*ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది*.
*ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు*.
*ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి*..!
" *మీరేంచేస్తారో నాకు తెలియదు, నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను" అని కన్నీరుపెట్టుకుంది*..!
*దానికి ఇంద్రుడు*...
*దీనికే ఇంత ఏడవడం ఎందుకు*.!? *అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మ కదా..! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను* *నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు*.
*ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ*
*నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను* *దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు..! కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం పద.!" అంటూ బయలుదేరారు*.
*వీరిరాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు*.
*నిజమే ప్రాణాలు* *కాపాడేవాణ్ణి నేనే ..కానీచిలుక ప్రాణం చివరి దశలో ఉంది..! మళ్ళీ ఊపిరి పోయాలంటే.. శివునికే సాధ్యం, మనం ముగ్గురం శివుని ప్రార్థిస్తాం పదండి అన్నారు*.
*ముగ్గురూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు*.
" *ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను..! మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి..! " అంటూ అందరూ బయలుదేరారు*.
*ఇంద్ర,బ్రహ్మ,విష్ణువు,శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాదారంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు*.
*అయ్యో* ..! *అదేమి పెద్ద పనికాదు. మాములుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను,వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. ఏ ఆకు రాలి క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకకు కాపాడుదాం అని అన్నాడు* .
*యముడు , అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే.. ఒక ఆకు రాలి పడింది.ఆ ఆకు ఎవరిదో.. అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ..ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం వ్రాసి ఉంది ఇలా*..!
*ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు.. బ్రహ్మ.. శివుడు..విష్ణువు.. యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది*..! *అని* *వ్రాసి ఉంది*
*ఇదే విధి*..! *విధిని ఎవ్వరూ మార్చలేరు..🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి