12, సెప్టెంబర్ 2020, శనివారం

బీజాక్షర వివరణార్థములు

:వృక్షము యొక్క విత్తు లాగానే బీజాక్షరము అనేది మంత్రము యొక్క బీజము లాంటిది. అది పఠించటము వలన సాధకునకు సకారాత్మక శక్తి(Positive energy) కలుగును. పఠించిన కొలది ఆ సకారాత్మక శక్తి(Positive energy) క్రమముగా వృక్షము మాదిరి వృద్ధిచెందును.

బీజమంత్రములు అనేవి స్పందనలు. ఆత్మయొక్క పిలుపులు. సృష్టి ఆరంభములోని స్పందనలు బీజాక్షర మంత్రములే. తొమ్మిది శబ్దములవరకు ఉన్నది బీజమంత్రము, తొమ్మిదికి మించినయడల మంత్రము అని, ఇరువది శబ్దములను మించిన మహా మంత్రము అని అంటారు.
అసలు సృష్టి ఆరంభములోని ప్రథమ స్పందన ‘ఓం’. అనగా ‘ఓం’ అనేది ప్రథమ బీజాక్షరము. ఆ ‘ఓం’ అనే ప్రథమ బీజాక్షరము క్రమముగా యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజము లుగా ఉత్పత్తి చెందినది. అవియే ‘ఐం’ ‘హ్రీం’ ‘శ్రీం’ ‘క్రీం’ ‘క్లీం’ ‘దం’ ‘గం’ ‘గ్లౌం’ ‘లం’ ‘వం’ ‘రం’ ‘యం’ ‘హమ్’ ‘రాం’ అనే బీజాక్షరములు. సంగీతములో కూడా ప్రథమముగా ఉన్నది ‘ఓం’ మాత్రమె. అది క్రమముగా ‘స’, ‘రి’, ‘గ’, ‘మ’, ‘ప’, ‘ద’, ‘ని’, గా ఉత్పత్తి చెందినది. వేణువు ఊదినప్పుడు వచ్చు మొదటి శబ్దము ‘ఓం’ మాత్రమె. యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజము లుగా ఉత్పత్తి చెందినది.

ఓం:
‘ఓం’ మంత్రము త్రిమూర్తులు అనగా సృష్టి (బ్రహ్మ) లేదా ‘అ’ కారమునకు, స్థితి(విష్ణు) లేదా ‘ఉ’ కారమునకు, మరియు లయ (మహేశ్వర) లేదా ‘మ’ కారమునకు, లకు ప్రతీక. ‘అ’ కారము, ‘ఉ’ కారమునకు, మరియు ‘మ’ కారము మూడు కలిసినదే ఓంకారము. ‘అ’ కారము ఋగ్వేదమునకు, ‘ఉ’ కారము సామవేదమునకు, మరియు ‘మ’ కారము యజుర్వేదమునకు ప్రతీక. సృష్టి (బ్రహ్మ), స్థితి(విష్ణు) మరియు లయ (మహేశ్వర) మూడింటిని కలిపి మాయ అంటారు.

క్రీం లేదా ధం లేదా క్షం లేదా లం :
ఇది కాళీమాత మరియు కుబేర బీజాక్షరము. ఈ బీజాక్షర ఉచ్చారణ మూలాధార చక్రములో చేయవలయును. మూలాధార చక్రము పృథ్వీ తత్వమునకు ప్రతీక. తద్వారా ఇచ్ఛాశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆరోగ్యము, బలము, అన్నివిధముల సఫలత, మరియు నకారాత్మక శక్తులనుండి రక్షణ లభించును.

శ్రీం లేదా వం :
ఇది మహాలక్ష్మి బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ స్వాధిష్ఠాన చక్రములో చేయవలయును. స్వాధిష్ఠాన చక్రము వరుణ తత్వమునకు ప్రతీక. తద్వారా క్రియాశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆరోగ్యము, అంగములలో బలము, మూత్రపిండములు, చర్మము వ్యాధుల నుండి రక్షణ, అన్నివిధముల భౌతిక సఫలత, వ్యాపార లేక వృత్తిలో వృద్ధి, రోగములను నిరోధించు శక్తి, విచార లేక శోక నిర్మూలన, సౌందర్యముగల భార్య లభించుట, సంతోషకరమయిన దాంపత్య జీవనము, అన్నివిధముల సఫలత, మరియు నకారాత్మక శక్తులనుండి రక్షణ లభించును.

హ్రౌం లేదా దూం లేదా రం:
ఇది శివ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ మణిపురచక్రములో చేయవలయును. మణిపురచక్రము అగ్ని తత్వమునకు ప్రతీక. తద్వారా జ్ఞానశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆత్మనిగ్రహశక్తి వృద్ధి చెందును. అకాల మరణము, చక్కర (diabetes) వ్యాధినుండి రక్షణ, మోక్షమునకు మార్గము లభించుట ఆరోగ్యము, అంగములలో బలము, అన్నివిధముల భౌతిక సఫలత, వ్యాపార లేక వృత్తిలో వృద్ధి, రోగములను నిరోధించు శక్తి, విచార లేక శోక నిర్మూలన, సౌందర్యముగల బార లభించుట, సంతోషకరమయిన దాంపత్య జీవనము, అన్నివిధముల సఫలత, మరియు నకారాత్మక శక్తులనుండి రక్షణ లభించును.

హ్రీం లేక ఐం లేక యం:
ఇది మహామాయ లేక భువనేశ్వరీ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ అనాహతచక్రములో చేయవలయును. అనాహతచక్రము వాయు తత్వమునకు ప్రతీక. తద్వారా బీజశక్తి(root power) వృద్ధి చెందును. తద్వారా ప్రాణశక్తి నియంత్రణ వృద్ధి చెందును. వాయుప్రకోపనముల (gastric disturbances) వ్యాధులనుండి రక్షణ, నాయక లక్షణములు కలుగుట ఏర్పడును.

గం లేక ఫ్రౌం లేక హమ్:
ఇది గణపతి, కుండలినీ, మరియు హనుమాన్ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ విశుద్ధ చక్రములో చేయవలయును. విశుద్ధ చక్రము ఆకాశ తత్వమునకు ప్రతీక. తద్వారా జ్ఞానము, రక్షణ, ఐశ్వర్యము, సుఖము, సౌభాగ్యం, ఆరోగ్యము, సమస్త హృదయబాధల ఉపశమన, సమస్త నకారాత్మక శక్తుల నిర్మూలన నివారణ కలుగును.

దం లేక ఓం:
ఇది విష్ణు బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ ఆజ్ఞా చక్రములో చేయవలయును. ఆజ్ఞా చక్రము కృష్ణ తత్వమునకు ప్రతీక. తద్వారా శుద్ధ జ్ఞానము, రక్షణ, ఐశ్వర్యము, సుఖము, సౌభాగ్యం, ఆరోగ్యము, సమస్త హృదయబాధల ఉపశమన, సమస్త నకారాత్మక శక్తుల నిర్మూలన నివారణ కలుగును.
క్ష్రౌం లేక రాం : ఇది నరసింహ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ సహస్రార చక్రములో చేయవలయును. తద్వారా సమస్త నకారాత్మక శక్తుల నిర్మూలన నివారణ కలుగును మరియు సాధకుడు స్వయముగా సాక్షీభూతుడు అగుతాడు.

గొప్ప ప్రేమకి చిహ్నముగా ఏముంది ?

టీచర్ - పిల్లలూ ఈ భూమి మీద గొప్ప ప్రేమకి చిహ్నముగా ఏముంది ?

విద్యార్థి - రామసేతు టీచర్...
టీచర్ - తాజమహల్ అని తెలిసికూడా రామసేతువు అని చెప్తున్నావ్...? పిచ్చెక్కిందా...!

విద్యార్థి - క్షమించండి టీచర్... తాజ్మహల్ గొప్ప కట్టడం అంతే.. ప్రేమకి గొప్ప చిహ్నం మాత్రం కానేకాదు.. మీ అందరి మనస్సుపై అలాని రుద్దించబడినది.

షాజహాన్... ముంతాజ్ చనిపోయిన 4 రోజుల్లోనే రెండో పెళ్లి చేసుకున్నాడు.

షాజహాన్ వద్ద 500 వేశ్యలు మొదటనుండే ఉన్నారు.

తాజ్ మహల్ నిర్మించడం కోసం... ప్రజలవద్ద నుండి అక్రమంగా కప్పం (టాక్స్) దోచుకున్నాడు

తాజ్ మహల్ మళ్ళి నిర్మించకుండా ఉండటం కోసం... 20 వేల మంది గొప్ప కార్మికుల చేతులను నరికాడు

తాజ్ మహల్ ప్రేమకి కాదు... పైశాచికానికి ప్రతీక.

అసలైన ప్రేమను శ్రీ రాముడు చూపించాడు టీచర్..
రాళ్లు కూడా తన ప్రేమ శక్తిని గుర్తించి నీళ్ళపై తేలియాడాయి...
తన ప్రేమ ఫలించడానికి సముద్రము, వానరులు, పక్షులు, చివరకి చిన్న చిన్న ఉడతలు కూడా సాయం చేశాయి.
ప్రేమకు దీనికంటే గొప్ప చిహ్నం ఇంకేమి సాటి రాలేదు టీచర్.

 టీచర్ మరియు మిగతా పిల్లలు
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

జై జానకి శ్రీ రామ్🚩

ఆలయం ..మోసాలు

కర్నూల్ జిల్లా మహానంది ఆలయం లో మీకు తెలియని మోసాలు భక్తులని యెంత ఇబ్బంది పాలు చేస్తున్న ఈఓ
1) నిత్యా అన్నదానం డోనార్స్ ఉన్న, నిత్యం ఉచిత కూరగాయలు ఇస్తున్నవచ్చే భక్తులు వేలల్లో, లక్షల్లో ఉన్న
కేవలం 100 మందికే మిగిలితే ఇంకో 20 మందికే అన్నదానం ఎందుకో తెలుసా ఈ ఆలయం మొదట్లో భోజనం హోటల్ ఉంది ఆ హోటల్ వాడు సంవత్సరానికి అక్షరాలా 40 లక్షలు దేవాలయాన్ని కడతాడంట అలాంటప్పుడు దేవాలయాల్లో అన్నదానం చేస్తే ఊరుకుంటాడా హోటల్ వాడు
2) ఈ దేవాలయం లో బాత్రూమ్స్ ఉండవ్ ఉన్న క్లోజ్ చేసేసి చేన్నాళ్ళు అయ్యింది ఎందుకో తెలుసా ఈ గుడికి లెఫ్ట్ సైడ్ పే యూజ్ బాత్రూమ్స్ ఉన్నాయ్ ఆడవాళ్లు , పసి పిల్లలు , మొగవారు ఎవరైనా ఒకటి కైనా రెండుకైన 10 రూపాయలు చెల్లిస్తేనే వెళ్ళనిస్తారు లేకపోతె లేదు పొరపాటున డబ్బులు రూమ్ లో మర్చి పొతే ఆడవాళ్లు ఐన ఏ చెట్టో చూసుకోవాలి
3) దేవస్థానం రూములు ఉంటాయి ఒక రోజుకు 200 కానీ ఎప్పుడు ఫుల్ అనే చెపుతారు ఆ రూమ్స్ ఎవరు లేక పాడుపడి పందులు కూడా ఉండవ్ నల్లుల మంచాలు పరుపు లో కబ్బరి పీచు కనిపించేలా చిరిగిపోయి గదులు ప్రేతకళతో ఉంటాయి ఎందుకో తెలుసా ఆ చుట్టుపక్కల ఉండే లాడ్జ్ లు డీలాక్స్ రూమ్స్ అని ప్రైవేట్ రూమ్స్ వాళ్ళు మొత్తం అందరు కలసి సంవత్సరానికి 3 కోట్ల దాక ఇస్తారు అంటా ఈ దేవాలయానికి
అలాగే చుట్టుపక్కల ఉన్న తినుబండారాల బండులు కలిపి నెలకి ఒక్కొక్క బండికి 1200 చప్పున కడతారంట అన్ని అధిక రేట్లకే అమ్ముతారు అక్కడ
4) మీరు పువ్వులు కబ్బరికాయలు పూజ ద్రవ్యాలు ఏ దేవాలయానికి వెళ్లిన చేలా షాపులు ఉంటాయి కానీ మహానంది లో ఒక్క షాప్ మాత్రమే ఉంటుంది అక్కడ రేట్లకు హద్దు ఆపు ఉండదు భక్తులు ఏమి చేయలేక కొంటుంటారు
5) ఏ దేవాలయాల్లో ఐన శనేశ్వరస్వామి ని దర్శించక శివయ్యను దర్శిస్తారు కానీ ఇక్కడ చాలాదారుణం దేవుణ్ణి పెట్టి వ్యాపారం చేస్తున్నారు ఏంటంటే శివయ్యను ,కామేశ్వరి అమ్మవార్ని , రామాలయాన్ని , ఆంజనేస్వామి ని దర్శించక బయటికి వచ్చే దారిలో నవగ్రహాల ఆలయం ఉంటది బయటకి వచ్చే దారిని మూసేసి నవగ్రహాలు లోపలి నుండి అది ఎడమ వైపు నుండి ప్రదక్షణమ్ చేయమంటారు ఒక పంతులు మామూలుగా ఐతే నవగ్రహాల బయటవరకే భక్తులు ప్రదక్షణం చేస్తరు కానీ డబ్బు కోసం నవగ్రహాల లోపలి కి వెళ్లి ఎడమ వైపు నుండి ప్రదక్షణమ్ చేపించి దీపం వెలిగించాలి అన్ని చెప్పి ఒక్కరిదగ్గర 50 రూపాయలు వసూళ్లు చేస్తాడు ఆ పంతులు అదేంటి ఆరా తీయగా నవగ్రహాల ను సంవత్సరానికి 20 లక్షలకు పాడాడంట ఆ పంతులు, ఇలాగ ఈ దేవాలయానికి సంవత్సర ఆదాయం అక్షరాలా 11 కోట్లు అంట దేవాదాయ ఈ ఆదాయం తో బాత్రూమ్స్ కటించ వచ్చు , అన్నదానం , ఇంకా ఎన్నో చేయొచ్చు ధర్మాదాయ శాఖ ఏంచేస్తుందో దేవాలయాల్లో ఇంతంత మోసాలు జరుగు తుంటే ఇక్కడే కాదు భద్రాచలం , లో కాణిపాకం లో ఆలయ గర్భ గుడిలా ఫోటోలు తీయటం తప్పు కానీ గుడి బయట ఆవరణాల్లో సెల్ ఫోనుల్లో ఫోటోలు తీయనీయకుండా అక్కడ ఫోటో గ్రాఫేర్స్ కి కాంట్రాక్ట్స్ ఇచ్చేసి వాళ్ళతో డబ్బులు ఇచ్చి తప్ప ఫోన్ లో ఫొటోస్ తీయనీకుండా చేస్తున్నారు కూడా నాకు ఎదురైనా పరిస్తుతులు ఇంకా ఎన్నో హిందూ దేవాలయాల్లో కూడా ఇదే పరిస్థితి అసలు ఎంతంత దూరాలనుండి దేవాలయాల దర్శనాలకు వెళ్తున్న భక్తులకు కనీస సౌకర్యాలు లేకపోగా అనేక ఇబ్బందుల పాలు చేటున్నారు ఈ దేవాలయాల అధికారులు వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే దాక షేర్ చేయండి లేకపోతె మన దేవాలయాలకు సామాన్యులు దేవాలయాలకు వెళ్ళలేరు వెళ్లారు కూడా

మంచి గ్రహా స్థితి ఉందని చెపుతున్నారు*_

*పండితుల సలహా ప్రకారం 13 వ తారీఖు న ఒక మంచి గ్రహా స్థితి ఉందని చెపుతున్నారు*_

13/09/2020 ఆదివారం ఉదయాన 10:45 నుండీ 11:45 మధ్య:

లగ్నం - అనూరాధ 2 - వృశ్చిక
రవి - సింహం - భావం 10 - స్వక్షేత్రం
చంద్ర - కర్కా - భావం 9 - స్వక్షేత్రం
కుజ - మేష - భావం 6 - స్వక్షేత్రం
బుధ - కన్య - భావం 11 - ఉచ్ఛ
గురు - ధను - భావం 2 - స్వక్షేత్రం
శుక్ర - కర్క - భావం 9 - శత్రు
శని - మకర - భావం 3 - స్వక్షేత్రం
రాహు - మిధున - భావం 8 - సమ
కేతు - ధను - భావం 2 - సమ

*మంచి ముహూర్తం అని చెపుతున్నారు,*

_ఆ గంట కాలం కనుక, ప్రతీ ఒక్కరూ రెండు జిల్లేడు ఆకులపై గోధుమలు ఉంచి, మట్టి ప్రమిద లో రెండు వత్తులు వేసి దీపారాధన చేసి,... దైవారాధన లో నిమగ్నమై ఉండడం మంచిది అని చెపుతున్నారు_

*చేసిన ప్రతీ ఒక్కరికీ శుభమే జరుగుతుంది...*

🙏సర్వే జనా సుఖినోభవంతు🙏
మన ప్రియతమ సభ్యుడు శ్రీ వై. ఎన్. వి. ఎల్. నరసింహారావు గారు, డాక్టర్ వడ్లమాని రవిసుందర్ గారు ప్రసంగించిన ఈ ఆడియోలో ఇక రాబోవు 250 సంవత్సరాలకు కూడా రానటువంటి ఒక అద్భుతం 13.9. 2020 ఆదివారం ఉదయం 10-45 నుంచి 11-45 లోగా నవ గ్రహాలలో (రాహు, కేతు, శుక్ర, గ్రహాలు తప్ప, మిగిలిన) ఆరు ప్రధాన గ్రహాలు తమతమ స్వక్షేత్రాలో పూర్తిగా ఉండబోతున్నాయి అని తెలిపారు. అందు వలన కలిగే ఫలితాలు కూడా తెలిపారు.
         ఇటువంటి జ్యోతిశ్శాస్త్ర, ఫల సంబంధమైన కలయిక రాబోవు రెండు వందల యాభై సంవత్సరాలు పైగా కూడా చూడవీలు పడదేమోని, కనుక, 13.9 2020 ఆదివారం ఉదయం స్నానం చేసి,10-45 నుండి, 11-45 వరకు పూజ గది ముందు కూర్చుని, 2 జిల్లేడు ఆకుల పై గుప్పెడు గోధుములు పెట్టి, దానిపై మట్టి ప్రమిదలో ఆవు నేతి దీపం కానీ, నువ్వుల నూనె దీపం కానీ వెలిగించి, మీ ఇష్ట ఆరాధ్య దైవములను సంకల్ప పద్ధతిలో స్తుతించి, మీ మనసులో మీకు కావలసిన కోరికలను ఫలించినట్లు కోరుకొని, సఫలీకృతులు కావాలని కోరడమైనది.

       సంకల్పానికి, లలితా సహస్రనామం కానీ, విష్ణుసహస్రనామం కానీ,హనుమాన్ చాలీసా కానీ, వేరే మీ ఇష్ట దేవత నామస్మరణ కానీ, చేసిన, మీరు కోరిన ఫలితం దక్కుతుంది. ఈ సందర్భం మీ జీవితంలో మరెన్నడూ రాదు.

       ఒకవేళ మీకు పైన చెప్పిన దేవతల నా మావళి దొరకకపోతే,
సులభంగా ఈ క్రింది సూర్యభగవానుని సంకల్పమును జపించండి:-

" ఆదిత్యాది నవగ్రహానా,
అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు".
     
      పై చిన్న మంత్రమును పూజ జరిగే వరకు చెప్పాలి.

      తెలుగు లో ఉన్న ఈ ఆడియో ని ఒకటికి రెండు సార్లు వినండి. ఆయురారోగ్య సుఖశాంతులతో వర్ధిల్లండి.

లోకా సమస్తా సుఖినోభవంతు🕉️🙌

కర్మ - సంబంధం

పాలను ఆశించి గోవును పోషిస్తాము
గోవు నుంచి మనకు పాలు వస్తాయి
అంతే కాదు పేడ కూడా వస్తుంది
పాలు ఇంట్లోకి తెచ్చుకుంటాం
పేడని ఇంటికి దూరంగా విసిరేస్తాం

ఆవు నుండి పాలు మాత్రమే రావాలి
పేడ రాకూడదు అంటే వీలు కాదు
కర్మలు కూడా ఇలాగే ఉంటాయి
ఏ కర్మ చేసినా అది పూర్ణంగా అర్థవంతంగా
ఉంటుందని చెప్పలేము
కొంత అభ్యంతరంగా కూడా ఉంటుంది

సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి
ఏ సంబంధం లేకుండా ఎవరితోను సంబంధం
లేకుండా జీవించడం సాధ్యపడదు
కాని సంబంధాలలో కేవలం సంతోషమే
ఉంటుందని చెప్పలేము
విషాదం కూడా కలిసే ఉంటుంది
మనం ఎవరితో కలిసి జీవించినా వారు
తల్లిదండ్రులు కావచ్చు , అన్నదమ్ములు
కావచ్చు , భార్యాభర్తలు కావచ్చు
స్నేహితులు కావచ్చు , బంధువులు కావచ్చు ,
వారిలో అన్నీ మనకు నచ్చిన గుణాలే
ఉంటాయని చెప్పలేము
మనకు నచ్చనివి వారు మెచ్చేవి కూడా
ఉంటాయి …. అలాంటివి ప్రేమకి సౌఖ్యానికి
ప్రతిబంధకాలే కావచ్చు కాని అవి లేకుండా
సంబంధాలు లేవు గులాబీలమధ్యా ముళ్ళు
తప్పనట్లు సంబంధాలలో ఈ విధమైన
సంఘర్షణలు తప్పవు ..

భోజనం చేయాలి ఆకును పడేయాలి
కాని ఆకు లేకుంటే వడ్డించటమే జరగదు
ఆకలి తీరదు ఆకలి అన్నంతోనే తీరుతుంది
అన్నం ఆరగించినంత వరకు ఆకును
ఆదరిస్తూనే పోవాలి
పడేసేదే కదా అనుకోవచ్చు కడుపులో
అన్నం పడే ఆకు మన ముందే ఉండాలి

ఈ ప్రపంచంలో ఏది అవసరం లేని క్షణం
ఒకటి రావచ్చు కాని అవసరాలలో
ఆవశ్యంగా తొంగిచూసే అనవసరాలనుకూడా
పెద్ద మనసుతో అంగీకరించే పెంచుకుంటేనే
అభివృద్ధిని సాధించటం మనిషికి
సాధ్యపడుతుంది

"సర్వేజనా సృజనో భవంతు"

Fate

Do Read it Excellent one 👌

Do you want a cup of coffee 😆😈☕

"One day, Death encountered a man and told him:
- Today's your last day.

The man replied:
- But I am not ready!

Death said:
- Your name is at the top of my to-do list for today.

The man said:
- Alright then… before you take me along, let's sit together and have one last cup of coffee.

Death said:
- Of course.

The man offered a cup of coffee to Death; the coffee was laced with some sleeping pills...
Death drank the coffee and soon it was fast asleep...

The man took Death's to-do list, wiped his name from the top and placed it at the bottom of the page.

When Death woke up, it said:
- You've treated me so kindly and with full of love today. I would like to reciprocate you by starting my today's work from the names at the bottom of my list."

Sometimes some things are written in your fate. No matter how hard you may try to change them, they never change...

The crow and the parrot were both created ugly. The parrot protested and was made beautiful. However, the crow remained content with the will of its Creator. Today the parrot is in a cage and the crow flies free...

Behind each incident is so exquisite a wisdom that maybe you will never understand it.

Therefore ...
Never ask "Why?" to the Creator.

DIABETIC

*Great News for DIABETIC patients..*     

Dr. Hasaan Shamsi Pasha working in one of Jeddah's hospital as Heart Specialist, had become Sugar patient himself with as high as 500 reading of Sugar level in the mornings..

He got very worried as despite many tests & trials of different medicines, his reading was still 200 before breakfast and 300 after breakfast..

As he was a reasercher himself and he was also writer of many medical books (refer to Wikipedia for more info on him), he decided to take Olive oil as medicine for Sugar..

He took 2-3 table spoons before bed and 2-3 table spoons early morning, one hour before breakfast..
Results were amazing after only one week of use.!

Sugar reading was 100 before breakfast and 180 after breakfast within 3 days and by end of 1 week it was 93 "after breakfast.!!"

He then left using before bed but still continues with early morning use of Olive oil..

Those who started using Olive oil for sugar showed other benefits too.. as follows :
Those who had problems of feet getting hot or cold, became better..

Others reduced the amount of their sugar medicines they used to take before..

Those using insulin injections have now reduced their dosage & are contemplating to stop injections completely.!
Many said their bones of the legs have now stopped paining.!

I request you all to, Please, forward this so that Diabetics in ur circle of Friends & Family are benefitted or try this for urself, if u suffer from Diabetes....
forwarded as received
*I CARE 4U SO SHARED*

వాననీటి పరిరక్షణ

వందల ఏళ్లకు ముందే వాననీటి పరిరక్షణ.

మండువా లోగిలి మధ్య ధ్వజ స్తంభంలా పక్క ఫొటోలోని ఈ ఇత్తడి గొట్టం అమరికను డోలియా అంటారు. పూర్వం వర్షం నీటిని ఒడిసి పట్టి.. దానిని ఓ చోటకు చేర్చి మంచినీటిగా మార్చే ప్రక్రియ కోసం దీనిని వినియోగించేవారు. 130 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ డోలియా తూర్పు గోదావరి జిల్లా రాయవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సెంటర్‌లోని మండువాలో నేటికీ చెక్కు చెదరకుండా సేవలందిస్తోంది. అందులో ఎనిమిది పదుల వయసు దాటిన సాలిగ్రామం నరసింహారావు, ఆయన భార్య అలివేలుమంగ ఉంటున్నారు.

అప్పట్లోనే ఎంఏ ఇంగ్లిష్‌ చదివిన ఇంటి యజమాని నరసింహారావు మాట్లాడుతూ.. ‘మండువా లోగిలిపై పడే ప్రతి నీటి బొట్టు వృథా కాకూడదన్న ఉద్దేశ్యంతో డోలియా పెట్టించారు. మా తాత నరసయ్య ఎంతో ఇష్టపడి కట్టించిన మండువాను, అందులోని డోలియాను కాపాడుకుంటూ వస్తున్నాం. అప్పట్లో ఇత్తడి లేదా రాగితో ఇలాంటివి ఏర్పాటు చేసేవారు. ఇంటి కప్పుపై కురిసే వర్షం నీరంతా డోలియా గొట్టం ద్వారా ఇంటి అడుగు భాగంలో నిర్మించిన రాతి ట్యాంక్‌లోకి చేరేది. అప్పట్లో ఇలా నిల్వ చేసిన నీటినే తాగేవాళ్లం. అలాగని అప్పుడు నీటి కొరత లేదు. అప్పట్లో వర్షం నీరంటే ఎలాంటి కాలుష్యం లేనిది. రాగి లేదా ఇత్తడి తొడుగు ద్వారా ఒడిసి పట్టడం వల్ల అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే నశించేది. ఆ నీటిని తాగితే ఆరోగ్యం చేకూరుతుందని గట్టి నమ్మకం.

డోలియా ద్వారా వచ్చిన నీరు ఇంటిల్లిపాదికీ వారం, పది రోజులు సరిపోయేది. అది అయిపోయాక చెరువు నీళ్లు తెచ్చుకునే వాళ్లం. వర్షం నీటిని ప్రకృతి వర ప్రసాదంగా భావించేవారు. నీటిని నిల్వ చేసుకునేందుకు, భూగర్భ జలాలను పెంచేందుకు, వినియోగం తరువాత మిగిలిన నీటిని డ్రెయిన్లలోకి పంపించేందుకు మండువా లోగిళ్లలో కనిపించే ప్రత్యేక ఏర్పాట్లు నాటి జీవన శైలికి సాక్ష్యాలు. ప్రతి లోగిలిలో 10 నుంచి 12 కుటుంబాలు నివసించేవి. మండువా చుట్టూ గదులు, వసారాలు, కొట్టు గదులు ఉండేవి. కొన్నింటిలో అయితే మేడలు (డూప్లెక్స్‌ ఇళ్లు) కూడా ఉండేవి. మా మనుమలు, ముని మనుమలు సెలవులకు వచ్చినప్పుడల్లా ఈ మండువాను, డోలియాను తీసేద్దామనేవారు. ఏది చేయాలన్నా నన్ను ఇంటి నుంచి బయటకు పంపేశాక చేసుకోండని గట్టిగా చెప్పడంతో దాని గురించి మాట్లాడటం మానేశారు’ అని వివరించారు.

నరసింహారావు సతీమణి అలివేలు మంగ మాట్లాడుతూ.. ‘మా మావయ్య గారి తండ్రి 130 ఏళ్ల క్రితం ఎంతో ఇష్టపడి కట్టించిన ఇల్లు ఇది. డోలియాను ఇప్పుడు వాడటం లేదు కానీ.. ఒకప్పుడు చాలా ఉపయోగపడేది. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. రెండు, మూడేళ్లకు ఒకసారి మెరుగు పెట్టించి కాపాడుకుంటున్నాం. పిడుగులు పడినప్పుడు డోలియా ఉండటం వల్ల ఇంట్లో వారెవరికీ ప్రమాదం ఉండదు’ అని చెప్పారు.

మండువా లోగిలి అంటే.. పురాతనమైన సంప్రదాయక పెంకుటిల్లు. చుట్టూ నలువైపులా గదులుంటాయి. కనీసం 10 కుటుంబాలు నివాసం ఉండేలా.. పెద్ద విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారం లేదా చతురస్రాకారంలో నిర్మాణం ఉండేది. నాలుగు వైపులా ఒక దానిని ఆనుకుని మరొకటి చొప్పున 10 నుంచి 12 వాటాలు (పోర్షన్లు) ఉండేవి. ప్రతి వాటాలో వంట గది, విశ్రాంతి గది, పడక గది, పెరటి దొడ్డి ఉండేవి. ఒక్కొక్క పోర్షన్‌లో 8 నుంచి 10 గుమ్మాలను అమర్చేవారు. సింహద్వారం నుంచి పెరటి గుమ్మం వరకు వందకు పైగా గుమ్మాలు ఉండేవి. లోగిలి మధ్యలో కల్యాణ మండపం ఉండేది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి ఇంటి మధ్య హాలు భాగంలో పైకప్పు లేకుండా నిర్మాణం చేసేవారు. వాన నీరు హాలులో మధ్యలో పడటానికి వీలుగా ఒక గుంట, ఆ గుంటలోంచి నీరు బయటకు పోవడానికి డ్రెయినేజీ పైపు ఉంటాయి. వర్షం వస్తున్నప్పుడు నీటి కోసం బయటకు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోని బిందెలు, పాత్రలలో నింపుకుని అవసరానికి ఉపయోగించుకునేవారు. మండువా చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఖాళీ సమయంలో ఈ మండువా లోగిలిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉమ్మడి కుటుంబాల మమతల కోవెళ్లుగా మండువా లోగిళ్లు వెలుగొందేవి.

కె.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో చిట్టూరి వంశీయులు నిర్మించిన మండువా లోగిలి అలనాటి నిర్మాణాలకు ప్రతీకగా రాజసాన్ని చాటుతోంది. ఇక్కడ 1830లో చిట్టూరి గోపాలయ్య నిర్మించిన ఈ మండువా లోగిలో మూడు తరాల వారు నివాసం సాగించారు. గోదావరి ఏటుగట్టుని అనుకుని ఉన్న ఈ గ్రామం తరచూ గోదావరి వరద ముంపునకు గురయ్యేది. ఈ దృష్ట్యా ఏటిగట్టుకు కిలోమీటరు దూరంలో ముంపు బారిన పడకుండా రెండెకరాల విస్తీర్ణంలో 10 కుటుంబాలకు చెందిన 50 మంది ఉండేందుకు వీలుగా దీనిని నిర్మించారు. 189 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లోగిలిలో అన్ని సదుపాయాలను శాస్త్రానికి, వాస్తుకు అనుకూలంగా నిర్మించారు. ఇందులో 114 గుమ్మాలతో నిర్మించిన ప్రతి గది ఆధునిక హంగులను ప్రతింబిస్తుంటుంది. లోగిలి మధ్యలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం విశేషంగా అకట్టుకుంటుంది. చిట్టూరి వంశంలో మూడో తరానికి చెందిన పార్థసారథి ఈ మండువాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలోని కె.గంగవరం మండలం కూళ్ల, ఉప్పలగుప్తం, సన్నవిల్లి, భీమనపల్లి, నంగవరం, గోడి, కూనవరం, పోతుకుర్రు, లక్కవరం, తూర్పుపాలెం, బట్టేల్లంక, కేశనపల్లి, గుడిమెళ్లంక, మోరిపోడు, గుడిమూల, సఖినేటిపల్లి, వీరవల్లిపాలెం, టేకి, పామర్రు గ్రామాల్లో మండువా ఇళ్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యపురి, శివదేవుని చిక్కాల, వీరవాసరం, మల్లవరం, పోడూరు, కుమారదేవం, ఇలపర్రు, బూరుగుపల్లి, చించినాడ, తణుకు, భీమవరం, ఉండి, ఆకివీడు తదితర ప్రాంతాల్లో మండువాలు, డోలియాలను భద్రంగా చూసుకుంటున్నారు.
- చిట్టూరి పార్థసారథి

అలభ్యయోగం

🙏
తిథుల ప్రకారం అలభ్యయోగం.‌


వైశాఖీ కార్తీకీ మాఘీ
తిథయో౭ తీవ పూజితాః!
స్నాన దాన విహినాస్తా
ననేయాః పాండునందన!!

అన్ని పూర్ణిమల్లోకి మఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతొ ఉత్కృష్టమైనవి.

మాఘ పూర్ణిమ నాడు " అలభ్య యోగం " అని కూడా అంటారు.
అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా
అది గొప్ప యోగ మవుతుంది.
అది అంత తేలికగా లభించేది కాదు.
ఈ సమయములో ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి.

స్నానదాన జపాది సత్కర్మలు లేకుండా వృథాగా
ఈ మూడు మాసాలు పూర్ణిమలను
 వ్యర్ధంగా గడుపరాదుని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.🙏

ఆచారాలు

👌🏻శుభాలనిచ్చే ఆధ్యాత్మికపు
ఆచారాలు👌🏻

🚩🚩

🦋గుంజీలు -- ఆలయాలలో వినాయకుని ముందు గుంజీలు
తీసి దండాలు పెట్టేవారిని చూస్తూంటాము.
ఇలా చేయడంలో విజ్ఞాన రీతిగా ఎన్నో మంచి ఫలితాలు
వున్నవి. రెండు చెవులను సాగదీసి
నొక్కడం వలన చెవుల నరాలు ప్రకంపిస్తాయి.
దీని వలన మెదడుకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బుధ్ధి పెరుగుతుంది.
శ్రధ్ధపెట్టి సరిగా చదవని విద్యార్థుల
చెవులను గురువులు
మెలిపెట్టడానికి కారణం యిదే.

☘️వేడినీళ్ళ అభిషేకాలు ---
108 వైష్ణవదేశాలలో ప్రధమ
ఆలయమైన శ్రీ రంగంలో
శయనించే భంగిమలో వున్న
రంగనాధునికి , అమావాస్య
ఏకాదశి, మాసారంభమున
ఆ రోజులలో ఆ స్వామికి
వేడినీటి అభిషేకం జరుగుతుంది.ఈ సంప్రదాయం
ఇతర ఆలయాలలో లేదు.

🦋తెలుసుకుందాము----
స్టీలు కుందులలో దేవుని వద్ద దీపాలు వెలిగించరాదు.
దీపాలలో దుర్గా, లక్ష్మీ, సరస్వతీ ఆనే మూడు శక్తులు వున్నాయి. కంచు కుందులలో
దీపం వెలిగిస్తే , పాపాలు
తొలగి పోతాయి.
మట్టి ప్రమిదలో వెలిగిస్తే
శక్తి లభిస్తుంది.
రాగి ప్రమిదలలో వెలిగిస్తే కోపం, ఆవేశం తొలగిపోతుంది.
నెయ్యి, నువ్వుల నూనె,
విప్పపువ్వు నూనె , కొబ్బరినూనె, ఆముదం మొదలైన ఐదు రకాలనూనెలతో దీపం
వెలిగించి అమ్మవారి పూజచేస్తే, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.

🦜అరచేతిలో దైవాలు---
అరచేతుల చివర మహాలక్ష్మి
మధ్యలో సరస్వతి , ఆరంభంలో గోవిందుడు
వుంటారని ఐహీకం.
అందువలననే మనము
ఉదయం లేవగానే అరచేతులను దర్శించుకుంటాము.

🔔దేవతలని ప్రదక్షిణం చేసే
విధానాలు---

వినాయకునికి ఒక ప్రదక్షిణం
చేయాలి.

పరమశివునికి, అమ్మవారికి
మూడు ప్రదక్షిణలు చేయాలి.

అశ్వధ్ధ వృక్షానికి ఏడు సార్లు
ప్రదక్షిణం చేయాలి.

మహాత్ముల సమాధుల దగ్గర నాలుగు సార్లు ప్రదక్షిణం చేయాలి.

నవగ్రహాలకి తొమ్మిది సార్లు ప్రదక్షిణలు జరపాలి.

సూర్యునికి రెండుసార్లు ప్రదక్షిణలు చేయాలి.

దోషాలు తొలగి శుభాలు చేకూరడానికి శ్రీ మహావిష్ణువు కి లక్ష్మీదేవికి
నాలుగు ప్రదక్షిణలు చేయాలి.

ఆలయంలోని బలి పీఠానికి
ధ్వజస్ధంభానికి ముందునే
సాష్టాంగ నమస్కారం చేయాలి.

భగవద్గీత ఉపదేశించిన రోజు---
మహాభారత యుధ్ధంలో
అర్జునునికి కృష్ణ పరమాత్మ
భగవద్గీత ఉపదేశించిన
రోజు వైకుంఠ ఏకాదశి.
ఇలాగే పాలకడలిలో మంధర
పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకి అనే సర్పాన్ని త్రాడుగా
చేసుకొని చిలకగా అమృతం
వెలువడిన రోజు వైకుంఠ
ఏకాదశి.

ఆంజనేయునికి తమలపాకుల
మాల-----
శ్రీ రాముని విజయాన్ని, అశోకవనంలో రావణునిచే చెర
బెట్టబడిన సీతాదేవికి
మొట్టమొదటగా వార్త
తెలియచేయడానికి హనుమవెళ్ళాడు. ఈ సంతోష విషయం తెలిపిన ఆంజనేయునికి తను ఏదైనా
కానుక యివ్వాలని సీతాదేవి అనుకొన్నది.
కానుకగా యివ్వడానికి ఆ సమయంలో తన వద్ద విలువైనదేదీ
 లేనందున, ప్రక్కనున్న చూడగా తమలపాకుల తీగ నుండి కొన్ని ఆకులు కోసి మాలగా కట్టి హనుమ చేతికి యిచ్చింది. యీ కారణంగానే
భక్తులు హనుమంతునికి
తమలపాకుల మాలలు సమర్పిస్తారు.

🚩🚩శేషశ్రీ

శ్రీ నరసింహ పంచరత్నం


1) నమో భగవతే నారసింహాయ
   తీవ్రశిరోపీడారోగోపశమనాయ
   తీవ్రమనోదుఃఖబాధానివారణాయ
   తీవ్రహృద్రోగప్లీహభగందరోపశమనాయ ||

2) నమో భగవతే నారసింహాయ
   తీవ్ర అతిసార అరోచక అస్మారిరోగనివారణాయ
   తీవ్ర గ్రహణి గుహ్య హిద్మ హస్తి మేహ రోగనివారణాయ
   తీవ్ర మధుమేహ మూత్రకృచ్ఛ్ర నష్టరక్తరోగనివారణాయ |మ
3) నమో భగవతే నారసింహాయ
   తీవ్ర రక్తమేహ రక్తప్రధార రక్తచాప రోగనివారణాయ
   తీవ్ర ఉదరావర్త ఉదరామేహ వ్రిక్కశోతరోగనివారణాయ
   తీవ్ర రాజయక్ష్మాది రక్తస్థివిసన్నియద్రోగనివారణాయ ||

4) నమో భగవతే నారసింహాయ
    తీవ్ర అగ్నిమాంద్య అధిమంత అక్షిశూలవ్యాధి నివారణాయ
   తీవ్ర అమావత ఆమజశూల అర్ధవభేదకవ్యాధి నివారణాయ
   తీవ్ర దాహ దంతవేష్ట గలగండ కంఠశూలక రోగనివారణాయ ||






5) నమో భగవతే నారసింహాయ
   తీవ్ర నాసపాక నాసప్రశోస నాసార్బుదవ్యాధి నివారణాయ
   తీవ్ర కుష్ఠ ప్రలుప్తకుష్ఠ శిల్పాద శితపిత్తవ్యాధి నివారణాయ
   తీవ్ర కర్కటి విశూచి మశూచికాది రోగనివారణాయ ||

   సర్వం శ్రీనారసింహదివ్యచరణారవిందార్పణమస్తు

సనాతన ధర్మం



చాలాకాలం క్రితమే మన పూర్వీకులు మనిషి చావు, పుట్టుకల గురించి, మరణానంతర పరిణామాల్ని గురించి ప్రశ్నించుకొని సమాధానాల్ని వెతుక్కునే ప్రయత్నం చేశారు. అనేక మంది ఋషులు, మునులు, జ్ఞానులు నిరంతరం సత్యాన్వేషణకై తపస్సు చేశారు. వాళ్లు తపస్సమాధిలో ఉన్నప్పుడు అత్యున్నత సత్యాన్ని, ధర్మాన్ని వేదం రూపంలో తెలుసుకున్నారు. తపస్సమాధిలో ఉండగా వాళ్లకు లభించిన జ్ఞానాన్ని వేదాలుగా వ్యవహరిస్తున్నాం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. వాళ్లకు అవి పరమాత్ముడి వాణిగా వినిపించాయి కాబట్టి వాటిని శ్రుతులు అన్నారు.

వేదాల ద్వారా లభించిన జ్ఞానంతో మన ఋషులు ఎంతో కృషి చేసి కొన్ని శాశ్వత సిద్ధాంతాలు ప్రతిపాదించారు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు విశ్వమంతటికీ అన్ని యుగాల్లోనూ వర్తిస్తాయి. మానవులు ఏయే దశలలో ఎటువంటి నియమాలు పాటించాలి? కుటుంబం, సమాజం, ప్రకృతి, దేశం పట్ల ఎవరి బాధ్యత ఏమిటి? తదితర విషయాల గురించి అన్ని విధాలా ఆలోచించి.. ఎలా వ్యవహరిస్తే ధర్మం నిలబడుతుందో ఆ విధంగా మార్గదర్శనం చేయగలిగిన అద్భుత జీవన విధానాన్ని మన ఋషులు, మునులు రూపొందించారు. సమస్త జగత్తునూ క్షేమంగా ఉంచగల ఈ శాశ్వత సూత్రాలే ధర్మానికి ఆధారంగా నిలిచాయి.
మానవులందరికీ శుభం చేకూర్చగల శక్తి ధర్మానికి ఉంది గనుక దీన్ని మానవ ధర్మం అన్నారు. శాశ్వత సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది గనుక దీన్ని సనాతన ధర్మం అన్నారు. అనాదిగా ఉన్న చైతన్యాన్ని దేవుడని, సనాతనుడనీ పిలుచుకున్నారు. కాబట్టి దీన్ని దైవ ధర్మమని, సనాతన ధర్మమని అన్నారు.
రుషులు మనకు అందించింది కాబట్టి దీన్ని ఆర్ష ధర్మం అని కూడా అన్నారు. అదే విధంగా మనదేశాన్ని హిందూదేశం అని పిలవడం వల్ల మనం అనుసరించే ఈ ధర్మాన్ని హిందూ ధర్మం అన్నారు.



ధారణాద్ధర్మమిత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః
 యస్మాద్ధారణ సంయుక్తః స ధర్మ ఇతి నిశ్చయః
ప్రజలందరూ ధర్మాన్ని రక్షణ కవచంగా ధరించాలి. ప్రజలందరిని ధర్మం ధరిస్తుంది. ఏది సంఘాన్ని కట్టుబాటులో నిలుపుతుందో అదే ధర్మం. ధర్మ మార్గంలో నడిచిన వాడికి సుఖశాంతులు, శాశ్వతకీర్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి. ‘ధర్మమే సర్వ జగత్తుకూ ఆధారం’ అని నారాయణోపనిషత్తు చెబుతోంది. ధర్మం కంటే బలమైనది ఈ సృష్టిలో మరేదీ లేదని.. ధర్మాన్ని అనుసరించే బలహీనుడు రాజుకన్నా బలవంతుడని బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతోంది. అట్టి ధర్మాన్ని విస్మరిస్తే జరిగేది పతనమే.

మానవజీవితానికి పరమ ప్రయోజనమైన మోక్షం.. కేవలం ధర్మంతోనే సాధ్యం. ధర్మబద్ధమైన ఆర్జన (అర్థం), ధర్మబద్ధమైన కామంతోనే మనిషి నాలుగో పురుషార్థమైన మోక్షాన్ని సాధించగలడు. అందుకే మన పెద్దలు చతుర్విధ పురుషార్థాల్లో ధర్మాన్ని ముందుపెట్టారు. సంపాదన అయినా, కోరికలైనా ధర్మాన్ని అనుసరించి ఉండాలని దీని అర్థం. అటువంటి ధర్మాన్ని పాటించి.. మానవ జన్మను సార్థకం చేసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః

ఓ మంచికథ!!* *🔮బహుమతి* .



*🔮బహుమతి* ....తప్పకుండా చదవండి.. నాకైతే కళ్ళు చెమర్చాయి..

```
ఉదయం పూజ అయ్యాక, పేపరు చదువుకుంటున్న నేను... ఎవరో కాలింగ్‌బెల్‌ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో ‘‘మాస్టారూ, బాగున్నారా?’’ అని పలకరించాడు.
వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ‘ఎవరా’ అని ఆలోచిస్తూ యథాలాపంగా ‘‘ఆ, బాగానే ఉన్నాను. లోపలికి రా బాబూ’’ అన్నాను.
లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ‘అతడెవరా’ అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం ‘‘మంచినీళ్ళు కావాలా?’’ అని అడిగాను. వద్దన్నాడు.
గొంతు సవరించుకుని అతడే అడిగాడు- ‘‘నన్ను గుర్తుపట్టారా మాస్టారూ?’’ అని.
నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో అన్నాడు ‘‘నేను సత్యమూర్తి నీ. మీ స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేసేవారు’’ అని.
అప్పుడు గుర్తుకు వచ్చింది. సత్యమూర్తి చాలా మంచి స్టూడెంట్‌. బాగా తెలివైనవాడు. ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేవాడు. అతడు స్కూల్లో చేరినరోజే వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి ‘మాస్టారూ, మావాడు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నా కోరిక. ఏ తప్పుచేసినా అల్లరిచేసినా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను. వాడు బాగా చదువుకుంటే అదే పదివేలు’ అని చెప్పారు. వృత్తిరీత్యా ఎంతోమంది రాజకీయ నాయకులని చూసిన నాకు, ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజుల్లో నేను హెడ్‌మాస్టర్‌గా పనిచేసేవాణ్ణి. పిల్లలకి గణితం, సైన్సు బోధించేవాణ్ణి.
అయితే సత్యమూర్తి దండించే పరిస్థితులు వచ్చేలా ప్రవర్తించలేదు. చాలా బాగా చదివేవాడు. ఏ సందేహం వచ్చినా అడిగి నివృత్తి చేసుకునేవాడు. అతడికి చదువులో, ముఖ్యంగా గణితం మీద ఉన్న అభిరుచి చూసి అతడికి మరింత శ్రద్ధతో కిటుకులు బోధించేవాణ్ణి.
కుశలప్రశ్నలయ్యాక, అతడు వచ్చిన పని చెప్పాడు. ‘‘మాస్టారూ, వచ్చే పదిహేనో తారీఖున నా పెళ్ళి, మా స్వగ్రామంలో. మర్నాడు సాయంత్రం ఈ ఊళ్ళోనే రిసెప్షన్‌. మీరూ అమ్మగారూ పెళ్ళికి తప్పకవచ్చి మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించాలని నా ప్రార్థన. మీరు ఎప్పుడు బయల్దేరతారో చెబితే, నేను మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కారు ఏర్పాటు చేస్తాను’’ అంటూ, నా చేతిలో శుభలేఖ పెట్టి, నాకూ మా ఆవిడకీ పాదాభివందనం చేశాడు.
శుభలేఖ చూశాను. అర్ధరాత్రి ముహూర్తం. నేను అతడికి మృదువుగా చెప్పాను- ఆరోగ్యరీత్యా ప్రయాణించలేమనీ వీలైతే రిసెప్షన్‌కి వస్తాననీ చెప్పాను. పెళ్ళికి రాలేమని అనేసరికి అతడి ముఖం కొద్దిగా చిన్నబోయింది. అయితే రిసెప్షన్‌కి ఇద్దరూ తప్పక రావాలని మాట తీసుకుని మరీ బయల్దేరాడు. కారు పంపవద్దనీ మేమే వస్తామనీ చెప్పాను.
పెళ్ళి రెండ్రోజులుందనగా మా ఆవిడ జయ, రిసెప్షన్‌ గురించి గుర్తుచేసి, బహుమతి ఏమిద్దామని అడిగింది. సత్యమూర్తి చాలా ధనవంతుడు. అతడి స్థాయికి తగిన బహుమతి ఇచ్చే తాహతు నాకు లేదు. చాలాసేపు ఆలోచించిన తరవాత నా ఉద్దేశ్యం జయకి చెప్పాను, తనూ అంగీకరించింది.
రిసెప్షన్‌కి నేనూ జయా వెళ్ళాం. సత్యమూర్తి స్నేహితులైన నా పూర్వవిద్యార్థులు కొంతమంది కలిశారు. సత్యమూర్తి తండ్రి వచ్చి పలకరించారు. రిసెప్షన్‌ మొదలయ్యాక నేనూ జయా వేదిక మీదకి వెళ్ళి వధూవరులని ఆశీర్వదించాం. సత్యమూర్తి చేతిలో నేను తీసుకెళ్ళిన కవరు పెట్టాను.
ఆ కవరులో పెట్టిన ఉత్తరంలో ఇలా రాశాను.

చిరంజీవి సత్యమూర్తికి
ఆశీస్సులు.
ఈ సమయంలో ఉత్తరం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నావా? తమ ఉన్నతికి పాటుబడిన ఉపాధ్యాయులని ఏమాత్రం పట్టించుకోని ప్రస్తుత కాలంలో నువ్వు గుర్తుపెట్టుకుని వెతుక్కుంటూ వచ్చి ఎంతో అభిమానంగా మమ్మల్ని నీ పెళ్ళికి ఆహ్వానించినందుకు చాలా సంతోషమైంది.
వృద్ధాప్యం వల్ల ఈమధ్య మా బంధువులలోనైనా ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించినా అంతగా వెళ్ళడం లేదు. నీ విషయంలో ఈ పద్ధతికి విరామం
ఇద్దామని నిర్ణయించుకున్నాను. కారణాలు అనేకం. నువ్వు నా అభిమాన విద్యార్థివి కావడం, మీ తండ్రిగారి మీద నాకున్న గౌరవం... వగైరా.
వచ్చిన చిక్కల్లా ‘నీకు ఏ బహుమతి ఇవ్వాలా’ అన్నదే. మనమిచ్చే బహుమతి అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నీకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని చాలా తర్జనభర్జనపడ్డాను. ఎంత ఆలోచించినా సరైన వస్తువేదీ నా బుద్ధికి తట్టలేదు. ఏ వస్తువు అనుకున్నా అది నీ తాహతుకి చాలా తక్కువవుతుందనిపించింది లేదా నీ దగ్గర ఇప్పటికే ఉండి ఉంటుందని పించింది. డబ్బే ఇద్దామనుకుంటే, నేనివ్వగలిగిన మొత్తం నీకు చాలా తక్కువవుతుందనిపించింది. అటువంటి సమయంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఉత్తరంతో జతచేసిన కాగితమే నేను నీకు ఇస్తున్న బహుమతి.
నువ్వూ నీ సహధర్మచారిణీ ఎంతో ఆనందంగా మీ భావిజీవితాన్ని గడిపేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం....
దీవెనలతో,
శంకరం మాస్టారు

డిన్నర్‌ చేశాక వద్దంటున్నా మా ఇద్దరికీ బట్టలు పెట్టారు అతడి తల్లిదండ్రులు. తీసుకోకపోతే సత్యమూర్తి బాధపడతాడంటూ బలవంతం చేశారు. చాలా మొహమాట మేసింది మాకు. అలాగే వద్దంటున్నా మమ్మల్ని కారులో మా ఇంటి దగ్గర దిగబెట్టారు.
నెల రోజుల తర్వాత నా పేరున ఓ ఉత్తరమొచ్చింది. తెరిచి చూస్తే అది సత్యమూర్తి రాసినది.

దైవసమానులైన మాస్టారుగారికి,

నమస్కారములు.
నా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించినందుకు సంతోషం. ఆరోజు నా పెళ్ళి రిసెప్షన్‌లో మీరు ఇచ్చిన బహుమతి చూశాక, దానికి జతచేసిన ఉత్తరం చదివాక చాలాసేపు అలా ఉండిపోయాను. మేధావులు ఎందుకు ప్రత్యేకంగా ఉంటారో అర్థమయింది.
మీరు రూ.1,116 నా పేరున ఓ అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చి, ఆ రసీదు జత చేశారు. నా పెళ్ళికి వచ్చిన అన్ని బహుమతులలో దీన్ని అత్యంత విలువైనదిగా భావిస్తాను.
స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మీరు నాకు ఓ రోల్‌మోడల్‌. చిన్నప్పటి నుండీ నేను ఇతరులని ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాణ్ణి. అలాగే స్కూల్లో చదువుతున్నప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాణ్ణి. అందువల్ల నేనుచాలా మంచి విషయాలే నేర్చుకున్నాను.
నేను ప్రస్తుతం ఇంత మంచి స్థాయిలో ఉండటానికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ, మీ బహుమతి నన్ను ఆలోచించేలా చేసింది. మీరన్నట్లు మామూలుగా అయితే రూ.1,116 నాకు చాలా చిన్న మొత్తమే. కానీ మీరు ఆ మొత్తాన్ని ఓ అనాథశరణాలయానికి విరాళంగా ఇచ్చారు- అదీ నా పేరున.
మీరు చేసిన ఈ గొప్పపని నాలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. అనేకసార్లు నేను చేసే అనవసర ఖర్చుల్ని గుర్తుచేసింది. మీరు ఇచ్చిన బహుమతిని నేను అప్పుడే అనుకరించేశాను. నా పెళ్ళయిన మూడు రోజులకి మా కజిన్ పెళ్ళి అయ్యింది. వాడికి లెక్కపెట్టలేనంత డబ్బు ఉంది. అందుకని మేమిద్దామనుకున్న రూ.50,000లని ఓ అనాథ శరణాలయానికి వాడి పేరుమీద విరాళంగా ఇచ్చాం. వాడెంత సంతోషించాడో మాటల్లో చెప్పలేను. మీరు మాకు ఓ కొత్త మార్గాన్ని చూపారు. మేమెందరమో ఈ కొత్త దారిలో ప్రయాణించే అవకాశం కల్పించారు.
ఇలా మీరు మీ చర్యలతో మాకు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు- ఉద్యోగంలో ఉన్నప్పుడూ రిటైర్‌ అయ్యాకా కూడా. అదే మీ గొప్పతనం.
పాదాభివందనాలతో,
మీ విద్యార్ది,
సత్యమూర్తి.

అతడి గొప్ప వ్యక్తిత్వానికి మనసులోనే హర్షిస్తూ, ఉత్తరం జయ చేతిలో పెట్టాను```

" ఈ పర్స్ ఎవరిదండీ ? "

సిద్దార్ధ టికెట్ టికెట్ అంటూ ట్రైన్ లో అటు నుండి ఇటు వస్తూ ఉంటే ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది . దానిని పైకి తీశాడు . అందులో కొద్దిపాటి చిల్లర నోట్లు , ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేవు . ఎవరిదో తెలిపే ఆనమాళ్ళు ఏమీ లేవు . ఎలా తిరిగి ఇవ్వడం ?
 .
 " ఈ పర్స్ ఎవరిదండీ ? " అంటూ అడిగారు
.
అందరూ పర్స్ కేసీ చూశారు . తమ జేబులు తడుముకున్నారు . ఈ విషయం పక్క బే లో కూర్చున్న ఒక వృద్ధుడు నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు .
 .
 " మీ పర్సు అని నమ్మకం ఏమిటీ ? ఏదైనా ఆనమాలు ఏమిటీ ? "
 .
 " అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ " అన్నాడాయన
.
 " అదే ఆనమాలు చెబితే ఎలాగండీ ? ఇంకా ఏదైనా చెప్పండి. మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా ! "
 .
అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమె !

 .
 " బాబూ ! అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన పర్సు . అప్పుడు నాకు మా అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం . అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను . కాలం గడిచే కొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది . అందుకని నేను అప్పుడు నా పర్సు లో నా ఫోటో పెట్టుకున్నాను . "
 .
నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది . నా భార్య చాలా అందగత్తె . నాకు ఆమె అంటే చాలా ప్రేమ అపుడు ఆమె ఫోటో నా పర్సులో పెట్టుకునే వాడిని .
 .
ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు . వాడంటే నాకు చాలా ఇష్టం . వాడి కోసం ఆఫీసు వదల గానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని . వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని . వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని . వాడే నా లోకం . అపుడు నా పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని . వాడు ఇపుడు అమెరికాలో ఉన్నాడు . నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది . ఇపుడు నన్ను నేను చూసుకోడానికి భయం వేస్తోంది . అందుకని నాకు తోడు గా కృష్ణుడిని పెట్టుకున్నాను . ఆయనే నాకు ఇపుడు తోడు . నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు . నా విచారానికి ఓదారుస్తాడు . నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో నా పర్సులో పెట్టుకోవలసిన ఆయనను నేను చాలా ఆలస్యంగా గుర్తించాను . ఇపుడు నేను ఆయనతో గడుపుతున్నాను . "
 .
 .
సిద్దార్ధ మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశాడు .
 .
 .
పక్క స్టేషన్ లో రైలు ఆగింది . సిద్ధార్ధ రైలు దిగి బుక్ స్టాల్ కి వెళ్ళాడు .
 .
 " దేవుడి ఫోటోలు ఏమి ఉన్నాయి పర్సు లో పెట్టుకోడానికి "

ధన్వంతరి



ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు, కథలలో నాలుగు విధాలుగా వినవస్తున్నది.[1]

భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.
కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు")- ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.
విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం.
ఇంతే కాకుండా పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. కనుక వివిధ ధన్వంతరుల కథలు చరిత్రలో కలగలుపు అయి ఉండవచ్చును.

వ్యుత్పత్తి
ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.

భాగవతంలో గాధ
భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.

"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు."[2]

కాశీరాజ దివోదాస ధన్వంతరి
భాగవతంలోనే నవమ స్కంధంలో కాశీరాజు ధన్వంతరి గురించి పురూరవ వంశక్రమంలో ఉంది (9.17.4) - ఆ ప్రకారం పురూరవునికి క్షత్రవృద్ధుడు, అతనికి సుహోత్రుడు, సుహోత్రునకు కాశ్యుడు, అతనికి కాశి, కాశికి దీర్ఘతపుడు, దీర్ఘతపునికి ధవ్వంతరి జన్మించారు. ధన్వంతరి హరి అంశతో ప్రభవించి ఆయుర్వేద ప్రవర్తకుడయ్యాడు. విష్ణుపురాణంలో కూడా ఈ వంశక్రమం ఉంది. ధన్వంతరికి మూడవ తరంవాడు దివోదాసుడు (దివోదాస ధన్వంతరి). ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది భాగాలుగా (ఆష్టాంగాలుగా) విభజించాడట. అవి [1]

కాయ చికిత్స (Internal Medicine)
కౌమారభృత్య లేదా బాలచికిత్స (Paediatrics)
భూతవైద్యం లేదా గ్రహచికిత్స (Psychiatry)
శలాక్యతంత్ర (Otto-Rhino-Laryngology & Opthalmology)
శల్యతంత్ర (Surgery)
విషతంత్ర (Toxicology)
రసాయన తంత్ర (Geriatrics)
వశీకరణ తంత్ర(The therapy for male sterility, impotency and the promotion of virility)
ఈ (సీనియర్) ధన్వంతరి కాశీరాజు దివోదాస ధన్వంతరికి ముత్తాత అయి ఉండాలి. కాశీరాజు దివోదాస ధన్వంతరి ఆయుర్వేద గ్రంధాలు ఏవైనా, ముఖ్యంగా శల్య సలాక్య తంత్రాల గురించి, వ్రాశాడో లేదో తెలియడం లేదు. బహుశా "చికిత్స తత్వ విజ్ఞానము", "చికిత్సా దర్శనము" అనేవి ధన్వంతరి దివోదాస రచనలు మరియు "చికిత్సా కౌముది" అనేది కాశీరాజు రచన అయి ఉండవచ్చును. శుశ్రుతుడు రచించిన "శుశ్రుత సంహితము" అనే మనకు లభించే రచన అతని గురువైన కాశీరాజు బోధనలపై ఆధారపడి ఉన్నట్లు అనిపిస్తుంది. వాటి ద్వారా ఆ కాలంలో శాస్త్రీయ విధానాలు స్పష్టంగా నెలకొన్నట్లు తెలుస్తున్నది. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన ప్రమాణాల గురించి (scientific methodology comprising observation and inductive, deductive and analogical reasoning) చెప్పబడింది. శల్య తంత్ర, శలాక్య తంత్ర అనే రెండు శస్త్ర చికిత్సా విధానాలకు కాశీరాజ దివోదాస ధన్వంతరి ఆద్యుడు అనిపిస్తున్నది. ఇతను క్రీ.పూ.3000 కాలానికి చెందినవాడని ద్వారకానాధ్ అభిప్రాయపడుతున్నాడు కాని అది నిరూపించడం కష్టంగా ఉన్నది.[1]

ఆలయాలు
ధన్వంతరి ఆలయాలు ప్రత్యేకంగా కనిపించడం అరుదు. వారాణసిలోని సంస్కృత విశ్వవిద్యాలయం మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. ఢిల్లీలోని "ఆయుర్వేద, సిద్ధ పరిశోధన మండలి కేంద్రం" (Central council for Research in Aurveda and Siddha)లో ఒక పెద్ద, ఒక చిన్న ధన్వంతరి విగ్రహాలున్నాయి.

తమిళనాడు లోని శ్రీరంగం రంగనాధస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్టించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ తీర్ధంగా కొన్ని మూలికల రసం (కషాయం) ఇస్తారు.

కేరళలో, గురువాయూర్, త్రిస్సూర్‌లకు మధ్య 20 కి.మీ. దూరంలో "నెల్లువాయ" అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనదని భావిస్తారు. తమ చికిత్సావృత్తి ప్రాంభానికి ముందు చాలా మంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు.

కేరళలోనే కాలికట్ పట్టణం పరిసరాలలో ఒక "ధన్వంతరి క్షేత్రం" ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. వ్యాధి నివారణకు, ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్ధనలు చేస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరులో ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉన్నది.

కేరళ అష్టవైద్యం
కేరళ లో సిద్ధ, ఆయుర్వేద వైద్య విధానంలో "అష్టవైద్యం" అనే ఒక విధానం ప్రసిద్ధి చెందింది. ఇది శతాబ్దాల తరబడి అవిచ్ఛిన్నంగా, పెద్దగా మార్పులు లేకుండా సాగుతున్నది. ఇలాంటి వైద్యం చేసే కుటుంబాలు ధన్వంతరిని పూజిస్తుంటారు. తమ ఆశ్రమాలలో ధన్వంతరి ఆలయాలను, విగ్రహాలను ప్రతిష్టించారు. కొట్టక్కల్ పులమంటల్ గ్రామంలోను, వడక్కంచేరి వద్ద, త్రిసూర్ పెరుంగ్వా వద్ద అలాంటి ఆలయాలున్నాయి. అలయిత్తూర్, కుట్టంచేరి, తైక్కాడ్, వయస్కార, వెల్లోడ్, చిరత్తమన్‌లలో అష్టవైద్య విధానాన్ని అనుసరించే కుటుంబాలున్నాయి.

మీరూ మీరూ చూసుకోండి

*ఏమైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి!*

"విశ్వనాధ సత్యనారాయణ" వారు స్కూలు టీచరుగా వారి ఊరికి దగ్గరగా ఉన్న గ్రామంలో పని చేస్తుండేవారు. అప్పటి వారి జీతం ఇరవై ఒక్క రూపాయలు. విశ్వనాధ వారు పోషించేది తొమ్మిదిమందిని: తల్లి, తోబుట్టువులు, వారి పిల్లలు, ముగ్గురు తమ్ముళ్ళు. రాబడి తక్కువ. ఒకనాటి రాత్రి వారి అమ్మగారు పార్వతమ్మగారు వచ్చి, “నాన్నా, బియ్యం రేపటికి నిండుకున్నవి. చాట అప్పుపుట్టే తీరు లేదు.” అన్నారు. విశ్వనాధ వారు “సరేలే అమ్మా! “ అన్నారు.

పాపం మరుసటి రోజు స్నానాదికాలు ముగించుకుని బయటకు వెళ్లారు. ఆ రోజుల్లో శని, ఆదివారం రెండూ సెలవుదినాలు. ఉదయం వెళ్లి రాత్రి పదిన్నరకు తిరిగి వచ్చారు. ఆరోజుల్లో బ్రాహ్మణుల ఇళ్ళలో ముందు ఒక నీళ్ళ తొట్టి, దాని మీద ఒక కర్ర తో చేసిన మూత ఉండేది .పెరట్లో మరొక నీళ్ళ తొట్టి మూతతో ఉండేది. బయట నుంచి రాగానే ముందు కాళ్ళు కడుక్కుని ఇంటి లోకి ప్రవేశించటం పద్ధతి . భోజనం అనంతరం పెరట్లో ఉన్న తొట్టి వద్ద కాళ్ళు కడుక్కోటం ఆచారం.
విశ్వనాథవారు వచ్చీ రావటంతోటే పద్ధతి ప్రకారం బయట కాళ్ళు కడుక్కోకుండానే సరాసరి వంటింట్లోకి వెళ్లి చూశారు. పొయ్యిలో పిల్లి లేవలేదు. గొప్ప ఖేదానికి గురయ్యారు.

అప్పుడు పాదప్రక్షాళనం చేసి, ముఖం కడుక్కుని “మా స్వామి“ అనే శతకం వ్రాయటం మొదలు పెట్టారు. 'మా స్వామి' లోని మొదటి రెండు పద్యాలు రామాయణ కల్పవృక్షానికి నాంది.
పది, పదిహేను పద్యాలు వ్రాసిన తర్వాత ఒక పద్యంలో అంటారు,
*“మా నాన్నగారికి, నీకు లావాదేవీలు ఏమున్నాయో నాకు తెలియదు. ఏమైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి. నన్నిలా కష్ట పెడితే మాత్రం నేను ఊరుకునేదిలేదు. ఆహితాగ్ని పెట్టెలో ఉన్న నీ బంగారు లింగాన్ని తెగనమ్ముతాను. రెండు బస్తాల బియ్యం, దినుసులు తెచ్చుకుంటాను”* అని వ్రాస్తుండగా,

తలుపు తడుతున్న శబ్దం అయింది. తల్లి పార్వతమ్మ గారు తలుపు తెరిచారు. బండి తీసుకుని వచ్చిన వ్యక్తి “అమ్మా, కపిలేశ్వరపురం నుంచి రావి సూరయ్య గారు తమకు ఇవ్వమని రెండు బస్తాల బియ్యం , కందిపప్పు మూట, బెల్లపు బుట్ట, నెయ్యి పంపించారు. ఎవరైనా కొద్దిగా సాయం చేస్తే ఆ బస్తాలు పంచలో పెడతాను“ అన్నారు. అది విశ్వనాధ వారి భక్తి , నిర్భీతి, వారి కున్న దైవానుగ్రహం!🙏

(శ్రీ విశ్వనాథ వారి జయంతి సందర్భంగా...)

*ఓం నమఃశివాయ*

నక్షత్ర సూచీ లక్షణము

*నక్షత్ర సూచీ లక్షణము-నక్షత్ర సూచీ అనగా ఎవరు:* అవిదిత్వైవ యశ్శాస్త్రం దైవత్వం ప్రపద్యతే|| నక్షత్ర సూచీ స భవేత్సర్వకర్మ బహిష్కృత:|
అగణిత సాంవత్సరిక షడ్గుణ హీనస్తు జగతియో మంత్రీ:|| శాస్త్రవిహీనో వైద్యస్త్ర యశ్చ పురుషాభవంతి యమదూతాః॥

తా. జ్యోతిశ్శాస్త్రమును గురుముఖతః ఎవరు చదువకుండ దైవజ్ఞుడని చెప్పుకుంటారో వానిని నక్షత్ర సూచి అందురు. ఇట్టివాడు సర్వకర్మల యందు అనర్హుడుగ బహిష్కరిం పబడును. గణిత శాస్త్రము తెలియనిదైవజ్ఞుడు, సడ్గుణసంపదలేని మంత్రి, వైద్యశాస్త్రము చదువకుండ వైద్యంచేయువాడు, యీ ముగ్గురు యమదూతలుగ చెప్పబడినాయి.

పండ్లు తినడం

*ఖాళీ కడుపుతో పండ్లు తినడం*

చివరి వరకు చదివి, ఆపై మీ ఇ-జాబితాలోని అందరికీ పంపండి......

డాక్టర్ స్టీఫెన్ మాక్ టెర్మినల్ క్యాన్సర్ రోగులకు *"అన్-ఆర్థోడాక్స్"* పద్దతి ద్వారా చికిత్స చేస్తారు.

చాలా మంది రోగులు ద్వారా మంచి ఫలితాలు సాధించారు.

అతను తన రోగుల అనారోగ్యాలను తొలగించడానికి సౌర శక్తిని ఉపయోగించే ముందు, అనారోగ్యాలకు వ్యతిరేకంగా శరీరంలో సహజమైన వైద్యం మీద నమ్మకం కలిగిస్తారు.

అతని వ్యాసం చదవండి:

క్యాన్సర్‌ను నయం చేసే వ్యూహాలలో ఇది ఒకటి. క్యాన్సర్‌ను నయం చేయడంలో నా విజయం రేటు 80%.

 క్యాన్సర్ రోగులు మరణించకూడదు. ఇది నా ధ్యేయం.
క్యాన్సర్ నివారణ ఇప్పటికే కనుగొనబడింది - *మనం పండ్లు తినే విధంగా*

 మీరు నమ్ముతున్నారా లేదా అనేది మీరే గమనించండి.



 *పండ్లు తినడం*

 మనమందరం పండ్లు తినడం అంటే కేవలం పండ్లు కొనడం, కత్తిరించడం మరియు మన నోటిలోకి పాప్ చేయడం.

 ఇది మీరు అనుకున్నంత సులభం కాదు. పండ్లు ఎలా మరియు ఎప్పుడు తినాలో తెలుసుకోవడం ముఖ్యం.

పండ్లు తినడానికి సరైన మార్గం ఏమిటి?

 *భోజనం తర్వాత పండ్లు తినకూడదు*

 *పండ్లు ఖాళీ కడుపుతో మాత్రమే తినాలి*

మీరు ఖాళీ కడుపుతో పండ్లను తింటుంటే, ఇది మీ వ్యవస్థను నిర్విషీకరణ చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది, బరువు తగ్గడం మరియు ఇతర జీవిత కార్యకలాపాలకు మీకు అధిక శక్తిని అందిస్తుంది.

 ఫ్రూట్ చాలా ముఖ్యమైన ఆహారం ._

మీరు రెండు రొట్టె ముక్కలు తరువాత ఒక ముక్క పండు తింటే.....

పండ్ల ముక్క కడుపు ద్వారా నేరుగా ప్రేగులలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది, కానీ పండ్ల ముందు తీసుకున్న రొట్టె కారణంగా అలా చేయకుండా నిరోధించబడుతుంది.

ఈలోగా రొట్టె & పండ్లు పులియబెట్టి మొత్తం ఆమ్లం గా మారుతుంది.

పండు కడుపులోని ఆహారం మరియు జీర్ణ రసాలతో సంబంధంలోకి వచ్చిన నిమిషం, ఆహారం మొత్తం ద్రవ్యరాశి చెడిపోవటం ప్రారంభమవుతుంది.

కాబట్టి దయచేసి మీరు పండ్లను *ఖాళీ కడుపుతో * లేదా మీ భోజనానికి ముందు తినండి*

ప్రజలు ఫిర్యాదు చేయడం మీరూ విన్నారు:

నేను పుచ్చకాయ తినే ప్రతిసారీ, నా కడుపు ఉబ్బిపోతుంది, అరటిపండు తిన్నప్పుడు నేను టాయిలెట్‌కు పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది.

మీరు ఖాళీ కడుపుతో పండ్లు తింటే అసలు ఇవన్నీ తలెత్తవు.

ఈ పండ్లు ఇతర ఆహారాన్ని ఉంచడంతో కలిపి వాయువును ఉత్పత్తి చేస్తుంది మరియు అందువల్ల మీరు ఉబ్బుతారు!

కళ్ళు కింద నలుపు, బట్టతల, నాడీ విస్ఫోటనం మరియు చీకటి వృత్తాలు వేయడం ఇవన్నీ మీరు ఖాళీ కడుపుతో పండ్లు తీసుకుంటే జరగదు.

నారింజ మరియు నిమ్మకాయ వంటి కొన్ని పండ్లు ఆమ్లమైనవి కావు, ఎందుకంటే అన్ని పండ్లు మన శరీరంలో ఆల్కలీన్ అవుతాయి, ఈ విషయంపై పరిశోధన చేసిన డాక్టర్ హెర్బర్ట్ షెల్టాన్ ప్రకారం.

మీరు పండ్లు తినడానికి సరైన మార్గాన్ని నేర్చుకుంటే, మీకు అందం, దీర్ఘాయువు, ఆరోగ్యం, శక్తి, ఆనందం మరియు సాధారణ బరువు యొక్క రహస్యం ఉంది.

మీరు పండ్ల రసం తాగినప్పుడు - *తాజా పండ్ల రసాన్ని మాత్రమే తాగండి* డబ్బాలు, ప్యాక్‌లు లేదా సీసాల నుండి కాదు.

వేడెక్కిన రసం కూడా తాగవద్దు.

వండిన పండ్లను తినవద్దు ఎందుకంటే మీకు పోషకాలు అస్సలు రావు.మీరు దాని రుచిని మాత్రమే పొందుతారు.
వంట అన్ని విటమిన్లను నాశనం చేస్తుంది.

కానీ, రసం తాగడం కంటే మొత్తం పండు తినడం మంచిది.

మీరు తాజా పండ్ల రసాన్ని తాగాలంటే, నెమ్మదిగా త్రాగాలి, ఎందుకంటే మింగడానికి ముందు మీ లాలాజలంతో కలపాలి.

మీ శరీరాన్ని శుభ్రపరచడానికి లేదా నిర్విషీకరణ చేయడానికి మీరు 3 రోజుల పండ్లనే ఆహారం గా తీసుకోవొచ్చు.

కేవలం 3 రోజులు పండ్లు తినండి మరియు తాజా పండ్ల రసం త్రాగండి.

మీరు ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తున్నారో మీ స్నేహితులు చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు!

 *కీవీ పండు:*

 చిన్నది కాని శక్తివంతమైనది.
 ఇది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఇ & ఫైబర్ యొక్క మంచి మూలం. దీని విటమిన్ సి కంటెంట్ నారింజ కంటే రెండు రెట్లు ఎక్కువ.

 *ఆపిల్*

రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుందా?
ఒక ఆపిల్‌లో తక్కువ విటమిన్ సి కంటెంట్ ఉన్నప్పటికీ, ఇందులో యాంటీఆక్సిడెంట్లు & ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి, ఇది విటమిన్ సి యొక్క కార్యాచరణను పెంచుతుంది, తద్వారా పెద్దప్రేగు క్యాన్సర్, గుండెపోటు & స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

 *స్ట్రాబెర్రీ:*

 రక్షిత పండు.
ప్రధాన పండ్లలో స్ట్రాబెర్రీ అత్యధిక యాంటీఆక్సిడెంట్ శక్తిని కలిగి ఉంది మరియు క్యాన్సర్ కలిగించే, రక్తనాళాలు-అడ్డుపడటం మరియు ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడుతుంది.

 *ఆరెంజ్:*

రోజుకు 2-4 నారింజ తీసుకోవడం వల్ల జలుబు దూరంగా ఉండి, కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు, మూత్రపిండాల్లో రాళ్లను నివారించవచ్చు మరియు కరిగించవచ్చు, అలాగే పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 *పుచ్చకాయ:*

 చక్కని దాహం చల్లార్చు. 92% నీటితో కూడి, ఇది గ్లూటాతియోన్ యొక్క భారీ మోతాదుతో నిండి ఉంటుంది, ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అవి కూడా లైకోపీన్ క్యాన్సర్ ఫైటింగ్ ఆక్సిడెంట్ యొక్క ముఖ్య వనరు. *
పుచ్చకాయలో లభించే ఇతర పోషకాలు విటమిన్ సి & పొటాషియం.

 *జామ & బొప్పాయి :*

విటమిన్ సి కోసం అగ్ర పురస్కారాలు వారి అధిక విటమిన్ సి కంటెంట్ కోసం స్పష్టమైన విజేతలు.

జామలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంది, ఇది మలబద్దకాన్ని నిరోధిస్తుంది.

బొప్పాయిలో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది; ఇది మీ కళ్ళకు మంచిది.

భోజనం తర్వాత కోల్డ్ వాటర్ లేదా డ్రింక్స్ తాగడం క్యాన్సర్ కారకం

 మీరు దీన్ని నమ్మగలరా?

చల్లటి నీరు లేదా శీతల పానీయాలు తాగడానికి ఇష్టపడేవారికి, ఈ వ్యాసం మీకు వర్తిస్తుంది.

భోజనం తర్వాత ఒక కప్పు చల్లటి నీరు లేదా శీతల పానీయాలు కలిగి ఉండటం చాలా బాగుంది అనిపిస్తుంది.

అయితే, చల్లటి నీరు లేదా పానీయాలు మీరు ఇప్పుడే తిన్న జిడ్డుగల పదార్థాన్ని పటిష్టం చేస్తాయి.

 *ఇది జీర్ణక్రియను తగ్గిస్తుంది*

 * ఈ 'బురద' ఆమ్లంతో స్పందించిన తర్వాత, అది విచ్ఛిన్నమవుతుంది మరియు ఘన ఆహారం కంటే వేగంగా ప్రేగు ద్వారా గ్రహించబడుతుంది. *

ఇది పేగును లైన్ చేస్తుంది.

అతి త్వరలో, ఇది క్రొవ్వు గా మారి క్యాన్సర్‌కు దారితీస్తుంది!

భోజనం తర్వాత వేడి సూప్ లేదా వెచ్చని నీరు త్రాగటం మంచిది.

జాగ్రత్తగా ఉండండి మరియు తెలుసుకోండి. మనం మనుగడ సాగించే మంచి అవకాశాన్ని ఎక్కువగా తెలుసుకోవాలి.

*ప్రముఖ కార్డియాలజిస్ట్*
 ఇలా అంటారు:

ఈ సందేశం వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని 10 మందికి పంపితే, మేము కనీసం ఒక ప్రాణాన్ని అయినా కాపాడుతామని మీరు అనుకోవచ్చు.

కాబట్టి దీన్ని ఆచరిద్దాం....
నలుగురితో పంచుకుందాం....

        *🙏సర్వేజనా సుఖినోభవంతు🙏*

*మీ మిత్రుడు*

**బదరీనాథ్ దేవాలయము**

*దశిక రాము**

**మన సంస్కృతి సాంప్రదాయాలు**




దేవాలయ విశేషాలు
ఓం నమఃశివాయ....ఓం నమఃశివాయ...ఓం నమఃశివాయ..
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం
హరిం నరహరిం రామ గోవిందం దధివామనమ్”
పై పది విష్ణునామాలు భక్తితో వందసార్లు జపిస్తే మానవుడు రోగ విముక్తుడగుతాడు. లక్షసార్లు జపిస్తే బంధ విముక్తుడవుతాడు. పదిలక్షసార్లు జపిస్తే గొడ్రాలు సంతానవతి అవుతుంది. కోటిసార్లు జపిస్తే జీవన్ముక్తుడవుతాడు. బదరీనాథ్ (నారాయణక్షేత్రం)లో జపిస్తే సర్వసిద్ధులు కలుగుతాయని బ్రహ్మవైవర్త పురాణంలో పేర్కొనబడింది.
బద్రీనాథ్ హిందువుల ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా లో ఉన్న పంచాయితీ.
చార్ ధామ్(నాలుగు పట్టణాలు)లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ గర్హ్వాల్ కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ కొండల వరసలమధ్య నీలఖంఠ(6,560 మీటర్లు) శిఖరానికి దిగువభాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్‌కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌‌కు సమీపంలో ఉన్న గౌరీ కుండ్‌కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది.
బద్రీనాథ్ ప్రాంతం హిందూ పురాణాలలో బద్రీ లేక బద్రికాశ్రమంగా వర్ణించబడింది. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. నర-నారాయణులు ఆశ్రమజీవితం గడిపిన ప్రదేశం. మహాభారతంలో శివుడు అర్జునినితో పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడుగానూ- కృష్ణుడు నారాయణుడిగానూ చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారు అని చెప్పినట్లు వర్ణించ బడింది.
గంగానది భూలోకవాసులను ఉద్ధరించడానికి భూమికి దిగివచ్చే తరుణంలో శక్తి వంతమైన గంగా ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కనుక 12 భాగాలుగా చీలీ నట్లూ దానిలో అలకనందానది ఒకటి అని పురాణాలు చెప్తున్నాయి. తరువాతి కాలంలో అది విష్ణుమూర్తి నివాసమైనట్లు పురాణ కథనం.
బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలోని కొండలూ వ్యాస విరచితమైన భారతంలో వర్ణించబడ్డాయి. శ్రీ కృష్ణ నిర్యాణానాంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించతలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థలపురాణం చెప్తుంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాధ్‌ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. స్వర్గారోహణలో వర్ణించిన మానా బద్రీనాథ్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. మానా కొండలలో వ్యాసుడు వర్ణించినట్లు చెబుతున్న గుహ ఇప్పటికీ ఉంది.
స్కంద పురాణంలో బద్రీనాథ్ గురించి ఇలా వర్ణించబడింది స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా బద్రీనాధ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు. పద్మ పురాణంలో బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు విస్తారమైన ఆధ్యాత్మిక నిధులకు మూల స్థానమైనట్లు వర్ణించారు. బద్రీనాథ్ విష్ణు నివాసంగానూ భూలోక వైకుఠం గానూ భక్తులచే విశ్వసించ బడుతుంది. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు మరియు వేదాంత దీక్షితులు ఇక్కడకు వచ్చి బద్రీనాధుని దర్శించుకుని ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు వ్రాశారు.
బద్రీనాథ్ లో ప్రత్యేక ఆకర్షణ బద్రీనాధ్‌గుడి. పురాణ కథనం అనుసరించి ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పంను తప్త కుండ్ వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్టించి అక్కడ ఒక గుడి నిర్మించాడు. 16వ శతాబ్ధంలో గర్హ్వాలా రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్థుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించాడు.
బద్రీనాథ్ గుడిలో అనేకమార్లు కొండచరియలు విరిగి పడిన కారణంగా నిర్మాణ పునరుద్దరణ కార్యక్రమాలు నిర్వహించారు. 17వ శతాబ్ధంలో గర్హ్వాలా రాజుచేత ఈ గుడి విస్తరించబడింది. 1803లో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిధిలం కావడంతో జయపూర్ రాజుచే ఈ ఆలయం పునర్నిర్మించబడింది.
బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి 50 అడుగులు. ముఖ ద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు. ఆలయం పై కప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది. ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చిలా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకు వెళతాయి. ఆలయ నిర్మాణశైలి బుద్దవిహార నిర్మాణశైలిని పోలి ఉంటుంది. వర్ణమయంగా అలంకరించిన ముఖద్వారం బుద్ధ ఆలయాలను గుర్తుకు తెస్తుంది. మండపాన్ని దాటి కొంత లోపలభాగానికి వెళ్ళామంటే రాతి స్తంభాలతో నిర్మించిన మధ్య భాగం గర్భ ఆలయానికి తీసుకు వెళుతుంది. ఆలయంలోపలి స్తంభాలు, గోడలు అందంగా చెక్కిన శిల్పాలతో శోభాయమానంగా ఉంటాయి.
బద్రీ అంటే రేగుపండు నాధ్ అంటే దేవుడు ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వలన ఇక్కడ వెలసిన దేవునికి బద్రీనాధుడు అనే పేరు వచ్చింది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి దీర్ఘ శీతాకాల శోషణ(అలసట)తీర్చడానికి రేగుచెట్టు రూపం దాల్చినట్లు పురాణాలు చెప్తున్నాయి.
బద్రీనాథ్ చైనా, టిబెట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌కు రెండు రోజుల ప్రయాణదూరంలో ఉంది. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ ధామ్(నాలుగు సౌధములు)లలో ఇది మొదటిది. ఇది ఓడలనుండి సరకు దిగుమతి చేసుకునే రేవులలో ఒకటి. బద్రీనాథ్ పోయే దారిలో హేమకుండ్ సాహెబ్ అనే సిక్కుల పవిత్ర క్షేత్రం మీదుగా పోవాలి. శీతాకాలంలో అతి శీతల వాతావరణం కారణంగా వేసవిలో మాత్రమే గుడిలో భక్తుల ప్రవేశానిక

ి అనుమతి లభిస్తుంది. బద్రీనాథ్, హేమకుండ్ కు వెళ్ళే భక్తులతో ఈ మార్గం వేసవిలో జనసమ్మర్ధం అధికమై రద్దీగా ఉంటుంది. బద్రీనాధుని దర్శించడానికి అనువైన కాలం జూన్ సెప్టెంబర్‌ల మధ్యకాలం. స్వెట్టర్లు మొదలైన చలిని తట్టుకొనే దుస్తుల అవసరం సంవత్సరమంతా ఉంటుంది. బద్రీనాథ్ మరియు పరిసర పల్లెలను బస్సు మార్గంలో చేరవచ్చు. ఆదిశంకరాచార్యుడు ఉత్తరభారతంలో స్థాపించిన జ్యోతిమఠం బద్రీనాథ్‌కు సమీపంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో ఉన్న ఇతర పుక్ష్యక్షేత్రాలు హరిద్వార్ మరియు కేదార్‌నాధ్.
ఈ క్షేత్ర మహత్యం స్కందపురాణంలో శివుడు తనపుత్రుడైన కుమారస్వామికి వర్ణించాడు.ఈ క్షేత్రాన్ని కృతయుగంలో ముక్తిప్రద అని,త్రేతాయుగంలో యోగసిద్దిద అని,ద్వాపరంలో విశాల అని పేర్లు ఉండేవి.జీవుడికి స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయని వాటినిజ్ఞానంవలన నశింపచేసే క్షేత్రంకనుక విశాల అనే పేరు వచ్చిందని పురాణ కథనం.ఇక్కడి రేగుచెట్టుకు అమృతం స్రవించినట్లు అందువలన ఇది బద్రీక్షేత్రమని పిలువబడినదని క్షేత్రపురాణం వివరిస్తుంది.బద్రీక్షేత్రంతో సమానమైన క్షేత్రం ముల్లోకాలలో లేదని శువుడు కుమారస్వామికి వివరించాడు.ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్ధాలు నిక్షిప్తమై ఉంటాయని స్కందపురాణం చెప్తుంది.ఇది విష్ణుక్షేత్రం విష్ణువు ఏక్షేత్రం విడిచినా ఈ క్షేత్రం విడువడని ప్రతీతి.ఈ క్షేత్రంలో అన్ని తీర్ధాలు మునులు సమస్త దేవతలు నివసిస్తారని వారణాశిలో అరవైవేల సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలం ఈ ఆలయదర్శన మాత్రంచే కలుగుతుందని పురాణకథనం.సమస్త దేవతలు మునులు నివసించడం వలన ఈ ఆలయానికి విశాల అని పేరు వచ్చిందని పురాణాలు వివరిస్తున్నాయి.ద్వాపరయుగంలో ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు కృష్ణుడు ఉద్దవుడిని ఈ క్షేత్రానికి వెళ్ళి తపసు చేయమని ఆదేసించడం వలన యాదవకుల వినాశనం జరిగినప్పుడు ఉద్దవుడు రక్షింపబడ్డాడు.
అతి సమీపంలోని విమానాశ్రయం డెహరాడూన్‌లో ఉన్న డెహరాడూన్(317కిలో మీటర్లు), సమీపంలోని రైల్వే స్టేషన్ హరిద్వార్ రైల్వే స్టేషన్ (310కిలోమీటర్లు) రిషికేశ్ రైల్వే స్టేషన్ (297) మరియు కోట్‌ద్వార్ రైల్వే స్టేషన్ (327 కిలో మీటర్లు). ప్రతి రోజు ఢిల్లీ, హరిద్వార్ మరియు ఋషికేశ్ లనుండి బస్సు సర్వీసులు (వసతులు) ఉంటాయి. రోడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి కనుక ప్రయాణీకులు జాగ్రత్త వహించడం మంచిది. ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించడం ఉత్తమం. కొంతకాలం క్రితం వరకు ఇక్కడకు ప్రయివేట్ వాహనాలు నిషిద్దం కానీ స్వంత వాహనాలలో ప్రస్తుతం గుడి పరిసరాల వరకు ప్రయాణం చేయవచ్చు .
🙏🙏🙏
సేకరణ

*ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏 

భర్తృహరిః

🌻🌹शुभोदय🙏सुभाषितम् 🌹🌻

वरं पर्वतदुर्गेषु भ्रान्तं वनचरैस्सह।
न मूर्खजनसम्पर्कः सुरेन्द्रभवनेष्वपि॥

                                     - भर्तृहरिः

వరం పర్వతదుర్గేషు
భ్రాన్తం వనచరైస్సహ।
న మూర్ఖజనసమ్పర్కః
సురేన్ద్రభవనేష్వపి॥

                                  - భర్తృహరిః

"సకలభోగాలుగల భవనంలో
మూర్ఖులతో సహవాసం చేయడంకంటే ఆటవికులతో కలసి అడవుల్లోనో పర్వతప్రదేశాల్లోనో సంచరించడం ఉత్తమం."


🌷🌻🌹🌸 शुभमस्तु 🌸🌹🌻🌷

అద్భుతమైన చిత్రం

ఎంత అద్భుతమైన చిత్రం కదా
🙏🙏🙏


*ప్రతిరోజూ శ్రీ అన్నపూర్ణా దేవిని భక్తి, శ్రద్ధలతో కొలిస్తే జీవితంలో అన్నపానీయాలకు లోటుండదు*


శ్రీ అన్నపూర్ణాష్టకం ఎంతో మహిమాన్వితమైన స్తోత్రం, రోజులో కనీసం ఒక్కసారైనా ఈ స్తోత్రం పటించాలి. శ్రీ అన్నపూర్ణా దేవి దేవి అనుగ్రహం వలననే మనకు అన్నపానీయాలు లభిస్తున్నాయి, ఇవే కాక జ్ఞానాన్నీ, వైరాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ తల్లి. అందుకే తప్పకుండా శ్రీ అన్నపూర్ణాష్టకం భక్తి, శ్రద్ధలతో పటించాలి.

శ్రీ అన్నపూర్ణాష్టకం

నిత్యానందకరీ వరాభయకరీ - సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ - ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 1

నానారత్నవిచిత్రభూషణకరీ - హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలస - ద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగరుచిరా - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 2

యోగానందకరీ రిపుక్షయకరీ - ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ - త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 3

కైలాసాచలకందరాలయకరీ - గౌరీ హ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థ గోచరకరీ - హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 4

దృశ్యాదృశ్యవిభూతిపావనకరీ - బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ - విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రమోదనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 5

ఆదిక్షాంతసమస్తవర్ణనికరీ - శంభుప్రియా శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రిణయనీ - విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 6

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ - మాతా కృపాసాగరీ
నారీ నాలసమానకుంతలధరీ - నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 7

దేవీ సర్వవిచిత్రరత్నరచితా - దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరప్రియకరీ - సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ - కాశీపురధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 8

చంద్రార్కానలకోటికోటిసదృశా - చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ - చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 9

క్షత్రత్రాణకరీ సదా శివకరీ - మాతా కృపాసాగరీ
సాక్షా న్మోక్షకరీ సదా శివకరీ - విశ్వేశ్వర శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 10

అన్నపూర్ణే సదాపూర్ణే - శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం - భిక్షాం దేహీచ పార్వతి,
మాతా చ పార్వతీ దేవీ - పితా దేవో మహేశ్వరః
బాంధవ శ్శివభక్తాశ్చ - స్వదేశో భువనత్రయమ్‌|

ఇతిః శ్రీ అన్నపూర్ణాష్టకం సంపూర్ణమ్‌

*ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః*

*భాగవతామృతం*


నారదుని పూర్వకల్పము

1-103-వ.వచనము
మహాత్మా! నేను పూర్వకల్పంబునం దొల్లిఁటి జన్మంబున వేదవాదుల యింటిదాసికిం బుట్టి, పిన్ననాఁడు వారలచేఁ బంపంబడి, యొక్క వానకాలంబునఁ జాతుర్మాస్యంబున నేకస్థల నివాసంబు సేయ నిశ్చయించు యోగిజనులకుం బరిచర్య సేయుచు.
మహా = గొప్ప; ఆత్మా = ఆత్మ కలవాడా; నేను = నేను; పూర్వ = ఇంతకు ముందటి; కల్పంబునన్ = కల్పములో; తొల్లిఁటి = పూర్వ; జన్మంబునన్ = జన్మలో; వేద = వేదము; వాదుల = చదువు వారి; ఇంటి = ఇంటిలో; దాసి = దాసి; కిన్ = కి; పుట్టి = జన్మించి; పిన్ననాఁడు = చిన్నతనమున; వారల = వారి; చేన్ = చేత; పంపంబడి = పంపబడి; ఒక్క = ఒక; వానకాలంబునన్ = వానాకాలమందు; చాతుర్మాస్యంబునన్ = చాతుర్మాస్యదీక్షలో {చాతుర్మాస్యము - యోగులు వర్షాకాలము 4 నెలలు ఒకే ప్రదేశమున ఉండు దీక్ష}; ఏక = ఒకే; స్థల = స్థలములో; నివాసంబున్ = నివాసము; సేయ = చేయుటకు; నిశ్చయించు = నిశ్చయించుకొన్న; యోగి = యోగుల; జనుల = సమూహమున; కున్ = కు; పరిచర్య = సేవ; సేయుచున్ = చేయుచు.
మహానుభావా! నేను గడచిన కల్పంలో గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇంటిలో పని చేస్తూ ఉండేది. నన్ను చాతుర్మాస్యాలలో వానాకాలం నాలుగు నెలలూ ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకొనిన కొందరు యోగిజనుల సేవనిమిత్తమై వారు నియమించారు. ఆ పెద్దల ఆనతి శిరసా వహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాణ్ణి.
1-104-క.కంద పద్యము

ఓటమితో నెల్లప్పుడుఁ
బాటవమునఁ బనులు సేసి బాలురతో నే
యాటలకుఁ బోక యొక జం
జాటంబును లేక భక్తి సలుపుదు ననఘా!
ఓటమి = భయభక్తుల; తోన్ = తో; ఎల్లప్పుడున్ = ఎప్పడూ; పాటవమునన్ = సామర్థ్యముతో; పనులు = పనులు; చేసి = చేసి; బాలుర = పిల్లల; తోన్ = తో; ఏ = ఏ; ఆటలు = ఆటలు; కున్ = కు; పోక = వెళ్ళకుండా; ఒక = ఒక; జంజాటంబును = బంధమును / తగులమును; లేక = లేకుండా; భక్తి = భక్తి; సలుపుదునన్ = చేయుచుంటిని; అనఘా = పాపములు లేనివాడా.
ఓ పుణ్యాత్ముడా! ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాణ్ణి. తోటిపిల్లలతో ఆటపాటలకు పోకుండా, ఎటువంటి ఇతర సంబంధాలూ పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముల్ని కొలిచేవాణ్ణి.
1-105-క.కంద పద్యము

మంగళమనుచును వారల
యెంగిలి భక్షింతు వాన కెండకు నోడన్
ముంగల నిలుతును నియతిని
వెంగలి క్రియఁ జనుదు నురు వివేకముతోడన్.
మంగళము = శుభము; అనుచును = అంటూ; వారల = వారి; ఎంగిలి = ఎంగిలి; భక్షింతు = తినెదను; వాన = వాన; కున్ = కు; ఎండ = ఎండ; కున్ = కు; ఓడన్ = జంకను; ముంగల = ఎదుట; నిలతును = నిలిచెదను; నియతిని = నియమముతో; వెంగలి = తెలివిలేనివాని; క్రియన్ = వలె; చనుదున్ = చరించెదను; ఉరు = మిక్కిలి; వివేకము = వివేకము; తోడన్ = తో.
నే నా యోగిజనులు భుజించిన అనంతరం భిక్షాపాత్రలలో మిగిలి ఉన్న అన్నాన్ని భక్షించేవాణ్ణి: ఎండని, వానని లేకుండా వారి ముందు నిలబడి, ఎంతో జాగ్రత్తగా మారుమాటడకుండా వారి ఆజ్ఞలు పాలించేవాడిని.
1-106-వ.వచనము
ఇట్లేను వర్షాకాల శరత్కాలంబులు సేవించితి; వారును నా యందుఁ గృపసేసి రంత.
ఇట్లు = ఈవిధముగ; ఏను = నేను; వర్షాకాల = వానాకాలము; శరత్కాలంబులు = శరత్కాలములు; సేవించితిన్ = సేవించితిని; వారును = వారుకూడ; నాయందున్ = నాయందు; కృప = దయ; సేసిరి = చూపిరి; అంత = అంతట;
ఈ ప్రకారంగా వర్షాకాలం, శరత్కాలం గడచిపోయాయి. ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది.
1-107-శా.శార్దూల విక్రీడితము

వారల్ కృష్ణు చరిత్రముల్ చదువఁగా, వర్ణింపఁగాఁ, బాడఁగా,
నా రావంబు సుధారసప్రతిమమై యశ్రాంతమున్ వీనులం
దోరంబై పరిపూర్ణమైన, మది సంతోషించి నే నంతటం
బ్రారంభించితి విష్ణుసేవ కితరప్రారంభ దూరుండనై.
వారల్ = వారు; కృష్ణు = కృష్ణుని; చరిత్రముల్ = చరితములు; చదువఁగా = చదువుచుండగా; వర్ణింపఁగాన్ = వర్ణిస్తుండగా; పాడఁగాన్ = పాడుతుండగా; ఆ = ఆ; రావంబు = శబ్దము / రాగము; సుధా = అమృతపు; రస = రుచితో; ప్రతిమము = సాటిది; ఐ = అయి; అశ్రాంతమున్ = ఎడతెగక; వీనులన్ = చెవులలో; దోరంబు = బలిష్ఠము , అధికము; ఐ = అయి; పరిపూర్ణమైన = నిండిపోవ; మది = మనసున; సంతోషించి = సంతోషించి; నేను = నేను; అంతటన్ = అప్పుటినుండి; ప్రారంభించితిన్ = సంకల్పించితిని; విష్ణు = హరియొక్క; సేవ = భక్తి; కిన్ = కి; ఇతర = ఇతరమైన; ప్రారంభ = సంకల్పాలకి; దూరుండను = దూరమైనవానిని; ఐ = అయి.
ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీ కృష్ణుని కథలు చదువుతూ, హరి లీలలు వర్ణిస్తు హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అనుక్షణం ఆ పుణ్యాత్ముల నోటినుండి వెడలి వచ్చే ఆ పలుకులు అమృత రసప్రవాహాలై నా వీనులవిందు చేసేవి. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర విషయా లన్నింటికి స్వస్తి చెప్పి భగవంతుడైన హరిని ఆరాధించటం ఆరంభించాను.
1-108-వ.వచనము
ఇట్లు హరిసేవారతిం జేసి ప్రపంచాతీతుండ నై బ్రహ్మరూపకుండ నయిన నా యందు స్థూలసూక్ష్మం బయిన యీ శరీరంబు నిజ మాయాకల్పితం బని యెఱింగితి; యమ్మహాత్ము లగు యోగిజనుల మూలంబున రజస్తమోగుణ పరిహారిణి యయిన భక్తి సంభవించె; నంతఁ జాతుర్మాస్యంబు నిండిన నయ్యోగిజనులు యాత్ర సేయువార లై; రివ్విధంబున.
ఇట్లు = ఈవిధముగ; హరి = హరియొక్క; సేవా = భక్తియందలి; రతిన్ = ఆసక్తి; చేసి = వలన; ప్రపంచ = ప్రకృతికి; అతీతుండన్ = అతీతమైనవాడిని; ఐ = అయి; బ్రహ్మ = పరబ్రహ్మయొక్క; రూపకుండన్ = రూపము దాల్చినవాడను; అయిన = అయిన; నా = నా; అందున్ = అందలి; స్థూల = స్థూలమూ; సూక్ష్మంబు = సూక్ష్మమూ; అయిన = అయినట్టి; ఈ = ఈ; శరీరంబున్ = శరీరము; నిజ = తన; మాయా = మాయచే; కల్పితంబు = కల్పింపబడినది; అని = అని; ఎఱింగితిన్ = తెలిసికొన్నాను; ఆ = ఆ; మహా = గొప్ప; ఆత్ములు = ఆత్మగలవారు; అగు = అయినట్టి; యోగి = యోగుల; జనుల = సమూహము; మూలంబునన్ = వలన; రజస్ = రజోగుణము; తమోగుణ = తమోగుణముల; పరిహారిణి = పరిహరించునది; అయిన = అయినట్టి; భక్తి = భక్తి; సంభవించెన్ = కలిగినది; అంతన్ = అంతలో; చాతుర్మాస్యంబున్ = (వారి) చాతుర్మాస్య దీక్ష; నిండినన్ = పూర్తికాగా; ఆ = ఆ; యోగి = యోగుల; జనులు = సమూహము; యాత్ర = యాత్ర {యాత్ర - యోగుల నియమమును అనుసరించి ఏకస్థలమున ఉండరాదు కనుక వారు చేయు ప్రయాణములు.}; చేయువారలు = చేయువారు; ఐరి = అయినారు; ఈ = ఈ; విధంబునన్ = విధముగ;
అప్పుడు నాకు హరి సేవలో అమితమైన ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను ప్రపంచాతీతుణ్ణి బ్రహ్మ స్వరూపుణ్ణి అయి, యట్టి నా యందు స్థూలం సూక్ష్మం అయిన ఈ శరీరం కేవలం మాయా కల్పితమని తెలుసుకున్నాను. మహానుభావులైన ఆ యోగీంద్రుల అనుగ్రహంవల్ల రజస్తమోగుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానకి వెళ్లటానికి ఉద్యుక్తులైనారు.
1-109-మ.మత్తేభ విక్రీడితము

అపచారంబులు లేక నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై
చపలత్వంబును మాని నేఁ గొలువఁగా సంప్రీతులై వారు ని
ష్కపటత్వంబున దీనవత్సలతతోఁ గారుణ్య సంయుక్తులై
యుపదేశించిరి నాకు నీశ్వరరహస్యోదారవిజ్ఞానమున్.
అపచారంబులు = తప్పులు / పొరపాట్లు; లేక = లేకుండ; నిత్య = ప్రతిదినము; పరిచర్యా = ఉపచారములు; భక్తి = భక్తి; ఉక్తుండను = కూడినవాడను; ఐ = అయి; చపలత్వంబును = చపలతను; మాని = మానివేసి; నేన్ = నేను; కొలువఁగా = ఆరాధించగా; సంప్రీతులు = సంతోషించినవారు; ఐ = అయి; వారు = వారు; నిష్కపటత్వంబునన్ = కపటత్వము లేకుండగను; దీన = దీనుల యెడ చూపెడి; వత్సలత = వాత్సల్యము; తోన్ = తో; కారుణ్య = దయ; సంయుక్తులు = తో కూడినవారు; ఐ = అయి; ఉపదేశించిరి = ఉపదేశించిరి; నాకున్ = నాకు; ఈశ్వర = హరియొక్క; రహస్య = రహస్యమైన; ఉదార = చక్కటి; విజ్ఞానమున్ = విజ్ఞానమును.
ఈ విధంగా ఎట్టి ఒడుదుడుకులూ రాకుండా, చాంచల్యం లేకుండా ముప్పూటలా భక్తితో ఆరాధించి నందుకు ఆ సాధుపుంగవులు సంప్రీతు లైనారు. ఎంతో సంతోష కారుణ్య వాత్సల్యాలతో అతిరహస్యము, అమోఘము అయిన ఈశ్వరవిజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు.
1-110-వ.వచనము
ఏనును వారి యుపదేశంబున వాసుదేవుని మాయానుభావంబు దెలిసితి; నీశ్వరుని యందు సమర్పితం బయిన కర్మంబు దాపత్రయంబు మానుప నౌషధం బగు; నే ద్రవ్యంబువలన నే రోగంబు జనియించె నా ద్రవ్యం బా రోగంబు మానుప నేరదు; ద్రవ్యాంతరంబులచేత నైన చికిత్స మానుపనోపు; ఇవ్విధంబునఁ గర్మంబులు సంసార హేతుకంబు లయ్యు నీశ్వరార్పితంబు లై తాము తమ్ముఁ జెఱుపుకొన నోపి యుండు; నీశ్వరుని యందుఁ జేయంబడు కర్మంబు విజ్ఞానహేతుకం బై యీశ్వర సంతోషణంబును భక్తియోగంబునుం బుట్టించు; నీశ్వరశిక్షం జేసి కర్మంబులు సేయువారలు కృష్ణ గుణనామ వర్ణనస్మరణంబులు సేయుదురు; ప్రణవపూర్వకంబులుగా వాసుదేవ ప్రద్యుమ్నసంకర్షణానిరుద్ధ మూర్తి నామంబులు నాలుగు భక్తిం బలికి నమస్కారంబు సేసి మంత్రమూర్తియు మూర్తిశూన్యుండు నయిన యజ్ఞపురుషుం బూజించు పురుషుండు సమ్యగ్దర్శర్శనుం డగు.
ఏనును = నేనును; వారి = వారి; ఉపదేశంబునన్ = ఉపదేశమువలన; వాసుదేవుని = భగవంతుని {వాసుదేవుడు - ఆత్మలోవసించే దేవుడు}; మాయ = మాయ; అను = అనే; న్ = ను; తెలిసితిన్ = తెలిసికొంటిని; ఈశ్వరుని = భగవంతుని; అందున్ = ఎడ; సమర్పితంబు = సమర్పింపబడినది; అయిన = అయినట్టి; కర్మంబు = కర్మము; తాప = తాపములు {తాపత్రయములు - ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము.}; త్రయంబు = మూడు; మానుపన్ = మానుపుటకు; ఔషధంబు = ఔధము / మందు; అగున్ = అగును; ఏ = ఏ; ద్రవ్యంబు = పదార్థము; వలనన్ = వలన; ఏ = ఏ; రోగంబు = రోగము; జనియించెన్ = పుట్టినదో; ఆ = ఆ; ద్రవ్యంబు = పదార్థమునకు; ఆ = ఆ; రోగంబున్ = రోగమును; మానుపన్ = మానుపుటను; నేరదు = చెయ్యలేదు; ద్రవ్య = పదార్థముకంటె; అంతరంబుల = ఇతరమైన వాటి; చేతన్ = చేత; ఐన = అయినట్టి; చికిత్స = వైద్యము; మానుపన్ = మాపునట్లు; ఓపు = చేయగలదు; ఈ = ఈ; విధంబునన్ = విధముగనే; కర్మంబులు = కర్మములు; సంసార = సంసారమునకు; హేతుకంబులు = కారణములు; అయ్యున్ = అయినప్పటికిని; ఈశ్వర = భగవంతునికి; అర్పితంబులు = సమర్పింపబడినవి; ఐ = అయి; తాము = తమను; తమ్మున్ = తమనే; చెఱుపుకొనన్ = నశింపచేసికొన; ఓపి = శక్తి కలిగి; ఉండున్ = ఉండును; ఈశ్వరుని = భగవంతుని; అందున్ = ఎడ; చేయంబడు = చేయబడు; కర్మంబు = కర్మమము; విజ్ఞాన = విజ్ఞానమునకు; హేతుకంబు = కారణము; ఐ = అయి; ఈశ్వర = భగవంతునికి; సంతోషణంబును = సంతోషమును; భక్తి = భక్తి; యోగంబునున్ = యోగమును; పుట్టించున్ = పుట్టించును; ఈశ్వర = భగవద్భక్తి వలన; శిక్షన్ = పొందిన నేర్పు; చేసి = వలన; కర్మంబులు = కర్మములు; చేయు = చేయు; వారలు = వారు; కృష్ణ = కృష్ణుని / భగవంతుని; గుణ = గుణములు; నామ = నామములను; వర్ణన = కీర్తించుటలు; స్మరణంబులు = జపించుటలు; చేయుదురు = చేయుదురు; ప్రణవ = ఓంకారము; పూర్వకంబులుగాన్ = ముందున్నట్టివిగా; వాసుదేవ = వాసుదేవ; ప్రద్యుమ్న = ప్రద్యుమ్న; సంకర్షణ = సంకర్షణ; అనిరుద్ధ = అనిరుద్ధ; మూర్తి = స్వరూపముల; నామంబులు = నామములు; నాలుగున్ = నాలుగును; భక్తిన్ = భక్తితో; పలికి = పలికి; నమస్కారంబున్ = నమస్కారము; చేసి = చేసి; మంత్ర = మంత్ర; మూర్తియు = స్వరూపుడును; మూర్తి = ఆకారము; శూన్యుండును = లేనివాడును; అయిన = అయినట్టి; యజ్ఞపురుషున్ = యజ్ఞపురుషుని; పూజించు = పూజించుచుండెడి; పురుషుండు = మానవుడు; సమ్యక్ = చక్కగా; దర్శనుండు = దర్శించినవాడు, తెలిసికొన్నవాడు; అగు = అగును.
