శ్రీమద్భగవద్గీత: ఎనిమిదవ అధ్యాయం
అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:
అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే (18)
భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే
రాత్ర్యాగమే௨వశః పార్థ ప్రభవత్యహరాగమే (19)
పార్థా.. బ్రహ్మదేవుడి పగటిసమయంలో చరాచర వస్తువులన్నీ అవ్యక్త ప్రకృతి నుంచి కలుగుతాయి. మళ్ళీ రాత్రికావడంతోనే అవ్యక్తం అనబడే ఆ ప్రకృతి లోనే కలసిపోతాయి. ఈ జీవకోటి పుట్టి పుట్టి బ్రహ్మకు రాత్రి రావడంతోనే ప్రకృతిలో లీనమవుతుంది. పగలు కాగానే మళ్ళీ పుడుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి