27, ఏప్రిల్ 2025, ఆదివారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🕉️సోమవారం 28 ఏప్రిల్ 2025🕉️*


           *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...


      *వాల్మీకి రామాయణం*

             *22వ  భాగం*

                   

దశరథుడి కుమారుల పెళ్ళికి, భరతుడి మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళదామని వచ్చాడు. కాని అప్పటికే భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకొని ఆయన కూడా మిథిలకి పయనమయ్యాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల వివాహాన్ని కన్నులార చూసి, వాళ్ళతోపాటే అయోధ్యకి వచ్చాడు. కొంతకాలం అయ్యాక యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు, భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఎన్ని భోగాలని అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు.


దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు నాలుగు చేతుల వంటివారు, ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ, మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు. నలుగురిని సమానమైన దృష్టితో చూసేవారు.కాని ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి, ఎందుకంటే...

```

*తేషామపి మహాతేజా రామో రతికరః పితుః।*

*స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః॥*```


రాముడికి ఉన్న గుణముల చేత, దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏమిటంటే, ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాడు (ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడక పోవచ్చు, కన్ను చూడలేక పోవచ్చు, నోటితో మాట్లాడలేక పోవచ్చు, కాలు-చెయ్యి పని చేయకపోవచ్చు, కాని పుట్టుకతో చెడ్డ మనస్సుతో ఎవడూ పుట్టడు, మన మనసుని మనం మార్చుకోగలము, అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలము),ఎప్పుడూ మృదువుగా, మధురంగా మాట్లాడతాడు, అవతలివాడు వెర్రికేకలు వేస్తే, ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు, వాదనలు చేసేవాడు కాదు, అవతలివాడు తనకి వంద అపకారాలు చెసినవాడైనా కాని, తనకి ఒకసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం, రాముడు అతను చేసిన ఉపకారాన్ని గుర్తుకుతెచ్చుకొని ఆనందపడతాడు (అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు), బుద్ధిమంతుడు, ముందు తనే పలకరించేవాడు, అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే, ‘అయ్యో! నేను వాళ్ళని పలకరించలేకపోయానే’ అని బెంగ పడేవాడు, అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు, ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అయినప్పటికీ నేను ఇంతటివాడిని అని ఎప్పుడూ అనుకోడు, తనకన్నా పెద్దవాళ్ళని ఎల్లప్పుడూ గౌరవించేవాడు, ఎప్పుడూ ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడేవాడుకాదు, శ్రేయస్కరముకాని పని చేసేవాడు కాదు (మనం ఏదన్నా పని చేసేముందు, మన లోపలి బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది, కాని మన మనసు ఆ మాట వినదు, అది ఈ పని చెయ్యద్దు అని అనదు, అదేమంటుందంటే, అందరు చేస్తున్నారు, మడి కట్టుకుని కూర్చుంటే ఎందుకూ పనికిరాము, ఈ మాత్రానికే ఏమి కొంపలు మునిగిపోవు, ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవడికీ తెలీదు అని పలురకాలుగా మభ్యపెట్టి, ఇంద్రియాలకి లొంగి, శ్రేయస్కరము కాని పని చేయిస్తుంది. కాని రాముడు మనసుకి లొంగి శ్రేయస్కరము కాని పనిని ఎన్నడూ చేసేవాడు కాదు), అలాగే...```

*ధర్మకామార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్।*

*లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః॥*```


గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉందట, సమయస్పూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉందట, ఆచారాలని పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు. ప్రాజ్ఞులైనవారిని, సత్పురుషులని ఎలా రక్షించాలో తెలిసున్నవాడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో, ఎలా ఆర్జించాలో, ఎలా ఖర్చుపెట్టాలో తెలిసున్నవాడు. సంగీత, శిల్ప, నృత్యములందు ఆరితేరినవాడు. అలాగే లొంగనటువంటి గుర్రాలని, ఏనుగుల్ని లొంగతీసుకుని వాటిమీద స్వారి చెయ్యగలిగే శక్తి ఉన్నవాడు, ప్రపంచంలో ఉన్న అతికొద్దిమంది అతిరథులలో శ్రేష్టుడైనవాడు, ఎన్ని అస్త్ర-శస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణ ప్రయోగం చెయ్యనివాడు.


ఇన్ని గుణములతో అందరినీ సంతోషింప చెయ్యగలిగేవాడు కనుక రాముడంటే దశరథుడికి అంత ప్రీతి. 


*రేపు...23వ భాగం*

        

*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🕉️సోమవారం 28 ఏప్రిల్ 2025🕉️*


           *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...


      *వాల్మీకి రామాయణం*

             *22వ  భాగం*

                   

దశరథుడి కుమారుల పెళ్ళికి, భరతుడి మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళదామని వచ్చాడు. కాని అప్పటికే భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకొని ఆయన కూడా మిథిలకి పయనమయ్యాడు. రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల వివాహాన్ని కన్నులార చూసి, వాళ్ళతోపాటే అయోధ్యకి వచ్చాడు. కొంతకాలం అయ్యాక యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు, భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఎన్ని భోగాలని అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు.


దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు నాలుగు చేతుల వంటివారు, ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ, మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు. నలుగురిని సమానమైన దృష్టితో చూసేవారు.కాని ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి, ఎందుకంటే...

```

*తేషామపి మహాతేజా రామో రతికరః పితుః।*

*స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః॥*```


రాముడికి ఉన్న గుణముల చేత, దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏమిటంటే, ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాడు (ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడక పోవచ్చు, కన్ను చూడలేక పోవచ్చు, నోటితో మాట్లాడలేక పోవచ్చు, కాలు-చెయ్యి పని చేయకపోవచ్చు, కాని పుట్టుకతో చెడ్డ మనస్సుతో ఎవడూ పుట్టడు, మన మనసుని మనం మార్చుకోగలము, అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలము),ఎప్పుడూ మృదువుగా, మధురంగా మాట్లాడతాడు, అవతలివాడు వెర్రికేకలు వేస్తే, ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు, వాదనలు చేసేవాడు కాదు, అవతలివాడు తనకి వంద అపకారాలు చెసినవాడైనా కాని, తనకి ఒకసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం, రాముడు అతను చేసిన ఉపకారాన్ని గుర్తుకుతెచ్చుకొని ఆనందపడతాడు (అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు), బుద్ధిమంతుడు, ముందు తనే పలకరించేవాడు, అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే, ‘అయ్యో! నేను వాళ్ళని పలకరించలేకపోయానే’ అని బెంగ పడేవాడు, అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు, ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అయినప్పటికీ నేను ఇంతటివాడిని అని ఎప్పుడూ అనుకోడు, తనకన్నా పెద్దవాళ్ళని ఎల్లప్పుడూ గౌరవించేవాడు, ఎప్పుడూ ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడేవాడుకాదు, శ్రేయస్కరముకాని పని చేసేవాడు కాదు (మనం ఏదన్నా పని చేసేముందు, మన లోపలి బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది, కాని మన మనసు ఆ మాట వినదు, అది ఈ పని చెయ్యద్దు అని అనదు, అదేమంటుందంటే, అందరు చేస్తున్నారు, మడి కట్టుకుని కూర్చుంటే ఎందుకూ పనికిరాము, ఈ మాత్రానికే ఏమి కొంపలు మునిగిపోవు, ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవడికీ తెలీదు అని పలురకాలుగా మభ్యపెట్టి, ఇంద్రియాలకి లొంగి, శ్రేయస్కరము కాని పని చేయిస్తుంది. కాని రాముడు మనసుకి లొంగి శ్రేయస్కరము కాని పనిని ఎన్నడూ చేసేవాడు కాదు), అలాగే...```

*ధర్మకామార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్।*

*లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః॥*```


గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉందట, సమయస్పూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉందట, ఆచారాలని పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు. ప్రాజ్ఞులైనవారిని, సత్పురుషులని ఎలా రక్షించాలో తెలిసున్నవాడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో, ఎలా ఆర్జించాలో, ఎలా ఖర్చుపెట్టాలో తెలిసున్నవాడు. సంగీత, శిల్ప, నృత్యములందు ఆరితేరినవాడు. అలాగే లొంగనటువంటి గుర్రాలని, ఏనుగుల్ని లొంగతీసుకుని వాటిమీద స్వారి చెయ్యగలిగే శక్తి ఉన్నవాడు, ప్రపంచంలో ఉన్న అతికొద్దిమంది అతిరథులలో శ్రేష్టుడైనవాడు, ఎన్ని అస్త్ర-శస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణ ప్రయోగం చెయ్యనివాడు.


ఇన్ని గుణములతో అందరినీ సంతోషింప చెయ్యగలిగేవాడు కనుక రాముడంటే దశరథుడికి అంత ప్రీతి. 


*రేపు...23వ భాగం*

        

*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

సోమవారం🕉️* *🌹28, ఏప్రిల్, 2025🌹* *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

    *🕉️సోమవారం🕉️*

*🌹28, ఏప్రిల్, 2025🌹*

   *ధృగ్గణిత పంచాంగం*                          

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖ మాసం - కృష్ణపక్షం*


*సూర్యరాశి : మేషం*

*చంద్రరాశి : మేషం/వృషభం*

*సూర్యోదయాస్తమయాలు ఉ 05.44*

*సా 06.26* 

*విజయవాడ*  

*ఉ 05.52*

*సా 06.36* 

*హైదరాబాద్*


*తిథి      : పాడ్యమి* రా 09.10 వరకు ఉపరి *విదియ* 

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం   : భరణి* రా 09.37 వరకు ఉపరి *కృత్తిక*


*యోగం  : ఆయుష్మాన్* రా 08.03 వరకు ఉపరి *సౌభాగ్య*

*కరణం  : కింస్తుఘ్న* ఉ 11.05 *బవ* రా 09.10 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 06.00 - 07.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *సా 05.26 - 06.50*

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.30*


*వర్జ్యం            : రా 09.02 - 10.26*

*దుర్ముహూర్తం  : ప  12.30 - 01.21 సా 03.03 - 03.53*

*రాహు కాలం    : ఉ 07.19 - 08.55*

గుళికకాళం       : *మ 01.40 - 03.15*

యమగండం     : *ఉ 10.30 -  12.05*


*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.44 - 08.16*

సంగవకాలం         :*08.16 - 10.49*

మధ్యాహ్న కాలం    :     *10.49 - 01.21*

అపరాహ్న కాలం    : *మ 01.21 - 03.53*


*ఆబ్ధికం తిధి         : వైశాఖ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.26*

ప్రదోష కాలం         :  *సా 06.26 - 08.41*

రాత్రి కాలం           :*రా 08.41 - 11.42*

నిశీధి కాలం          :*రా 11.42 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.13 - 04.58*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)*

*అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం*


*సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

మర్కట కిశోర న్యాయం

 🙏మర్కట కిశోర న్యాయం, మార్జాలకిశోర న్యాయం🙏

మర్కటము అంటే కోతి.. మార్జాలము అంటే పిల్లి.. కిశోరము అంటే చిన్న బిడ్డ.

ఇక్కడ కర్తలు కిశోరాలే . మర్కటము యొక్క కిశోరము. మార్జాలము యొక్క కిశోరము. (వాటి తల్లులు కాదు. )

పిల్లల చర్యలే ఇక్కడ గ్రాహ్యాలు.తల్లులవి కాదు . అని నా భావము


కోతిపిల్ల తన తల్లిని వదలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది.

నా తల్లిని పట్టుకొన్నాను, నాకేమీ కాదు అని గట్టి ధైర్యం.

తల్లిని తన ప్రయత్నంతో బిడ్డ పట్టుకొని ఉండడం "అన్యథా శరణం నాస్తి , త్వమేవ శరణం మమ" అని.


ఇక్కడ జీవుడికి భగవంతుణ్ణి పట్టుకోవడం తెలుసు. ఆ ప్రయత్నమూ తెలుసు.


తీర్థ యాత్రలూ, పూజలు, యజ్ఞాలూ , జప తపాలూ చేయడం.. తన ప్రయత్నం బహుళంగా ఉండడం. తానే భగవంతుణ్ణి పట్టుకోవడం.


పిల్లి పిల్లలు తల్లి ఎక్కడ వదిలితే అక్కడే తిరుగుతూ తల్లి రాకకోసం ఎదురుచూస్తూ ఉంటాయి . తల్లే వచ్చి తీసుకుపోవాలి.. తల్లి తమను పట్టించుకోవాలి. తాము తల్లిని వెతికి పట్టుకోలేవు. ఏడవడం తప్ప ఇంకేమీ చేయలేవవి. అపుడు తన కూనలను తానే నోట కరచుకొని తీసుకుని పోతుంది ఆ తల్లిపిల్లి.


తెలిసి భగవంతుణ్ణి తానే గట్టిగా పట్టుకొని నిర్భయంగా ఉండడం మర్కట కిశోర న్యాయం.


నాకేమీ తెలియదు ( న మంత్రం నోయంత్రం అన్నట్టు). నిన్ను తలచుకోవడం ఒకటే తెలుసు . నన్ను కడతేర్చు— అని దీనంగా ఆక్రోశిస్తూ ఉన్న ఆ బిడ్డను ఆ భగవంతుడే దిగి వచ్చి, అతడికి ఏ కష్టమూ లేకుండా తన ధామం చేర్చుకొంటాడు. కూన ప్రయత్నం లేకుండానే తల్లి ఆ బాధ్యత అంతా తానే స్వీకరిస్తుంది.

జ్ఞానేనైవ తు కైవల్యం.. అనేది ప్రసిద్ధ వాక్యం. భగవంతుడు వేద వేద్యుడు గాబట్టి వేద విహిత కర్మలు చేసి


ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ (భరతర్షభ! )


న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే


అని చెప్పిన వాక్యాలు ప్రమాణంగా అన్ని దశలూ దాటి కడకు జ్ఞానియై కైవల్యం చెందడం (బహూనాం జన్మనాం అంతే జ్ఞాన వాన్ మాం ప్రపద్యతే —అని ఉన్న ది గాబట్టి ) శాస్త్ర సమ్మతం..


జ్ఞాని/ యోగి వాసుదేవస్సర్వం అని దర్శిస్తాడు.. ఇది మర్కట కిశోర పద్ధతి . తెలిసి , ఆశ్రయించే విధానమూ తెలిసి భగవంతుణ్ణి పట్టుకోవడం ఈ యోగి చేసేది..


మార్జాల కిశోరంలో ఆర్తి ఉంది.. తనకే తన వేదన చెప్పుకొంటూ ఉంది. అది విని , తల్లి నోట గరుచుకొని తీసుకుని పోయి , దాని భయాన్ని పోగొడుతూ ఉన్నది...

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

తంత్ర శాస్త్రం

 తంత్ర శాస్త్రం వివరణ - చిట్టి తంత్రాలు - 1. 


సమస్త ప్రపంచం  మంత్రం, యంత్రం, తంత్రం అనే మూడు సిద్ధాంతాలపైన ఆధారపడి ఉంటుంది. ఏ పని అయినా సులభముగా సిద్ధింప చేసుకొనుటకు తంత్రం చాలా సులభమైన మార్గం. ఇప్పుడు మీకు వీటి గురించి స్వల్పముగా వివరిస్తాను. 


. ఈ ప్రపంచంలో కొన్ని లక్షలకొట్ల శక్తులు అదృశ్య రూపములో సంచరిస్తూ ఉంటాయి. మనం కూర్చునేంత చిన్న స్థలములోనే కొన్ని లక్షల శక్తులు ఉంటాయి. వీటిని ఉత్తేజిత పరుచుటకు కొన్ని ప్రత్యేక శబ్దక్రియలు ఉంటాయి. ఆ శబ్దములనే "మంత్రములు " అంటారు. ఈ మంత్రములను ఉచ్చరించినపుడు ఉత్తేజితులు అయిన శక్తులు దేనికోసం అయితే మనం ఆ ఉచ్చారణ చేశామో ఆయా క్రియలును అవి సంపూర్ణం చేస్తాయి. ఇక్కడ మీకో చిన్న ఉదాహరణ చెప్తాను. "శాపం " అంటే అందరికి తెలుసు కదా. ఏ వ్యక్తి అయితే పరిపూర్ణమైన శక్తితో, ఆగ్రహముతో ఎదుట వారిని శపించినప్పుడు ఆ శాపమును నిర్వర్తించే బాధ్యత ఆ చుట్టూ పక్కన ప్రదేశములో ఉండే ఏదో ఒక శక్తి తీసుకొని ఆ శాపమును అమలుపరిచే వరకు ఆ వ్యక్తిని వేటాడుతుంది. ఇదే వాక్కుకి ఉండే శక్తి అందుకే పెద్దవారు ఏదన్నా అన్నప్పుడు పైన "తధాస్తూ దేవతలు " ఉంటారు తప్పుగా అనొద్దు అని నివారిస్తారు. ఆ తధాస్తు దేవతలే ఈ శక్తులు. ఇలా ఉండేదే మంత్రశాస్త్రం ఇది ముఖ్యముగా వాక్కు మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో హోమాలు, జపాలు ఈ క్రియ క్రిందకు వస్తాయి.


. రెండొవది అయినా "యంత్రం" అనగా ఏదైనా ఒక శక్తిని ఒక ప్రదేశములో దిగ్బందన చేయడాన్ని 

" యంత్రప్రక్రియ " అని పిలుస్తారు. ఇది గృహములకు, దేవాలయాలయాలో శక్తిని నిక్షిప్తం చేయడానికి ఈ ప్రక్రియ వాడతారు.  


. మూడోవది మరియు చివరిది అయిన " తంత్రం ". దీన్ని ఆంగ్ల భాష యందు "మెస్మరిజం" అంటారు తెలుగులో కనికట్టు అని కూడా అంటారు. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాయ చేయడం. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. కానీ ఇది కొన్ని పెద్ద పెద్ద పనులు చేయుటకు, కొన్ని రకాల గ్రహ దోషాలు పోగొట్టడానికి ఇది అతి సులభ విధానం. 


. ఈ తంత్ర శాస్త్రం ఎంత సులభం అయినదో ఉదాహరణ చెప్తాను. శని సంబంధ దోషం ఉన్నప్పుడు మంత్రం శాస్త్రం శనికి అభిషేకం, జపాలు, హోమాలు ఇలాంటివి సూచిస్తుంది. కానీ అదే తంత్ర పద్ధతిలో పారే నీళ్లలో సారా, ఇనుప మేకులు, ఎండు మిరప కాయలు వదిలి వెనక్కు తిరిగి చూడకుండా రావాలి అని ఉంటుంది. అదే విధముగా రాహు సంబంధ దోషముకు coffebite చాక్లేట్స్ పిల్లలకు పంచమని చెప్తారు. ఇలా సులభమైన పద్ధతులు ఉంటాయి. 


. ఇలాఎన్నో రకాల ఉదాహరణలు ఉన్నాయి. ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఒక గ్రంధమే అవుతుంది. అందుకే స్వల్ప మోతాదులో వివరిస్తున్నాను. 


. మరింత విలువైన సమాచారం తరువాతి పోస్టు నందు వివరిస్తాను. 



ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

. ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

             

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

         

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                    

. 9885030034

తోలుబొమ్మలాట

 🙏తోలుబొమ్మలాట -ప్రదర్శన -చరిత్ర 🙏                        మొదటిభాగం


తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి ఉంది.

తోలు బొమ్మలాట ఆట చూద్దాము చదవండి 

ప్రదర్శన సంబంధమైన కదలికలకు అనుగుణంగా ప్రధాన గాయకుడు పాడుతూ వుంటే, మిగిలినవారు వంతలుగా పాడుతారు. వంతల్లో స్త్రీలు ప్రధానంగా ఉంటారు. రాగంతీయడం, ముక్తాయింపు, సంభాషణ ధోరణిలో స్త్రీగొంతు ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇందులో స్త్రీ పాత్రలకు స్త్రీలే పాడతారు. మైకులు వంటి సాధనాలు లేకుండా విశాలమైన మైదానంలో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే వారి గొంతు స్థాయిని ఊహించుకొనవచ్చును.ఏ వ్యక్తి బొమ్మలను ఆడిస్తాడో ఆ వ్యక్తి తానే పాడుతూ, పాటకు అనుగుణంగా బొమ్మను ఆడిస్తాడు. రెండు బొమ్మలను ఆడించే సమయంలో బొమ్మలమధ్య వచ్చే పోరాటంలో రెండు బొమ్మలను చేతితో కొట్టిస్తాడు. అదే సమయానికి క్రింది బల్లచెక్క టకామని నొక్కుతాడు. ఈ సమయంలో మిగిలిన వంతదారులు కావలసిన అల్లరి, హంగామా చేస్తారు. ఒక యుద్ధఘట్టం వచ్చిందంటే డోళ్ళూ, డబ్బాలూ, ఈలలూ, కేకలతో బీభత్సం సృష్టిస్తారు.



తోలుబొమ్మ లాటలలో గాయకులకు హార్మోనియం శృతిగా ఉంటుంది. తాళాలుంటాయి. వాయించే వ్యక్తులు కూడా వెనుక కూర్చొని వంత పాడుతుంటారు. అంతే కాదు, వాళ్ల కాళ్ళక్రింద బల్లచెక్కలుంటాయి. ఆయా ఘట్టాలననుసరించి ఈ చెక్కలను తొక్కుతుంటారు. ముఖ్యంగా రథాలు, గుఱ్ఱాలు, యుద్ధఘట్టాలలో ఈ చెక్కలు టకటకా త్రొక్కుతుంటే మంచి రసవత్తరంగా ఉంటుంది. నగారా మోతలకు ఖాళీ డబ్బాలు ఉపయోగిస్తారు. ఉరుములు ఉరిమినట్టూ, పిడుగులు పడ్డట్టూ డబ్బాలు మ్రోగిస్తారు.


తోలుబొమ్మలు

తోలుబొమ్మల తయారీ చాలా శ్రమతో కూడుకున్న పని. వీటి తయారీకి జింక,   దుప్పి, మేక ఈ మూడు రకాల జంతువుల తోళ్ళను వాడతారు. చైనాలో గాడిద చర్మంతోను, గ్రీసుదేశంలో ఒంటె చర్మంతోను తోలుబొమ్మలను తయారు చేస్తారు. పచ్చితోళ్ళను పరిమితమైన వేడి నీటిలో నానబెట్టి బండమీద లేదా చదునైన చాపమీద పరచి తోలుపై ఉన్న వెంట్రుకలను తొలగిస్తారు. ఆ తర్వాత తోలుకు మిగిలి ఉన్న పల్చటి చర్మపుపొరను పదునైన కత్తి సహాయంతో తీసివేసి మరోసారి వేడినీటిలో వేసి ఉప్పుతో శుభ్రపరుస్తారు. శుభ్రపరిచిన తోలును మేకుల సహాయంతో చతురస్రాకారపు చెక్కకు బిగించి ఆరవేస్తారు. ఈవిధంగా చేయడం వల్ల మిగిలిన కొద్దిపాటి నలకలు ఉంటే అవిపోతాయి. ఇన్ని దశల్లో శుభ్రపరచిన తోలు పలచనిపొరగా, పారదర్శకంగా తయారై దీపపుకాంతి ప్రసరించే విధంగా అవుతుంది.


జింక చర్మాలను దేవతలు, పౌరాణిక కథానాయకులలాంటి ముఖ్యమయిన పాత్రల బొమ్మలను తయారు చెయ్యడంలో ఉపయోగిస్తారు. లేడి చర్మం బాగా మన్నిక గలది గనుక దీనిని భీముడు, రావణుడు లాంటి యోధుల బొమ్మలను తయరు చెయ్యడానికి ఉపయోగిస్తారు. హాస్యపాత్రల వంటి మిగిలిన బొమ్మల కోసం సులభంగా దొరికే గొర్రె చర్మాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా ఒక్కొక్క బొమ్మ తయారు చెయ్యడానికి ఒక చర్మం సరిపోతుంది. కానీ రావణుడు వంటి కొన్ని బొమ్మలు తయారు చెయ్యడానికి ఎక్కువ చర్మం అవసరమవుతుంది. రావణుడి బొమ్మను తయారు చెయ్యడానికి కనీసం నాలుగు చర్మాలు అవసరమౌతాయి. శరీరం కోసం ఒక చర్మం, కాళ్ళ కోసం ఒక చర్మం, రెండు జతల చేతుల (ఒక్కొక్కటి ఐదు చేతులు) కోసం రెండు చర్మాలు. ఎంపికచేసుకున్న బొమ్మలకు రేఖాచిత్రాల ఆధరంగా ప్రకృతిసిద్దమైన కరక్కాయ, చింత గింజలపొడి, అన్నభేది మొదలైన రంగులచే తోలుబొమ్మలకు ఇరువైపుల రంగులు వేస్తారు. ప్రస్తుతం ఆధునికులు పారదర్శకమైన రంగులను ఉపయోగిస్త్తున్నారు.

                          సశేషం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కృష్ణుడు ఆరాధ్యుడు

 🔔 *కృష్ణం వందే* *జగద్గురుమ్*🔔


*శ్రీకృష్ణుని*

*జీవితం...దారుణమైన ముళ్ళబాట.*


సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు. 


పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు కృష్ణుడు.


*కానీ... ఆత్మహత్య చేసుకోలేదు.* 


కృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెఱసాలలో మ్రగ్గిపోయారు. కృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో వ్రేపల్లెకు వలసపోయాడు. 


కొన్ని వారాల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యాప్రయత్నం చేసింది పూతన. 


అప్పటినుండీ అతనికి దినదిన గండంగానే గడిచింది. కృష్ణుని శైశవదశ, బాల్యదశ కూడా - శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది. కేవలం పదహారేళ్ళనాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత కష్టమో కదా! 


*అయినా ఆత్మహత్య చేసుకోలేదు.*


జరాసంధునితో వరుసగా 17 సార్లు యుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లూ కృష్ణుడే జయించాడు. కాని, క్షణం విశ్రాంతి లేకుండాపోయింది. అంతలోనే "కాలయవనుడు" అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది. యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు. 


రుక్మిణిని వివాహమాడేందుకు, ఆమె అన్నయైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడనే నిందనూ ఒక హత్యానేరాన్నీ మోశాడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తెచ్చి తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్ళాడేముందు ఆమె తండ్రియైన జాంబవంతునితో యుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది. జీవితమే ఒక పోరాటమయింది కృష్ణునికి. 


*కానీ ఆత్మహత్య చేసుకోలేదు.* 


చివరకు సంసారజీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలూ, వైషమ్యాలూ ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాతవృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు. 


తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు. కురుక్షేత్రములో దుష్టజన నాశనం పూర్తయినా, కృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారిచేత శపించబడ్డాడు. యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె! 


కృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధ పడలేదు. 


*ఆత్మహత్య చేసుకోలేదు.* 


యాదవకుల నాశనానికి "ముసలం" పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు యావన్మందీ ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగులైపోతున్నా, విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు కృష్ణుడు! సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాంటి సమయములో ఆయన మనఃస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. 


*ఆవేశం కాదు ఆలోచన, సంయమనము కావాలనే విషయాన్ని కృష్ణుని జీవితం నుంచి నేర్చుకోవాలి.* 


నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే కాని, ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే అనుభవించడం కష్టం. కాని, కృష్ణుడు అన్నీ ఆచరించి, భరించి చూపించాడు. అందుకే కృష్ణుడు ఆరాధ్యుడు అయ్యాడు.


*భగవంతుడిని పూజించటం కాదు... ఆచరించాలి

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం...

 🎻🌹🙏 శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం... అరసవిల్లి...!!


🌸 శ్రీ సూర్యనారాయణ దేవాలయాలు భారతదేశంలో అరుదుగా వున్నాయి. ఒరిస్సాలోని పూరీకి సమీపంలో కోణార్క్ సూర్యదేవాలయం వుంది.

శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లిలో శ్రీ ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ సూర్య నారాయణస్వామి దేవాలయం వుంది. 

ఇది గొప్ప సూర్యక్షేత్రం. 


🌿 ఓం ఆదిత్యాయ నమః..అంటూ భక్తులు వేనోళ్ల పొగిడే దివ్య ఆదిత్య క్షేత్రం.. శ్రీకాకుళం సమీపంలోని అరసవల్లి సూర్యక్షేత్రం!


🌸 భక్తులు సూర్యభగవానుని శరణుజొచ్చి, పూజలు, అభిషేకాలు సూర్య నమస్కారాలు జరిపి తమ కోర్కెలు ఫలించడంతో హర్షభరితులై తమ ఇండ్లకు వెళతారు. 


🌿అందుకే ఈ క్షేత్రానికి హర్షవల్లి అనే పేరు వచ్చిందని, అదే వాడుకలో అరసవిల్లి అయిందని అంటారు.ఈ క్షేత్ర స్వామి గ్రహాధిపతి కావడం వల్ల దర్శన మాత్రముననే సర్వగ్రహారిష్ట శాంతి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.


🌸 సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడింది. 

దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. 

కంచిలోని ఏకామేశ్వరాలయంలో కూడా యిలాంటి ఏర్పాటు వుంది.


🌿 ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించినట్లు కొందరు పురావస్తు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. అరసవల్లిలో సూర్యదేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది. 


🌹🙏 స్థల పురాణం 🙏🌹


🌸 కురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడనొల్లక బలరాముడు తీర్థయాత్ర లకు బయలుదేరాడు. కరువు కాటకాలతో బాధపడుచున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముని ప్రార్థింపగా


🌿 అతను తన ఆయుధమైన హలం (అనగా నాగలి వలన) ని భూమి పై నాటి జలధార వచ్చేటట్లుగా చేసాడు. 

బలదేవుని ఆయుధమైన నాగావళి ఉధ్బవించినకి కాబట్టి నాగావళి (దీనినే లాంగుల్య నది) అని పిలివబడుతుంది. 


🌸ఈ నాగావళి నది తీరమందు బలరాముడు ఐదు విశిష్ట శివాలయాలను నిర్మించాడు.

 అందులో నాలుగవది శ్రీకాకుళం పట్టణంలో వెలసిన ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామివారిని దేవతలందరూ దర్శించుకున్నారు. 


🌿 అలాగే ఇంద్రుడు కూడా ఈ మహాలింగాన్ని దర్శించుటకు వచ్చాడు. అప్పటికే కాలాతీతమైంది. పిదప నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, బృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించుటకు ఇది తగిన సమయం కాదని వారించాడు.


 🌸పిదప ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగాడు. అపుడు నందీశ్వరుడుకు ఆగ్రహం వచ్చి కొమ్ములతొ ఒక విసురువిసిరాడు. ఇంద్రుడు ఆ కొమ్ములవిసురుకు కొంతదూరంలో పడ్డాడు. ఇంద్రుడు పడిన ఆ స్థలంనే ఇంద్ర పుష్కరిణి అంటారు. 


🌿 అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవానుని ప్రార్థించగా ప్రత్యక్షమై "నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో త్రవ్వమని" చెప్పాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో త్రవ్వగా అచ్చట సూర్యభగవానుని విగ్రహం దొరికింది.


🌸దానితోపాటు ఉష,ఛాయ, పద్మిని విగ్రహాలు కూడా లభించాయి. అచ్చట ఇంద్రుడు దేవాలయం కట్టి సూర్యభగవానుని ప్రతిష్ఠించాడు అని పురాణ కథనం అదే ఈనాటి అరసవెల్లి క్షేత్రం.


 🌿అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. 


🌸స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి.


🌿 అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారు.


🌸అరసవిల్లి నందు ఏకశిల పై యున్న సూర్యుని విగ్రహం, ఆయన రథ 

సారధి అమారుడు, ఉష, పద్మిని, ఛాయాదేవి, సనకుడు, సివందుడు, మారరుడు, పింగళుడు వంటి సూర్యభగవానుడి పరివారం కూడా దర్శన మిస్తారు. 


🌿“సూర్యకఠారి ” చురకత్తిని కూడా ఇక్కడ సతీసమేతంగా రథమున అధిరోహించిన శ్రీసూర్యనారాయణుని నడుమునందు దర్శించవచ్చు.


🌹 రథసప్తమి పర్వదినం :🌹


🌸ఈ రోజున రాష్ట్రం నలుమూలల నుంచే కాక.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. 

స్వామివారికి త్రిచ, సౌర, అరుణ ప్రయుక్తంగా సూర్య నమస్కార పూజలు, అష్టోత్తర శత సహస్ర నామార్చనలు నిర్వహిస్తారు.

 ఏటా సంక్రాంతి రోజున క్షీరాభిషేకం, ఏకాదశి నాడు కల్యాణసేవ, ప్రతి ఆదివారం తిరువీధిసేవ నిర్వహిస్తారు


 🌹సూర్యనమస్కారాలు: 🌹


🌿రోజూ రూ. 50 చెల్లిస్తే కుటుంబం పేరు మీద అర్చకులు సూర్యనమస్కారాల సేవ చేస్తారు... స్వస్తి..🌞🙏

లక్ష్మీదేవి

 *🪷లక్ష్మీదేవి పద్మముపై ఎందుకు ఉంటుంది🪷* 


🪷శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీసూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు. ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో ఋక్కులు కనబడతాయి. “పద్మాననే పద్మ ముఖే పద్మాక్షీ పద్మ సంభవే” అని అన్ని పద్మ విశేషణాలు వాడారు. 


🪷పద్మాల వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి మోము కలది, పద్మం నుండి పుట్టినది అని సూక్తం వర్ణిస్తుంది. బురద నుండి పుట్టినది పద్మం కానీ ఆ చిక్లీతను (బురదను) అంటించుకోదు. 


🪷సంసారంలో ఆ పద్మంలాగా ఉండాలని సూచిస్తుంది. పద్మం సూర్యుని చూసి వికసిస్తుంది, అలాగే మనం కూడా పరమాత్మ వైపు మంచి విషయాలపై మాత్రమె నీకు అనురక్తి ఉండాలి అని మరొక సంకేతార్ధం.నీటి మీద ఉన్న ఆ పద్మం చాలా చంచలం.


🪷ఆ పువ్వు మీద ఆసీనురాలైన ఆవిడ కూడా ధర్మం ఉన్నన్నాళ్ళే వారి దగ్గర ఉంటుంది.విష్ణు నాభి కమలం నుండి ఉద్భవించాడు చతుర్ముఖ బ్రహ్మ, అటు పద్మం నుండి పుట్టి అక్కడనుండి సృష్టి ఆవిర్భావం.ఆ బ్రహ్మ తత్త్వాన్ని తెలిపే సంకేతంగా మరొక పద్మం.అమ్మవారి రెండు కర కమలాలలో భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతి అనుగ్రహాలు ఉన్నాయి. 


🪷వాటికి చిహ్నంగా అలా కనిపిస్తుంది. ఆవిడ రూపాన్ని ఋషులు, మహర్షులు ధ్యానతపస్సులో అష్ట లక్ష్ములు గా దర్శించి తరించారు. వాటినే మనకు అందించారు. 


🪷లక్ష్మీదేవి 16 రకాల సంపదను అనుగ్రహించే తల్లి 


🪷జ్ఞానం, తెలివి, బలం, శౌర్యం, వీరం, అందం, జయం, కీర్తి, ధృతి, నైతికత, ధనం, ధాన్యం, ఆనందం, ఆయుష్షు, ఆరోగ్యం మరియు సంతానం ఇస్తుంది.

💎💎💎💎💎💎💎💎💎💎

శ్రీ కాళహస్తీశ్వర శతకము

 శు భో ద యం 🙏


శ్రీ కాళహస్తీశ్వర శతకము

                       (200)

(400 సంవత్సరాల కిందట శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరైన "ధూర్జటి" మహాకవిచే ఆవిష్కరించబడినది.


వెనుకం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్

వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్

నను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం

జెనకుం జీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!


తాత్పర్యం

శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ జన్మముననే మునుపు ఆయా యౌవనాది దశలయందు చేసిన దుష్కర్మముల నాలోచించిన కొలది రోత కల్గుచున్నది. రానున్న దుర్మరణము తలుచుకొనగా - ఈ ఉన్న కాలమైన సదుపయోగము చేసికొని నిన్ను ఆరాధింపనిచో జీవితమునందు ఏమి మంచి సాధించనివాని నగుదునే?? నేను చేసిన పనులను తల్చుకొనిన నన్ను చూడగా నాకే భయము కల్గుచున్నది. ఏది ఏమైనను కాలమునకు (నా ఆయువునకు) అత్యంత బాధాకరమగు చీకటి క్రమ్ముకొనివచ్చుచున్నట్లగుచున్నది. మిగిలిన ఈ కొంతకాలమైన నిన్ను ఏకాంతముగ ఆరాధించి నీ అనుగ్రహము పొందుటకు యత్నము చేయుదును.


(శివ భక్తుడైన శ్రీ ధూర్జటి ఆత్మ నివేదన -మీలో కొందరిని 'పద్య భాగం' అలరింపచేయలేక పోయివుండవచ్చు గాక. కానీ భావం ద్వారా నైనా ఆయన హృదంతరాళాల్లోని ఆర్తిని మీరు గ్రహించి వుంటారు. ఎందుకంటే చాలా సందర్భాలలో..మనకు కూడా వర్తిస్తుంది కనుక!


