుల్యమైన పరాక్రమము ఉన్న నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన వాడు తిరిగి రావడం లేదు, ఇప్పుడు కాని నువ్వు వెళితే యుద్ధం చేద్దాము. మనం యుద్ధం చెయ్యలేము అని నువ్వు అంటే యుద్ధం ఆపేద్దాము” అన్నాడు. 


అప్పుడు ప్రహస్తుడు… “మీరు ఈ మాట ఇంతకముందు ఒకసారి సభలో అడిగారు. అప్పుడు కొంతమంది… 'సీతమ్మని ఇచ్చెయ్యండి' అన్నారు. మీరు అప్పుడే ఇవ్వలేదు, ఇప్పుడు యుద్ధం ఆపడమేమిటండి. యజ్ఞంలో వేసిన దర్భలా వెళ్ళి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను వెళ్ళమనా మీ ఉద్దేశం” అన్నాడు.


అప్పుడు రావణుడు "ప్రహస్తా! నీ కంఠం గట్టిది, నువ్వు యుద్ధానికి వెళ్ళి గట్టిగా అరువు. వానరులకి యుద్ధం చెయ్యడం రాదు, వాళ్ళు చపలబుద్ధులు. నువ్వు గట్టిగా అరిస్తే అన్ని వానరాలు పారిపోతాయి. అప్పుడు యుద్ధ భూమిలో ఒక్క రామలక్ష్మణులు తప్ప ఎవరూ ఉండరు, అప్పుడు నువ్వు వాళ్ళని సునాయాసంగా కొట్టేయ్యచ్చు” అన్నాడు.


అప్పుడా ప్రహస్తుడు రావణుడికి ప్రదక్షిణ చేసి, రథానికి ప్రదక్షిణ చేసి కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. ఈయనకి కూడా అనేకమైన అపశకునాలు కనపడ్డాయి. ఈయన కూడా మిగతా వాళ్ళలాగానే వాటిని లెక్కచెయ్యకుండా తూర్పు ద్వారంగుండా ముందుకెళ్ళాడు.


అప్పుడు ప్రహస్తుడికి నీలుడికి యుద్ధం జరిగింది. ప్రహస్తుడు చాలా గొప్ప యుద్ధం చేసి ఎందరో వానరాలని చంపాడు. ప్రహస్తుడు నీలుడి మీద బాణాలని ప్రయోగిస్తే, ఆబోతు మీద వర్షం పడితే అది ఎంత సంతోషంగా ఉంటుందో, నీలుడు కూడా ఆ బాణాలు పడుతుంటే అంత సంతోషంగా ఉన్నాడు. నీలుడు ఒక చెట్టుని పెకలించి ప్రహస్తుడి రథాన్ని కొట్టాడు, అప్పుడా రథం పడిపోయింది. తరువాత ఆయన ఒక పెద్ద సాల వృక్షంతో ప్రహస్తుడి గుర్రాలని కొట్టాడు. ఆ తరువాత ఒక శిలని తీసుకొచ్చి ప్రహస్తుడి మీద పడేశాడు. దాంతో ఆ ప్రహస్తుడు కూడా మరణించాడు.


ప్రహస్తుడు మరణించాడన్న వార్త విన్న రావణుడు ఉద్విగ్నతని పొంది, తన సైన్యం అంతటినీ పిలిచి…

“ఇప్పుడు నేనే యుద్ధానికి వెళుతున్నాను. నేను బయటకి వెళ్ళాక వానరాలు లోపలికి రావచ్చు, అందుకని మీరందరూ జాగ్రత్త వహించి కోట శిఖరముల మీద నిలబడండి” అని చెప్పి రథం ఎక్కి, సైన్యాన్ని తీసుకొని యుద్దానికి వెళ్ళాడు.


రాముడంతటివాడు కూడా యుద్ధ భూమిలోకి వస్తున్న రావణుడిని చూసి 'మిట్ట మధ్యానం వేళ సూర్యుడిని చూస్తే స్పష్టంగా కనపడకుండా ఆయన తేజస్సు చేత కళ్ళు అదిరినట్టు, ఈయనని చూస్తే కూడా కళ్ళు అదురుతున్నాయి. ఎవరీ వస్తున్నవాడు' అని ఆశ్చర్యపోయి, వస్తున్నవాడు ఎవరని విభీషణుడిని అడిగాడు.


విభీషణుడు అన్నాడు “రామ! ఆ ఏనుగు మీద వస్తున్నవాడు అకంపనుడు(ఇందాక చనిపోయినవాడు కూడా అకంపనుడే, కాని వీడు ఇంకొక అకంపనుడు), వాడిది సామాన్యమైన యుద్ధం కాదు, వాడిని కనీసం పర్వత శిఖరాలతో కొట్టాలి, లేకపోతె వాడికి ఇష్టం ఉండదు. ఆయన పక్కన రథంలో వస్తున్నవాడు ఇంద్రజిత్. వాడి రథం యజ్ఞాగ్నిలో నుంచి బయటకి వస్తుంది, సింహములు పూన్చిన రథం మీద వస్తాడు. ఈ పక్కన, మహేంద్ర పర్వతం, వింధ్య పర్వతం ఎంత శరీరాలతో ఉంటాయో, ఎంత ధైర్యంతో ఉంటాయో, అంతటి ధైర్యము, శరీరము ఉన్న అతికాయుడు వస్తున్నాడు. పర్వత శిఖరం కదిలొస్తోందా అన్నట్టుగా ఉన్న ఆ ఏనుగు మీద వస్తున్నవాడు మహోదరుడు. అక్కడ ఒక గుర్రము ఎక్కి పాశము పట్టుకొని వస్తున్నవాడు పిశాచుడు, వాడు అరవీరభయంకరుడు. అటుపక్క వృషభం ఎక్కి చేతిలో శూలం పట్టుకొని వస్తున్నవాడు త్రిశిరస్కుడు, వాడు మహా ఘోరమైన యుద్ధం చేస్తాడు. అటుపక్క తన ధ్వజానికి సర్పాన్ని గుర్తుగా పెట్టుకొని, ధనుస్సు పట్టుకొని వస్తున్నవాడు కుంభుడు. అలాగే పర్వతాలని గులకరాళ్ళగా విసరగల బాహుపరాక్రమము కలిగినవాడు ఆ పక్కన వస్తున్నాడు, వాడి పేరు నరాంతకుడు. భోజనం చెయ్యడం అందరికీ ఎంత సంతోషమో, యుద్ధం చెయ్యడం అంత సంతోషంగా ఉండేవాడు నికుంభుడు. అదుగో అక్కడ పది తలకాయలతో, ఇరవై చేతులతో, కిరీటాలు వేసుకొని, కుండలాలు తొడుక్కొని, బ్రహ్మాండమైన పర్వతంవంటి భీమకాయం కలిగినవాడు, మహేంద్రుడు, యముడు, దేవతలు మొదలైనవారిని యుద్ధరంగంలో పరుగులు తీయించినవాడు, అందరినీ శాసించగలిగినవాడు, ఎవడి పేరు చెబితే లోకాలు ఏడుస్తాయో అటువంటి రావణుడు ఆ ఏనుగు మీద వస్తున్నాడు.


అప్పుడు రాముడు రావణుడిని చూసి "ఏమి తేజస్సు, ఏమి కాంతి, ఏమి స్వరూపం, ఏమి పరాక్రమం, మిట్ట మధ్యానం సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. ఇప్పటివరకూ నేను దేవతలలో కాని, యక్షులలో కాని, గంధర్వులలో కాని ఇంత తేజస్సు కలిగినవాడిని చూడలేదు. కాని ఇన్నాళ్ళకి రావణుడిని చూసే అదృష్టం కలిగింది, ఇక వీడు తిరిగి ఇంటికి వెళ్ళడు. ఎవరితో యుద్ధం చెయ్యాలని చూస్తున్నానో అటువంటివాడు ఇవ్వాళ యుద్ధ భూమిలోకి వచ్చాడు” అని సంతోషంగా ధనుస్సుని చేతితో పట్టుకొని టంకారం చేశాడు.


రావణుడిని చూడగానే సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పెకలించి గబగబా వెళ్ళి రావణుడి మీద పడేశాడు. తన మీదకి వస్తున్న ఆ పర్వత శిఖరాన్ని రావణుడు అర్థచంద్రాకార బాణాలతో తుత్తునియలు చేసి, బంగారు కొనలు కలిగిన బాణాలతో సుగ్రీవుడి గుండెల్లో కొట్టాడు. ఆ దెబ్బకి భూమిలో నుంచి జలం పైకొచ్చినట్టు సుగ్రీవుడి గుండెల్లోనుంచి రక్తం పైకి వచ్చింది. అంతటి సుగ్రీవుడు కూడా గట్టిగా అరుస్తూ కిందపడి మూర్చపోయాడు. తదనంతరం గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, ఋషభుడు, నలుడు మొదలైన వానర వీరులందరి మీద 4, 6, 8, 12 బాణములను ఏకాకాలమునందు విడిచిపెట్టి వాళ్ళ మర్మస్థానముల మీద కొట్టాడు. వాళ్ళందరూ కింద పడిపోయారు.

వానర వీరులందరినీ రావణుడు కొట్టేస్తున్నాడని హనుమంతుడు గబగబా వచ్చి రావణుడి రథం ముందు నిలబడి కుడి చెయ్యి బిగించి

“రావణా! నీకు బ్రహ్మగారి వరాలు ఉన్నాయని మిడిసిపడ్డావు, సీతమ్మని అపహరించావు, నా పిడికిలి గుద్దు చేత నీలోని జీవాత్మని పైకి పంపించేస్తాను రా” అన్నాడు.

అప్పుడు రావణుడు “నువ్వంత మొనగాడివైతే అది చాలా గొప్ప విషయమే, నన్ను గుద్దు చూస్తాను" అన్నాడు.

హనుమంతుడు తన పిడికిలిని బిగించి రావణుడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి రావణుడు స్పృహ తప్పినట్టయ్యి అటు ఇటూ తూలి 

“ఆహా! ఏమి గుద్దు గుద్దావురా, చేస్తే నీలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి” అన్నాడు.

అప్పుడు హనుమంతుడు “ఛీ దురాత్ముడా, ఇన్నాళ్ళకి నా పిడికిలి పోటు మీద నాకు అసహ్యం వేసింది. దీనితో గుద్దాక నువ్వు బతికి ఉన్నావు, ఎంత ఆశ్చర్యం. నేను ఇంక నిన్ను కొట్టను, నువ్వు నా వక్షస్థలం మీద గుద్దు, నా శక్తి ఏమిటో నువ్వు చూద్దువు కాని. అప్పుడు నేను నిన్ను మళ్ళి తిరిగి గుద్దుతాను” అన్నాడు.


అప్పుడు రావణుడు తన కుడి చేతిని బిగించి హనుమ యొక్క వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి హనుమంతుడు గిరగిరా తిరిగి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.```


        *రేపు…86వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

మంగళవారం🍁* *🌹01 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁మంగళవారం🍁*

   *🌹01 జూలై 2025🌹*      

     *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః* 

*ఆషాఢమాసం - శుక్లపక్షం*


*తిథి  : షష్ఠి* ఉ 10.20 వరకు ఉపరి *సప్తమి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం   : పుబ్బ* ఉ 08.54 ఉపరి *ఉత్తర ఫల్గుణి* *( ఉత్తర )* 

*యోగం : వ్యతీపాత* సా 05.19 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం   : తైతుల* ఉ 10.20 *గరజి* రా 11.04 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ప 12.00 - 01.00 మ 02.00 - 03.30*

అమృత కాలం  : *రా 03.15 - 05.00 తె*

అభిజిత్ కాలం  : *ప 11.45 - 12.38*

*వర్జ్యం          : సా 04.46 - 06.31*

*దుర్ముహూర్తం  : ఉ 08.16 - 09.08 రా 11.06 - 11.50*

*రాహు కాలం   : మ 03.28 - 05.06*

గుళికకాళం       : *మ 12.11 - 01.50*

యమగండం     : *ఉ 08.55 - 10.33*

సూర్యరాశి : *మిధునం*  

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 05.45*

సూర్యాస్తమయం :*సా 06.55*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.38 - 08.15*

సంగవ కాలం         :      *08.15 - 10.53*

మధ్యాహ్న కాలం    :     *10.53 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 04.07*

*ఆబ్ధికం తిధి         : ఆషాఢ శుద్ధ సప్తమి*

సాయంకాలం        :*సా 04.07 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.55*

రాత్రి కాలం           :*రా 08.55 - 11.50*

నిశీధి కాలం          :*రా 11.50 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.11 - 04.55*

-----------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🚩హనుమంతుని శ్లోకాలు🚩*


*అంజని నందన హనుమంత*

*అద్భుత వేగ హనుమంత*

*జయ బజరంగబలి* 

*జయజయ జయ బజరంగబలి*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

01.07.2025, మంగళవారం

 జై శ్రీమన్నారాయణ 

01.07.2025, మంగళవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం - శుక్ల పక్షం

తిథి:షష్ఠి మ12.17 వరకు

వారం:భౌమవాసరే

(మంగళవారం)

నక్షత్రం:పుబ్బ ఉ11.25 వరకు

యోగం:వ్యతీపాతం రా8.12 వరకు

కరణం:తైతుల ఉ12.17 వరకు తదుపరి గరజి రా12.46 వరకు

వర్జ్యం:రా7.06 - 8.49

దుర్ముహూర్తము:ఉ8.08 - 9.00

మరల రా10.57 - 11.41

అమృతకాలం:ఉ6.23 వరకు

మరల తె5.22 నుండి

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం;ఉ9.00 - 10.30

సూర్యరాశి:మిథునం

చంద్రరాశి: సింహం

సూర్యోదయం:5.32

సూర్యాస్తమయం:6.34



ప్రాధాన్యత జాబితాలో ఆరోగ్యకరమైన జీవితం అగ్రస్థానంలో ఉంటుంది. 'ఆరోగ్యమే గొప్ప సంపద' అని కూడా చెబుతుంటారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు మాత్రమే జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించగలుగుతారు. హెల్తీ గా ఉంచడంలో వైద్యుల పాత్ర చాలా ముఖ్యమైనది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని రకాల జబ్బులు వైద్యుల సహాయంతో నయమవుతాయి. బహుశా అందుకే డాక్టర్లకు భగవంతునితో సమానంగా చూస్తారు. భారతదేశపు ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ 1 జూలై 1882న జన్మించారు. అంతేకాదు ఆయన 1962సంవత్సరంలో జూలై 1వ తేదీనే మరణించారు. వైద్యరంగంలో వారి సేవలను గౌరవించేందుకు జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు...

పార్వతీ నందను పసి చేష్టలు!

 శు భో ద యం 🙏


పార్వతీ నందను పసి చేష్టలు!


              ఉ: " అంకముఁ జేరి, శైలతనయా స్తన దుగ్ధము లానువేళ, బా

                        ల్యాంక విచేష్ట తొండమున నవ్వలి చన్గబళిపఁబోయి, యా

                        వంకఁ గుచంబుఁ గాన కహి వల్లభ హారముఁగాంచి, వేమృణా

                        ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్తు, నభీష్ట సిధ్ధికిన్ ;


                         మనుచరిత్రము- అవతారిక- అల్లసాని పెద్దన !


               రాయల కాలంలో భువన విజయ సభామండప సాహితీ గౌరవానికి మూలకారకుడు 'ఆంధ్ర కవితాపితామహుడు " అల్లసాని పెద్దన! తొలి ప్రబంధ నిర్మాత! 


              కం: పెద్దన వలెఁగృతి సెప్పిన

                    పెద్దనవలె, తక్కువాని పెద్దనవలెనా?

                    ఎద్దనవలె మొద్దనవలె

                     గ్రద్దనవలె, కుందవరపుఁ గవిచౌడప్పా! - అనిపెద్దన కవితకు ప్రశంస! అల్లిక జిగిబిగిలో మొనగాడు. అతని కవితా చాతుర్యమునకు అవతారికలో నీపద్యము మచ్చుతునక! చిత్తగించండి! 


                  వినాయక ప్రార్ధనారూపమైన పద్యము. బాలగణేశ స్మరణము;


                           చిన్ని గణపయ్య తల్లి పార్వతీదేవి యొడిలో పాలుద్రాగు చున్నాడట; పార్వతి యర్ధనారీశ్వరి. ఆమెశరీరమందలి యర్ధభాగము పరమేశ్వరార్పిత మగుట నటువైపు పుస్త్వ లక్షణములేగాని స్త్రీత్వ సూచకమైన స్తన

సంపద యుండదు.


               ఈమతలబులన్నీ బాలగణేశున కేమెరుక? అతడు యెడమ వైపుగా బాలుగుడుచుచు కుడిప్రక్కకు చేయిసాచి

దేనికో వెదకు లాట ప్రారంభించెను. బాలు రొక వైపు బాలుద్రావుచు మరియొక వైపున నున్న స్తనమును పుణుకు చుండుట

స్వభావము. అతడా కార్యమునే యొనర్పసాగెను. కాని , యేమిప్రయోజనము? ఆవైపున నట్టిదేమియు దొరుకక పోగా సర్పహారము

చేతికందినది. చేతికి దొరకిన దానినూరక పోనిచ్చునా? మెత్త మెత్తగ నున్నది .తామఱతూడేమో ననుకొని నోటఁ బెట్టుచున్నాడట!


                           ఇదిగూడ బాల స్వభావమే! పెద్దన యెంతచక్కగా వ్రాసినాడు. ఇంతవరకు నెంతో యేకాగ్రతతో చదువు పాఠకుడు

బాలగణేశుని ఈచర్య చదివి ఫక్కున నవ్వకమానడు. నిజమునకు బాలుర స్వభావమేయంత? ఈగణేశుడు యేనిక మోమువాడు.కావున

తత్స్వభావమగు మృణాళనాళ భక్షణము సేయుట విహితమే! పైగా బాలుడగుట నాతనికి పామును మృణాళనాళమని భ్రమించుట కవకాశము కలిగినది. 


                  ఆబాల స్వభావమును ఆధారముగా గొని కవి యింత కథ నల్లినాడు. 


                        ఇంతకూ ఈప్రార్ధనా పద్యము నిట్లేల చిత్రించె నందురా? దానికి కారణమున్నది. వినుడు.రాయలు హాస్య ప్రియుడు.

ఒక్క రాయలనే యననేల ? జనులందరూ శృంగారము తరువాత యిష్టపడునది హాస్యమునే! మనమాటలలో హాస్యము లాస్యము

చేయుచున్నంతవరకూ ,మన మాటలకు యెదురుండదు. ఎటుదిరిగీ అది అపహాస్యము కారాదు. హృదయమునకు ఉల్లాసమును

గల్గించు హాస్యమును కాదనువారెవరు?


                  అదిగో ఆహాస్యమునకు అధిష్ఠాన దేవత గణపతి.అతని కరుణ లేకున్న కార్యభంగ మగుటయేగాక, పోయిన చోటనెల్ల

విరసమే యెదురగును. దానిని తప్పించుటకై హాస్య మూర్తియగు బాలగణపతిని ప్రార్ధన మొనరించెను.చూచితిరా పెద్దనగారి యోచన!


                                                     హాస్యమునకు స్ధాయి ,వికృతమైన వేషభాషలు, వికృత కార్యములు.


                 ఇపుడు పెద్దన గారివర్ణనమునకు తగిన కారణములు కనబడుచున్నవిగదా! 


                 బాల గణపతి గనుక దైవమైననూ హాస్యమాడుటలో(వేళాకోళం) తప్పుండదు!పైగానది స్వభావోచితమే!


               పామును జూచి తామరతూడనుకొనుట భ్రమ! కావున నిందు భ్రాంతిమంత మను నలంకారము

                                                 కల్పింప బడినది. ఇదీ పెద్దన చతురత!


                                                                    స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సుభాషితం

 *నేటి సుభాషితం* 

_(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)_


అనిర్వేదం చ దాక్ష్యం చ మనసశ్చాపరాజయః.

కార్యసిద్ధికరాణ్యాహు

స్తస్మాదేతద్బ్రవీమ్యహమ్

(4-49-6)


*అర్థం:*

ఉత్సాహం, సామర్థ్యం మరియు ధైర్యం ఓటమిని అధిగమించి విజయానికి దారితీస్తాయని అంటారు. అందుకే నేను ఇలా చెబుతున్నాను.


'శ్రీ ఆంజనేయ శతనామ స్తోత్రం' తో శుభోదయం 


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష* 

ధర్మో రక్షతి రక్షితః 


శుభ మంగళవారం

రైల్వే ప్రయాణికులకు చక్కటి ఆంధ్ర భోజనము

 ఫ్రెండ్స్... రైల్వే ప్రయాణికులకు చక్కటి ఆంధ్ర భోజనము అందజేస్తాము. మీరు చేయవలసినదల్లా ఒక్కరోజు ముందుగా తెలియ చేయవలెను. మీ భోగి వద్దకు మీరు కోరిన విధంగా టిఫిన్స్, భోజనం, పులిహార, దద్దోజనం, జ్యూస్, వాటర్ అందజేస్తాము.

విజయవాడ: మోహన్ గారు 7396881404

విజయవాడ: మధువని గారు 9182554800

బెంగళూరు ద్రాక్షాయిని గారు: 9738979748

బెంగళూరు శర్మగారు: 8892447050

సికింద్రాబాద్: ప్రసన్న గారు: 090329 10106

సికింద్రాబాద్: లంచ్ హోమ్: 9885785556

వైజాగ్ : మల్లికార్జున శర్మ గారు: 6281023114

వైజాగ్ : సాయిశర్మ గారు: 70323 24851

కాకినాడ హరి గారు: 081427 29222

తిరుపతి :లక్ష్మి గారు: 99598 59227

న్యూఢిల్లీ ఫణి కుమార్ గారు: 9650873730

చెన్నై తాంబరం స్టేషన్: 73959 32954

రాజమండ్రి :ప్రసన్న గారు: 63040 49434

నెల్లూరు :రాధాగారు: 93469 43145

వారణాసి : శైలజ గారు: 

షిర్డీ : అనిల్ గారు: 95111 11585

ఒరిస్సా :లహరి గారు: 70081 79751

గుంటూరు సాయి గారు: 7989585295

అరుణాచలం రవి గారు: 88702 18670

ఏలూరు: 86885 25350

ఒంగోలు సునీత గారు: 92907 77270

⚜ శ్రీ దైత్య సుడాన్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1159


⚜ మహారాష్ట్ర : లోనార్ 


⚜ శ్రీ దైత్య సుడాన్ ఆలయం



💠 భారతదేశంలోని అంతగా తెలియని పురాతన దేవాలయాలలో ఒకటి మహారాష్ట్రలోని లోనార్‌లోని దైత్య సుడాన్ ఆలయం


💠 దైత్య సుడాన్ ఆలయం మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలోని లోనార్ పట్టణం నడిబొడ్డున ఉన్న ఒక శక్తివంతమైన, ఆకట్టుకునే ఆలయం. ఈ అందమైన విష్ణు ఆలయం 6వ మరియు 12వ శతాబ్దాల మధ్య మధ్య & దక్షిణ భారతదేశాన్ని పాలించిన చాళుక్య రాజవంశం పాలనకు చెందినది. 

ఈ ఆలయం ఖజురాహో ఆలయాన్ని పోలి ఉంటుంది.



🔆 పౌరాణిక చరిత్ర


💠 లోనాసురుడు లేదా లవనాసురుడు అనే రాక్షసుడు తన సోదరీమణులతో కలిసి ఈ ప్రాంతంలో నివసించాడని ఒక పౌరాణిక చరిత్ర ఉంది.  

ఆయన దైత్యసుదన అవతారంలో విష్ణువు చేత చంపబడ్డాడు, అందుకే ఆ పేరు వచ్చింది. 


🔅 చరిత్ర


💠 విష్ణువు తన సోదరీమణులతో కలిసి ఈ ప్రాంతంలో భూమి కింద నివసించిన లోనాసురుడు లేదా లవణాసురుడిని చంపడానికి దైత్యసుడాన్ అనే యువ, అందమైన బాలుడి రూపంలో ఈ ప్రదేశానికి దిగివచ్చాడని చెబుతారు. 

లోనార్ సరస్సును సృష్టించడంలో ముగిసిన యుద్ధంలో దైత్య సుడాన్ రాక్షసుడిని చంపాడు.


💠 సూర్యుని నిలబడి ఉన్న విగ్రహాన్ని ఆలయం వెనుక ఉన్న ప్రధాన గుడిలో ఉంచారు. 

ఈ ఆలయం మొదట సూర్య దేవుడికి అంకితం చేయబడిందని ఇది ఊహిస్తుంది. అయితే, ప్రస్తుత రూపంలో, ఇది దైత్య సుడాన్ అవతారంలో విష్ణువు యొక్క వైష్ణవ ఆలయం.


 

💠 దైత్య సుడాన్ ఆలయం యొక్క భౌగోళిక విస్తరణ : 

దైత్య సుడాన్ ఆలయం 105 అడుగుల పొడవు మరియు 84.5 అడుగుల వెడల్పు ఉంటుంది. 

ఇది ఒక చెట్టు గది ఆలయం, లోపలి భాగంలో గర్భగుడి, ఇక్కడ లవణాసురుడి పైన నిలబడి ఉన్న విష్ణువు విగ్రహం ఉంది. అసలు విగ్రహం కనిపించకుండా పోయిన తర్వాత నేటి విగ్రహాన్ని నాగ్‌పూర్ భోల్సే పాలకులు తయారు చేశారు. 

రెండవ గదిని "అంతరాల్" అని పిలుస్తారు, ఇక్కడ ఈ పైకప్పుపై వ్యక్తిగత పూజలు నిర్వహించబడ్డాయి, 


💠 ఇక్కడ పురాణ కథలలో భాగంగా శ్రీకృష్ణుడు లవణాసురుడిని చంపడం మరియు లోనార్ యొక్క ధార్ కనిపించడం; కంసుడు మరియు కృష్ణుడి కథ, నరసింహుడు మరియు హిరణ కశ్యపుడి కథ మరియు చివరగా రాస క్రీడ రాతి నిర్మాణంలో చిత్రీకరించబడ్డాయి. 


 

💠 దైత్య సుడాన్ ఆలయ దేవత రాయిని పోలి ఉండే అధిక లోహ పదార్థం కలిగిన ఖనిజంతో తయారు చేయబడింది.


💠 దైత్య సుడాన్ ఆలయం యొక్క శిల్ప శైలి హేమద్పంతి శైలికి ఉత్తమ ఉదాహరణ. 


💠 దైత్య సుడాన్ ఆలయం యొక్క బయటి గదిని సభామండప్ అని పిలుస్తారు, ఇది సామూహిక నైవేద్యాలు మరియు ప్రదర్శన కోసం ఉద్దేశించబడింది. 

ఈ భాగం అలాగే ప్రవేశ ద్వారం మొత్తం ఆలయ శైలి మరియు నిర్మాణ అంశాలకు సరిపోలడం లేదు. దెబ్బతిన్న లేదా అసంపూర్తిగా ఉన్న ఆలయానికి ఇటుక పని తరువాత జోడించబడి ఉండవచ్చు, ఇది 10వ శతాబ్దం తర్వాత జరిగిన వివిధ దండయాత్రల కారణంగా ఉండవచ్చు.



💠 ఈ ఆలయం హేమద్పతి నిర్మాణ శైలిని పోలి ఉండే ఒక క్రమరహిత మరియు అసమాన నక్షత్రంలా కనిపిస్తుంది. 

ఈ ప్రార్థనా స్థలం గోడలపై అందమైన శిల్పాలు ఉన్నాయి. విగ్రహం కూడా ఒక ఖనిజంతో నిర్మించబడింది


💠 ఆలయం యొక్క పీఠం దాదాపు 1.5 మీటర్ల ఎత్తులో ఉంది మరియు అసంపూర్ణ పైకప్పు ముందుకు సాగని ఉద్దేశించిన పిరమిడ్ టవర్‌ను సూచిస్తుంది. బాహ్య గోడలలో ఆ యుగం యొక్క చరిత్రను వర్ణించే చెక్కబడిన బొమ్మలు ఉన్నాయి.


💠 లోనార్ చుట్టూ ఉన్న ప్రాంతం పురావస్తు శాస్త్రం మరియు చరిత్ర పరంగా చాలా ముఖ్యమైనది. 

చిఖ్లి సమీపంలోని లోనార్, మెహ్కర్ మరియు సత్గావ్ భూసారిలోని స్మారక చిహ్నాలతో, ఈ ప్రాంతం ఆసక్తికరమైన అంతగా తెలియని స్మారక చిహ్నాలతో నిండి ఉంది.



💠 ఈ ఆలయం ఒక ఆలయాన్ని మసీదుగా ఎలా మారుస్తారో చూపించే ఉదాహరణ. 

ఈ చారిత్రాత్మక హిందూ ఆలయాన్ని మసీదుగా మార్చడానికి ప్రయత్నించిన ముస్లిం దళాల దాడికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. 

ఆలయ ప్రధాన ద్వారం ఇస్లామిక్ శైలిలో ఎర్ర ఇటుకలతో కప్పడానికి ప్రయత్నాలు జరిగాయి.


💠 హేమద్‌పంతి నిర్మాణ శైలికి ఉత్తమ ఉదాహరణలలో ఒకటి, ఈ ఆలయం అసమాన నక్షత్రం రూపంలో నిర్మించబడింది. 

ఆలయం యొక్క అద్భుతమైన శృంగార శిల్పాలు ప్రసిద్ధ ఖజురాహో దేవాలయాలను పోలి ఉంటాయి 


💠 ఆలయం యొక్క మొత్తం ఉపరితలాన్ని కప్పి ఉంచిన వివరణాత్మక శిల్పాలు, పురాణాల నుండి కథలు, రామాయణం & మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాలు, వివిధ దేవుళ్ళు & దేవతల అవతారాలు, అప్సరసలు, యక్షులు, కిన్నరులు మరియు కామసూత్రాల నుండి కథలను వివరిస్తాయి.



రచన

©️ Santosh Kumar

18-33-గీతా మకరందము

 18-33-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ || మూడు విధములగు ధైర్యమును గూర్చి చెప్పబోవుచు మొదట సాత్త్వికధైర్యమును వివరించుచున్నారు-


ధృత్యా యయా ధారయతే 

మనః ప్రాణేన్ద్రియ క్రియాః | 

యోగేనావ్యభిచారిణ్యా 

ధృతిస్సా పార్థ సాత్త్వికీ || 


తా:- ఓ అర్జునా! చలింపని (విషయములందు ప్రవర్తింపని) ఏ ధైర్యముతో గూడిన వాడై మనస్సు యొక్కయు, ప్రాణము యొక్కయు, ఇంద్రియములయొక్కయు క్రియలను యోగసాధనచేత (విషయములనుండి త్రిప్పి ఆత్మధ్యానమున, లేక శాస్త్రోక్తమార్గమున) నిలబెట్టుచున్నాడో, అట్టి ధైర్యము సాత్త్వికమైనది.


వ్యాఖ్య:- ప్రపంచములో ధైర్యముగలవా రనేకులుందురు. కొందఱు యుద్ధమున ధైర్యముతో పోరాడుదురు. కొందఱు ధైర్యముతో నిశీధసమయమున భీకరారణ్యములలో సంచరించుదురు. కొందఱు ధైర్యముతో మహోన్నత పర్వతశిఖరముల నధిరోహించుదురు, సముద్రములను లంఘించుదురు. కాని ఆ ధైర్యములన్నిటికంటెను ఉపరిస్థానముననున్న ధైర్యమొకటి యిచ్చోట చెప్పబడినది. అదియే సాత్త్వికధైర్యము. అనగా ఏధైర్యముచే మనుజుడు తనమనస్సును, ఇంద్రియములను విషయభోగములనుండి నిరోధించునో, దృశ్యవ్యామోహమునుండి నివృత్తుడగునో, ఆదియే గొప్పధైర్యమని భగవానుడిచట సెలవిచ్చెను. కాబట్టి తక్కిన ధైర్యములు కలిగియున్నను, జన్మసాఫల్యకారణమగు ఈ పారమార్థిక ధైర్యమునుగూడ మనుజుడు తప్పక గలిగియుండవలెను.

అయితే ఆ ధైర్యము చపలముగ నుండరాదు. ఈ రోజున ఉండి రేపు అదృశ్యముకారాదు. కనుకనే "అవ్యభిచారిణ్యా” (నిశ్చలమైన) అని చెప్పబడినది. ఏలయనగా కొందఱు ముముక్షువులు ఏదియో యొక ఆవేశములో ధైర్యము కలిగి తమ ఇంద్రియాదులను నిగ్రహించినవారై, మఱల పరిస్థితుల ప్రాబల్యముచే క్రమముగ ఆ ధైర్యమును సడలించి, విషయములందు ప్రవర్తించుట కానంబడుచున్నది. అది "అవ్యభిచారిణీ ధైర్యము" కాదు. కాబట్టి స్థిరముగ నుండునట్టి ధైర్యమునే అవలంబించవలెను.


ప్ర:- సాత్త్వికధైర్య మెట్టిది?

ఉ:- ఏ నిశ్చలధైర్యముతో గూడి యోగసాధనచే మనుజుడు ఇంద్రియాదులను విషయముల నుండి నిరోధింపగల్గునో అట్టిధైర్యము సాత్త్వికమని చెప్పబడును.

తిరుమల సర్వస్వం -287*

 *తిరుమల సర్వస్వం -287*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-2


చరిత్ర లభ్యమైనంత వరకూ - వేంకటేశుణ్ణి తమ ఇలవేల్పుగా భావించి, అనేక కానుకలు సమర్పించి, తిరుమల ఆలయ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడిన హైందవ పాలకులు, భక్తులలో బాణులు, పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ, సాళువ, తుళువ, అరవీడు వంశీయులు; యాదవరాజులు, మరాఠా ప్రభువులు, కర్నాటకాన్ని పాలించిన హోయసలులు, మైసూరు ఒడయార్లు; ఉత్తరభారతావనికి చెందిన మహంతులను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ హైందవ రాజవంశీయులే కాకుండా - అన్య మతస్తులైన గోల్కొండ సుల్తానులు, ఆర్కాటు నవాబులు, మొగలుల వంటి మహమ్మదీయ పాలకుల; ఈస్టిండియా కంపెనీ, బ్రిటీషు ప్రభుత్వం, ఫ్రెంచి వారు వంటి క్రైస్తవ పాలకుల ప్రత్యక్ష, పరోక్ష ఏలుబడిలో కూడా తిరుపతి - తిరుమల ప్రాంతాలు, ఆలయం చాలాకాలం మనుగడ సాగించాయి. అయినప్పటికీ, ఆ స్వామి కృప వల్ల, తిరుమల - అనేక ఇతర హైందవాలయాల వలె - మతఛాందస ముష్కరమూకల దాడికి గురి కాలేదు. శిల్పసంపద చెక్కు చెదరలేదు. దేవాలయాల విధ్వంసమే జీవితధ్యేయంగా పెట్టుకున్న ఔరంగజేబు లాంటి మతోన్మాది కూడా ఈ ఆలయం జోలికి వచ్చే సాహసం చేయలేదు. అడపా దడపా చిన్నా, చితకా దాడులు జరిగినా - స్థానిక పాలకుల, అర్చకుల, భక్తుల తెగువ, సమయస్ఫూర్తి వల్ల ఆలయం, ఆనందనిలయుడు - ఇరువురూ పదిలం గానే ఉన్నారు. ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప - భక్తజనసందోహం, వార్షికాదాయం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. 


పరాయి పాలకులు హుండీ ఆదాయం పైనే ప్రముఖంగా దృష్టి సారించారు కానీ; భక్తజనాగ్రహానికి వెరచి స్వామివారి స్థిర చరాస్తులను, ఆలయ మర్యాదలను మాత్రం భద్రంగానే ఉంచారు. తిరుమల - తిరుపతి క్షేత్రాలలో మతమార్పిడులను ప్రోత్సహించ లేదు. అప్పట్లోనే ఆలయానికి ఉన్న విశేష జనాదరణే దీనికి కారణం. ఎవరి పాలనలో ఉన్నా - వారు హైందవులైనా, ఇతరులయినా - స్వామివారి వైదిక కైంకర్యాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ఘనత శ్రీవారికే గాక, వారి కైంకర్యపరులు, భక్తబృందం మొదలైన వారందరికీ దక్కుతుంది. ఇన్ని వందల ఏళ్ళ పాటు నిర్విరామంగా, ఆగమశాస్త్ర బద్ధంగా సేవలు కొనసాగిన మరో హైందవాలయం బహుశా చరిత్రలో లేదేమో! అయితే, కొందరు హైందవేతర పాలకులు మిగులు ఆదాయాన్ని పెంచుకునే నిమిత్తం క్షేత్రంలో అనాదిగా జరుగుతున్న ఉత్సవాల పరిధిని, ప్రాభవాన్ని; అన్నప్రసాదాల పరిమాణాన్ని; భక్తులకు ఉచితంగా కల్పించే అనేక సౌకర్యాలను కుదించడం మాత్రం విస్మరించలేని వాస్తవం. 


తిరుమల ఆలయం అన్యమతస్తుల దాడి నుంచి తనను తాను రక్షించుకోవడమే కాకుండా, ఇతర దేవాలయాల మూర్తులను కూడా సంరక్షించింది. ఆ వివరాలు మున్ముందు శ్రీవారి ఆలయం వైశిష్ట్యం అనే అధ్యాయంలో తెలుసుకుందాం.


వికటగిరీం

➖➖➖➖


చరిత్రకు అందనట్టి ప్రాచీనకాలం నుండి తిరుమల క్షేత్రం వివిధ నామాంతరాలతో పిలువబడుతూ, ప్రఖ్యాత వైష్ణవక్షేత్రంగా రాణిస్తోంది. చతుర్వేదాల్లో కెల్లా ప్రాచీనమైన ఋగ్వేదం లో తిరుమల క్షేత్రం వికటగిరీం అని సంస్కృతభాషలో ప్రస్తావించ బడింది. వేదాలు అపౌరుషేయాలు కావున ఋగ్వేదం ఏనాటిదో నిర్థారించలేము కానీ, సుమారు పదివేల సంవత్సరాలకు పైగా ప్రాచీనమైనదని చరిత్రకారులు భావిస్తారు. తిరుమల క్షేత్రం అత్యంత (పదివేల సంవత్సరాలకు పైగా) పురాతనమైనదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి? ఇక, పురాణేతిహాసాలను ప్రాతిపదికగా తీసుకుంటే - అనేక పూర్వయుగాలు, కల్పాలు, మన్వంతరాల నుండి కూడా తిరుమలక్షేత్రం జగజ్జేగీయమానంగా వెలుగొందుతూ, మానవాళితో బాటు దేవతలు, దానవులు, యక్షకిన్నెర కింపురుషులు సహిత సమస్త చరాచరజీవులకు ఐహికాముష్మికానందాలను ప్రసాదిస్తోంది.


వేదాలతో బాటుగా, హైందవసంస్కృతికి ఆలంబనగా నిలిచే అష్టాదశ పురాణాలలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన కానవస్తుంది. ఇంతే కాక - కొన్ని రామాయణ, మహాభారత గ్రంథాలలో కూడా తిరుమలక్షేత్రం ఉటంకించబడినట్లుగా కొందరు చెబుతారు. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*


*424 వ రోజు*


*సోమతీర్థం*


తరువాత బలరాముడు సోమతీర్ధముకు వెళ్ళాడు. అక్కడ సోముడు రాజసూయయాగం చేసాడు. ఆ ప్రదేశంలో ఇంద్రుడు షణ్ముఖుని దేవసేనకు అధిపతిగా అభిషిక్తుడిని చేసాడు. ఆ తరువాత షణ్ముఖుడు తారకాసురుడిని సంహరించాడు. పరమేశ్వరుడు ఒకసారి తన రేతస్సును దేవతల కోరిక మీద అగ్ని ఆ తేజస్సును భరించ లేక బ్రహ్మతో మొరపెట్టుకోగా బ్రాహ్మ ఆ తేజస్సును గంగా నదిలో దాచమని చెప్పాడు. గంగానది కూడా ఆ తేజస్సును భరించలేక హిమాలయాల మీద ఒక తటాకంలో రెల్లు పొదలలో ఉంచింది. అప్పుడు కుమార జననం జరిగింది. అప్పుడు అతడికి కృత్తికలు ఆరుగురు తమ పాలు ఇచ్చి పోషించి కుమారుడికి తల్లులు అయ్యారు. బృహస్పతి స్వయంగా కుమారునికి జాతకకర్మలు గావించాడు. ఒక రోజు పరమశివుడు పార్వతి సమేతుడై, రుద్రగణాలతో అక్కడకు వచ్చారు. అదే సమయంలో అక్కడకు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, దిక్పాలకులు, మరుత్తులు, పితృగణాలు అక్కడకు వచ్చారు. అప్పుడు శివుడు అక్కడ తాను, పార్వతీ, గంగ, అగ్ని ఉన్నారు కదా కుమారుడు ముందు ఎవరికి ముఖ్యత్వం ఇస్తాడు అనుకున్నాడు. అలాగే మిగిలిన వారు అలాగే అనుకున్నారు. వారి మనోగతం తెలుసుకున్న కుమారుడు నాలుగు రూపాలతో వారి వద్దకు వెల్లాడు. పరమ శివుడు బ్రహ్మను చూసి " దేవా ! మహా తేజశ్వి అయిన ఈ కుమారునికి తగిన పదవిని మీరే నిర్ణయించండి " అన్నాడు. బ్రహ్మ " మహాదేవా ! ఇతడు దేవతల హితం కోరే వాడు కనుక ఇతడికి దేవ సైన్యాధిపత్యం ఇవ్వండి " అన్నాడు. అక్కడి వారంతా బ్రహ్మదేవుడి మాటకు ఆమోదం తెలిపారు. అందరూ సరస్వతీనదీ తీరం చేరి షన్ముఖుడిని బంగారు సింహాసనం మీద కూర్చుండ పెట్టి బృహస్పతి హోమ కార్యం నిర్వహిస్తుండగా దేవసేనకు అభిషిక్తుడిని చేసాడు. ఈశానుడు, విష్ణువు అభిషేకద్రవ్యాలను పూర్ణకలశాలను పట్టుకున్నారు. గంధర్వులు, అప్సరసలు మంగళ గీతాలు ఆలపించారు. మహామునులు పుణ్యాహవాచనములు నిర్వర్తించారు. లక్ష్మీదేవి, సరస్వతి, శచీదేవుల ఆశీర్వాదంతో షణుముఖునికి ఇక్కడ అభిషేకం జరిగింది. శంకరుడు , విష్ణువు, దేవతలు తమ బలంలో కొంత భాగాన్ని అతడికి కానుకగా ఇచ్చారు. శంకరుడు ఉదయభాస్కరునితో సమానమైన పతకాన్ని, బ్రహ్మదేవుడు రాక్షస సంహారానికి అవసరమైన శక్తిని, విష్ణువు వనమాలను ఇచ్చాడు. పార్వతీ దేవి మాయని పట్టుబట్టలను ఇవ్వగా, గంగాదేవి ఉజ్వలమైన అమృతమయమైన కమండలం ఇచ్చింది, గురువు దండమును, గరుడుడు నెమలిని, వరుణుడు తామర తూడులను, కుబేరుడు మేకలను, బ్రహ్మ కృషాజినం బహూకరించాడు. అతడి వైభవమును చూసిన ఈశ్వరుడు " ఇతడు తప్పక రాక్షసులను సంహరిస్తాడు " అని అతడికి భూతమయమైన సైన్యాన్ని ఇచ్చాడు. అప్పుడు అందరూ భేరీ నాదం చేస్తూ శంఖనాదం చేసారు. కుమారుడు " మీరు చంపమన్న శత్రువును చంపుతాను " అని వారితో పలికాడు. ఆ తరువాత కుమారుడు దేవతలను తారకాసురుడు బాధించడం తెలుసుకొని తారకారురుడిని శక్తిఆయుధ ప్రయోగంతో ససైన్యంగా సంహరించాడు. ఆ తరువాత లోక కంటకుడైన బలిచక్రవర్తి కుమారుడైన బాణుడిని తన శక్తిఆయుధముతో సంహరించి ముల్లోకాలకు శాంతి కలిగించాడు.


*అగ్ని తీర్థం*


సోమతీర్థం నుండి బలరాముడు అగ్ని తీర్థం వద్దకు వెళ్ళాడు. ఇక్కడ " భృగు శాపానికి గురి అయిన అగ్నిదేవుడు అలిగి ఇక్కడ ఉండగా దేవతలు అతడిని బుజ్జగించి సర్వ భక్షకుడివి కమ్మని భృగువు ఇచ్చిన శాపం జరిగినా ఏది భక్షించినా అగ్ని పవిత్రత చెడదని వరమిచ్చారు. అగ్ని సంతసించి తిరిగి తన విధి నిర్వహణకు పూనుకున్న ప్రదేశం ఇదే. అందు వలన ఈ ప్రదేశానికి అగ్నితీర్థం అనే పేరు వచ్చింది. బలరాముడు ఆ తరువాత కుబేర తీర్ధానికి వెళ్ళాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సాలిగ్రామం

 గండకీ నది జన్మవృత్తాంతము మరియు

సాలిగ్రామం ఎలా పుట్టింది


కాళీ గండకి నది లేదా గండకి నదిని దక్షిణ నేపాల్‌లో నారాయణి నది & భారతదేశంలో గండక్ అని కూడా పిలుస్తారు. ఈ గండకి నది నేపాల్‌లోని ప్రధాన నదులలో ఒకటి మరియు భారతదేశంలో గంగానదికి ఎడమ ఒడ్డున ఉపనది. ఈ నదిని నేపాల్‌లో కృష్ణ గండకి అని కూడా పిలుస్తారు. ప్రాథమికంగా గండకి నది / కాళీ గండకి నది / గండకి నీటికి ఐదు ప్రధాన ఉపనదులు , అవి దరౌడి, సేతి, మడి, మార్స్యండి & బుధి గండకి.


గండకి నది లేదా గండకి నది కాళీ & త్రిసులి నదుల కలయిక ద్వారా ఏర్పడుతుంది మరియు ఈ రెండు నదులు నేపాల్‌లోని గొప్ప హిమాలయ శ్రేణిలో పుడతాయి. ఈ జంక్షన్ నుండి భారత సరిహద్దు వరకు ఈ నదిని నారాయణి నది అని పిలుస్తారు. గండకి నది భారతదేశంలోకి నైరుతి వైపు ప్రవహిస్తుంది మరియు తరువాత బీహార్-ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు వెంట ఆగ్నేయంగా మారుతుంది. ఇండో-గంగా మైదానంతో పాటు, ఈ నది 765 కి.మీ (475 మైళ్ళు) వంకర మార్గం తర్వాత పాట్నా ఎదురుగా గంగా నదిలోకి ప్రవేశిస్తుంది.


నేపాల్ లోని గండకి నది కథలో పరమాత్మ పాపులను దైవిక విశ్వాసం ద్వారా సమర్థించడం మరియు వారిని కొత్త లేదా పునర్జన్మ సృష్టిగా మార్చడం అనే సార్వత్రిక ఇతివృత్తం ఉంది. ఇది వారి ప్రాపంచిక స్థానం ఉన్నప్పటికీ దైవిక సత్యాన్ని కోరుకునే వారి గురించిన కథ. గండకి నది కథ అనేది చివరి నిమిషంలో విశ్వాసిని భయంకరమైన విశ్వాసం యొక్క చర్య చేయకుండా దేవుడు నిరోధించిన కథ.



నేపాల్ గండకి నది కథ

ఒకప్పుడు "గండకి" అనే అమ్మాయి ఒక వేశ్య కుమార్తె ఉండేది. కఠినమైన సామాజిక నిబంధనల ప్రకారం, గండకి అనే అమ్మాయి ఎల్లప్పుడూ తన తల్లిలాగే అదే పనిని చేపట్టాలి. కానీ ప్రతి భార్యకు విధించిన కఠినమైన నియమాన్ని నెరవేర్చడానికి ఆమె ఆకర్షితురాలైంది, ఆమె ప్రతి వివాహితలో స్వర్గపు భర్త లేదా పతి పరమేశ్వరుడి స్వరూపాన్ని చూసింది. ఒక రోజు ఆమెను ఒక అందమైన యువకుడు సందర్శించాడు, అతను ఆమెకు మంచి జీతం ఇచ్చాడు కానీ దురదృష్టవశాత్తు ఆమెను చూడకుండానే ఆమెను విడిచిపెట్టాడు.


కానీ ఆమె సాధారణ విశ్వాసంతో, గండకి ఆ అందమైన యువకుడి కోసం వేచి ఉంది మరియు చివరికి అర్ధరాత్రి సమయంలో అతను తిరిగి కనిపించాడు. ఆమె అతనికి సేవ చేసి ప్రేమ యొక్క అన్ని కళలతో అతనికి విలాసంగా ఇచ్చింది. ఆమె అతనికి స్నానం చేయిస్తున్నప్పుడు, అతని శరీరం కుష్టు వ్యాధితో తినేసిందని ఆమె కనుగొంది మరియు ఎటువంటి సంకోచం లేకుండా, ఆమె తనను తాను పూర్తిగా అతనికి అప్పగించుకుంది. ప్రజలు ఆశ్చర్యపోయారు మరియు ఆమె దానిని ఎలా భరించగలదని మరియు అతనిని ఎలా లాలించగలదని అడిగారు. ఆమె, "సూర్యోదయానికి ముందే, అతను ఇప్పటికీ నా జీవిత భాగస్వామి అవుతాడు" అని సమాధానం ఇచ్చింది.


కానీ ఆ ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆ యువకుడు మరణించాడు. అప్పుడు గండకి తన భర్త పట్ల తన విశ్వాసాన్ని అంతిమంగా వ్యక్తపరచాలనుకుంది మరియు ఆమె అతనితో (సతి) దహనం చేయబడుతుంది. ఆమె అంత్యక్రియల చితికి వంగి ఉండగా అకస్మాత్తుగా ఆ యువకుడి శరీరం పూర్తిగా బంగారంగా మారిపోయింది మరియు అతనికి నాలుగు చేతులు వచ్చాయి. అప్పుడు అతను ఆమెతో మాట్లాడి, "నేను విష్ణు నారాయణుడిని మరియు నేను నిన్ను పరీక్షించడానికి వచ్చాను. మీరు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు మరియు ఇప్పుడు మీకు మూడు కోరికలు ఉండవచ్చు" అని అన్నాడు. ఆ అమ్మాయి తనకు ఒకే ఒక కోరిక ఉందని చెప్పింది "మీరు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టకూడదు!"


అప్పుడు విష్ణువు ఆమెకు తాను రాయిగా మారడానికి శపించబడ్డానని వివరించాడు. అతను కొనసాగించాడు, "నువ్వు నదిగా మారతావు, మరియు నేను రాతి ఆకారంలో ఎప్పటికీ మీ ఒడిలో ఉంటాను." మరియు దీనికి చిహ్నంగా, మీరు "సాలగ్రామి" అనే పేరును కలిగి ఉండాలి (శాలిగ్రామం / సాలగ్రామం / సాలగ్రామం / సాలగ్రామం / సాలగ్రామ రాళ్ళు కలిగి ఉండాలి).

నేపాల్‌లోని గండకి నది నుండి శాలిగ్రామ శిల

గౌతమీయ తంత్రం ప్రకారం, గండకి నది / కాళి గండకి నది దగ్గర, సాలగ్రామ్ అనే పెద్ద ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో కనిపించే రాళ్లను సాలగ్రామ్ శిల లేదా సాలగ్రామ్ శిల అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం, ఈ రాయి అంటే సాలగ్రామ్ శిల "వజ్ర-కీట" అని పిలువబడే ఒక చిన్న కీటకానికి ఆశ్రయం. వజ్ర-కీటక కీటకాలు వజ్ర-దంతాన్ని కలిగి ఉంటాయి, ఇది సాలగ్రామ్ రాయిని చీల్చి దాని లోపల ఉంటుంది.


సాలగ్రామ్ లేదా సాలగ్రామ్ పై ఉన్న అన్ని గుర్తులు దీనికి ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తాయి. సాలగ్రామ్ లు నలుపు, జెట్ బ్లాక్, ఎరుపు, నీలం, పసుపు & ఆకుపచ్చ వంటి వివిధ రంగులలో వస్తాయి. ఎరుపు రంగు సాలగ్రామ్ తప్ప అన్ని రకాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి కానీ పసుపు & బంగారు రంగు సాలగ్రామ్ లు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఎరుపు రంగు సాలగ్రామ్ భక్తుడి శరీరం నుండి ప్రాణాంతక మరియు ప్రమాదకరమైన వ్యాధులను తొలగిస్తుంది.

ఎర్రటి శాలిగ్రామం "తంత్రం" మరియు "విప్రీత తంత్రం", ప్రతికూలత, దుష్టశక్తులు మొదలైన మాయాజాల తొలగింపుకు కూడా ఉపయోగించబడుతుంది. వివిధ ఆకారాల శాలిగ్రామాలు మత్స్య శాలిగ్రామం , నరసింహ శాలిగ్రామం , కూర్మ శాలిగ్రామం , సుదర్శన శాలిగ్రామం వంటి విష్ణువు యొక్క వివిధ అవతారాలతో సంబంధం కలిగి ఉంటాయి.

అష్టసిద్ధులు

 ప్రపంచంలో హిందూ ధర్మం యొక్క గొప్పతనం👇


హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, అష్టసిద్ధులు అంటే ఎనిమిది రకాల గొప్ప శక్తులు, నవనిధులు అంటే తొమ్మిది రకాల సంపదలు. ఈ రెండూ హనుమంతునికి సీతమ్మ తల్లి ప్రసాదించినవని పురాణాలూ చెబుతున్నాయి. 

అష్టసిద్ధులు (Ashta Siddhis):

1. అణిమ:

తన శరీరాన్ని అణుమాత్రంగా చిన్నదిగా చేసుకోగల శక్తి.

2. మహిమ:

తన శరీరాన్ని ఇష్టమున్నంత పెద్దగా చేసుకోగల శక్తి.

3. లఘిమ:

తన శరీరాన్ని చాలా తేలికగా చేసుకోగల శక్తి.

4. గరిమ:

తన శరీరాన్ని చాలా బరువైనదిగా చేసుకోగల శక్తి.

5. ప్రాప్తి:

కోరుకున్న వస్తువులను పొందగల శక్తి.

6. ప్రాకామ్య:

కోరికలు తీర్చుకోగల శక్తి.

7. ఈశిత్వ:

అన్నింటిపైనా అధికారం చలాయించగల శక్తి.

8. వశిత్వ:

సమస్త భూతాలను వశపరచుకోగల శక్తి. 



నవనిధులు (Nava Nidhis):


మహాపద్మ: గొప్ప సంపద.

పద్మ: అందమైన సంపద.

శంఖ: అపారమైన సంపద.

మకర: అపారమైన ధనం.

కచ్ఛప: అపరిమితమైన సంపద.

ముకుంద: కోరినవన్ని పొందే సంపద.

కుంద: ఎల్లప్పుడూ ఉండే సంపద.

నీల: అంతరించిపోని సంపద.

ఖర్వ: ఎవరికీ దొరకని సంపద.

కంచిపరమాచార్యవైభవం

 అత్యవసర చికిత్స 


కుంభకోణ మఠంలో చంద్రమౌళీశ్వర పూజ పూర్తైన తరువాత, పరమాచార్య స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.


శ్రీమఠంతో సంబంధం ఉన్న ఒక రైతు ఆత్రుతగా స్వామివారి వద్దకు పరిగెత్తుకుని వచ్చి, స్వామివారి పాదాలపై పడి విలపించసాగాడు, “నా కుమారుణ్ణి కాపాడండి దేవుడా!” అని.


ఏమి జరిగిందో కనుక్కోమని సహాయకునికి చెప్పారు స్వామివారు.


ఆ రైతుకి ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ పిల్లవాడు ఆహారం తింటున్నప్పుడు, ఒక పాము అతని శరీరంపై పాకి వెళ్లిపోవడం వల్ల భయంతో మూర్చిల్లాడు. పాము కరిచిందో లేదో తెలియడంలేదు. సాధారణంగా పాము కాటుని మంత్రంతో పోగొట్టే ఒక పధ్ధతి ఉంది. కాని ఆ మంత్రం తెలిసిన వారు దగ్గరలో ఎవరూ లేరు.

“సామి మాత్రమే వాణ్ణి కాపాడాలి . . .”


మహాస్వామివారు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. “ఆ పిల్లవాని నుదురుపై పూయండి”.


“సరే సామి”


“మీ ఇంట్లో శీకాయ పుడి ఉందా?”


“ఉంది సామి” అని తలూపాడు.


“పిల్లవాని పెదాలు వేరుచేసి, కొద్దిగా శీకాయ పొడి వేసి చిన్నగా రుద్దండి. చేదుగా ఉందని పిల్లవాడు ఉమ్మివేస్తే, పాము కరవలేదని అర్థం. తీయగా ఉన్నదని లోపలి తీసుకుంటే, పాము కరచిందని అర్థం. దాని ప్రకారంగా చికిత్స చెయ్యాలి. వెళ్లి పిల్లవాడికి శేకాయ పొడి ఇవ్వు”


ఆ రైతు పరుగున ఇంటికి వెళ్లి స్వామివారు చెప్పినట్టుగా చేశాడు. శీకాయ పొడిని నోటిలో వెయ్యగానే, “చేదు, చేదు” అని ఉమ్మేశాడు. పాము కరవలేదని ఆ రైతు చాలా సంతోషపడ్డాడు.


పరిస్థితి చక్కబడిన తరువాత ఆ రైతు కుటుంబంతో సహా స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆ రితు భార్యతో స్వామివారు, “ప్రతి రోజూ ఇంటిలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించు” అని చెప్పారు.


--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.




#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత:  ఎనిమిదవ అధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:


అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే 

రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే (18)


భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే 

రాత్ర్యాగమే௨వశః పార్థ ప్రభవత్యహరాగమే (19)


పార్థా.. బ్రహ్మదేవుడి పగటిసమయంలో చరాచర వస్తువులన్నీ అవ్యక్త ప్రకృతి నుంచి కలుగుతాయి. మళ్ళీ రాత్రికావడంతోనే అవ్యక్తం అనబడే ఆ ప్రకృతి లోనే కలసిపోతాయి. ఈ జీవకోటి పుట్టి పుట్టి బ్రహ్మకు రాత్రి రావడంతోనే ప్రకృతిలో లీనమవుతుంది. పగలు కాగానే మళ్ళీ పుడుతుంది.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝 *సత్యం స్వర్గస్య సోపానం*

            *పారావారస్య నౌరివl*

            *నాస్తి సత్యాత్పరం దానం*

            *నాస్తి సత్యాత్పరం తపఃll*


*తా𝕝𝕝 "సత్యము స్వర్గప్రాప్తికి నిచ్చెనవంటిది. సంసారసాగరాన్ని దాటేందుకు సత్యము నావవంటిది. సత్యవాక్పాలనమును మించిన దానము లేదు. తపస్సుయూ లేదు"*

                   

 ✍️🌸💐🌹🙏

Panchaag