30, నవంబర్ 2025, ఆదివారం

ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ

  *ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది*.


*ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు*.


*ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి*..!


" *మీరేంచేస్తారో నాకు తెలియదు, నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను" అని కన్నీరుపెట్టుకుంది*..!


*దానికి ఇంద్రుడు*...

*దీనికే ఇంత ఏడవడం ఎందుకు*.!? *అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మ కదా..! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను* *నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు*.


*ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ*

*నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను* *దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు..! కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం పద.!" అంటూ బయలుదేరారు*.


*వీరిరాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు*.

*నిజమే ప్రాణాలు* *కాపాడేవాణ్ణి నేనే ..కానీచిలుక ప్రాణం చివరి దశలో ఉంది..! మళ్ళీ ఊపిరి పోయాలంటే.. శివునికే సాధ్యం, మనం ముగ్గురం శివుని ప్రార్థిస్తాం పదండి అన్నారు*.


*ముగ్గురూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు*.

" *ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను..! మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి..! " అంటూ అందరూ బయలుదేరారు*.


*ఇంద్ర,బ్రహ్మ,విష్ణువు,శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాదారంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు*.

 

*అయ్యో* ..! *అదేమి పెద్ద పనికాదు. మాములుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను,వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. ఏ ఆకు రాలి క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకకు కాపాడుదాం అని అన్నాడు* .


*యముడు , అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే.. ఒక ఆకు రాలి పడింది.ఆ ఆకు ఎవరిదో.. అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ..ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం వ్రాసి ఉంది ఇలా*..!


*ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు.. బ్రహ్మ.. శివుడు..విష్ణువు.. యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది*..! *అని* *వ్రాసి ఉంది*


*ఇదే విధి*..! *విధిని ఎవ్వరూ మార్చలేరు..🙏

అంతా_అన్నంలోనే_ఉంది

  🌹అంతా_అన్నంలోనే_ఉంది🌹


అంపశయ్యపై ఉన్న భీష్ముడు తన చుట్టూ చేరిన పాండవులకు ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నాడు. అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న ద్రౌపది ఫక్కున నవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ నవ్వు భీష్ముడి మాటల ప్రవాహానికి భంగం కలిగించడంతో ‘అమ్మా! ఇప్పుడు నువ్వెందుకు నవ్వావో నాతో పాటు వీళ్లకీ తెలియాలి.. కాస్త చెప్పమ్మా’ అన్నాడు.


ద్రౌపది బదులిస్తూ ‘భీష్మాచార్యా! ఇంకొద్ది రోజుల్లో మరణించబోయే మీరు ఇంత చక్కగా ధర్మం గురించి చెబుతున్నారు, బాగుంది. కానీ నాడు నా వస్త్రాపహరణ సమయంలో ఈ ధర్మపరిజ్ఞానం అంతా ఏమైపోయిందో అనిపించగానే నవ్వు ఆగలేదు’ అంది.


ఆయన తల పంకించి ‘నువ్విలా నవ్వడం మంచిదయ్యిందమ్మా! నువ్వు గనుక నవ్వకపోయుంటే నాకూ నీకూ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఇదొక శేష ప్రశ్నగా మిగిలిపోయేది. నీ సందేహానికి నా సమాధానం విను!


అప్పుడు నేను సుయోధనుడు పెట్టిన మలినమైన అన్నం తింటున్నాను. అది నా రక్తంలో కలిసి.. ఆ ప్రభావం నా విజ్ఞతను, వివేకాన్ని తెరలా కప్పేయడం వల్ల కర్తవ్యం గుర్తు రాలేదు. నేడు అర్జునుడి బాణాలతో నా రక్తంలో చేరిన ఆ కాలుష్యమంతా అంతరించింది కనుక ధర్మం మాట్లాడుతున్నాను అన్నాడు.


మిత్రులారా! అన్నం మహిమ అంతటిది. మనం తినే ఆహారం కష్టార్జితంతో కూడుకొన్నదై ఉండాలి. పీడన సొమ్ముతో లభించింది తింటే.. అది చెడు ఆలోచనలు కలిగిస్తుంది(మనం తినే ఆహారం లో 6 వంతు మనసు అవుతుంది). అందుకని ఆహారం స్వార్జితం, దైవార్పితం, మితం అయ్యుంటే అది మనసును పరిశుద్ధంగా ఉంచుతుంది. ధర్మమార్గంలో నడిపిస్తుంది. సాత్విక ఆహారంతో ఆత్మ, దేహం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. దైవసాధనలో మనసు నిగ్రహం కోల్పోదు .🙏🙏🏻🌹🌹🙏🏻🙏🏻

ఋషులు కాలాన్ని ఎలా గణించారో,

  🌹హిందూ ధర్మం 🌹


ఇప్పుడు జ్యోతిష్యంలో మన ఋషులు కాలాన్ని ఎలా గణించారో, మామూలు వారు ఊహించని స్థాయిలో, 17 మైక్రో సెకన్ల నుంచి 311,040,000,000,000 ఏళ్ళ వరకు కాలాన్ని అతి సూక్ష్మంగా ఎలా గణించారో, ఆ వివరాలు చూద్దాం.


1 పరమాణువు- ఒక సెకన్‌లో 60,570 వ వంతు, 16.8 మైక్రోసెకను (1 మైక్రోసెకను= 1 సెకెనులో 10 లక్షల వంతు)

1 అణువు- 2 పరమాణువులు≈ 33.7 మైక్రోసెకను

1 త్రసరెణు- 3 అణువులు≈ 101 మైక్రోసెకను

తృటి- 3 త్రసరెణు≈ 1/3290 సెకన్లు; అనగా ఒక సెకనులో 3290 వ వంతు= 304 మైక్రోసెకను

1 వేధ= 100 త్రుటి≈ 47.4 మిల్లిసెకన్లు

1 లవం- 3 వేధలు≈ 0.14 సెకన్లు≈ 91 మిల్లిసెకన్లు

1 నిమేషం (కంటిరెప్ప కాలము)- 3 లవములు≈ 0.43 సెకన్లు (లెకలన్నీ దరిదాపుల్లో)

1 క్షణం- 3 నిమేషాలు≈ 1.28 సెకన్లు

1 కాష్టా- 5 క్షణాలు≈ 6.4 సెకన్లు

1 లఘు- 15 కాష్టాలు≈ 1.6 నిమిషాలు

1 దంఢ- 15 లఘువులు≈ 24 నిమిషాలు

1 ముహూర్తం- 2 దంఢలు≈ 48 నిమిషాలు

1 అహోరాత్రం- 30 ముహుర్తాలు≈ 24 గంటలు

మాసము- 30 అహోరాత్రాలు≈ 30 రోజులు

ఋతువు= 2 మాసాలు ≈ 2 నెలలు

అయనము= 3 ఋతువులు≈ 6 నెలలు

సంవత్సరము= 2 అయనాలు= దేవతలకు ఒక రోజు.

-----

1 త్రుటి= 29.6296 మైక్రోసెకన్లు

1 తత్పర= 2.96296 మిల్లిసెకన్లు

1 నిమెషం- 88.889 మిల్లిసెకన్లు

45 నిమెషాలు - 1 ప్రాణ= 4 సెకన్లు

6 ప్రాణాలు- 1 వినాడి- 24 సెకన్లు

60 వినాడి(లు)- 1 నాడి- 24 నిమిషాలు

60 నాడులు= 1 అహోరాత్రము

ఆధునిక ప్రమాణాల ప్రకారం, 24 గంటలు అంటే ఒక పగలు, రాత్రి. మనం గమనించేది 1 నాడి లేదా దంఢం= 24 నిమిషాలు, 1 వినాడి= 24 సెకన్లు, 1 ఆసు/ ప్రాణం= 4 సెకన్లు ........ 1 తృటి= 1 సెకనులో 33,750 వంతు. అసలు ఇంత చిన్న కాలాన్ని మన ఋషులు లెక్కించడమే ఆశ్చర్యం కదూ.


సూర్య సిద్ధాతం కాలాన్నివాస్తవికంగాను, వ్యవహారికంగానూ చెప్పింది. Virtual భాగాన్ని మూర్తం అని, Practical భాగాన్ని అమూర్తం అని చెప్పింది. ప్రాణం (ఊపిరి) పీల్చుకునే కాలంతో మొదలయ్యేది సత్యమని, తృటితో మొదలయ్యేది నిత్యజీవితంలో అవసరంలేనిదని చెప్పింది. 1 ప్రాణం అంటే, ఆరోగ్యవంతమైన మనిషి 1 సారి ఊపిరి పీల్చి విడువడానికి పట్టే సమయం లేదా గురువక్షరం అనే 10 అక్షరాలను పలికే సమయం.

🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹సశేషం

30నవంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌞 *ఆదివారం*🌞

 *🌹30నవంబర్2025🌹*      

    *దృగ్గణిత పంచాంగం*                  


         *స్వస్తి శ్రీ విశ్వావసు*

         *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్ల పక్షం*


*తిథి  : దశమి* ‌రా 09.29 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : ఉత్తరాభాద్ర* రా 01.11 వరకు ఉపరి *రేవతి*

*యోగం : వజ్ర* ఉ 07.12 *సిద్ధి* రా.తె 04.22 ఉపరి *వ్యతీపాత*

*కరణం  : తైతుల* ఉ 10.27 *గరజి* రా 09.29 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.00 మ 02.00 - 04.00* 

అమృత కాలం  : *రా 08.37 - 10.08*

అభిజిత్ కాలం  : *ప 11.34 - 12.19*

*వర్జ్యం    : ప 11.30 - 01.01*

*దుర్ముహూర్తం  : సా 04.03 - 04.48*

*రాహు కాలం   : సా 04.09 - 05.33*

గుళికకాళం      : *మ 02.44 - 04.08*

యమగండం    : *ప 11.56 - 01.20*

సూర్యరాశి : *వృశ్చికం*                  

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం :*ఉ 06.30*

సూర్యాస్తమయం :*సా 05.40*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.19 - 08.34*

సంగవ కాలం         :     *08.34 - 10.49*

మధ్యాహ్న కాలం    :    *10.49 - 01.03*

అపరాహ్న కాలం    : *మ 01.03 - 03.18*


*ఆబ్ధికం తిధి         : మార్గశిర శుద్ధ దశమి*

సాయంకాలం        :  *సా 03.18 - 05.33*

ప్రదోష కాలం         :  *సా 05.33 - 08.06*

రాత్రి కాలం           :*రా 08.06 - 11.31*

నిశీధి కాలం          :*రా 11.31 - 12.22*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.38 - 05.29*

*****************************

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*


        *అరుణాయ నమః*

        *సూర్యాయ నమః*

         *ఇంద్రాయ నమః*

          *రవయే నమః*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసిం*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌞 *ఆదివారం*🌞

 *🌹30నవంబర్2025🌹*      

    *దృగ్గణిత పంచాంగం*                  


         *స్వస్తి శ్రీ విశ్వావసు*

         *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్ల పక్షం*


*తిథి  : దశమి* ‌రా 09.29 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : ఉత్తరాభాద్ర* రా 01.11 వరకు ఉపరి *రేవతి*

*యోగం : వజ్ర* ఉ 07.12 *సిద్ధి* రా.తె 04.22 ఉపరి *వ్యతీపాత*

*కరణం  : తైతుల* ఉ 10.27 *గరజి* రా 09.29 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.00 మ 02.00 - 04.00* 

అమృత కాలం  : *రా 08.37 - 10.08*

అభిజిత్ కాలం  : *ప 11.34 - 12.19*

*వర్జ్యం    : ప 11.30 - 01.01*

*దుర్ముహూర్తం  : సా 04.03 - 04.48*

*రాహు కాలం   : సా 04.09 - 05.33*

గుళికకాళం      : *మ 02.44 - 04.08*

యమగండం    : *ప 11.56 - 01.20*

సూర్యరాశి : *వృశ్చికం*                  

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం :*ఉ 06.30*

సూర్యాస్తమయం :*సా 05.40*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.19 - 08.34*

సంగవ కాలం         :     *08.34 - 10.49*

మధ్యాహ్న కాలం    :    *10.49 - 01.03*

అపరాహ్న కాలం    : *మ 01.03 - 03.18*


*ఆబ్ధికం తిధి         : మార్గశిర శుద్ధ దశమి*

సాయంకాలం        :  *సా 03.18 - 05.33*

ప్రదోష కాలం         :  *సా 05.33 - 08.06*

రాత్రి కాలం           :*రా 08.06 - 11.31*

నిశీధి కాలం          :*రా 11.31 - 12.22*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.38 - 05.29*

*****************************

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*


        *అరుణాయ నమః*

        *సూర్యాయ నమః*

         *ఇంద్రాయ నమః*

          *రవయే నమః*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసిం🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

 *🌞ఆదివారం 30 నవంబర్ 2025🌞*


        `` *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                    6️⃣0️⃣``

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


      *సంపూర్ణ మహాభారతము*         

              *60 వ రోజు*                    


*మాయా జూదానికి నాంది*```


దుర్యోధనుడు శకునితో 

ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు. కుమారుడు కృశించి పోతున్నాడని విని ధృతరాష్ట్రుడు  చింతించాడు. “నాయనా సుయోధనా! కౌరవ సంపదనంతా నీకు ఇచ్చాను కదా. దేవేంద్రునితో సమానమైన భోగభాగ్యాలు నీకు ఉన్నాయి కదా. నీవిలా కృశించడం ఎందుకు?" అని అడిగాడు. 

“తండ్రీ! పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుని కంటే గొప్పది. వారి కీర్తి నలుదిశలా వ్యాపించింది. వారితో పోల్చడానికి మూడు లోకాలలోని రాజులు సరిపోరు. హరిశ్చంద్రుడు  చేసిన రాజసూయయాగం కంటే పాండవులు చేసిన రాజసూయ యాగం గొప్పది. సామంతుల వలన అశేషరత్నాభరణాలు కప్పంగా పొందారు. 

ధర్మరాజుకు సాత్యకి 

ముత్యాల ఛత్రం పట్టాడు. భీముడు  చామరం వీచాడు. రాజులందరి చేత శ్రీకృష్ణుడు ధర్మరాజుకు మొక్కించాడు. సాటి రాజ కుమారుడుగా నేనిది సహించలేను” అన్నాడు. 


శకుని దుర్యోధనునితో “ధర్మరాజు జూద ప్రియుడు. అందులో కపటం తెలియని వాడు. నేను అక్షవిద్యలో నేర్పరిని. జూదంలో 

ధర్మరాజుని అక్రమంగా ఓడించి అతని సంపద అంతా సుయోధనుని హస్తగతం చేస్తాను” అన్నాడు. 


సుయోధనుడు సంతోషించి “తండ్రీ! ఇందుకు మీరు అంగీకరించండి” అన్నాడు. 


ధృతరాష్ట్రుడు “విదురుడు చాలా దూర దృష్టి కలవాడు. నీతి కోవిదుడు. మీ ఇరువురి క్షేమం కోరేవాడు. అతనితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము” అని అన్నాడు. 


దుర్యోధనుడు “తండ్రీ విదురుడు  పాండవ పక్షపాతి. అతడు ఇందుకు అంగీకరించడు. మీరు అంగీకరించనిచో నేను అగ్ని ప్రవేశం చేస్తాను. మీరు, విదురుడు సంతోషంగా ఉండండి” అన్నాడు. 


జూదం తగదని సంశయిస్తూనే  ధృతరాష్ట్రుడు కుమారుని సంతోషపెట్టడానికి సభానిర్మాణానికి ఏర్పాట్లు చెయ్యమని చెప్పాడు. ఒక నాడు విదురునితో సుయోధనుని అభిప్రాయం చెప్పాడు. విదురుడు 

“ఇందుకు నేను అంగీకరించను. పాండవులకు,కౌరవులకు విరోధం కలగడానికి పునాది వెయ్యద్దు. ఎంతటి శాంత స్వభావులకైనా జూదం విరోధం కలిగిస్తుంది. పాండవులు కౌరవులు కలసి ఉండేలా ఏర్పాటు చెయ్యి” అన్నాడు. 


ధృతరాష్ట్రుడు “విదురా! నీవు అనవసరంగా అనుమానపడవద్దు. మీరు, భీష్ముడు ఉండగా అన్నదమ్ముల మధ్య విరోధం ఎందుకు వస్తుంది. కనుక నీవు ఈ జూదానికి అంగీకరించి ఇంద్రప్రస్థానికి వెళ్ళి పాండవులను జూదానికి తీసుకురా!” అన్నాడు. 


ధృతరాష్ట్రుడు “దుర్యోధనా! ఈ జూదం వలన మీకు విరోధం వస్తుంది మీ విరోధం భూమి మీద ప్రజలందరికి కీడు చేస్తుంది. విదురునికి ఇందులో అంగీకారం లేదు. నీకు సంపద కావాలంటే నీవు కూడా యాగం చెయ్యి. 

మీరిద్దరూ రాజ్యాన్ని పాలించండి.” అన్నాడు. 


దుర్యోధనుడు "మహారాజా! ధర్మరాజు జూదం ఆడుతుండగా చూడటం ఒక యజ్ఞం. నేను సకలైశ్వర్యములు పొందడానికి అది మార్గం. శత్రువుల అభివృద్ధిని ఉపేక్షించిన మనలను అది నాశనం చేస్తుంది. పాండవుల ఐశ్వైర్యాన్ని కొల్లగొడితే కాని నాకు ఉపశమనం లేదు" అన్నాడు. 


వెంటనే శకుని “సుయోధనా! ఎలాంటి సైన్యం లేకుండా యుద్ధం రక్త పాతం లేకుండా పాచికలాడించి పాండవ రాజ్యలక్ష్మిని నీకు ఇస్తాను. జూదం కాక వేరు ఏ విధంగానూ పాండవులను జయించడం ఎవరి తరం కాదు" అన్నాడు. 


ధృతరాష్ట్రుని మనసు జూదానికి అంగీకరించలేదు. “మీరు ఎన్ని చెప్పినా నేను వినను. విదురుడు  జూదం అనర్ధ హేతువని చెప్పాడు. అతడు నీతి కోవిదుడు. నేను అతని మాట మీరను. జూదం వదిలి ఎప్పటిలా ఉండు" అని దుర్యోధనునితో అన్నాడు. 


దుర్యోధనుడు “తండ్రీ! విదురుడు  పాండవ పక్షపాతి అతడు మనకు ఆప్తుడు కాడు. జూదం పురాణంలో ఉంది. స్నేహంతో ఆడుకునే జూదం హాని కాదు. కనుక శకునితో జూదం ఆడటానికి అనుమతి ఇవ్వండి” అన్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏హా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹హా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

సంపూర్ణ మహాభారతము*

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🍁శనివారం 29 నవంబర్ 2025🍁*


`` *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                            5️⃣9️⃣``

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


         *సంపూర్ణ మహాభారతము*       

            *59వ రోజు*                    

```

అప్పుడు శ్రీకృష్ణుడు సభాసదులను చూసి “మేము ప్రాగ్జ్యోతిషపురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు  ద్వారకను తగులబెట్టాడు. భోజరాజులు రైవతకాద్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు. నా తండ్రి వసుదేవుడు  అశ్వమేధయాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు. బబ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం నూరు తప్పులు సహించాను. ఇతడు నాకు పరమ శత్రువు అయ్యాడు.” అన్నాడు.  


శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి “నేను వివాహమాడదలచిన కన్యను అపహరించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నావా?”అని దూషించాడు.


ఇక శ్రీకృష్ణుడు సహించలేక పోయాడు. తన చక్రాయుధం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు. శిశుపాలుని కుమారుని ఛేదిదేశానికి రాజుని చేసాడు. 

శిశుపాలుని వధతో రాజసూయం పరిసమాప్తి అయింది.```


*రాజసూయయాగం అనంతర విశేషాలు*```


ధర్మరాజు రాజసూయానికి విచ్చేసిన దేవతలను, గురువులను, బ్రాహ్మణులను తగు రీతిని సత్కరించి తృప్తిపరిచాడు. ధర్మరాజు 

ఆజ్ఞ ప్రకారం భీమసేనుడు భీష్మ, దృతరాష్ట్రులను సాగనంపాడు. అలాగే అర్జునుడు  దృపదుని సాగనంపాడు. నకులుడు  శల్యుని,సుబలుని సాగనంపాడు.  సహదేవుడు ద్రోణ,కృప,

అశ్వత్థామలను సాగనంపాడు. 

శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు 

వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమయ్యాడు. 

పాడవులందరూ శ్రీకృష్ణుని సాగనంపారు. 

వ్యాసమహర్షి కూడా బయలు దేరుతూ శిష్యులతోగూడి ధర్మరాజు దగ్గరికి రాగా ధర్మరాజు

“పురుషోత్తమా!రాజసూయయాగమును చేయమన్న మా తండ్రిగారి సందేశాన్ని నారద మహర్షి తెలుపుతూ రాజసూయయాగము చేయడం వలన ఈ భూమండలంపై సర్వక్షత్రియ వినాశాకమైన ఉత్పాదం, యుద్ధం సంభవించే కారణమైన సంఘటన జరిగేఅవకాశం ఉన్నదన్నారు. శిశుపాలుడి వధతో ఆ ఉత్పాతాలు సమసి పోయినట్లేనా" అని అడిగాడు. 


అంత వ్యాస మహర్షి “నాయనా యుధిష్టిరా! మహోత్పాతాల ప్రభావం పదమూడేళ్లు ఉంటుంది. సర్వక్షత్రియ నాశము జరుగుతుంది. ఆ సమయం రాగానే నీ కారణంగా దుర్యోధనుడి అపరాధం వలన భీమార్జునుల పరాక్రమం ద్వారా భూమి మీది రాజులందరూ కలిసి పరస్పర యుద్దంలో నాశనం అవుతారు. ఇందుకు నిదర్శనంగా తెల్లవారు జామున స్వప్నంలో నీవు వృషభారూఢుడైన పరమశివుడు దక్షిణ దిక్కును చూస్తూ కనిపిస్తాడు. దాని గురుంచి చింతించకు. కాలం దాటరానిది. నీకు శుభమవుగాక. అప్రమత్తంగా ఉంటూ భూమిని పరిపాలించు” అని చెప్పి కైలాసపర్వతానికి వెళతాడు. 


ధర్మరాజు తమ్ములందరితో...

“వ్యాసమహర్షి నాతో చెప్పినది విన్నారు గదా. సర్వక్షత్రియ నాశనానికి విధి నన్ను కారణముగా చేయదలచుకుంటే నేను జీవించి ఉండటం వలన ప్రయోజనం ఏముంది? కాబట్టి నేను మరణించాలను కుంటున్నాను” అని తన నిశ్చయం తెలియజేయగా అంత అర్జునుడు “ఘోరమైన ఇటువంటి మోహమును పొందక, ధైర్యం వహించి ఏది మేలో అది ఆచరించు, మేము నిన్ను అనుసరిస్తాము” అన్నాడు. 


అంత ధర్మరాజు ”సోదరులను గాని, ఇతర రాజులనుగాని పరుషంగా మాట్లాడను. జ్ఞాతుల ఆజ్ఞను పాటిస్తూ భేదభావం రాకుండా, విరోధం రాకుండా అడిగినవి ఇస్తూ, చెప్పినవి చేస్తూవుంటాను” అని ప్రతిజ్ఞ చేయగా తమ్ముళ్ళందరూ అందుకు సమ్మతించారు. 


మయసభ విశేషాలు చూడటానికి  శకుని,దుర్యోధనుడు 

ఇంద్రప్రస్థంలో ఉన్నారు. 

ఒక రోజు సుయోధనుడు ఒంటరిగా మయసభను చూడటానికి వెళ్ళాడు. దాని అపూర్వ సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు. దుర్యోధనుడు మయసభను చూసే సమయంలో అక్కడక్కడా భంగపడ్డాడు. తెరచిన ద్వారం మూసి ఉన్నట్లు గానూ, మూసిన ద్వారం తెరచినది గాను భ్రమించి లలాటం కొట్టుకున్నాడు. నీరులేనిచోట ఉన్నదని, నీరు ఉన్న చోట లేదు అని భ్రమపడి దిగి దుస్తులు తడుపుకున్నాడు. అతని అవస్థచూసి ధర్మరాజు

సుయోధనునికి నూతన వస్త్రాలు ఇచ్చాడు. కానీ దుర్యోధనుడు అది తనకు జరిగిన అవమానంగా భావించి రోషపడ్డాడు. హస్థినకు బయలుదేరాడు. మయసభా విభవం పాండవుల వైభవం అతనిలో అసూయా అగ్నిజ్వాలలా రగిలించింది. 

దుర్యోధనుడు అసూయతో రోజురోజుకు కృశించి పోసాగాడు. శకుని ఇది గమనించి “సుయోధనా నీకు ఏమైంది?” అని అడిగాడు.  


దుర్యోధనుడు “మామా మయసభ చూసావు కదా. అంతటి మయసభ కలిగిన ధర్మరాజు ఎంతటి అదృష్టవంతుడు. ధర్మరాజు 

చక్రవర్తి అయ్యాడు. రాజులంతా ధర్మరాజుకు  అమూల్యమైన కప్పములు సమర్పించారు. శ్రీకృష్ణుడు 

శిశుపాలుని వధించినా రాజులు పొగిడారు కాని ఏమని అడగలేదు. పాండవుల ఐశ్వర్యం సహించరానిదిగా ఉంది. అభిమానధనుడు దాయాదుల వైభవాన్ని సహింపకలడా?” అని దు॰ఖించాడు. 


శకుని “సుయోధనా! దృతరాష్టృని అనుమతి పొంది నా మాట పాటిస్తే పాండవ లక్ష్మిని నీకు చెందేలా చేస్తాను" అన్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🍁శనివారం 29 నవంబర్ 2025🍁*


`` *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                            5️⃣9️⃣``

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


         *సంపూర్ణ మహాభారతము*       

            *59వ రోజు*                    

```

అప్పుడు శ్రీకృష్ణుడు సభాసదులను చూసి “మేము ప్రాగ్జ్యోతిషపురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు  ద్వారకను తగులబెట్టాడు. భోజరాజులు రైవతకాద్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు. నా తండ్రి వసుదేవుడు  అశ్వమేధయాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు. బబ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం నూరు తప్పులు సహించాను. ఇతడు నాకు పరమ శత్రువు అయ్యాడు.” అన్నాడు.  


శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి “నేను వివాహమాడదలచిన కన్యను అపహరించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నావా?”అని దూషించాడు.


ఇక శ్రీకృష్ణుడు సహించలేక పోయాడు. తన చక్రాయుధం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు. శిశుపాలుని కుమారుని ఛేదిదేశానికి రాజుని చేసాడు. 

శిశుపాలుని వధతో రాజసూయం పరిసమాప్తి అయింది.```


*రాజసూయయాగం అనంతర విశేషాలు*```


ధర్మరాజు రాజసూయానికి విచ్చేసిన దేవతలను, గురువులను, బ్రాహ్మణులను తగు రీతిని సత్కరించి తృప్తిపరిచాడు. ధర్మరాజు 

ఆజ్ఞ ప్రకారం భీమసేనుడు భీష్మ, దృతరాష్ట్రులను సాగనంపాడు. అలాగే అర్జునుడు  దృపదుని సాగనంపాడు. నకులుడు  శల్యుని,సుబలుని సాగనంపాడు.  సహదేవుడు ద్రోణ,కృప,

అశ్వత్థామలను సాగనంపాడు. 

శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు 

వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమయ్యాడు. 

పాడవులందరూ శ్రీకృష్ణుని సాగనంపారు. 

వ్యాసమహర్షి కూడా బయలు దేరుతూ శిష్యులతోగూడి ధర్మరాజు దగ్గరికి రాగా ధర్మరాజు

“పురుషోత్తమా!రాజసూయయాగమును చేయమన్న మా తండ్రిగారి సందేశాన్ని నారద మహర్షి తెలుపుతూ రాజసూయయాగము చేయడం వలన ఈ భూమండలంపై సర్వక్షత్రియ వినాశాకమైన ఉత్పాదం, యుద్ధం సంభవించే కారణమైన సంఘటన జరిగేఅవకాశం ఉన్నదన్నారు. శిశుపాలుడి వధతో ఆ ఉత్పాతాలు సమసి పోయినట్లేనా" అని అడిగాడు. 


అంత వ్యాస మహర్షి “నాయనా యుధిష్టిరా! మహోత్పాతాల ప్రభావం పదమూడేళ్లు ఉంటుంది. సర్వక్షత్రియ నాశము జరుగుతుంది. ఆ సమయం రాగానే నీ కారణంగా దుర్యోధనుడి అపరాధం వలన భీమార్జునుల పరాక్రమం ద్వారా భూమి మీది రాజులందరూ కలిసి పరస్పర యుద్దంలో నాశనం అవుతారు. ఇందుకు నిదర్శనంగా తెల్లవారు జామున స్వప్నంలో నీవు వృషభారూఢుడైన పరమశివుడు దక్షిణ దిక్కును చూస్తూ కనిపిస్తాడు. దాని గురుంచి చింతించకు. కాలం దాటరానిది. నీకు శుభమవుగాక. అప్రమత్తంగా ఉంటూ భూమిని పరిపాలించు” అని చెప్పి కైలాసపర్వతానికి వెళతాడు. 


ధర్మరాజు తమ్ములందరితో...

“వ్యాసమహర్షి నాతో చెప్పినది విన్నారు గదా. సర్వక్షత్రియ నాశనానికి విధి నన్ను కారణముగా చేయదలచుకుంటే నేను జీవించి ఉండటం వలన ప్రయోజనం ఏముంది? కాబట్టి నేను మరణించాలను కుంటున్నాను” అని తన నిశ్చయం తెలియజేయగా అంత అర్జునుడు “ఘోరమైన ఇటువంటి మోహమును పొందక, ధైర్యం వహించి ఏది మేలో అది ఆచరించు, మేము నిన్ను అనుసరిస్తాము” అన్నాడు. 


అంత ధర్మరాజు ”సోదరులను గాని, ఇతర రాజులనుగాని పరుషంగా మాట్లాడను. జ్ఞాతుల ఆజ్ఞను పాటిస్తూ భేదభావం రాకుండా, విరోధం రాకుండా అడిగినవి ఇస్తూ, చెప్పినవి చేస్తూవుంటాను” అని ప్రతిజ్ఞ చేయగా తమ్ముళ్ళందరూ అందుకు సమ్మతించారు. 


మయసభ విశేషాలు చూడటానికి  శకుని,దుర్యోధనుడు 

ఇంద్రప్రస్థంలో ఉన్నారు. 

ఒక రోజు సుయోధనుడు ఒంటరిగా మయసభను చూడటానికి వెళ్ళాడు. దాని అపూర్వ సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు. దుర్యోధనుడు మయసభను చూసే సమయంలో అక్కడక్కడా భంగపడ్డాడు. తెరచిన ద్వారం మూసి ఉన్నట్లు గానూ, మూసిన ద్వారం తెరచినది గాను భ్రమించి లలాటం కొట్టుకున్నాడు. నీరులేనిచోట ఉన్నదని, నీరు ఉన్న చోట లేదు అని భ్రమపడి దిగి దుస్తులు తడుపుకున్నాడు. అతని అవస్థచూసి ధర్మరాజు

సుయోధనునికి నూతన వస్త్రాలు ఇచ్చాడు. కానీ దుర్యోధనుడు అది తనకు జరిగిన అవమానంగా భావించి రోషపడ్డాడు. హస్థినకు బయలుదేరాడు. మయసభా విభవం పాండవుల వైభవం అతనిలో అసూయా అగ్నిజ్వాలలా రగిలించింది. 

దుర్యోధనుడు అసూయతో రోజురోజుకు కృశించి పోసాగాడు. శకుని ఇది గమనించి “సుయోధనా నీకు ఏమైంది?” అని అడిగాడు.  


దుర్యోధనుడు “మామా మయసభ చూసావు కదా. అంతటి మయసభ కలిగిన ధర్మరాజు ఎంతటి అదృష్టవంతుడు. ధర్మరాజు 

చక్రవర్తి అయ్యాడు. రాజులంతా ధర్మరాజుకు  అమూల్యమైన కప్పములు సమర్పించారు. శ్రీకృష్ణుడు 

శిశుపాలుని వధించినా రాజులు పొగిడారు కాని ఏమని అడగలేదు. పాండవుల ఐశ్వర్యం సహించరానిదిగా ఉంది. అభిమానధనుడు దాయాదుల వైభవాన్ని సహింపకలడా?” అని దు॰ఖించాడు. 


శకుని “సుయోధనా! దృతరాష్టృని అనుమతి పొంది నా మాట పాటిస్తే పాండవ లక్ష్మిని నీకు చెందేలా చేస్తాను" అన్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ఉచితాలకి ఇక చెల్లుచీటీ...

  🌹🌹🌹


*ఉచితాలకి ఇక చెల్లుచీటీ... కోర్టుల జోక్యం...ఊపిరి తీసుకుంటున్న సామాన్య ఉద్యోగులు...ఇక చదవండి.👌*

*తమిళనాడు (హైకోర్టు)*


ఇక చదవండి...🙏


_*ఉచిత పథకాలపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం.*_

*మీ వల్లే బద్ధకం.. కొన్నాళ్లైతే అన్నం వండి తినిపిస్తారేమో.*

*- కేంద్ర, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశo...*

★ మా పార్టీని గెలిపిస్తే ఇంటికో వాషిన్ మెషీన్..! నన్ను గెలిపిస్తే మహిళలకు ఉచితంగా బంగారం ఇస్తాం..! మా అభ్యర్థిని సీఎం చేస్తే ప్రతి ఇంటికీ నెలకు రూ.10 వేలు..! ఎన్నికల్లో ఇలాంటి ఉచిత హామీలు ఎక్కువయ్యాయి. 

★ ఏ పార్టీ మెనిఫెస్టో చూసినా ఉచితాలే దర్శనమిస్తాయి. 

★ ఇక తమిళనాడులో అయితే లెక్కే లేదు. 

★ ఉచిత టీవీ, ఉచిత ఏసీ, ఉచిత సైకిల్, ఉచిత బైక్, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, ఉచిత కేబుల్ కనెక్షన్.. ఇలా ఒక్కటా రెండా.. అక్కడ అన్నీ ఉచితాలే. 

★ ఈ ఉచిత హామీలపై మద్రాస్ హైకోర్టు మండిపడింది. 

★ ఉచిత పథకాలతో ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నారని.. ఏ పనీ చేయకుండా తయారు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది.

★ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీ ప్రకటించిన ఉచిత హామీలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలయింది.

★ ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్యా వైద్యారంగ అభివృద్ధి, రవాణా, వ్యవసాయ రంగాలను పక్కనబెట్టి.. ఉచిత హామీలపైనే అభ్యర్థులు ఫోకస్ పెడుతున్నారని పిటిషన్ వాదించారు. 

★ వీటికి కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

★ దానిపై విచారించిన జస్టిన్ ఎన్.కిరుబకరన్, జస్టిస్ బి.పుగలెంతినేతృత్వంలోని ధర్మాసనం.

★ ఉచిత పథకాలను తీవ్రంగా తప్పుబట్టింది. 

★ ఉచిత పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులుగా మారుతున్నారని అభిప్రాయపడింది. 

★ ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు తక్కువలో తక్కువ రూ.20 కోట్లు ఖర్చుపెడుతున్నారని.. బిర్యానీ, బీరు కోసం ఓటువేస్తే, మీ నాయకుడిని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఎక్కడుంటుందని ప్రశ్నించింది.

★ ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ ప్రజలకుందని స్పష్టం చేసింది. 

★ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉచిత కలర్ టీవీలు, ఫ్యాన్స్, మిక్సర్ గ్రైండర్లు, ల్యాప్‌టాప్‌లు.. వంటి హామీలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

★ అన్నాడీఎంకే పార్టీ ఉచిత వాషింగ్ మెషీన్ హామీ కూడా ఇచ్చింది.

★ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మహిళలకు రేషన్ కోసం ఆర్థిక సాయం చేస్తాయని కూడా ప్రకటించాయి. 

★ ఐతే ఈ ఉచిత హామీల సంప్రదాయం కొనసాగడం ప్రజలకు ఎంత మాత్రమూ మంచిది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. 

★ రానున్న రోజుల్లో అన్నం కూడా వండి తినిపిస్తారేమోనని సెటైర్లు వేసింది. 

★ ఉచిత హామీలను అవినీతి వ్యవహారంగా పరిగణించాల్సిన అవసరం ఉందని..

★ వీటి వలన ఓటర్లు ప్రభావితమవుతున్నారని అభిప్రాయపడింది. 


★ ఉచిత పథకాల వలన తమిళ ప్రజలు బద్ధకస్తులుగా మారిపోయారని.. అందుకే హోటళ్లు, సెలూన్‌లు, చివరకు పొలాల్లో పనిచేసేందుకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని మద్రాస్ హైకోర్టు కోర్టు తెలిపింది. 


★ రానున్న రోజుల్లో ఇక్కడి స్థిర, చరాస్తులకు వలస కార్మికులే యజమానులుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. 


★ ఉచిత పథకాలకు సంబంధించి పిటిషనర్ పేర్కొన్న 20 ప్రశ్నలకు కేంద్ర, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. 


*ఉచిత హామీలకు అడ్డుకట్ట వేసే దిశగా ఎలాంటి చర్యలు చేపడతారో ఏప్రిల్ 26 లోగా చెప్పాలని స్పష్టం చేసింది.*..®✓

హిందూ ధర్మం

 🌹హిందూ ధర్మం 🌹


ఇంతకి ఈ 14 లోకాలు ఎక్కడ ఉన్నాయి? వాటి లోకవాసులు ఎలా ఉంటారు? వారు సాధారణ మనుష్యులేనా? లేక దివ్యలోకాలకు చెందినవారా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఈ ప్రశ్నలకు నాస్తిక కోణం నుంచి సమాధానాలు వెతికితే, అది అర్ధ సమాచారంతో ముగుస్తుంది, అవగాహనారాహిత్యన్ని బయటపెడుతుంది. మనకు 3 ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి శాస్త్రప్రమాణం, రెండవది ఆప్తప్రమాణం, మూడవది ఆత్మప్రమాణం. శాస్త్రమనగా వేదాది శాస్త్రాలు, ఆప్తులు అంటే ధర్మం మేలు కోరేవారు; భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్య, త్రైలింగ స్వామి మొదలైనవారు; ఆత్మప్రమాణం అంటే వ్యక్తి యొక్క అనూభూతి/ దివ్యానుభవం. ఆత్మప్రమాణాన్ని ఆప్తప్రమాణం, శాస్త్రప్రమాణంతో పోల్చి చూసి, అప్పుడే నిర్ధారణకు రావాలి. శాస్త్రకారుల దృష్టి, జ్ఞానం, అనుభవం మనకు లేకపోవచ్చు, కనుక మలిన, సంకుచిత బుద్ధితో వీటికి అర్ధా లను చెప్పి అసలు విషయాన్ని పక్కదారి పట్టించకూడదు.


దేవ- అనే పదం ద్యు లేదా ద్యౌ అనే అక్షరం నుంచి వచ్చింది. ద్యౌ అంటే కాంతిగల లోకం. దేవతలు అంటే కాంతి శరీరం కలిగినవారు. వారివి మనలాంటి పాంచభౌతిక దేహాలు కాదు, రక్తమాంసాలతో నిండిన దేహాలు కావు, అవి దివ్యశరీరాలు. వారు కాంతి శరీరులు. అందుకే దేవతలు ప్రత్యక్షం అయ్యారని అంటాము, అంటే కళ్ళముందు కనిపించడం; అదృశ్యం అయ్యారు అంటాము- దృశ్యం అంటే కనిపించేది, కనిపించకుండా పోవటం అదృశ్యం. అంటే తమను వ్యక్తం చేసుకున్న దేవతలు తిరిగి అవ్యక్తమవ్వడం అన్నమాట. అలాగే పితృదేవతలు - మరణించిన మన కుటుంబాలకు చెందినవారు. వీరు కూడా భౌతిక దేహాన్ని కోల్పోయి, పితృలోకానికి చెందిన శరీరాన్ని పొందినవారే. దేవత అంటే ఇచ్చుటకు శక్తి కలిగి ఉన్నది అని అర్దం. పితరులు ఆశీస్సులు నిత్యజీవితంలో ఎంతో అవసరం. అలాగే ఇంద్రాది దేవతలవి కూడా. వారు మనకు ఎన్నో విధాలుగా సాయం చేస్తారు. వరాలను ఇస్తారు. అందుకే దేవతలు అన్నారు. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లల వృద్ధికి కారణమవుతుంది కనుక వారిని దేవతలుగా భావించమని వేదం చెప్పింది. ఇంద్రుడు, అగ్ని, ఆదిత్యుడు, యక్షులు, గంధర్వులకు పునర్జన్మ ఉంది. అయితే పరంబ్రహ్మ/ పరమాత్మ- ఈ దేవతలకంటే పైస్థాయివాడు. మనం పూజించే శివ, శక్తి, విష్ణు, గణేశ మొదలైన స్వరూపాలు ఈ పరబ్రహ్మం యొక్క ప్రతిబింబాలు.


ఇప్పుడు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నిజదేవుడిని పూజించండి, మా ద్యాముడు మాత్రమే నిజదేవుడు, అల్లాహ్ నే అసలు దేవుడు, హిందూ దేవీదేవతలు సైతాన్లు అంటూ మతమార్పిడి మూకలు ప్రచారం చేస్తున్నాయి. దేవత (తెలుగులో దేవుడు) అనేది సంస్కృతపదం. అది ఎవరికి వాడాలో కూడా శాస్త్రమే చెప్పింది. ఈ అన్యమతస్తులు చెప్పిన దేవుడికి రూపంలేదు, అది కాంతిశరీరం కలదని, దివ్యశరీరం కలదని వాళ్ళ గ్రంథాలు చెప్పలేదు. ఉంటే అలా ఎక్కడుందో reference చూపించమని అడగాలి. అసలు శరీరం ఉందని చెప్పడమే నింద అని చెప్పాయి. కానీ వాళ్ళేమో నిజదేవుడంటారు- ఈ దేవుడు అనే పదం వాళ్ళు వాడటం ఆయా గ్రంథాలను అపహాస్యం చేయడం, వాళ్ళ గాడ్‌ (God) కు ఈ పదాన్ని హిందువులు ఉపయోగించటం సనాతనధర్మాన్ని అవమానించటమే అవుతుంది. ఇది మనం గమనించాలి. వారు వాడకూడదని తెలియజేయాలి. 

అలాగే యక్ష, కిన్నెర, కింపురుష మొదలైన ఇతర లోకవాసుల గురించి, సూర్యమండలం, చంద్రమండల వాసుల గురించి పురాణాలు చెబుతున్నాయి. వీరి ఎక్కడ ఉన్నట్లు? వీరిని మానవులుగా, కొండజాతి వారిగా భావించకూడదు. యక్షులు, గంధరువులు మొదలైన వారితో సంభాషించిన మహాత్ములు, సిద్ధులు ఈ భూమి మీద తిరిగారు. వారి చరిత్రలు మనలో పేరుకుపోయిన ఎన్నో సందేహాలను, అపార్ధాలను తొలగిస్తాయి. యక్షులు, గంధర్వులు మొదలైనవారు కామరూపధారులు. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు. వీరు చెడ్డవారు అనే అభిప్రాయం చాలామంది చెప్తారు. కానీ వాస్తవంలో చక్కని జ్ఞానం, లోకహితం కోరే యక్షులు అనేకమంది ఉన్నారు. భగవంతుడు వీరిని కొన్ని అరణ్యాలకు రాజులుగా నియమించాడు. ఆయుర్వేద మూలికలపై వీరి ఆధిపత్యం ఉంటుంది. సంపదల కోసం లోకులంతా పూజించే కుబేరుడు యక్షరాజు. కొన్ని పురాతన ఆలయాలను నిర్మించినప్పుడు, ఆ ఆగమంలో భాగంగా ఆ ఆలయసంపదలకు రక్షకులుగా యక్షులను నియమించడం కనిపిస్తుంది. ఆలయ గోడలపై రకరకాల రూపాలు చెక్కి ఉండటం మనం చూస్తుంటాము. అందులో కొన్ని యక్షులవి ఉంటాయి. వారు ఆ ఆలయానికి రక్షకులుగా ఉంటారు. 

ఆలయ సంపదను, హుండీ డబ్బును ప్రభుత్వం తీసుకుని ప్రజల కోసం ఉపయోగించాలి. దేవాలయంలో స్వామికి అర్పించిన బంగారాన్ని ప్రభుత్వం కరిగించి తాకట్టు పెట్టాలి; ఇలాంటి మాటలు అప్పుడప్పుడూ వింటూ ఉంటాము. గుప్తనిధుల కోసం దేవాలయంలో తవ్వకాలు జరపడం చూస్తుంటాము... ఇలాంటి మాటలు మాట్లాడేవారిని, నిధుల కోసం ఎగబడేవారిని యక్షులు శిక్షిస్తారు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకుండా, పనులు చేయకుండా జాగ్రత్తపడండి. యక్షులకు దైవభక్తి ఉంటుంది. మనం వృక్షాల చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. అప్పుడు మనకు తగిన ఫలితం ఇచ్చేది ఎవరు?.... యక్షిణీదేవతయే ఆ చెట్టు మీద ఉండి, మన ప్రదక్షిణకు తగిన ఫలితం ఇస్తుందని తంత్రగ్రంథాల్లో శివపార్వతుల సంవాదంలో కనిపిస్తుంది. అనగా వీరు దివ్యశరీరం కలవారని స్పష్టమవుతోంది. దేవలోక గాయకులు గంధర్వులు. వీరు కూడా దివ్యశరీరులు. వీరికి దైవభక్తి అధికం, పరమాత్మను ఉద్దేశించి వీరు చేసే గానాలకు గంధర్వవేదం అనే ప్రత్యేక వేదం కలిగి ఉన్నారు. అహోబిలంలో ఛత్రవట నృసింహస్వామి వారి సన్నిధిలో హాహా, హూహూ అనే పేరుగల గంధర్వులు గానం చేశారు. అప్పుడు స్వామి వారి గానానికి మైమరిచి, తాళం వేశారు. అహోబిలంలో ఛత్రవట నృసింహస్వామి వారి మూలవిరాట్టు స్వయంభూః. అక్కడ స్వామి రూపం కూడా తాళం వేస్తున్నట్లుగానే ఉంటుంది. 


అహోబిలం, మాల్యాద్రి, అరుణాచలం, శేషాచలం (తిరుమల), శ్రీశైలం, పశ్చిమ కనుమూల్లో కొన్ని ప్రదేశాలు.... ఇలా అనేక పవిత్ర స్థలాల్లో యక్షులు, సిద్ధులు, గంధర్వులు మొదలైన ఇతరలోక జీవులు ఈనాటికీ తపస్సు చేసుకుంటున్నారు. అలాగే కొందరు ఋషుల జీవిత చరిత్రలను గమనించినప్పుడు, వారు తపస్సు చేసుకోవడం కోసం, దేవకార్యం కోసం భూలోకనికి వచ్చారాని చెప్పబడి ఉంటుంది. ఆ కార్యం పూర్తవ్వగానే తిరిగి దివ్యలోకాలకు వెళ్ళిపోయారని కనిపిస్తుంది. అంటే మనకు కనిపించే ఈ లోకం కాక మరెన్నో లోకాలు ఉన్నాయని ఆప్తుల ద్వారా, గురువుల ద్వారా స్పష్టమవుతోంది.

🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

పంచాంగం