శతకసాహిత్యం సౌజన్యంతో-🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*కర్తా కారయితా చైవ

 





*కర్తా కారయితా చైవ ప్రేరకశ్చానుమోదకః*

*సుకృతం దుష్కృతం వాఽపి చత్వార స్సమభాగినః*


అన్నట్లు ఆ దోషంలో అందరూ భాగస్వాములౌతారు.



*   

ఎక్కడి తల్లిదండ్రి

 శు భో ద యం 🙏


"ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం

బెక్కడ జీవుँడెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా

డొక్కడె,పాప పుణ్య ఫల మొందిన నొక్కడె, కానరాడువే

ఱొక్కడు? వెంటనంటి భవ మొల్లనయా! కృప జూడుమయ్య!నీ

టక్కరి మాయలందిడక దాశరథీ! కరుణా పయోనిధీ. ॥ 92 ॥"🌷🌷🙏🙏🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌞ఆదివారం 27 ఏప్రిల్ 2025🌞*

           *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...


      *వాల్మీకి రామాయణం*

             *21వ  భాగం*

           

అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోను, భరతుడికి మాండవిక తోను, శత్రుఘ్నుడికి శృతకీర్తితోను వివాహం జరిపించారు.


అలా వివాహం జరగగానే, దివ్యదుందుభిలు మ్రోగాయి, పైనుండి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు.   


ఆ రోజ జరిగిన సీతారాముల కల్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి.


మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరిని ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. జనక మహారాజు కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి ఇచ్చాడు. అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు.


అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి, నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది, మంగళ ప్రదమైన వృక్షాలు నేలమీద పడుతున్నాయి, కాని మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి.


ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి, ఏమి జరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు.


ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు, “ఏదో దైవీసంబంధమైన విపత్తు వస్తోంది, కాని మృగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావ”న్నారు.


ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, “నేను ఈ రోజే విన్నాను,శివ ధనుస్సుని విరిచావంట, నీ గురించి విన్నాను రామా, ఏమిటి నీ గొప్పతనం, నువ్వు అంతటివాడివైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు!” అన్నారు.


ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి, పరుగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరికి వచ్చి....“మహానుభావా! ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు, క్షత్రియులందరినీ సంహరించావు.ఇవ్వాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేకలేక నాకు పిల్లలు పుట్టారు. వివాహాలు చేసుకొని ఇంటికి వెళుతున్నారు. నన్ను క్షమించు” అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు.


అప్పుడు రాముడు ఇలా అన్నాడు… “పరశురామా! నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు, ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికిమాలినవాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా, తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. నేను తప్పకుండా ఎక్కుపెడతాను” అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి, ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు. “నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను, కాని నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి, నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను. కాని ఒకసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను, అందుకని నేను నీ గమన శక్తిని కొట్టేస్తాను” అన్నాడు.


అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు “రామా! నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను,o అప్పుడాయన నన్ను రాత్రి పూట                          ఈ భూమండలం మీద ఉండద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతోంది, కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడినవుతాను” అని అన్నాడు.


“అయితే నీ తపఃశక్తితో సంపాదించిన తపోలోకాలు (తపస్సు) ఉన్నాయి, వాటిని కొట్టేస్తాను” అన్నాడు రాముడు.


పరశురాముడు “సరే” అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేసాడు.


వెంటనే పరశురాముడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, “నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామా, నువ్వు ఆ శ్రీమహావిష్ణువే, ఇక ఈ భూలోకంలో నా అవసరంలే”దని మహేంద్రగిరి పర్వతాలవైపు వెళ్ళిపోయాడు పరశురాముడు.


దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్ళని చూసుకొని మురిసిపోయారు. అప్పుడు వాళ్ళని ఆ వంశ కులదైవాలున్న దేవతాగృహాలకి తీసుకెళ్ళి ఇక్కడ పూజ చెయ్యాలని చూపించారు. అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు.


సీతారాముల అలా ఆనందంగా ఉండడానికి కారణాన్ని వాల్మీకి మహర్షి ఈ క్రింది శ్లోకంలో చెప్పారు.....``` 


*ప్రియా తు సీతా రామస్య దారాః పితృ కృతా ఇతి।*

*గుణాత్ రూప గుణాత్ చ అపి ప్రీతిః భూయో అభివర్ధతే॥*```


రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టమంట, ఎందుకు ఇష్టమంటే,’మా తండ్రిగారు నాకు తగిన భార్య’ అని నిర్ణయం చేశారు, అందుకు ఇష్టమట. అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది, అలాగే అపారమైన సంస్కారము, గుణములు ఉన్నాయట. సీతారాములు కొంతకాలం సంసారం చేశాక, సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట, అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట, హృదయాలతో నిశబ్ధంగా మాట్లాడుకునేవాళ్ళట. తన తండ్రిగారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించాడంట, కాని సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందంట. అలా ఆనందంగా కాలం గడిచిపోతోంది.


*రేపు...22వ భాగం*


*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

ఆదివారం🌞* *🌹27, ఏప్రిల్, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌞ఆదివారం🌞*

  *🌹27, ఏప్రిల్, 2025🌹*

     *దృగ్గణిత పంచాంగం*                    


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - కృష్ణపక్షం*


*తిథి : అమావాస్య* రా 01.00 వరకు ఉపరి *వైశాఖ మాసారంభః*

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం : అశ్విని* రా 12.38 వరకు ఉపరి *భరణి*


*యోగం  : ప్రీతి* రా 12.19 వరకు ఉపరి *ఆయుష్మాన్* 

*కరణం : చతుష్పాద* మ 02.55 *నాగ* రా 01.00 ఉపరి *కింస్తుఘ్న*


*సాధారణ శుభ సమయాలు:* 

                 *-ఈరోజు లేవు-*

అమృత కాలం : *సా 06.20 - 07.44*

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.30*


*వర్జ్యం : రా 09.08 - 10.32*

*దుర్ముహూర్తం : సా 04.44 - 05.35*

*రాహు కాలం : సా 04.50 - 06.26*

గుళికకాళం : *మ 03.15 - 04.50*

యమగండం : *మ 12.05 - 01.40*

సూర్యరాశి : *మేషం* 

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయాస్తమయాలు:

*ఉ 05.45* 

*సా 06.26*

 *విజయవాడ*

సూర్యోదయాస్తమయాలు

ఉ 05.54 

సా 06.35 

*హైదరాబాద్*

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.45 - 08.17*

సంగవకాలం         :*08.17 - 10.49*

మధ్యాహ్న కాలం  :     *10.49 - 01.21*

అపరాహ్న కాలం   : *మ 01.21 - 03.53*


*ఆబ్ధికం తిధి       : చైత్ర అమావాస్య*

సాయంకాలం        :  *సా 03.53 - 06.26*

ప్రదోష కాలం         :  *సా 06.26 - 08.41*

రాత్రి కాలం : *రా 08.41 - 11.42*

నిశీధి కాలం          :*రా 11.42 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.14 - 04.59*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య చంద్ర కళా స్తోత్రం*🌝 


*మహాత్మానౌ చక్రవాక*

 *చకోరప్రీతికారకౌ |*

*సహస్రషోడశకళౌ* 

*సూర్యచంద్రౌ గతిర్మమ ||*


🙏 *ఓం నమో సూర్యదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

మనిషికి ఇచ్చే విలువ

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏        🔥 *ఆరడుగుల మనిషికి ఇచ్చే విలువ అతడి నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది..తలుపుకు వేసిన తాళం ఇంటిని కాపాడుతుంది.. నోటికి వేసిన తాళం పరువుని కాపాడుతుంది.. వంకర మాటలు వంద మాట్లాడే బదులు.. సూటిగా నిక్కర్చిగా ఒక్క మాట మాట్లాడు నీ విలువ పెంచుతుంది*🔥రక్తం చుక్కలు చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకర మైన ఆయుధం *మాట*.. దానిని మూర్కుడు వాడిన తరువాత ఆలోచిస్తాడు.. తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతాడు🔥కోపంతో మాట్లాడే ప్రతీ మాట చివరకు నిన్ను తల దించుకునేలా చేస్తుంది.. ప్రేమ మనిషిని మహనీయుడను చేస్తే క్రొధం మతిభ్రష్టుదిగా మార్చేస్తుంది..ఆలోచనతో అవేశానికి అడ్డుకట్ట వేయవచ్చు.. కోపాన్ని అదుపు చేసి మాటకు కళ్లెం వేసి అదుపు చేసేదే మౌనం..మనం తిన్న తిండి కడుపులో ఉండదు.. కానీ అన్న మాట మాత్రం మనసులో ఉండిపోతుంది🔥కోపంలో చెప్పే సమాధానం, సంతోషంలో చేసే వాగ్దానం, వత్తిడిలో తీసుకునే నిర్ణయం ఎప్పటికీ తప్పే..నలుగురు మాట్లాడేటప్పుడు ఓపికతో వినాలి.. నలుగురితో ఆలోచించి మాట్లాడాలి..అప్పుడే  వత్తిడికి గురికాకుండా జీవిత ప్రయాణం సాగుతుంది🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.9440893593.9182075510* 🙏🙏🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - అమావాస్య - అశ్వనీ -‌‌ భాను వాసరే* (27.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగములు

 తిథి 

వారము

నక్షత్రము 

యోగము 

కరణము 

ఈ ఐదు కలిపి 

పంచాంగములు అనబడతాయి. 

పంచాంగములు అంటే ఐదు అంగములు 


ఎవరికి ఇవి అంగములు? 

అంటే...


పైన చెప్పుకొన్న 

తిథి 

వారము

నక్షత్రము 

యోగము 

కరణము 

ఈ ఐదూ కూడా కాలమును విభజన చెయ్యగా వచ్చినవే...


సూర్యుడు చంద్రుడు నిత్యమూ ఖగోళంలో సంచరిస్తూ ఉంటారు. ఆ క్రమంలో సూర్యునికి చంద్రునికి మధ్య దూరము కొన్నిరోజులు పెరగటము కొన్నిరోజులు తగ్గటము జరుగుతుంది. దీనివలననే మనకు చంద్రుడు పున్నమిరోజున నిండుగా కనబడి తరువాత నుండి కొద్ది కొద్దిగా తగ్గిపోతూ కనబడుతుంటాడు. 


ఈవిధంగా సూర్యునికి చంద్రునికి దూరాన్ని డిగ్రీలలో చెప్పుకుంటాము. సూర్యునికి చంద్రునికి దూరం 0° నుండి 12° వరకు పాడ్యమి తిథి. 13°నుండి 24° వరకు విదియ తిథి. ఇదేవిధంగా అమావాస్య వరకు మరియు అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఊహించగలరు. 


మన భూమి చుట్టూ ఖగోళం మనకు గోళాకారంలో కనిపిస్తుంది. అంటే ఒక వృత్తం. వృత్తానికి 360° కదా! చంద్రుడు ఒక నక్షత్రమును ప్రవేశించి దానిని దాటటానికి 13°20" దూరం ఉంటుంది. ఈ దూరాన్ని చంద్రునికి సుమారుగా 22 నుండి 27 గంటల సమయం పడుతుంది. ఈ సమయాన్ని మనం ఈరోజు ఈ నక్షత్రం అంటూ వ్యవహరిస్తాము. అంటే ఇది కూడా కాలంతో ముడిపడి ఉన్నదే. 


24గంటలతో కూడిన రోజును వారముల పేర్లతో పిలుస్తున్నాము. 


యోగము అనేది సుమారుగా రోజుకు ఒక యోగము ఉంటుంది. 


కరణములు రోజుకు రెండు ఉంటాయి. 


యాతావాతా ఇవన్నీ కూడా కాలవిభజనలే. 


కాలము దైవస్వరూపము. 

ప్రతిరోజూ మనము ఈ పంచాంగములను స్మరించటం అంటే దైవాన్ని స్మరించినట్లే. దాని వలన మనకు శుభం జరుగుతుంది.

*~శ్రీశర్మద*

పంచాంగం 27.04.2025

 ఈ రోజు పంచాంగం 27.04.2025

Sunday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాస కృష్ణ పక్ష అమావాస్య తిథి భాను వాసర అశ్విని నక్షత్రం ప్రీతి యోగః: చతుష్పాత్ తదుపరి నాగవం కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 


శుభోదయ: , నమస్కారః