దేవాదిదేవుడైన వాసుదేవుని మాయాప్రభావాన్ని నేను కూడా ఆ మహనీయుల మహోపదేశం వల్ల తెలుసుకున్నాను. తాపత్రయాన్ని రూపుమాపే పరమౌషధం ఈశ్వరార్పణం చేసిన కర్మమే. లోకంలో ఏ పదార్థం వల్ల రోగం ఉద్భవించిందో ఆ పదార్థం ఆ రోగాన్ని పోగొట్టలేదు. మరో పదార్థం చేత చికిత్స జరిగితేనే కాని ఆ రోగం శాంతించదు. ఈ ప్రకారంగా కర్మలు భవబంధ కారణాలే అయినప్పటికీ, ఈశ్వరార్పణం చేయటం మూలాన తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే కార్యం విశిష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల ఈశ్వరుడు సంతోషించి అచంచల భక్తిని అనుగ్రహిస్తాడు. భగవంతుని ప్రబోధం వల్ల కర్మలు కావించేవారు శ్రీ కృష్ణ గుణ నామాలను కీర్తించటంలో, సంస్మరించటంలో ఆసక్తులౌతారు. ఓంకారపూర్వకంగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ నామాలు నాలుగింటిని భక్తితో ఉచ్చరించి నమస్కరించి చిన్మయ స్వరూపుడైన యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించే మానవుడు సమ్యగ్దర్శనుడై సమదృష్టి కలవాడౌతాడు.
1-111-క.కంద పద్యము

ఏ నవ్విధమునఁ జేయఁగ
దానవకులవైరి నాకుఁ దనయందలి వి
జ్ఞానము నిచ్చెను మదను
ష్ఠానము నతఁ డెఱుఁగు నీవు సలుపుము దీనిన్.
ఏను = నేను; ఆ = ఆ; విధమునన్ = ప్రకారముగా; చేయఁగన్ = చేయగా; దానవకులవైరి = భగవంతుడు {దానవకులవిరోధి - దానవులందరికి శత్రువు, విష్ణువు}; నాకున్ = నాకు; తన = తన; అందలి = ఎడలి; విజ్ఞానమున్ = విజ్ఞానమును; ఇచ్చెను = ఇచ్చెను; మత్ = నాయొక్క; అనుష్ఠానమున్ = అనుష్ఠానమును; అతఁడు = అతడు; ఎఱుఁగు = తెలియును; నీవున్ = నీవు కూడా; సలుపుము = ఆచరింపుము; దీనిన్ = దీనిని.
నేనీ విధంగా ప్రవర్తించుటవల్ల విష్ణుభగవానుడు విశిష్టమైన ఈశ్వరజ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు. నా నడవడి ఆ శ్రీమన్నారాయణునికి తెలుసు. ఓ వ్యాసా! నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు.
1-112-క.కంద పద్యము

మునికులములోన మిక్కిలి
వినుకులు గలవాఁడ వీవు విభుకీర్తులు నీ
వనుదినముఁ బొగడ వినియెడి
జనములకున్ దుఃఖమెల్ల శాంతిం బొందున్.
ముని = మునుల; కులము = వంశము; లోనన్ = లో; మిక్కిలి = ఎక్కువగ; వినుకులు = (అనేక విషయములను) వినుటలు; కలవాఁడవు = కలిగిన; వాఁడవు = వాడవు; ఈవు = నీవు; విభు = ప్రభు యొక్క / భగవంతుని; కీర్తులు = కీర్తనలు; నీవు = నీవు; అనుదినమున్ = ప్రతిదినమును; పొగడ = కీర్తించుచుండగ; వినియెడి = వినెడు; జనముల = మానవులు; కున్ = కు; దుఃఖము = దుఃఖము; ఎల్లన్ = సమస్తము; శాంతిన్ = శాంతిని; పొందున్ = పొందును.
వ్యాసా! నీవు మునులలో ఎంతో ప్రసిద్ధుడవు. వినేవారి దుఃఖాలన్నీ దూరమై వారి స్వాంతనాలకు శాంతి లభించేటట్లు, చక్కగా వాసుదేవుని కీర్తించుము.“
1-113-వ.వచనము
ఇట్లు నారదు జన్మకర్మంబులు విని క్రమ్మఱ వ్యాసుం డిట్లనియె.
ఇట్లు = ఈ విధముగ; నారదు = నారదుని; జన్మ = పూర్వజన్మ; కర్మంబులు = కర్మములు; విని = ఆలకించి; క్రమ్మఱన్ = మరల; వ్యాసుండు = వ్యాసుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
ఇలా నారదమహర్షి తన పుట్టు పూర్వోత్తరాలు వినిపించగా ఆలకించిన, వ్యాసముని నారదుణ్ణి మళ్లీ ఇలా ప్రశ్నించాడు.
1-114-మ.మత్తేభ విక్రీడితము

విను మా భిక్షులు నీకు నిట్లు కరుణన్ విజ్ఞానముం జెప్పి పో
యిన బాల్యంబున వృద్ధభావమున నీ కే రీతి సంచారముల్
సనె? నీకిప్పుడు పూర్వకల్పమతి యే జాడం బ్రదీపించెఁ? ద
త్తనువుం బాసిన చందమెట్లు? చెపుమా దాసీసుతత్వంబుతోన్.
వినుము = వినుము; ఆ = ఆ; భిక్షులు = యోగులు; నీకున్ = నీకు; ఇట్లు = ఈ విధముగ; కరుణన్ = దయతో; విజ్ఞానమున్ = విజ్ఞానమును; చెప్పి = తెలిపి; పోయిన = వెళ్ళిపోయిన; బాల్యంబున = బాల్యములో; వృద్ధ = పెద్ధవాడు / జ్ఞాని; భావమున = అయినప్పుడు; నీకు = నీకు; ఏ = ఏ; రీతి = విధమైన; సంచారముల్ = సంచరించుటలు; చనెన్ = జరిగెను; నీకు = నీకు; ఇప్పుడు = ఇప్పుడు; పూర్వ = పూర్వ; కల్ప = జన్మ; మతి = జ్ఞాపకములు; ఏ = ఏ; జాడన్ = మార్గమున; ప్రదీపించెన్ = ప్రకాశించెను; తత్ = ఆ; తనువున్ = శరీరమును; పాసిన = విడిచిన; చందము = విధము; ఎట్లు = ఏది; చెపుమా = చెప్పుము; దాసీ = దాసీ; సుతత్వంబు = పుత్రతత్వము; తోన్ = తో.
“ఆయ్యా! నీకు ఆ మహానుభావులైన సాధువులు ఎంతో దయతో ఈశ్వరజ్ఞానాన్ని ఉపదేశించి వెళ్లిపోయారు గదా. అటు పిమ్మట నీ బాల్యం ఎలా గడిచింది. పెద్దవాడ వయ్యాక ఎక్కడెక్కడ సంచరించావు. ఈ జన్మలో ఇప్పుడు నీకు పూర్వ జన్మస్మృతి ఏ విధంగా కలిగింది. దాసీవుత్రుడవైన నీవు ఏ విధంగా నీ దేహాన్ని త్యజించావు దయచేసి వివరించు.”
1-115-వ.వచనము
అని యిట్లు వ్యాసుం డడిగిన నారదుం డిట్లనియె "దాసీపుత్త్రుండ నయిన యేను భిక్షులవలన హరిజ్ఞానంబు గలిగి యున్నంత.
అని = అని; ఇట్లు = ఈ విధముగ; వ్యాసుండు = వ్యాసుడు; అడిగిన = అడిగిన; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; దాసీ = దాసీ; పుత్త్రుండన్ = పుత్రుడను; అయిన = అయినట్టి; ఏను = నేను; భిక్షుల = భిక్షువులు; వలనన్ = వలన; హరి = హరియొక్క; జ్ఞానంబు = జ్ఞానము; కలిగి = కలిగి; ఉన్నంత = ఉండగ.
వ్యాసులవారి ప్రశ్నలకు నారదులవారు ఇలా సమాధానం చెప్పారు”ఆ విధంగా నేను ఆ సాధుపుంగవుల వల్ల ఈశ్వర పరిజ్ఞానాన్ని పొంది యున్నాను.
1-116-సీ.సీస పద్యము

మమ్ము నేలినవారి మందిరంబునఁ గల;
పనులెల్లఁ గ్రమమున భక్తిఁ జేసి
తన పరాధీనతఁ దలఁపదు; సొలసితి;
నలసితి నాఁకొంటి ననుచు వచ్చి
మాపును రేపును మా తల్లి మోహంబు;
సొంపార ముద్దాఁడు చుంచు దువ్వు
దేహంబు నివురు మోదించుఁ గౌఁగిటఁ జేర్చు;
నర్మిలి నన్నిట్టు లరసి మనుప
1-116.1-ఆ.
నేను విడిచి పోక యింట నుండితినయ్య,
మోహిఁగాక, యెఱుక మోసపోక
మాఱు చింత లేక మౌనినై యేనేండ్ల
వాఁడ నగుచుఁ గొన్ని వాసరములు.
మమ్ము = మా; ఏలినవారి = యజమానుల; మందిరంబునన్ = ఇంటిలో; కల = ఉన్న; పనులు = పనులు; ఎల్లన్ = అన్నియు; క్రమమున = పద్ధతిగ; భక్తిన్ = భక్తితో; చేసి = చేసి; తన = తన యొక్క; పరాధీనతన్ = దాస్యమును; తలఁపదు = తలుచుకొనదు; సొలసితిన్ = సోలిపోతిని; అలసితిన్ = అలసిపోతిని; ఆఁకొంటిన్ = ఆకలితో ఉంటినని; అనుచున్ = అనుకొనుచు; వచ్చి = వచ్చి; మాపును = రాత్రిని; రేపును = పగలును; మా = మాయొక్క; తల్లి = తల్లి; మోహంబు = మోహము; సొంపార = అతిశయించగా; ముద్దాఁడున్ = ముద్దాడును; చుంచు = జుట్టు; దువ్వున్ = దువ్వును; దేహంబున్ = దేహము; నివురున్ = నిమురును; మోదించున్ = తట్టును; కౌగిటన్ = కౌగిట్లో; చేర్చున్ = చేర్చుకొనును; అర్మిలిన్ = ఆపేక్షతో; నన్ = నన్ను; ఇట్టుల = ఈ విధముగ; అరసి = సాకి; మనుపన్ = పోషింపగ;
నేను = నేను; విడిచి = విడిచిపెట్టి; పోకన్ = వెళ్ళిపోక; ఇంటన్ = ఇంటిలో; ఉండితిని = ఉన్నాను; అయ్య = అయ్య; మోహిన్ = మోహి; కాక = కాకుండగ; ఎఱుకన్ = జ్ఞానముయందు; మోసపోకన్ = వంచింపబడక; మాఱు = మరొక; చింత = ఆలోచన; లేకన్ = లేకుండగ; మౌనిని = మౌనమువహించినవాడను; ఐ = అయ్యి; ఏను = ఐదు; ఏండ్లవాఁడన్ = ఐదుసంవత్సరములవాడిని; అగుచున్ = అగుచూ; కొన్ని = కొన్ని; వాసరములు = దినములు;
మా తల్లిది చాలా జాలిగుండె. ఉత్త అమాయకురాలు. తల వంచుకొని యజమానుల గృహాల్లో పనులన్నీ క్రమం తప్పకుండ చేసేది. తన దాస్యాన్ని గూర్చి కించిత్తు కూడా కించపడేది కాదు. నేనంటే ఆమెకు పంచప్రాణాలు. అయ్యో నా బిడ్డ అలసిపోయాడు. సొలసిపోయాడు, ఆకలి గొన్నాడు. అని అంటూ ప్రతిరోజూ అల్లారుముద్దుగా ఆదరించి నన్ను పెంచి పెద్దచేసింది. ఎంతో ప్రేమగా మాటిమాటికీ నా బుగ్గలు ముద్దుపెట్టుకొనేది. నా జట్టు దువ్వేది. నాఒళ్లు నిమిరేది. నన్ను ఆప్యాయంగా అక్కున చేర్చుకొనేది. ఈ విధంగా తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెను విడిచి పోలేక ఇంట్లోనే ఉండిపోయాను. అయితే నేను సంసారవ్యామోహంలో చిక్కుబడలేదు. జ్ఞానాన్ని విడువలేదు. అయిదేళ్ళు వచ్చేదాక అలా మౌనిగ ఉన్నాను.
1-117-వ.వచనము
అంత.
అంత = అంతట.అప్పుడు.
1-118-క.కంద పద్యము

సదనము వెలువడి తెరువునఁ
జెదరక మాతల్లి రాత్రిఁ జీఁకటివేళన్
మొదవుం బిదుఁకగ నొకఫణి
పదభాగముఁ గఱచెఁ ద్రొక్కఁబడి మునినాథా!
సదనమున్ = ఇంటినుండి; వెలువడి = బయల్పడి; తెరువునన్ = దారిలో; చెదరక = బెదరక; మా = మా; తల్లి = తల్లి; రాత్రిన్ = రాత్రి; చీఁకటివేళన్ = చీకటిలో; మొదవున్ = ఆవుకు; పిదుఁకగన్ = పాలుపిండుటకు పోవుచుండగా; ఒక = ఒక; ఫణి = పాము; పదభాగమున్ = పాదమును; కఱచెన్ = కరచినది; త్రొక్కఁబడి = త్రొక్కబడి; మునినాథా = మునులలోశ్రేష్ఠుడా.
వ్యాసమహర్షీ! ఒకనాడు ఏమి జరిగిందంటే. మా అమ్మ రాత్రివేళ కటిక చీకటిలో ఆవు పాలు పిండటం కోసం ఇల్లు వదలి బయటికి వెళ్లింది. త్రోవలో ఆమె ఒకపామును త్రొక్కింది. ఆ సర్పం ఆమె పాదాన్ని కరచింది.
1-119-క.కంద పద్యము

నీలాయతభోగఫణా
వ్యాళానలవిష మహోగ్రవహ్నిజ్వాలా
మాలావినిపాతితయై
వ్రాలెన్ ననుఁ గన్నతల్లి వసుమతి మీఁదన్.

నీల = నల్లని; ఆయత = పొడవైన; భోగ = శరీరము; ఫణా = పడగలుగల; వ్యాళ = పాము; ఆనల = జఠరాగ్నిని పుట్టిన; విష = విషముయొక్క; మహా = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; వహ్ని = అగ్ని; జ్వాలా = జ్వాలల; మాలా = మాలల వలన; వినిపాతిత = పడవేయబడినది; ఐ = అయి; వ్రాలెన్ = పడిపోయెను; ననున్ = నన్ను; కన్న = కన్నటువంటి; తల్లి = తల్లి; వసుమతి = భూమి; మీఁదన్ = మీద.
అత్యంత భయంకరమైన ఆ త్రాచుపాము కోరలలోని విషాగ్ని జ్వాలల వల్ల అమ్మ నేల మీద పడిపోయిది.
1-120-ఉ.ఉత్పలమాల

తల్లి ధరిత్రిపై నొఱగి తల్లడపాటునుఁ జెంది చిత్తముం
బల్లటిలంగఁ బ్రాణములు వాసినఁ జూచి కలంగ కేను నా
యుల్లములోన మోహరుచి నొందక సంగము వాసె మేలు రా
జిల్లె నటంచు విష్ణుపదచింత యొనర్పఁగ బుద్ధిఁ జేర్చుచున్.
తల్లి = తల్లి; ధరిత్రి = భూమి; పైన్ = మీద; ఒఱగి = పడిపోయి; తల్లడపాటునున్ = వణుకిపోవుటను; చెంది = చెంది; చిత్తమున్ = మనసు; పల్లటిలంగన్ = కలవరపడగా; ప్రాణములు = ప్రాణములను; పాసినన్ = వదలగా; చూచి = చూచియు; కలంగక = కలతపడక; ఏను = నేను; నా = నా; ఉల్లము = మనసు; లోనన్ = లోపల; మోహ = మోహపు; రుచిన్ = భావమును / లేశమును; ఒందక = పొందక; సంగము = బంధము; పాసె = తొలగినది; మేలు = మంచి; రాజిల్లెన్ = సిద్ధించెను; అట = అట; అంచున్ = అనుకొనుచు; విష్ణు = హరి; పద = పాద; చింత = భక్తి; ఒనర్పఁగన్ = చక్కచేయవలెనని; బుద్ధిన్ = బుద్ధిలో; చేర్చుచున్ = నిర్ణయించుకొనుచు.
అలా మా అమ్మ క్రిందపడి విలవిల తన్నుకొని వివశురాలై ప్రాణాలు వదిలింది. అప్పుడు నేను ఆ విషాదదృశ్యాన్ని చూసి ఏ మాత్రం కలవరపడకుండా, నాచిత్తం శోకాన్నిపొందకుండా, నిబ్బరించుకొని నిలబడ్డాను. ”మంచిది, బంధం తెగిపోయింది" అనుకొన్నాను. ఇక నాకు హరిచరణస్మరణమే అవశ్యకర్తవ్యమని నిర్ణయించుకొన్నాను.
1-121-వ.వచనము
ఉత్తరాభిముఖుండ నై యేను వెడలి జనపదంబులుఁ, బురంబులు, బట్టణంబులుఁ, గ్రామంబులుఁ, బల్లెలుఁ, మందలుఁ, గిరాత పుళిందనివాసంబులు, నుపవనంబులుఁ, జిత్రధాతు విచిత్రితంబు లయిన పర్వతంబులు, సమద కరికర విదళిత శాఖలు గల శాఖులును, నివారిత పథికజనశ్రమాతిరేకంబు లైన తటాకంబులు, బహువిధ విహంగ నినద మనోహరంబు లై వికచారవింద మధు పాన పరవశ పరిభ్రమద్భ్రమర సుందరంబు లైన సరోవరంబులు దాఁటి చనుచు; క్షుత్పిపాసాసమేతుండ నై యొక్క నదీహ్రదంబునఁ గ్రుంకులిడి శుచినై నీరుద్రావి గతశ్రముండనై.
ఉత్తర = ఉత్తదిక్కుకు; అభిముఖుండన్ = తిరిగినవాడిని; ఐ = అయి; ఏను = నేను; వెడలి = బయలుదేరి; జనపదంబులున్ = నగరములు; పురంబులున్ = పురములు; పట్టణంబులున్ = పట్టణములు; గ్రామంబులున్ = గ్రామములు; పల్లెలున్ = పల్లెటూళ్ళు; మందలున్ = మందలు (సంచార జాతుల వారి); కిరాత = కిరాతులయొక్క; పుళింద = పుళిందులయొక్క; నివాసంబులున్ = నివాసములు; ఉపవనంబులున్ = ఉద్యానవనములు; చిత్ర = చిత్రమైన; ధాతు = ఖనిజాలతో; విచిత్రితంబులు = విచిత్రములు; అయిన = అయినట్టి; పర్వతంబులు = పర్వతములు; సమద = మదమెక్కిన; కరి = ఏనుగు; కర = తొండములచే; విదళిత = విరవబడ్డ; శాఖలు = కొమ్మలు; కల = కలిగిన; శాఖులును = (కొమ్మలతోనుండేవి) చెట్లు; నివారిత = వారింపబడిన; పథికజన = బాటసారుల; శ్రమ = అలసటయొక్క; అతిరేకంబులు = విజృంభణలు / చెలరేగుటలు; ఐన = కలిగిన; తటాకంబులు = చెరువులు; బహువిధ = వివిధరకముల; విహంగ = పక్షుల; నినద = కలకలారావముతో / అరపులతో; మనోహరంబులై = మనోహరములై; వికచ = వికసించిన; అరవింద = పద్మముల; మధు = తేనె; పాన = తాగుటవలన; పరవశ = పరవశించి; పరిభ్రమత్ = తిరుగుచున్న; భ్రమర = తుమ్మెదలతో; సుందరంబులు = అందమైన; ఐన = అయినట్టి; సరోవరంబులు = సరస్సులు; దాఁటి = దాటుకొనుచు; చనుచున్ = వెళ్ళుచుండగ; క్షుత్ = ఆకలి; పిపాసా = దాహములుతో; సమేతుండను = కూడుకొన్నవాడను; ఐ = అయి; ఒక్క = ఒక; నదీ = నదియొక్క; హ్రదంబునన్ = మడుగులో; క్రుంకులిడి = స్నానముచేసి; శుచిని = శుభ్రపడినవాడను; ఐ = అయి; నీరు = నీరు; త్రావి = తాగి; గత = పోగొట్టబడిన; శ్రముండన్ = అలసటకలవాడను; ఐ = అయి.
అలా అనుకొన్న నేను ఉత్తర దిక్కుగా బయలుదేరి పల్లెలు, పట్టణాలు, నగరాలు, జనపదాలు, గ్రామాలు, పేటలు, భిల్లవాటికలు దాటుకొంటూ, ఆటవికుల నివాసాలు, పెద్ద కొమ్మల మహావృక్షాలు, బాటసారుల మార్గాయాసాన్ని పోగొట్టే తటాకాలు, నానావిధాలైన పక్షుల కలకలారావాలతో రమణీయమై, వికసించిన తామరపూలలోని మకరందాన్ని త్రాగి పరవశించి పరిభ్రమించే గండుతుమ్మెదలతో నిండిన సరస్సులు దాటుతూ ముందుకు సాగాను. అప్పుడు నాకు ఆకలి దప్పికా ఎక్కువయ్యాయి. ఒక యేటి మడుగులో శుభ్రంగా స్నానం చేసి నీరు త్రాగి నా మార్గాయాసాన్ని తగ్గించుకొన్నాను.
1-122-క.కంద పద్యము

సాలావృక కపి భల్లుక
కోలేభ లులాయ శల్య ఘూక శరభ శా
ర్దూల శశ గవయ ఖడ్గ
వ్యాళాజగరాది భయద వనమధ్యమునన్
సాలావృక = పెద్దతోడేళ్ళు; కపి = కోతులు; భల్లుక = ఎలుగుబంట్లు; కోల = అడవిపందులు; ఇభ = ఏనుగులు; లులాయ = అడవిదున్నలు; శల్య = ముళ్ళపందులు; ఘూక = గుడ్లగూబలు; శరభ = శరభమృగములు {శరభము - సింహములను తినే ఒక జాతి జంతువు}; శార్దూల = పెద్దపులులు; శశ = కుందేళ్ళు; గవయ = ఎనుబోతులు; ఖడ్గ = ఖడ్గమృగములు; వ్యాళ = పాములు; అజగర = కొండచిలువలు; ఆది = మొదలగువానితో; భయద = భయంకరమైన; వన = అడవి; మధ్యమునన్ = నడుమ.
తోడేళ్ళు, కోతులు, ఎలుగుబంట్లు, అడవివరాహాలు, ఏనుగులు, దున్నపోతులు, ఏదుపందులు, గుడ్లగూబలు, శరభమృగాలు, శార్దూలాలు, కుందేళ్లు, మనుబోతులు, ఖడ్గమృగాలు, క్రూరసర్పాలు, కొండచిలవలు నిండిన భయంకరారణ్యాల గుండా మళ్లీ ప్రయాణించాను.
1-123-వ.వచనము
దుస్తరంబులైన నీలవేణు కీచక గుల్మ లతాగహ్వరంబుల పొంత నొక్క రావిమ్రాని డగ్గఱఁ గూర్చుండి యే విన్న చందంబున నా హృదయగతుం బరమాత్మ స్వరూపు హరిం జింతించితి.
దుస్తరంబులు = దాటుటకు మిక్కిలి కష్టమైనవి; ఐన = అయినట్టి; నీల = నీలి; వేణు = వెదురు; కీచక = బొంగువెదురు; గుల్మ = పొదలు; లత = తీగలు; గహ్వరంబుల = పొదరిళ్ళ; పొంతన్ = ప్రక్కన; ఒక్క = ఒక; రావి = రావి; మ్రాని = మ్రానుకు; డగ్గఱన్ = దగ్గర; కూర్చుండి = కూర్చొని; ఏన్ = నేను; విన్న = వినిన; చందంబున = విధముగ; నా = నా; హృదయ = హృదయమున; గతున్ = ఉన్నవాడైన; పరమాత్మ = పరమాత్మయొక్క; స్వరూపు = స్వరూపముగలవాడైన; హరిన్ = హరిని; చింతించితిన్ = ధ్యానించాను.
దాట శక్యం కాని నీలితుప్పలు, వెదురు పొదరిండ్లు దగ్గరగా గల ఒక రావిచెట్టు కింద కూర్చున్నాను. నేను విన్న విధంగా నా హృదయంలో పదిలం చేసికొన్ని పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేశాను.

కాకినల్లన

కాకినల్లన పికమును కాకివోలు
భేదమేమి రెండింటను విడిగతెలియ?
ఆమనియె భూమికిన్ ప్రాప్తమైనయపుడు
కాకి కాకియౌ! కోకిల కోకిలగును.

నీచులనెపుడు ఆశ్రయమందినిలువరాదు
ఉన్నతుల ఆశ్రయించుటే ఉత్తమమయ.
హరుని భూషయై నాగమ్ము వెరపులేక
అరి గరుడుని క్షేమమ్మునే యడుగగలిగె.

విద్య తపము దానము జ్ఞానవృద్ధి శీల
సుగుణ ధర్మ శూన్యులు, కారె క్షోణిభార
భూతులైనట్టివార, లాపురుషులెపుడు
మనుజరూపులౌ మృగములు కనగమతిని.

(అనువదింపబడినవిమాత్రమే)

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

*ధార్మికగీత - 18*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
                           
                                       *****
            *శ్లో:- పుస్తకం వనితా విత్తమ్ ౹*
                    *పరహస్తం గతం గతః ౹*
                    *అథ వా పున రాయాతి ౹*
                    *జీర్ణ భ్రష్టా చ ఖండశ: ౹౹*
                                     *****
*భా:- మానవ జీవిత వికాసానికి దేవుడిచ్చిన అపురూప వరాలు మూడు. పుస్తకము, వనిత , విత్తము. 1.పుస్తకము:- మన జన్మకు విజ్ఞానాన్ని , వివేకాన్ని,అర్థాన్ని, పరమార్థాన్ని చేకూర్చి, మోక్షమార్గమును చూపే సాధనము పుస్తకము. గురు శిష్యులకు చక్కని వారధి. అలాంటి పుస్తకం పరుల చేతికి పోతే రానేరాదు. వచ్చినా చినిగి, నలిగి, మాసిపోయి వస్తుంది. 2."వనిత":- గగనతలంలో రెపరెపలాడే గాలిపటం వంటి పురుషునికి, "నేర్పు" అనే సూత్రం కట్టి, ఓర్పుతో నియంత్రించే సూత్రధారి స్త్రీమూర్తి. బుద్ధికుశలతతో సంసారాన్ని చక్కదిద్దగల విదుషీ మణి. బాల్యంలో తల్లిదండ్రులు, యౌవనంలో భర్త, ముదిమిలో బిడ్డలు ఆమెకు సంరక్షకులు. అట్టి స్త్రీ గీత దాటితే జరిగే ఘోరాలు, నేరాలు వేరే చెప్పనక్కరలేదు. 3. "విత్తము":- "ధనమూలమిదం జగత్" అన్నారు. అన్ని అవసరాలను తీర్చేది డబ్బే. దాని వల్లే అన్ని అర్థాలు, అనర్థాలు కూడా. నెయ్యానికి,వియ్యానికి కయ్యానికి కారణం డబ్బే. ఆ డబ్బు చేయి దాటితే తిరిగి రానేరాదు. ఒకవేళ వచ్చినా ముక్కలు ముక్కలు గానే. ప్రతి ఒక్కరి జీవితంలో కీలకపాత్ర వహిస్తున్న యీ మూడు వరాల పాత్రను, పాత్రతను, పవిత్రతను, మూల్యాన్ని, ప్రాథమ్యాన్ని, పారమ్యాన్ని గుర్తించి చక్కని అవగాహనతో మెలగాలని, వినియోగంలో కృతకృత్యులు కావాలని సారాంశము.*
                                 *****
                  *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

_*💫 కరోనా గురించి..*

_
〰️〰️〰️〰️〰️〰️〰️

1 ప్రశ్న :- కరోనా సోకిన వారు రుచి, వాసన ఎందుకు కోల్పోతారు ?
〰️〰️〰️〰️〰️〰️〰️
జవాబు :- కరోనా మన శరీరంలో ప్రవేసంచాక అది మన శరీరంలో ఉండే proteins, amino acids వాడుకోని తన సైన్యం పెంచుకుంటుంది.
మన శరీరంలో proteins, amino acids.. Glycin తయారీకి ఉపయెాగ పడతాయి.
Glycin వెన్నెముక నుంచి మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయెాగ పడుతుంది.
అంటే కరోనా మన శరీరంలో ఉండే Glycin మెుత్తం వాడుకొని సైన్యం పెంచుకుంటుంది.
అందువల్ల కరోన వచ్చిన వ్యక్తికి glycin లేక brain కి సంకేతాలు వెళ్ళక రుచి, వాసన కోల్పోతాడు.
〰️〰️〰️〰️〰️〰️〰️
2వ ప్రశ్న :- కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస ఎందుకు ఆడదు ?
〰️〰️〰️〰️〰️〰️〰️
 జవాబు :- శరీరంలో పుార్తిగా glycin అయిపోయిన తర్వాత oxygen కూడా తీసుకోలేక చనిపోతున్నాడు.

మనం శరీరంలోకి Glycin తయారీకి అవసరం అయిన protein, amino acids పంపక పోతే కరోనా చనిపోతుంది. కాని దానితోపాటు మనం కూడా చనిపోతాం. కాబట్టి శరరంలో అవసరం కన్నా ఎక్కువ Glycin తయారు అవ్వడం ద్వారా మన శరీరం కరోనా తో పోరాడ గలదు.
〰️〰️〰️〰️〰️〰️
3వ ప్రశ్న :- Glycin ఎలా తయారవుతుంది ?
〰️〰️〰️〰️〰️〰️
జవాబు:+ Glycin తయారీకి ఉపయెాగ పడే పదార్దాలు రోజుకి కనీసం 20gm నుంచి 50gm వరకు తీసుకోవాలి.
Glycin కి ఉపయెాగ పడేవి
 1. తోటకూర
 2. ఆవాలు
 3. నువ్వులు
〰️〰️〰️〰️〰️
పోషకాహారాలు
〰️〰️〰️〰️〰️
 4. కరివేపాకు
 5. మునగాకు
〰️〰️〰️〰️〰️
  సి విటమిన్
〰️〰️〰️〰️〰️
 6. నిమ్మ
 7. ఉసిరి
   
వీటి ద్వారా proteins Amino Acids తయారవుతాయి. వీటి ద్వారా వెన్నెముక నుంచి మెదడుకు సరఫరా చేసే Glycin తయారవుతుంది. పోషకాహారాలు, సి విటమిన్ ద్వారా శరీరానికి కరోనాతో పోరాడే శక్తి వస్తుంది. కాబట్టి
పైన చెప్పిన పదార్దములు ప్రతి రోజు తినడం ద్వారా కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోగలం !

🙏🇮🇳😷🌳🤺

13 వ తారీఖు న ఒక మంచి గ్రహా స్థితి ఉంది.



13/09/2020 ఆదివారం ఉదయాన 10:45 నుండీ 11:45 మధ్య:

లగ్నం - అనూరాధ 2 - వృశ్చిక

రవి - సింహం - భావం 10 - స్వక్షేత్రం

చంద్ర - కర్కా - భావం 9 - స్వక్షేత్రం

కుజ - మేష - భావం 6 - స్వక్షేత్రం

బుధ - కన్య - భావం 11 - ఉచ్ఛ

గురు - ధను - భావం 2 - స్వక్షేత్రం

శుక్ర - కర్క - భావం 9 - శత్రు

శని - మకర - భావం 3 - స్వక్షేత్రం

రాహు - మిధున - భావం 8 - సమ

కేతు - ధను - భావం 2 - సమ

మంచి ముహూర్తం ఆ గంట కాలం కనుక, ప్రతీ ఒక్కరూ

రెండు జిల్లేడు ఆకులపై గోధుమలు ఉంచి,

మట్టి ప్రమిద లో రెండు వత్తులు వేసి దీపారాధన చేసి,

దైవారాధన లో నిమగ్నమై ఉండండి.

చేసిన ప్రతీ ఒక్కరికీ శుభమే జరుగుతుంది.

🙏సర్వే జనా సుఖినోభవంతు🙏

పోత‌న త‌ల‌పులో ....(50)



భీష్మ‌పితామ‌హుడు, ధ‌ర్మ‌రాజుకు మానవజాతికి ఆవశ్యకాలైన సామాన్య ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, అనురాగ వైరాగ్యాలకు సంబంధించిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, దాన ధర్మాలు, రాజ ధర్మాలు, స్త్రీ ధర్మాలు భగవంతునికి ప్రియమైన భాగవత ధర్మాలు, , చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలు, నానావిధాలైన ఉపాఖ్యానాలు, ఇతిహాసాలు కొన్ని సంక్షేపంగా కొన్ని వివరంగా చెప్పాడు.
ఆ త‌ర్వాత శ్రీ కృష్ణ‌ప‌ర‌మాత్మ‌పై దృష్టినిలిపి ఆయ‌న‌ను స్తుతిస్తూ భీష్ముడు ఇలా అన్నాడు.....

"త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ, బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల, నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప, మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.
             ***

హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై,
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో,
జయముం బార్థున కిచ్చువేడ్క, నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.
                     ***
“ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం గలవాడు; పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు; నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు; ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు; మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు; అయిన శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి.
                               **

గుఱ్ఱాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా; ముంగురులు చెదిరి పోతున్నా; అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా; ముచ్చటైన ముఖమంతా ఎఱ్ఱగా అవుతున్నా; నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను.

     🏵️పోత‌న ప‌ద్యం🏵️
🏵️సత్యతత్వావిష్కరణం🏵️

మొగలిచెర్ల అవధూత

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
అవధూతల దర్శనం..

నెల్లూరు నుంచి శ్రీ చంద్రశేఖర్ గారు అదే మొదటిసారి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి రావడం..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుని..మందిరం లోని ప్రధాన మంటపం చుట్టూరా ప్రదక్షిణం చేసి..శ్రీ స్వామివారి విగ్రహం వద్ద పూజ చేయించుకొని..కొద్దిసేపు మంటపంలో కూర్చున్నారు..చంద్రశేఖర్ గారి మనసులో ఒక కోరిక కలిగింది..అడగాలా?..వద్దా?..అనే సందేహం లో కొంచెం సేపు మథనపడి.. చివరకు..

"ప్రసాద్ గారూ..మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?.."అన్నారు..

"మందిరానికి సంబంధించినది ఏదైనా సరే..నిరభ్యంతరంగా అడగండి.." అన్నాను..

"శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొచ్చి..ఇక్కడ..ఈ మందిరం వద్ద ఒక ప్రక్కన పెట్టాలని కోరిక కలిగిందండీ..మీరు అనుమతి ఇస్తే..శ్రీ వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొస్తాను.." అన్నారు..

"ఎటువంటి ఇబ్బందీ లేదు..మీరు చూస్తున్నారు కదా..నైరుతి మూలలో శ్రీ సాయిబాబా మందిరం ఉన్నది..శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన తరువాత..శ్రీ సాయిబాబా ను కూడా దర్శించుకుంటున్నారు..అలాగే శ్రీ వెంకయ్య స్వామి వారి పటం వుంటే..ఆ స్వామికి నమస్కరించుకుంటారు..గొలగమూడి లో ఉన్న వెంకయ్య స్వామి వారిని కూడా అవధూత పరంపర లోనే పరిగణిస్తున్నారు కదా..నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదండీ.." అన్నాను..

చంద్రశేఖర్ గారు ఎంతో సంతోషం తో .."ఈసారి వచ్చేటప్పుడు శ్రీ వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొస్తానండీ..ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు.." అని చెప్పి..నెల్లూరు వెళ్లిపోయారు..

రెండు నెలలు గడిచాయి..ఒకరోజు చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..శ్రీ వెంకయ్య స్వామి వారి చిత్రం ఒక్కటే కాకుండా..ఇతర అవధూతల చిత్రాలు కూడా తీసుకురావాలని నాకు స్వప్నంలో ఆదేశం వచ్చిందండీ..శ్రీ దత్తాత్రేయస్వామి వారి గర్భ గుడి వెలుపల గోడ మీద నాలుగు వైపులా కొలతలు తీసుకొని..అందుకు తగ్గట్టుగా అవధూతల పటాలు చేయించి..తీసుకొస్తాను..రేపుదయం వస్తున్నాను..నాతో పాటు నెల్లూరు లోని సత్యం స్థూడియో యజమాని గారు కూడా వస్తున్నారు.." అన్నారు..తీరా చూస్తే..ఆ సత్యం గారు మాకు దూరపు బంధువు..దత్త భక్తుడూ..

అనుకున్న విధంగానే ప్రక్కరోజు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..ప్రధాన మంటపం చుట్టూరా కొలతలు తీసుకొని వెళ్లిపోయారు..మళ్లీ రెండు నెలల పాటు ఎటువంటి కబురూ లేదు..

ఆ తరువాత ఒక ఆదివారం నాడు..
శ్రీ దత్తాత్రేయ (త్రిమూర్తి స్వరూపుడు)
శ్రీ పాద శ్రీ వల్లభులు..
శ్రీ నృసింహ సరస్వతి..
శ్రీ స్వామీ సమర్ధ..
శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్
శ్రీ సాయిబాబా..
శ్రీ వెంకయ్య స్వామి..

వీటన్నింటి తో పాటు..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు..

మొత్తం ఎనిమిది చిత్రపటాలు.. పెద్ద సైజువి తీసుకొని వచ్చి..మంటపం చుట్టూ ఒక పద్ధతి ప్రకారం అమర్చారు..

"చిత్రమేమిటంటే..అందరు అవధూతల చిత్రపటాలు తయారయ్యేదాకా..శ్రీ వెంకయ్య స్వామి వారి చిత్రపటం పూర్తి కాకపోవడం..అందరి తో కలిసే శ్రీ వెంకయ్య స్వామి వారు మొగలిచెర్ల స్వామివారి దగ్గరకు రావడం.."

మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చిన భక్తులు ప్రధాన ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేటప్పుడు..పై అవధూతలందరి దర్శనము అవుతుంది..

ఒక్క వెంకయ్య స్వామి వారి పటాన్ని మాత్రం పెట్టుకోవడానికి అనుమతి కోరిన చంద్రశేఖర్ గారు..శ్రీ స్వామివారి ఆదేశం తో అందరు అవధూతల చిత్రపటాలూ తీసుకొచ్చారు..తనకూ ఇతర అవధూతలకూ బేధమే లేదని శ్రీ స్వామివారు పరోక్షంగా సూచించారు..

సర్వం..
దత్తకృప.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

రామాయణమ్..59


...
రామా ! కులమునకు కళంకము తెచ్చే సామాన్య స్త్రీ ని కాను నేను !
.
నీవు తప్ప మరొకరిని మనస్సుచేత కూడా చూడను !
.
స్వయంతు భార్యాం కౌమారీమ్ ....నేను నీ భార్యను ,యవ్వనములో ఉన్నదానిని ,భార్యను ఇతరులకు అప్పగించి జీవించువాడివలే నన్నిక్కడ వదిలేసి వెళతావా?.
.
నీవు ఎవరి హితము గురించి మాటలాడుతున్నావో నీవే వారికి విధేయుడిగా ఉండు ! నేనెందుకుండాలి? నేనెవరికీ ఇచట విధేయురాలిగా ఉండవలసిన అవసరములేదు .అసలు అవి అయుక్తమైన మాటలు!.
.
నీవుండే చోటు నాకు స్వర్గము ,నీ సాన్నిధ్యము లేకపోతే నాకేదీ రుచింపదు ,.
.
మార్గంలో ముళ్ళు ఉంటాయంటావా ! అవన్నీ నాకు దూదితో సమానము ,పెనుగాలులు రేగి దుమ్ము కప్పి వేస్తుందంటావా నీ ప్రక్కన ఉంటే అదే నాకు మంచిగంధమవుతుంది రామా!.
.
వనములలో పచ్చికబయళ్ళమీద పడుకుంటే చిత్రమైన కంబళ్ళు కప్పిన పడకలకంటే సుఖము రామా ! నీ ప్రక్కన ఉంటే ప్రపంచంలో ఏదయినా నాకు అత్యంత సుఖకరమైనవే ! నన్ను నీవు ఇక్కడనే శత్రువుల పరంచేసి వెడతానంటే మాత్రము ఈక్షణమే ! ఇప్పుడే విషంతాగి చావనయినా చస్తాను కానీ వైరులవశం మాత్రంకాను...
.
నీవు అంతకాలం కనపడకపోతే దుఃఖంతో ఎప్పుడో ఒకప్పుడు చావవలసినదానినే ! ఆ చావు ఇప్పుడే నన్ను వరించనీ ! .
.
అని ఏడుస్తూ తనను కౌగలించుకొన్న సీత చుబుకము ఎత్తిపట్టి మెల్లగా ప్రేమగా అనునయిస్తూ నీవులేకుండా నేను మాత్రం ఒక్కక్షణమైనా ఉండగలనా ? నీ అభిప్రాయము తెలుసుకొకుండా నేను నిన్ను అడవికి ఎలా తీసుకెళతాను ?
.
ఆత్మాభిమానము కలవాడు తన కీర్తిని ఎలా విడువజాలడో ఆవిధముగా నేను నిన్ను విడువజాల!.
.
సీతా ! పితృవాక్పాలనము నా ధర్మము !
సీతా, తల్లికి ,తండ్రికి లొంగి ఉండటమే ధర్మము .
అలాంటి ధర్మాన్ని విడిచి నేను జీవించను.
.
కనపడే దేవతలు తల్లీ, తండ్రీ,గురువులు! అలాంటి వారిని విడిచి మనకు అందుబాటులో లేని దైవాన్ని ఆరాధించటమెందుకు?.
.
అస్వాధీనమ్ కధం దైవమ్ ప్రకారైరభిరాధ్యతే
స్వాధీనమ్ సమతిక్రమ్య మాతరం పితరం గురుమ్!.
.
తల్లి,తండ్రి,గురువులు ముగ్గురూ మూడులోకములు వీరితో సమానమైన వారు ఈ భూలోకంలో లేరు !అందుకే వారి సేవ చేయవలెను! .
.
తండ్రి సేవను మించిన బలకరమైనది ఏదీ లేదు! తండ్రి ఆజ్ఞ పాటించుటవలన మనిషికి సకలైశ్వర్యములు సమకూరగలవు! .
.
నా తండ్రి ఆజ్ఞ పాటించాలని ,ఆయన ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవాలనీ నేను కోరుకుంటున్నాను! ఇదే సనాతన ధర్మము!.
.
సీతా నీవు నాకు సహధర్మచారిణివి ! నీవు నాకూ,నీకూ మేలుకూర్చే మంచి నిర్ణయము తీసుకొన్నావు !
.
వెంటనే బయలుదేరదాము ! నీ వద్ద ఉన్న విలువైన వస్తువులన్నీ దానం చేసెయ్ !..
.
ఇంతకు మునుపే రామాంతఃపురమునకు వచ్చిన లక్ష్మణుడు అన్నావదినల సంభాషణ అంతా విన్నాడు..
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

new revenue act తెలంగాణ

Chief Minister K Chandrasekhar Rao has introduced the historical new revenue act 2020 in the Telangana monsoon assembly session. The CM expressed happiness on the introduction of the bill which is aimed to address all the land related disputes on a permanent basis.

Key points to be remembered in the new revenue act...


All the information about agricultural and non-agricultural lands will be made available on Dharani portal

The portal can be accessed from anywhere and by anyone

No official will have the rights to decide what should have to be done. All should act according to the new act.

The land mutation will be done soon after registration


Mutation power has been transferred to MRO from RDO

Sub Registrars are given powers to register only non agricultural lands

MROs have powers to register agricultural lands

Can download registration documents, passbook

Division of inherited land only on the joint agreement

Tahsildars shall issue passbooks for lands which do not have them

Criminal cases against tahsildars for violating rules


Government officials cannot be sued if they make changes in the land records

Agricultural loans to be issued on digital records

Passbooks should not be kept in banks for granting loans

VROs to be transferred to other positions on the equal scale

Powers of sub-registrar are transferred to tahsildars

All pending files, cases will be sent to tribunal court with the dismissal of the 1971 act.

Tribunal verdict to be finalised after the investigation

Jagir lands to be registered as government lands in the revenue records

Slot booking through government website for any kind of registration

Coordinates for survey number to prevent illegal land encroachment

పరోపకార తత్వం

మొత్తం లాక్-డౌన్లో, 17500 మంది ఉద్యోగులలో, ఏ ఉద్యోగిని తొలగించలేదు లేదా ఎవరికైనా 1% జీతం తగ్గించలేదు, నష్టం మొత్తం ₹ 30 కోట్లు స్వయంగా భరించారు. 

 రామస్వామి జి తిరుపూర్‌లో కెపిఆర్ మిల్స్‌ను కలిగి ఉన్నారు మరియు లోదుస్తుల తయారీ చేయిస్తారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని పెద్ద బ్రాండెడ్ కంపెనీలు ఆయన కంపెనీ నుండి దుస్తులను తయారు చేయిస్తాయి. తిరుపూర్ మరియు కోయంబత్తూరులో 4 కర్మాగారాలు ఉన్నాయి, ఇందులో 22000 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

రామస్వామి 17,500 వేల మంది వలస కూలీలకు (4500 స్థానికులు, సమీపంలోని తన ఇంట్లోనే) తమ ఫ్యాక్టరీ హాస్టళ్లలో ఉండమని చెప్పారు మరియు లాక్ డౌన్ అయినంత వరకు, మీరు చింతించకండి, మీ ఆహార పానీయాలు, వసతి, మొబైల్‌ రీఛార్జ్ చేయడం కూడా నా వైపు నుండి ఉచితం అని ప్రకటించారు.

రామస్వామి ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతి కార్మికుడి శ్రమకు నెలకు జీతం 13500 / - ఖర్చు అవుతుంది మరియు దీని కారణంగా సుమారు 2 నెలల్లో మొత్తం రూ .30 కోట్లు ఖర్చు జరిగింది.

 ఎందుకంటే ఆయన ఏ ఒక్క కార్మికుడికి ఒక్క రోజు జీతం కూడా తగ్గించలేదు. "" మీరు ఇంత నష్టాన్ని ఎందుకు భరించారు? "అని అడిగినప్పుడు నేను రెండు విషయాలు ఆలోచించాను. మొదట అతన్ని నిరుద్యోగిగా చేయకూడదనేది నా నైతిక బాధ్యత.రెండవది నన్ను ఇంత పెద్ద వాడిగా చేయడంలో ఈ వ్యక్తుల హస్తం ఉంది, ఆపై దేశ ప్రధాని కూడా ఎవరినీ ఉద్యోగం నుండి తొలగించ వద్దని విజ్ఞప్తి చేశారు.

నా మనస్సులో మరో మీమా0స ఉంది లాక్డౌన్ ముగిసిన తరువాత నేను మళ్ళీ నైపుణ్యం కలిగిన కార్మికులను పొందుతానో లేదో. ఏదైనా ఇది ఒక కర్తవ్యంగా నిర్వహించాలి.

ఈ సంస్థ యొక్క వార్షిక టర్నోవర్ 3250 కోట్లు అయితే పెద్ద విషయం ఏమిటంటే, కెపి రామ స్వామి జీ లేబర్ గురించి ఉన్నత స్థాయి మానవతా దృక్పథాన్ని కనబరిచారు. మన దేశం ఇలాంటి వ్యక్తుల ప్రాతిపదికన నడుస్తోంది.