28, ఫిబ్రవరి 2024, బుధవారం

మారాల్సినది

 ముందు మారాల్సినది రాజకీయాలు నేతలు 


గురుశిష్యులు ప్రజలు మానసికంగా ఎదగాలంటే సంభాషణ సంస్కృతం వేదాలను భగవద్గీతను అనివార్యంగా నేర్చుకోవాలి



మన ప్రభుత్వాలు


మద్యపాన ఆపణాలకు

 నిర్మాణ కర్మాగారాలకు 


ధూమపానమ్ ఆపనాలకు

నిర్మాణ కర్మాగారాలకు


గుట్కా ఆపణాలకు

నిర్మాణకర్మాగారాలకు 


వాటిని ప్రచారం చేయడానికి ప్రచార మాధ్యమాలల్లో నిమిషానికి ఒకసారి

విజ్ఞాపనలకు 


రెస్టారెంటులకు

బార్ ఆపణాలకు

డిస్కో క్లబ్బులకు


అశ్లీలచిత్రాలకు

అశ్లీలసాహిత్యానికి

అశ్లీలనృత్యాలకు

అశ్లీల కథలకు

అశ్లీలఫ్లెక్సీలకు

అశ్లీలసంభాషణలను


ఆనవశ్యక పిల్లల పెద్దల నానావిధ ప్రజల మనస్సులను   విచలితం చేసే వాటికి


అనుమతులు  ఇచ్చిన రాజకీయ నాయకులదే ప్రభుత్వాలదే తప్పు


యథా రాజా తథా ప్రజా


⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡


ఈ దేశంలో మారాల్సింది రాజకీయ నాయకులు


గురుర్ బ్రహ్మ అని గురువుల గొప్పతనం చెబుతారు


గురువులను ఈ ప్రభుత్వాలు 


ప్రైవేటు గురువు అని

ప్రభుత్వ గురువు అని

పార్ట్ టైమ్ గురువు అని

కాంట్రాక్టు గురువు అని

గెస్ట్ ఫ్యాకల్టీ గురువు అని

టైమ్ స్కేల్ గురువు అని


యస్ టి గురుకులాల గురువు అని

యస్ సి గురుకులాల గురువు అని


బి.సి గురుకులాల గురువు అని


ఓ.సి గురుకులాల గురువు అని


మైనారిటీల గురుకులాల గురువు అని


విడదీసినారు


ప్రభుత్వ గురువులకు తప్ప మిగితా గురువులకు చాలీ చాలని వేతనాలు ఇస్తున్నారు


అది కూడా 7 8 నెలలు మాత్రమే


ఈ తెలంగాణాలో 


గురువులందరికి మినిమమ్


50 వేల జీతం ఉండాలి


పోలీసు ఆర్మీ రంగం వలే గురువుల రంగం ప్రభుత్వ ఆధీనమై ఉండాలి


గురువులను సైతం సమాజాన్ని గొప్పగా మార్చే

 క్రమశిక్షణగా ఉంచే ఉండే 


పోలీసు 

ఆర్మీ రంగం వలే ఉంచి 


సరైన వేతనం ఇచ్చి కొన్ని బాధ్యతలను ఇవ్వాలి


ప్రపంచంలో మనిషి మనీషి కావాలంటే నీతిగా మనుగడసాగించాలన్న


అది ఒక్క గురువు వలనే సాధ్యం అని ఈ సమాజం గ్రహించాలి


విద్యను వ్యాపారం చేసి గురువులను బానిసలుగా చేసిననాడే మానవత్వం మాయం అయినది


అర్హులైన వక్తలైన కవులైన పండితులైన ఋషిలైన అంకితభావం గొప్ప మేధావంతులైన గురువులు ఉండాలి

జన్మించాలి


అలాంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలి


యోగ్యలైన గురువులను గుర్తించి ప్రభుత్వం లో భాగస్వామ్యం చేసి


సలహాలు పొందుతూ


గురు శిష్యులను వారి కుటుంబాలను

 అన్ని విధాలుగా ఆదుకోవాలి


గురువులకు


50 వేల వేతనం 12 నెలలు ఇవ్వాలి


అర్హులైన గురువులందరిని కాపాడుకోవాలి ప్రోత్సహించాలి


 గురు శిష్యులందరూ


 గొప్ప వక్తలు కవులు పండితులు ఋషులు పరోపకారపరాయణులు 

నాయకులు కావాలి


సంఘసంస్కర్తలు కావాలి


ఈ సమాజస్వరూపాన్ని కుల్లు రాజకీయాలను మార్చేయాలి


ఏ దేశంలో గురుశిష్యులు మేధోమథనం చేస్తారో


ఆ దేశంలోనే పరోపకారపరాయణులు గొప్ప నాయకులు జన్మిస్తారు


ఈ ప్రపంచచరిత్ర మార్చేస్తారు


సంస్కృతభాషను జాతీయ భాషగా ప్రకటించుకుందాం


వేదాలను భగవద్గీతను జాతీయ గ్రంథాలుగా


ఆవును జాతీయజంతువుగా చేద్దాం


ఈ విశ్వమానవుల చరిత్రను మార్చేద్దాం


వీథి వీథి లో 


సంస్కృతమాధ్యమ గురుకులాలను స్థాపిద్దాం


సంస్కృతసంభాషణను విశ్వసంభాషణం కుర్యామ

పాఠశాలలో

 *🎒మన పాఠశాలలో..!!*

====================


*"ఏంటి సర్..సిలబస్* *అయిపోవచ్చిందా?"*

*అన్న మాటలు విని  వెనక్కి తిరిగి చూసా..*


*ఎదురుగా* *హెడ్డుమాస్టర్..*

*కళ్ళజోడు* *సవరించుకుంటూ..*


*"లేదు సర్,ఇంకా ఒక లెసన్ ఉంది"*

*కొంచెం తటపటాయిస్తూ నా సమాధానం.*


*"మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు"*

*అని మా హెడ్డుమాస్టర్ కొంచెం గంభీరంగానే అడిగారు.*


*"సమాజంలో విలువలు" కోసం చెప్తున్నా సర్..!*

*అని*

*"సర్" కళ్ళలోకి కొంచెం గర్వంగా చూస్తూ..చెప్పా*

*ఆ మాటకు మా హెడ్డు గారు కొంచెం చిరాకుగా మొహం పెట్టి*

*"అవన్నీ నీకు ఎవరు చెప్పామన్నారయ్యా?"*

*అని పిల్లల వైపు ఒకసారి తేరిపారా చూసి బయటకు రమ్మన్నారు.*

*వెళ్లి ఆయన ఎదురుగా నిల్చున్నా..*


*నన్ను ఒకసారి పైకి కిందకి చూసిన ఆయన*

*కొంచెం మెల్లిగా మాట్లాడుతూ..*


*"నీకేమైనా పిచ్చా?"*


*"ఈ రోజుల్లో పేరెంట్స్ వచ్చి మా వాడికి మార్కులు ఎందుకు తగ్గాయి అని అడుగుతారు కానీ..*

*"విలువలు,క్రమశిక్షణ ఎంతవరకు నేర్పించారు?"అని అడగరయ్యా!!*


*"పోనీ ప్రోగ్రెస్ రిపోర్టులో విలువలు, క్రమశిక్షణ కాలమ్  ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా??"*


*"ఈ రోజుల్లో వాటితో పెద్ద పనిలేదయ్యా"*


*అని చెప్పి..నాకు ఆయన మరింత దగ్గరగా వచ్చి*


*"ముందు సిలబస్ కంప్లీట్ చేసి,మన బడుద్దాయిలకి నాలుగు ప్రశ్నలు ఇచ్చి కంటస్థ పెట్టించు.విలువలదేముంది బాబూ..!అవి మనం* *నేర్పించకపోయినా ఎవడూ అడగడు"అన్నారు.*


*ఆ మాటకు నా మొహంలో వస్తున్న మార్పులు* *గమనించినట్టున్నారు.*  *మా హెడ్డుమాస్టర్.*

*వెంటనే..ఇలా అన్నారు.*


*"ఈ రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి కత్తి మీద సాము లాంటిదయ్యా!"*


*నాకు అర్ధం అయ్యీ..అవనట్టుగా ఉండి అలానే చూస్తున్నాను.*


*ఆయన నా వైపే చూస్తూ..*


*"అవునయ్యా..!ఈ రోజుల్లో మనం వాళ్ళకి చదువు మాత్రమే చెప్పగలం.*

*"జ్ఞానం"ఇవ్వడానికి మన దగ్గర టైం లేదు.*


*"జ్ఞానం" ఇవ్వాలంటే*


*"క్రమశిక్షణ" కావాలి...అది నేర్పించాలంటే*


*"దండన" కొన్నిసార్లు తప్పకపోవచ్చు.*


*కానీ...ఈ రోజుల్లో అది సాధ్యమయ్యే పనేనా..!?*


*ఎంతమంది విద్యార్థులని రోజూ చూడటంలేదు*


*ఒకడు కన్నాలున్న పాంటుతో వస్తాడు*

*ఇంకొకడు సగం*

*గొరిగి మధ్యలో వదిలేసిన హెయిర్ స్టైల్  తో వస్తాడు.*

*"అదేమిట్రా?" అంటే*

*మా నాన్న చేయించాడు అంటాడు.*

*మరొకడేమో..*

*నిన్ను..నన్నూ..* *గుద్దుకుంటూ పోతాడు.*


*"అది తప్పురా"*

*అని కొంచెం గద్దిస్తే చాలు*

*సాయంకాలానికి వాడి తల్లిదండ్రులు*

*"గేట్"ముందు ధర్నాకు దిగుతారు.*


*పోనీ..వాళ్ళకే ఏదో సర్దిచెపుదాం అంటే..*


*"డబ్బులు కడుతున్నాము..గుద్దితే కొంచెం సర్దుకుపోలేరా??" అని మనల్నే ప్రశ్నిస్తారు.*


*"పిల్లవాడికి మొదటి సమాజం పాఠశాల"*


*సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకునేది ఇక్కడే..!*


*కానీ...*


*"విద్యార్థి చేసిన ఏ చిన్న తప్పుకు కూడా పాఠశాల లో దండన లేదు కాబట్టే వాడు పెద్దయ్యాక సమాజంలో తప్పు చేయడానికి భయపడటం లేదు."*


*విచిత్రం ఏమిటంటే..!!*


*చేసిన తప్పుకు పాఠశాలలో దండన లేదు కానీ*

*సమాజంలో మాత్రం ఉంటుంది.*

*పాపం అది తెలుసుకునే సరికే..వాడు తల్లిదండ్రుల చేయి దాటిపోతాడు.*


*"మా వాడిని ఎందుకు దండిచావయ్యా?"*

*అని "జిల్లా జడ్జి గారి"ని అడగలేరు కదా..*

*తప్పుకు శిక్ష పడాల్సిందే కదా..*


*అదే పాఠశాల లో సరిఅయిన*

 

*"శిక్షణ"*


*జరగడానికి..వీళ్లందరూ సహకరిస్తే..ఆ*

*"శిక్ష"లు పడవు కదా..*


*అని చెప్పి,కొంచెం ఆలోచించి మళ్లీ ఇలా అన్నారు.*


*"నాకు కూడా మంచి సమాజం స్థాపన కోసం*

*క్రమశిక్షణ కలిగిన విద్యార్థులని తయారు చేయాలని ఉందయ్యా..!"*


*"చదువంటే మార్కులు కాదు,క్రమశిక్షణ మరియు విలువలతో కూడిన జ్ఞానం అని ప్రతి పేరెంట్* *తెలుసుకున్నపుడు..తప్పకుండా మనం మంచి సమాజ స్థాపన కోసం పాఠశాలలోనే పునాది వేద్దాం"*


*అని చెప్తూ..ఆయన గది వైపు నడుచుకుంటూ వెళ్లిపోయారు.*


*నేను ఆయన్నే తదేకంగా చూస్తూ..నిల్చుండిపోయాను.*


*"సైనిక పాఠశాలలో ఎంతోమంది* *విద్యార్థులని బెత్తం దెబ్బలతో అయినా* *"క్రమశిక్షణ" నేర్పించి*

*వారిని ఉత్తములుగా తీర్చిదిద్దిన*

*"హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు గారు "*

*ఈ రోజు మార్కుల కోసం ఆలోచించడం ఏంటో..!!"*


*"హ్మ్మ్..ఏదైనా తల్లిదండ్రులకి కావాల్సింది ఈ రోజుల్లో మార్కులే కదా..!!"*


*అని మా ఆఫీస్ బాయ్ లింగరాజు అంటున్న*

*మాటలు నా చెవికి అస్పష్టంగా వినిపిస్తున్నాయి.*


*రాసిన మహానుభావుడికి...*

🙏🙏🙏🙏🙏🙏

Panchaag


 

/ రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*28-02-2024 / బుధవారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

మేషం


సోదరులతో  మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున  ఊహించని  మార్పులు ఉంటాయి. 

---------------------------------------

వృషభం


ధన వ్యవహారాలు కలసివస్తాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా  వ్యవహరిస్తారు.  నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున  పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

మిధునం


అవసరానికి చేతికి ధనం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి  అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

కర్కాటకం


ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

సింహం


ఉద్యోగులు చేయని పనికి నిందలు పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా  ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బందిపడతారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.

---------------------------------------

కన్య


నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

---------------------------------------

తుల


ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు  ఎదుర్కొంటారు. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప  ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. స్ధిరాస్తి సంబంధిత వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

---------------------------------------

వృశ్చికం


కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు  వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

---------------------------------------

ధనస్సు


వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మారుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ  బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. అనుకున్న సమయానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది.

---------------------------------------

మకరం


కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక ఋణ సమస్యలు  నుండి బయట పడతారు. స్థిరస్తి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది.

---------------------------------------

కుంభం


నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో  దూర ప్రయాణాలు చేస్తారు.

---------------------------------------

మీనం


ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాల వలన శ్రమాదిక్యత పెరుగుతుంది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

ధర్మార్థములు లేని చోట

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 ||శ్లో||.   

*ధర్మార్థౌ యత్ర న స్యాతామ్*

*శుశ్రూషా వాపి తద్విధా|*

*తత్ర విద్యా న వక్తవ్యా* 

*శుభం బీజమివోషరే||*


||తా|| *ధర్మార్థములు లేని చోట, వినవలెనని కోరిక లేని చోట విద్యని బోధించరాదు*.... బోధించినట్లైన చవిటిభూమిలో విత్తనములు జల్లినట్లేయగును...

మాఘ పురాణం

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*🌺మాఘ పురాణం - 18 వ అధ్యాయము🌹*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*ఇంద్రుని శాపవిముక్తి*


శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను." దేవతలారా! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు, మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు, నశించును.మాఘ వ్రతము నాచరించినవారు, నాకిష్టులు. వారు దేవతలై, వైకుంఠమును చేరుదురు.


మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేదములు, శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో, శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో, రామతారకము ఉత్తమము. స్రీలలో లక్ష్మి దేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరువు పర్వతములలో గొప్పది. అన్ని  దానములలో, ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము, సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరీ, ఇలా సర్వనదులయందును, పది సంవత్సరముల పాటు, సూర్యోదయ సమయమున, స్నానము చేసినచో, వచ్చు పుణ్యము, మూడు దినములు, అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి, పూజ  మున్నగువానితో, వివిధ పుష్పములతో, సాలగ్రామరూపమున నున్న నన్ను పూజించిన, మోక్షము వచ్చును, అని శ్రీమన్నారాయణుడు, దేవతలకు, మాఘవ్రత మహిమను వివరించెనుl.


దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి, యింద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదకుచున్నవారికి, చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండయొకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి.ఎంత ప్రయత్నించినను, ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని, శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి, మరునాడు మాఘస్నానాదికమును చేసి, ఆ తీర్థమును తొండపై పోసిరి.


పవిత్రోదకముచే తడిసిన తొండ, దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాపవిముక్తికి సంతసించుచు. దేవతలకు నమస్కరించి యిట్లు పలికెను." నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున, నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను. మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి, "మనుష్య జన్మము కష్ట ప్రదము, స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను, ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి, తపమాచరించుటమేలని" తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి, నా తల్లితండ్రులిద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.


నేనును బంధువుల వద్దనుంటిని, వారి నిరాదరణ ఫలితముగ, చూచువారెవరును లేకపోవుటచే, భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్నదానిని భుజించుచు, బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు, జీవించుచుంటిని. భక్తి, వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమననేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి, పరిహాసము చేసితిని. ధనమును దాచి, సంపాదనపరురాలనైతిని. నన్ను కోరిన వారికి, నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు, నీతి నియమములను విడిచి, దురాచారవంతురాలనై, జీవితమును గడిపితిని, తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.


పులి, కోతి, ఎద్దు, మున్నగు పెక్కు జంతువుల జన్మనందితిని, పెక్కు బాధలను పడితిని. ఒకనాటి  జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును, ఆకలి కల వానికి పెట్టితిని, ఆ చిన్న మంచి పని వలన, మీరు దయయుంచి, నాకు శాపవిముక్తిని కలిగించిరి" అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజలస్పర్శచే, ఆమె దేవతత్వమునంది,' దేవప్రియ' అను పేరును పొందెను. దేవతలలో, ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును, దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో, వికారరూపముతో తిరుగుచున్న యింద్రుని జూచి, బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికిపారిపోయెను. దేవతలను ఇంద్రుని జూచి, వెంబడించి, వానిని ఊరడించి, ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు, మహావిష్ణువు, నీ శాపవిముక్తికి మార్గమును సూచించెను, ఆ, ప్రకారము చేయుదము" రమ్మని, తుంగభద్రాతీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెనుl.


ఇంద్రుడును దేవతలతో కలసి స్వర్గమునకెగెను. రాక్షసులను జయించి, సుఖముగనుండెను. గృత్నృదమదమహర్షి జహ్నుమునికి యీ విధముగ మాఘమాస స్నానమహిమను వివరించెనని పలుకుతుండగా, జహ్నుముని, స్వామీ! యీ విష్ణు కథామృతము, ఇంకను వినవలెననున్నది. ఇంకను చెప్పుడని కోరెను. గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు .


ధనసంపాదనము తప్ప, ధనవినియోగము నాతడు  చేయలేదు. పూజ, దానము, మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత, నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి, దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై, పంపాతీరమున, మఱ్ఱిచెట్టు పైనుండి, అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠమహర్షి, ఆ ప్రాంతమునకు, శిష్యులతో వచ్చి, మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు, మాఘస్నానము, పూజ, మున్నగునవి  చేయుచు, శిష్యులకు, మాఘమాస మహత్త్యమును, వివరించుచుండెను, అతదు మాఘస్నాన మహిమను వివరించుచు, నొకనాడు, మాఘస్నానము చేసిన వారి సర్వపాపములును, సూర్యోదయమువలన  చీకట్లు నశించినట్లుగా, నశించును. మాఘస్నానము చేయనివాడు  నరకమునపోవును" అనుచు, మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయుట వలని శుభములను, చేయకపోవుటవలని అశుభములను,  వివరించుచుండెను. ఆ సమయమున, పిశాచరూపము పైనుండి క్రిందపడింది. ఆ పిశాచము, వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు, పంపాజలమున, మాఘస్నానమును, వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన, మాఘ స్నానము వలన, వాని పిశాచరూపముపోయి, దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన, వైకుంఠమును చేరెను.


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*కేశవ! సంతత క్లేశ నాశనుఁడవు; కోరి మనో వా గగోచరుఁడవు*

*నిద్ధ మనోరథ హేతుభూ తోదార; గుణనాముఁడవు సత్త్వగుణుఁడ వఖిల*

*విశ్వోద్భవస్థితి విలయార్థ ధారిత; విపుల మాయాగుణ విగ్రహుఁడవు*

*మహి తాఖి లేంద్రియ మార్గ నిరధిగత; మార్గుఁడ వతిశాంత మానసుఁడవు*


కేశవా! నీవు ఎడతెగకుండా వచ్చిపడే ఘోరమైన కష్టాలనన్నింటినీ రూపు మాపుతావు. నీవు మనస్సులకూ, మాటలకూ అందనివాడవు. నీ గుణాలూ, నీ పేరులూ, భక్తుల హృదయాలలో చెలరేగే మోక్షకాంక్షను చక్కగా ఫలవంతం చేస్తాయి. సత్త్వగుణం నీ సొమ్ము. సంస్త లోకాల పుట్టుక, స్థితి, వినాశమూ అనే పనులను నిర్వహించడానికి నీవు మాయాగుణాలతో కూడిన రూపాలను స్వీకరిస్తావు. ఇంద్రియమార్గాలన్నీ నీ మార్గం దగ్గర నిలిచి పోతాయి. ఆ మార్గాలు నీ మార్గంలో అడుగు కూడా పెట్టలేవు. ప్రశాంతమైన మనస్సుతో విరాజిల్లుతూ ఉంటావు. భక్తుల సంసారమనే ఘోరమైన బంధాన్ని ఎలా నాశనం చేయాలో తెలిసిన జ్ఞానస్వరూపుడవు నీవు. దేవదేవుడవు. వాసుదేవుడవు. సర్వభూతాల హృదయాలే నీ ఆలయాలు. నీవు సర్వసాక్షివి. కృష్ణా! వాసుదేవా! నీకు నమస్కారాలు చేస్తూనే ఉంటాము.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 36*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితాః ।*

*నిందంతస్తవ సామర్థ్యమ్ తతో దుఃఖతరం ను కిమ్ ।।*


*భావము:* 

నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు, దీనితో నీ గొప్పతనం చులకనయిపోతుంది. అయ్యో, దీని కంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా?

 

వివరణ: ఒకవేళ అర్జునుడు యుద్ధ భూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పతనం తగ్గిపోవడమే కాక, తను చులకనైపోతాడు. శ్రీ కృష్ణుడు 'నిందంతః' అంటే 'నిందించుట, దూషించుట' అని. 'అవాచ్య వాదాన్' అంటే, 'నపుంసకుడు' వంటి కఠినమైన మాటలు. అర్జునుడి శత్రువులైన దుర్యోధనుడు వంటి వారు "చూడండి, ఈ చేతకాని అర్జునుడు యుద్ధ భూమి నుండి, కాళ్ళ మధ్యలో తోక ముడుచుకున్న కుక్క లాగ పారిపోతున్నాడు" అని చాలా అనుచితమైన మాటలు మాట్లాడుతారు. ఇలాంటి హేళన భరించటం అర్జునుడికి చాల బాధాకరంగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు గుర్తుచేస్తున్నాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 41*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 118*


*అదిఇది యని మది దోచెడు*

*సదనము గుర్తించి లోనె సాధించినచో*

*గుదురును బ్రహ్మానందము*

*గదసిన మది జేరనొక్కి కనవలె వేమా !*


*🌹తాత్పర్యము --*

ఆత్మసాక్షాత్కారముతో బ్రహ్మానందము కలుగునని గ్రహించాలి.


*💥వేమన పద్యాలు -- 119*


*అదియొకటి దెలిసి యాదిని నిల్పిన*

*యాది బాయకున్న నభవు డవును*

*యాది బాయువాడు యంధుని రీతిరా*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

ఆదిమధ్యాంతములు తెలిసినవాడే దైవస్వరూపుడగును.

అది తెలియని వాడు గృడ్డివానితో సమానము.


*💥వేమన పద్యాలు -- 120*


*అధముడైన మనుజు డధికుని జబట్టి*

*యతని మాట నడచు నవని లోన*

*గజపతింట నెన్న గవ్వలు చెల్లవా* 

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

అధముడు , అధికుని చేరి అతని మాటే వేదవాక్కుగా భావించి ప్రవర్తిస్తాడు.

గజపతి ఇంటిలో అల్పులెందరు చలామణిగాలేరు.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నీచుల ఆశ్రయం

 🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 నీచాశ్రయో న ఖలు కర్తవ్యః

కర్తవ్యో మహదాశ్రయః|

పయోపి శౌండకీహస్తే

వారుణీత్యభిధీయతే||


తా𝕝𝕝 "నీచుల ఆశ్రయం, సహవాసం ఎప్పుడూ చేయకూడదు. మహదాశ్రయం అంటే మహానుభావుల ఆశ్రయం సాంగత్యం ఎల్లప్పుడూ కర్తవ్యంగా జీవించాలి. మద్యం విక్రయంచే ఆమెవద్ద పాలు వున్నా మద్యం గానే భావిస్తారు. అలాగే నీచుల ఆశ్రయం లో ఎంత నిష్ఠగా వున్నా నీచునిగానే పరిగణిస్తారు."


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్  - సంస్కృతసుధాసింధువు_*

దేహములకు

 *1998*

*కం*

పనిచేసెడి దేహములకు

ఘనమగు ధారుఢ్యమెల్ల కలుగును ధరణిన్.

పనులను తప్పించుకొనెడి

తనువులు రోగముల బడును తరచుగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పనిచేసే శరీరములకు గొప్ప దారుఢ్యము కలుగుతుంది. పనులను తప్పించుకొనే శరీర ములు తరచుగా రోగాలబారిన పడుతూ ఉంటాయి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

జాతీయ విజ్ఞాన దినోత్సవం

 *నేడు జాతీయ విజ్ఞాన దినోత్సవం (నేషనల్ సైన్స్ డే)*


1986 లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (NCSTC- National Council for Science and Technology Communication) ఫిబ్రవరి 28 ను జాతీయ విజ్ఞాన దినోత్సవం (National Science Day) గా ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. భారతదేశం 1986 లో ఈ రోజును జాతీయ విజ్ఞాన దినంగా అంగీకరించింది మరియు ప్రకటించింది.


 *ఫిబ్రవరి 28 నే ఎందుకు?* 


చంద్రశేఖర్ వెంకటరామన్ (CV Raman)  *'రామన్‌ ఎఫెక్ట్‌'*  కనుగొన్న (పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన) రోజైన ఫిబ్రవరి 28 (1928) జ్ఞాపకార్థం జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.


 *రామన్ ప్రభావం (Raman Effect):* 


సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం (scattering) చెంది మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని సి.వి.రామన్ సిద్ధాంతీకరించాడు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ప్రభావం *(Raman scattering or Raman effect)* అంటారు. కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లోని ఫోటాన్ కణాలు, ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చాలా ఫోటాన్లు పడేటప్పటి పౌనఃపున్యంలోనే చెదిరిపోతే, కొన్ని ఫోటాన్లు మాత్రం అంతకు తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనఃపున్యంతో చెదురుతుంది. ఇదే రామన్ ఎఫెక్ట్. దీన్ని కనుగొన్నందుకు ఆయన 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారు.

వైవాహిక వైఫల్యాలకు

 నేటి వైవాహిక వైఫల్యాలకు కారణం?


1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..

ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,

చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..

భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!


2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో

ఒకరు చూపులు నిలపకపోవటం.. -

ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!

(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)

(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)


3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..

ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!


4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..

ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బదులు...!


5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి

రావటం వధూవరులని ఆశీర్వదించటం..

ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి

జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!


6. బఫే భోజనాలు..

ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!


7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..

ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!


ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.

అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని

భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....


అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.


వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని, ఆలోచనతో ఒక 15000 మంది దంపతులపై గడచిన 20 సంవత్సరాల నుంచి observe చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం. అందరికి అందించండి.


అందరూ హిందూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం

నెరవేరేటట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ..


    🙏 సర్వేజనా సుఖినో భవంతు !🙏

చంద్రశేఖర్ ఆజాద్ ఈ

 తన సొంత దేశస్తుల చేత మోసం చేయబడిన చంద్రశేఖర్ ఆజాద్ ఈ రోజు 1931లో అలహాబాద్‌లో అమరుడయ్యాడు.


చంద్రశేఖర్ ఆజాద్ 23 జూలై 1906న అలీరాజ్‌పూర్ రాచరిక రాష్ట్రంలోని "చంద్ర శేఖర్ తివారీ" గా భాభ్రా గ్రామంలో జన్మించారు . అతని పూర్వీకులు ఉనావో జిల్లాలోని బదర్కా గ్రామానికి చెందినవారు . అతని తల్లి, జాగ్రణీ దేవి, సీతారాం తివారీకి మూడవ భార్య, అతని ముందు భార్యలు చిన్నవయస్సులోనే మరణించారు. బదర్కాలో వారి మొదటి కుమారుడు సుఖ్‌దేవ్ పుట్టిన తరువాత, కుటుంబం అలీరాజ్‌పూర్ రాష్ట్రానికి మారింది . 


అతని తల్లి తన కొడుకు గొప్ప సంస్కృత పండితుడిని కావాలని అతనిని కాశీ విద్యాపీఠం, బనారస్‌కు పంపమని అతని తండ్రిని ఒప్పించింది . 1921లో, సహాయ నిరాకరణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు 15 ఏళ్ల విద్యార్థి చంద్ర శేఖర్ ఉద్యమంలో చేరాడు. ఫలితంగా డిసెంబర్ 20న అరెస్టయ్యాడు. ఒక వారం తర్వాత పార్సీ జిల్లా మేజిస్ట్రేట్ జస్టిస్ MP ఖరేఘాట్ ముందు హాజరుపరచి వివరాలు అడగ్గా అతను తన పేరును "ఆజాద్" ( ది ఫ్రీ ), తన తండ్రి పేరును"స్వతంత్రత" మరియు అతని నివాస స్థలం "జైలు" అని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన మేజిస్ట్రేట్ అతడిని 23 వారాల పాటు జైలులో ఉంచాలని, రోజుకు 15 కొరడా దెబ్బలు వేయాలని ఆదేశించాడు. 

అప్పటి నుండి చంద్రశేఖర్ తివారీ చంద్ర శేఖర్ ఆజాద్ గా గుర్తింపబడ్డాడు.


1922లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సస్పెండ్ చేసిన తర్వాత , ఆజాద్ నిరాశ చెందారు. అతను ఒక యువ విప్లవకారుడు మన్మత్ నాథ్ గుప్తాను కలిశాడు, అతను హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA) అనే విప్లవ సంస్థను 1923 లో స్థాపించిన రామ్ ప్రసాద్ బిస్మిల్‌కు పరిచయం చేశాడు . అజాద్ HRAలో క్రియాశీల సభ్యుడిగా మారి HRA కోసం నిధులను సేకరించడం ప్రారంభించాడు. నిధుల సేకరణలో ఎక్కువ భాగం ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడం ద్వారానే జరిగింది. అతను 1925లో కాకోరి రైలు దోపిడీలో పాల్గొన్నాడు. లాలా లజపత్ రాయ్ హత్యకు ప్రతీకారంగా 1928లో లాహోర్‌లో జాన్ పి. సాండర్స్‌ను కాల్చిచంపడం మరియు చివరకు1929లో వైస్రాయ్ ఆఫ్ ఇండియా రైలు పేల్చేసే ప్రయత్నంలో కూడా పాల్గొన్నాడు.


1925లో కాకోరి రైలు దోపిడీ తరువాత , బ్రిటిష్ వారు విప్లవ కార్యకలాపాలను అణిచివేశారు. ప్రసాద్, అష్ఫాఖుల్లా ఖాన్ , ఠాకూర్ రోషన్ సింగ్ మరియు రాజేంద్ర నాథ్ లాహిరి విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మరణశిక్ష విధించబడింది. ఆజాద్, కేశబ్ చక్రవర్తి మరియు మురారి లాల్ గుప్తా పట్టుబడకుండా తప్పించుకున్నారు. ఆజాద్ తరువాత శివ వర్మ మరియు మహాబీర్ సింగ్ వంటి తోటి విప్లవకారుల సహాయంతో HRAని పునర్వ్యవస్థీకరించారు.


1928లో, భగత్ సింగ్ మరియు ఇతర విప్లవకారులతో కలిసి అతను రహస్యంగా హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA)ని పునర్వ్యవస్థీకరించాడు, 8-9 సెప్టెంబర్, వారి ప్రాథమిక లక్ష్యాన్ని సాధించడానికి దానిని హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA)గా మార్చాడు.


27 ఫిబ్రవరి 1931న, అలహాబాద్‌లోని CID పోలీసు అధిపతి సర్ JRH నాట్-బోవర్‌కి ఆజాద్ ఆల్‌ఫ్రెడ్ పార్క్‌లో ఉన్నాడని అతని సహచరుడు సుఖ్‌దేవ్ రాజ్‌తో మాట్లాడుతున్నాడు అని ఎవరో తెలియజేశారు. ఆ సమాచారంతో అరెస్ట్ చేసేందుకు తనతో పాటు పార్కుకు రమ్మని అలహాబాద్ పోలీసులను బోవర్ పిలిచాడు. పార్కు వద్దకు చేరుకున్న పోలీసులు నాలుగు వైపులా చుట్టుముట్టారు. డీఎస్పీ ఠాకూర్ విశ్వేశ్వర్ సింగ్‌తో పాటు కొందరు కానిస్టేబుళ్లు రైఫిల్స్‌తో పార్క్‌లోకి ప్రవేశించడంతో కాల్పులు జరిగాయి. సుఖ్ రాజ్ క్షేమంగా బయటపడ్డాడు. ఆజాద్ మాత్రం తనను తాను రక్షించుకోవడానికి ఒక చెట్టు వెనుక దాక్కుని కాల్పులు ప్రారంభించాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. సుదీర్ఘ షూటౌట్ తర్వాత, ఎల్లప్పుడూ ఆజాద్‌గానే ఉంటానని, మరియు సజీవంగా బంధించబడను అనే తన ప్రతిజ్ఞకు కట్టుబడి అతను తన తుపాకీ యొక్క చివరి బుల్లెట్‌తో తన తలపై కాల్చుకున్నాడు. షూటౌట్‌లో బోవర్ మరియు DSP సింగ్‌లకు వరుసగా కుడి అరచేతి మరియు దవడలకు గాయాలయ్యాయి. ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత పోలీసులు ఆజాద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.


సాధారణ ప్రజలకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని దహన సంస్కారాలకు రసూలాబాద్ ఘాట్‌కు తరలించారు. ఇది వెలుగులోకి రావడంతో ఘటన జరిగిన పార్కును ప్రజలు చుట్టుముట్టారు. బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆజాద్‌ను కొనియాడారు. 


ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆజాద్ వంటి నిస్వార్థ స్వాతంత్ర యోధులు చనిపోడానికి ప్రధాన కారణం దేశభక్తి లేకుండా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఊడిగం చేసిన భారతీయులే.. నేడు కూడా దేశభక్తి లేకుండా విదేశీ భావజాలాన్ని తలనిండా నింపుకుని విదేశీ నిధులతో ఈ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్న వెన్నుపోటు దారులు వున్నారు. అందుకే జాతీయవాదులు అటువంటి దేశ ద్రోహుల అజెండాలను ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ ప్రజలను జాగృతం చేయాలి.


25 సం. ల చిరు వయసులోనే అలా ముగిసింది ఒక విప్లవవీరుడి జీవిత గాధ.


🙏🙏🙏


....చాడా శాస్త్రి అన్న గారి వాల్ నుంచి....

దంపత్సమేత దీక్ష..*

 మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లీలలు..


*దంపత్సమేత దీక్ష..*


నాలుగైదేళ్ల క్రిందట దత్త దీక్షా కార్యక్రమం జగుతున్న నాటి సంఘటన ఇది..

"అయ్యా..నలభై ఒక్క రోజుల మండలదీక్ష రేపు కూడా తీసుకోవచ్చా..? మా ఇంటాయన చేత దీక్ష చేయిద్దామని అనుకుంటున్నాను.." అని మా దేవస్థానం లో పనిచేసే సిబ్బందిని అడిగిందా ఇల్లాలు..ఆమె పేరు వెంకట సుబ్బమ్మ, ఆమె భర్త పేరు కొండయ్య.."రేపే చివరి రోజు..రేపు వచ్చి దీక్ష తీసుకోండి.."-అని మా వాళ్ళు జవాబు చెప్పారు..తలవూపి వెళ్ళిపోయింది..


వెంకట సుబ్బమ్మ కొండయ్య దంపతులు..ఇద్దరు పిల్లలు..కొన్నాళ్ళు సంసారం బాగానే గడిచింది..కొండయ్య ఏకారణం చేతో తెలీదు కానీ తాగుడికి బానిస అయ్యాడు..ఆనాటి నుంచీ సంసారం లో కలతలు ప్రారంభం అయ్యాయి..అతని సంపాదన మొత్తం తాగుడికి సరిపోతోంది..వెంకట సుబ్బమ్మ కూలి పనులు చేసి, కాపురాన్ని నెట్టుకొస్తోంది..భర్త స్వతహాగా మంచివాడే..కానీ ఈ దురలవాటు అతనిని మార్చివేసింది..త్రాగుడు మానుకోమని ఎన్నోసార్లు భర్తను బ్రతిమలాడి చెప్పుకున్నది..ఆ పూటకు సరే అంటున్నాడు..మళ్లీ ప్రక్కరోజుకు త్రాగుతున్నాడు..సరిగ్గా ఆ సమయం లోనే, మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మండల దీక్ష మొదలవుతున్నదనీ..ఎలాగో ఒకలాగా బ్రతిమలాడి కొండయ్య చేత దీక్ష ఇప్పిస్తే..అతను బాగు పడతాడనీ సుబ్బమ్మకు అనిపించింది...ఆ వివరం కనుక్కోవడానికే ముందుగా మందిరానికి వచ్చింది..


కానీ చుట్టుప్రక్కల వాళ్ళు, "ఈవిడ తాపత్రయ పడుతున్నది గానీ..వాడు తాగుడు మానుతాడా?..అనవసరంగా ఆ స్వామి దీక్ష తీసుకొని కొనసాగించకుండా..మళ్లీ తాగి, పాపం మూటగట్టుకుంటాడు.." అని చాటుమాటుగా కొందరు..ఎదురుగానే మరికొందరు అనేశారు.."అన్నిటికీ ఆ దత్తయ్యే వున్నాడు..ఆయన దీక్ష లో ఉన్నన్నాళ్ళూ నేను కూడా అక్కడే ఉంటాను..మా పిల్లలతో సహా ఆ స్వామి చెంతనే ఉంటాము..స్వామి మీదే భారం వేస్తున్నాను.." అని చెప్పింది వెంకట సుబ్బమ్మ నిశ్చయంగా..


ఆ ప్రక్కరోజు ఉదయాన్నే కొండయ్యను, పిల్లలను వెంటబెట్టుకొని, మొగిలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి, కొండయ్యకు దీక్ష ఇప్పించింది...స్వామివారి విగ్రహం ముందు నిలబడి మనస్ఫూర్తిగా మొక్కుకుంది..తన భర్త ఆ దురలవాటు ను పూర్తిగా మానుకొని, తన సంసారం చక్క బడాలని కోరుకున్నది సుబ్బమ్మ..దీక్షా మాలలు కొండయ్య మెడలో వేసేముందు.."అయ్యగారూ..మీరు కూడా ఈయనకు..దీక్ష సక్రమంగా చేయమని గట్టిగా చెప్పండి.." అని నన్ను అడిగింది..


ఆ నలభైరోజులూ ఆ దంపతులు పిల్లలతో సహా శ్రీ స్వామివారి మందిరం వద్దే వున్నారు..ప్రతిరోజూ కొండయ్య తో పాటు, వెంకట సుబ్బమ్మ కూడా శ్రీ స్వామివారి మందిరం లో 108 ప్రదక్షిణాలు చేసేది..పది రోజుల కల్లా కొండయ్య మనసులో అంతర్మధనం మొదలైంది..తాను ఇంతకు ముందు గడిపిన జీవన విధానం సరికాదని అతనికే అనిపించసాగింది..అతను మరింత నిష్ఠగా శ్రీ స్వామివారి దీక్ష కొనసాగించ సాగాడు..


వైశాఖ మాసం శుద్ధ సప్తమి నాడు శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవం జరుగుతుంది..(ఈ సంవత్సరం మే 11 వతేదీ నాడు శ్రీ స్వామివారి ఆరాధన)..ఆ ముందురోజు, దత్తదీక్ష స్వీకరించిన స్వాములందరూ మొగిలిచెర్ల గ్రామం లో గల రామాలయం వద్దనుంచి నీరు నింపిన కలశాలతో ఊరేగింపుగా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి, ఆరోజు రాత్రి 12 గంటల తరువాత, శ్రీ స్వామివారి సమాధికి ప్రదక్షిణ చేసి, తాము తెచ్చిన కలశం లోని నీటితో శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేస్తారు..స్వాములందరితో పాటు కొండయ్య కూడా శ్రీ స్వామివారికి అభిషేకం చేసాడు..ఆ ప్రక్కరోజు ఉపవాసం వుండి, ఆరాధన నాటి రాత్రికి అగ్నిగుండం లో నడిచాడు..


దీక్ష విరమణ చేసినా కొండయ్య త్రాగుడు జోలికే వెళ్ళలేదు..పూర్తిగా మానేశాడు..ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారి దీక్ష తీసుకుంటాడు..ప్రస్తుతం ఆ దంపతులు హైదరాబాద్ లో వుంటున్నారు..కొండయ్య మేస్త్రీ గా పనిచేయటం మొదలుపెట్టి, ఇప్పుడు స్వంతంగా కాంట్రాక్టులు చేస్తున్నాడు..తమను తమ సంసారాన్ని ఆ దత్తయ్య స్వామే కాపాడాడని పదే పదే చెప్పుకుంటారిద్దరూ..దీక్ష కాలంలో ఏదో ఒకరోజు, శ్రీ స్వామివారి మందిరం వద్ద ఉన్న ఇతర దీక్షాధారులకు, భక్తులకు అన్నదానం చేయడం ఆ దంపతుల నిర్ణయం..గత నాలుగేళ్లుగా అదే పాటిస్తున్నారు..


దత్త దీక్ష స్వీకరించి, ఆచరించే భక్తుల అనుభవాలు కోకొల్లలు..ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం..అయితే అందరూ చెప్పేది ఒకటే మాట.."ఆ స్వామివారి వద్ద దీక్ష తీసుకుని..నిష్ఠ తో ఆచరిస్తే..మన కష్టాలు తొలిగిపోతాయి..మనలను దత్తాత్రేయుడే కాపాడతాడు.." అని..


సర్వం..

శ్రీ దత్తకృప!


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx




(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

తెలియగ లేరే నీ లీలలు....

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లీలలు..


*తెలియగ లేరే నీ లీలలు....*


*ఆవుల మల్లిఖార్జున..*


మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పరమ భక్తుడు..శ్రీ స్వామి వారి మందిరంలో మొదట దత్తదీక్ష తీసుకున్న అతి కొద్దిమందిలో మల్లిఖార్జున కూడా ఒకడు..క్రమం తప్పకుండా స్వామి వారిని సేవించుకునే వాడు..


ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దత్త దీక్ష స్వీకరించి..ఆ నలభై రోజులపాటూ శ్రీ స్వామివారి మందిరం వద్ద నిష్ఠతో దీక్ష కొనసాగించడం మల్లిఖార్జున అలవాటు..ప్రతి క్షణం శ్రీ స్వామి వారి సేవలోనే కాలం గడుపుతూ వుండేవాడు.. దీక్షలో ఉన్న ఇతర స్వాములకు కంకణాలు కడుతూనో.. వాళ్ళ కంఠం లో చిక్కుపడిన దీక్ష మాలలు సరిచేస్తూనో..సాయంత్రం భజనకు కావాల్సిన సరంజామా సర్దుతూనో..దీక్ష ముగింపు ముందు కలశాలు స్వాములకు నెత్తిన పెడుతూనో..స్వామీ వారి అభిషేక సమయంలో ఇతర స్వాములకు సహాయం చేస్తూనో.. స్వామీ వారి సమాధి కి అద్దే గంధం కలుపుతూనో...నిరంతరం ఆ స్వామీ సేవలోనే గడుపుతూ ఏ మాత్రం అహంకారం లేని భక్తుడు..


సౌమ్యుడు..మితభాషి..ఎవ్వరి విషయంలోనూ అనవసరపు జోక్యం చేసుకోడు..


కొద్దికాలం క్రిందట ఆ మల్లిఖార్జునకు మోటార్ సైకిల్ పై వెళుతుంటే ప్రమాదం సంభవించింది..ప్రారబ్ధాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు..ఆసమయంలో అతనిని చూసిన వాళ్ళు జీవించడం కష్టం అని తేల్చేశారు..హాస్పిటల్ లో చేర్పించారు..ప్రాణాపాయం లేదన్నారు కానీ, మామూలు మనిషి కావడానికి సంశయం వెలిబుచ్చారు..మాట కూడా లేదు..ఆర్ధికంగా కూడా చాలా ఖర్చు అయింది..నిత్యమూ శ్రీ స్వామిని నమ్ముకొని ఉన్న మల్లిఖార్జునను ఇక ఆ దిగంబర అవధూత దత్తాత్రేయుడే కాపాడాలి..అంతకంటే మార్గం లేదని ఇంట్లో వాళ్ళు ఒక నిశ్చయానికి వచ్చేసారు..


అతని భార్యా, తల్లీ ఇద్దరూ చెరోవైపు పట్టుకుని స్వామి వారి మందిరానికి తీసుకొని వచ్చారు..ఆ దత్తాత్రేయుడి వద్ద నిలబెట్టారు..ఆ కుటుంబానికి స్వామి వారి మీద ఉన్న అచంచల భక్తీ విశ్వాసాలో, భక్తుడి పట్ల ఆ దత్తాత్రేయ స్వామి కి ఉన్న అవ్యాజ కరుణో..ఏదైతేనేం..తల్లి, భార్యా పట్టుకుంటే కానీ అడుగు వేయలేకపోయిన మల్లిఖార్జున.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ..క్రమంగా కోలుకున్నాడు..నెమ్మదిగా నడవసాగాడు..కొద్దిరోజుల్లోనే మళ్లీ మామూలు మనిషిలా మారి..తన పనులు తానే చేసుకోసాగాడు..


మళ్ళీ దత్తదీక్ష ల నాటికి మల్లిఖార్జున ఎప్పటిలాగే పూర్తి స్వస్థత తో ఆలయానికి వచ్చి, 41 రోజుల మండల దీక్ష తీసుకున్నాడు..అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ సంవత్సరం దీక్ష పూర్తి చేసాడు..ఈ సంఘటన జరిగి దాదాపు రెండేళ్లు అవుతోంది..ఈ సంవత్సరం కూడా మల్లిఖార్జున దత్తదీక్ష స్వీకరించి, శ్రీ స్వామివారి సన్నిధిలో వున్నాడు..


కష్టాలు ప్రతి మనిషికీ వస్తాయి..ఆ దత్తుడి మీద విశ్వాసం ఉంచి, తన కర్తవ్యం తను చేస్తే, ఆ దత్తాత్రేయుడే సహస్ర బాహువులతో కాపాడతాడు..


సర్వం..

దత్తకృప..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



(పవని నాగేంద్ర ప్రసాద్...శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

Jai ganesh


 

Joke




 

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.          *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.             *సాంఖ్య యోగము*

.                  *శ్లోకము 36*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితాః ।*

*నిందంతస్తవ సామర్థ్యమ్ తతో దుఃఖతరం ను కిమ్ ।।*


*భావము:* 

నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు, దీనితో నీ గొప్పతనం చులకనయిపోతుంది. అయ్యో, దీని కంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా?

 

వివరణ: ఒకవేళ అర్జునుడు యుద్ధ భూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పతనం తగ్గిపోవడమే కాక, తను చులకనైపోతాడు. శ్రీ కృష్ణుడు 'నిందంతః' అంటే 'నిందించుట, దూషించుట' అని. 'అవాచ్య వాదాన్' అంటే, 'నపుంసకుడు' వంటి కఠినమైన మాటలు. అర్జునుడి శత్రువులైన దుర్యోధనుడు వంటి వారు "చూడండి, ఈ చేతకాని అర్జునుడు యుద్ధ భూమి నుండి, కాళ్ళ మధ్యలో తోక ముడుచుకున్న కుక్క లాగ పారిపోతున్నాడు" అని చాలా అనుచితమైన మాటలు మాట్లాడుతారు. ఇలాంటి హేళన భరించటం అర్జునుడికి చాల బాధాకరంగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు గుర్తుచేస్తున్నాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 41*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 118*


*అదిఇది యని మది దోచెడు*

*సదనము గుర్తించి లోనె సాధించినచో*

*గుదురును బ్రహ్మానందము*

*గదసిన మది జేరనొక్కి కనవలె వేమా !*


*🌹తాత్పర్యము --*

ఆత్మసాక్షాత్కారముతో బ్రహ్మానందము కలుగునని గ్రహించాలి.


*💥వేమన పద్యాలు -- 119*


*అదియొకటి దెలిసి యాదిని నిల్పిన*

*యాది బాయకున్న నభవు డవును*

*యాది బాయువాడు యంధుని రీతిరా*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

ఆదిమధ్యాంతములు తెలిసినవాడే దైవస్వరూపుడగును.

అది తెలియని వాడు గృడ్డివానితో సమానము.


*💥వేమన పద్యాలు -- 120*


*అధముడైన మనుజు డధికుని జబట్టి*

*యతని మాట నడచు నవని లోన*

*గజపతింట నెన్న గవ్వలు చెల్లవా* 

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

అధముడు , అధికుని చేరి అతని మాటే వేదవాక్కుగా భావించి ప్రవర్తిస్తాడు.

గజపతి ఇంటిలో అల్పులెందరు చలామణిగాలేరు.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వాగ్వాదానికి దిగకూడదు

 నీతిశాస్త్రం॥మతిమత్సు మూర్ఖమిత్రగురువల్లభేషు వివాదో న కర్తవ్యః ॥భావము।బుధ్ధిమంతులతోను,మూర్ఖులతోను ,గురువులతోను, ఇష్టులైనవారితోను వాగ్వాదానికి దిగకూడదు. వేదపురుషానుగ్రహసిధ్ధిరస్తు. నిరంతరం దేవబ్రాహ్మణ ప్రసాదసిధ్ధిరస్తు.॥

నిష్కామ కర్మ*

 *నిష్కామ కర్మ*

                ➖➖➖✍️

*భగవంతుడు భగవద్గీత లో - ‘నిష్కామ కర్మ’ గూర్చి చెబుతారు, భగవద్ అనుగ్రహము కావాలంటే చాలా గ్రంధాలలో కూడా ఈ ‘నిష్కామ కర్మ’ గూర్చి ఉంది, నిష్కామ కర్మ వలన(ఫలితం ఆశించని) ఎటువంటి కర్మ ఫలము అంటదు...!*

*అదేంటో , ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకొందాము!!!*

       *ఒకానొక సమయములో, దూర్వాస మహర్షి యమునా నది దాటివచ్చి, భక్తితో గోపికలు సమర్పించిన ఫలములను, వాళ్ల సమక్షమున ఆరగించి, వారిని ఆశీర్వదించాడు.*

*ఇంతలో యమునా నది పొంగడం వలన, ఆ గోపికలు తిరిగి వెళ్ళే మార్గం లేక దూర్వాస మహర్షి సహాయాన్ని అర్ధించారు.*

*ఆ మహర్షి, వారితో యమునా నదిని ఈవిధంగా ప్రార్ధించమన్నాడు...*

*"ఓ యమునా మాతా! ఈ దూర్వాస మహర్షి ఈనాడు ఉపవాస దీక్ష పాటించి ఉండి నట్లయితే, దయతో మాకు ఆవలి ఒడ్డుకు చేరే దారినియ్యి!" అని.*

*తమ ఎదుటే భుజించిన మహర్షి కి, ఉపవాస దీక్ష ఏమిటి? అనుకుని గోపికలు నిర్ఘాంత పోయారు!!...*

*అయినా మహర్షి మహిమ దృష్టి లో ఉంచుకుని, మారు మాట్లాడకుండా యమునను ఆ విధంగా ప్రార్థించారు.*

*యమునా నది వెంటనే గోపికలకు త్రోవఇచ్చింది, దూర్వాస మహర్షి కేవలం గోపికల భక్తికి మెచ్చి, వారిని ఆనంద పరచడానికి పండ్లు ఆరగించాడే తప్ప, వాటిపై వ్యామోహం తో కాదు. ఆకలితో కాదు, మనస్సును, ఇంద్రియాలను జయించినవారికి, ఆకలి దప్పులు ఉండవు.*

*ఈశ్వరార్పణ భావంతో చేసిన ఆ కర్మకు అతడు కర్త కాదు, కేవలం సాక్షీభూతుడు, అందువల్ల అతనికి ఆ కర్మకు ఫలం అంట లేదు.*

*అలానే ఈనాడు కలియుగంలో ఏది చేసినా, అది భగవంతునికి అర్పితం చేయాలి!*

*ఎవరైనా ఇంతపని ఎలా చేసావు, ఎలా సాధ్యమైనది, అని అడిగినప్పుడు ‘అంతా ఈశ్వర సంకల్పం మాత్రమే, నేను నిమిత్తమాత్రుడిని, ఆయన దయ ఉంటే అన్నీ సాధ్యమే!’ అనే మాట చెప్పి, మన భావం కూడా అలానే ఉండాలి... అప్పుడే ఆ సర్వేశ్వరుడు - మంచి ఫలితం మనకు ఇచ్చి, దానిలో ఉన్న చెడును హలాహలం లాగా తాను స్వీకరిస్తాడు.* 

*అప్పుడే అది నిష్కామ కర్మ అవుతుంది..!*

*ఈరోజు మనం, మంచి జరిగితే నేను, చెడు అయితే దేవుడు అని అనుకొని మాయలో పడుతున్నాము ...*✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*