17, నవంబర్ 2025, సోమవారం

ఎందుకయా! సాంబశివా! భక్తి గీతం

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు.🌹

  భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన, చాలా ప్రాచుర్యం పొందిన భక్తి గీతం ' ఎందుకయా! సాంబశివా! '. ఈ గీతానికి సంగీతం పాలగుమ్మి విశ్వనాథం గారు. ఎంతో ఆర్తితో ఆ మహాశివుని ప్రార్ధించే ఈ గీతాన్ని వినసొంపుగా ఆలపించారు శ్రీమతి ఆకెళ్ల రాధాదేవి. గొప్ప రసరమ్య గీతం. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

పిల్లలు పక్కలో మూత్రం పోయకుండా

 7 రోజుల్లో పిల్లలు పక్కలో మూత్రం పోయకుండా నివారించే అద్భుత యోగం  - 


      ప్రతినిత్యం రాత్రి పడుకునే సమయంలో 125 ml పాలల్లో చిటికెడు ఆవాల పొడి కలిపి తాగించుచున్న 7 రోజుల్లొ చిన్నపిల్లలు పక్కలో మూత్రం పోయుట ఆగిపోవును .


మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

17నవంబర్ 2025🌹* *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

    🕉️ *సోమవారం*🕉️

*🌹17నవంబర్ 2025🌹*

   *ధృగ్గణిత పంచాంగం* 


       *స్వస్తి శ్రీ విశ్వావసు*

        *నామ సంవత్సరం*       

*దక్షిణాయనం - శరదృతువు*

*కార్తీక మాసం - బహుళ పక్షం*


తిథి      : *త్రయోదశి* పూర్తి

వారం   : *సోమవారం* (ఇందువాసరే)

నక్షత్రం : *చిత్ర* *తె5.32 వరకు*

యోగం : *ప్రీతి* *ఉ9.19 వరకు*

కరణం  : *గరజి* *సా5.52 వరకు*

వర్జ్యం  :  *మ12.13 - 1.57*

దుర్ముహూర్తము : *మ12.07 - 12.52*

                   మరల *మ2.21 - 3.06*

అమృతకాలం    : *రా10.37 - 12.20*

రాహుకాలం        : *ఉ7.30 - 9.00*

యమగండ : *ఉ10.30 - 12.00*

సూర్యరాశి: *వృశ్చికం*  చంద్రరాశి: *కన్య*

సూర్యోదయం: *6.09* సూర్యాస్తమయం:

*5.21*

<><><><><><><><><><><><><><>

       *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_*

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*శాంతే స్వాంతే*

*ప్రలీనే ప్రకటితవిభవే* 

*దివ్యరూపేఽ శివాఖ్యే*


🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

గోకర్ణ క్షేత్రం

 🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀


గోకర్ణ క్షేత్రం



కార్తీకమాసం సందర్భంగా రోజుకొక శైవ క్షేత్రం


గోకర్ణం...🙏🏻


గోకర్ణ క్షేత్ర వివరాలు స్కందపురాణంలో కనిపిస్తాయి.


గోకర్ణ మహాబళేశ్వరాలయంలో గణపతి విగ్రహం ఉంది; ఇక్కడ ఉన్న గణపతి విగ్రహానికి తలమీద ఓ సొట్ట ఉంటుంది.అది ఒక సందర్భంలో గణపతి తెలివికి ఉక్రోషంతో రావణుడు కొట్టిన దెబ్బవల్ల ఏర్పడిందని కథనం.


గర్భగుడిలోని లింగం కింది వైపున పెద్దగా ఉంటూ పైకి వెళ్లే కొద్ది సన్నబడి ఉంటుంది. రావణుడు పెకిలించడానికి ప్రయత్నించడం వల్ల లింగం ఈ రూపును సందర్శించుకుందని పూజారులు చెబుతుంటారు. ఇక లింగం పై భాగంలో ఉన్న రంద్రంలో వేలును పెడితే లింగం లోపల ఉన్న మరో లింగం కనిపిస్తుంది. అదే నిజమైన ఆత్మలింగంమని కథనం. పన్నేండేళ్లకు ఒకసారి ఇక్కడ ఈ లింగానికి విశేష పూజలు జరుగుతాయి.


మహాబలేశ్వర ఆలయం తూర్పున మహాగణపతి ఆలయం ఉంటుంది. రావణుడికి ఆత్మలింగం దక్కకుండా తన వంతు సహకారం అందించి నుందుకు గాను గణపతిని శివుడు మెచ్చు కుంటాడు. అంతే కాకుండా ఈ క్షేత్రంలో మొదట గణపతిని దర్శించుకున్న తర్వాతనే తనకు భక్తు పూజలు చేస్తారని చెబుతారు. ఈ విధానం ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ఇక్కడి గణపతి విగ్రహం తల పైన నొక్కు రావణుడి మొట్టి కాయకు గుర్తుగా చెబుతారు. మహిమాన్మితమైన గణేషునిగా , మంచి ఇచ్ఛతో కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులు బావిస్తుంటారు


రావణుడు గొప్ప శివభక్తుడు. దక్షిణ ప్రాంతంలో ఉన్న తన దేశంలోనే శివుణ్ణి పూజించేవాడు. కొంతకాలం తర్వాత, “కైలాసాన్ని నాయింటికే ఎందుకు తెచ్చుకోకూడదు?” అని అతననుకున్నాడు. 


అతను లంక నుండి కైలాసపర్వతం దాకా నడిచాడు. కైలాసపర్వతాన్ని ఎత్తడం ప్రారంభించాడు. పార్వతికి చాలా కోపం వచ్చింది. ఆవిడ, శివుడితో , “అతను నీకెంత ప్రీతిపాత్రుడైనా కావచ్చు, కాని కైలాసాన్ని దక్షిణానికి తీసికు వెళ్ళడానికి అనుమతించవద్దు.” అన్నది. రావణుడి అహంకారం చూసి శివుడికి కూడా కోపం వచ్చింది. కైలాసాన్ని తన పాదంతో కిందికి ఒత్తాడు. కైలాసం కింద రావణుడి చేతులు ఇరుక్కున్నాయి. రావణుడు బాధతో గింజుకున్నాడు, కాని శివుడతన్ని వదిలిపెట్టలేదు.


కైలాసం కింద తన చేతులు ఇరుక్కుపోయినా, రావణుడు శివునిపై ప్రేమతో, అందమైన వివిధ గీతాలతో శివస్తోత్రం చేయసాగాడు. అతను 1001 గీతాలు రచించి శివునిపై తన భక్తిని వెల్లడించి, పూర్తిగా ఆయనకు ప్రపత్తుడయ్యాడు. 


అప్పుడు శివుడు రావణుని ముక్తుణ్ణి చేసి, “ఒక వరం కోరుకో, నీ ఇష్టం వచ్చిన వరం.” అన్నాడు. మళ్లీ రావణుడి స్వభావం వెల్లడైంది. అతను, “నేను పార్వతిని వివాహమాడాలి.” అని కోరుకున్నాడు “సరే, ఆమె ఇప్పుడు మానస సరోవరంలో ఉంది. నీవు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోవచ్చు” అన్నాడు శివుడు. 


శివుని చుట్టూ ఉన్న గణాలు ఆందోళన చెంది, “ఇదెట్లా? రావణుడు పార్వతీదేవిని ఎట్లా తాకగలడు? ఇది అసంభవం” అనుకున్నారు. వాళ్లు మానస సరోవరానికి పరిగెత్తి వెళ్లి పార్వతీదేవికి, “రావణుడొస్తున్నాడు. అమ్మా! రావణుడు మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి శివుడు అనుమతి ఇచ్చాడు.” అని చెప్పారు. పార్వతి కప్పల రాణి మండూకాన్ని పిలిచింది. అందమైన యువతిగా మార్చింది. రావణుడు పార్వతినెప్పుడూ చూడలేదు. ఇప్పుడు మండూక యువతిని చూసి పార్వతే అనుకున్నాడు. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడై వివాహమాడాడు. ఆ యువతే మండోదరి.


తర్వాత రావణుడు గొప్ప సాధన చేశాడు. శివుని నుండి శక్తిమంతమైన జ్యోతిర్లింగాన్ని పొందాడు. ఇది సమాజం ఆమోదిస్తుందా లేదా అన్న సంశయాలేవీ శివునికి ఉండవు. నిజాయితీగా ఏమి చేసినా ఆయనకు ఇష్టమే. ఏకైకధ్యానంతో సాధన చేస్తే ఆయన వశమైపోతాడు. శివుడు రావణునికి జ్యోతిర్లింగాన్ని ఇస్తూ దాన్ని ఎక్కడ పెడితే అక్కడే శాశ్వతంగా ప్రతిష్ఠమైపోతుందనీ, అందువల్ల మధ్యలో ఎక్కడా కింద పెట్టవద్దనీ చెప్పాడు.


నిజాయితీగా ఏమి చేసినా ఆయనకు ఇష్టమే. ఏకైకధ్యానంతో సాధన చేస్తే ఆయన వశమైపోతాడు. 

రావణుడు చాలా జాగ్రత్తగా గొప్పశక్తితో జ్యోతిర్లింగాన్ని తీసికొని లంకకు వెళుతూ ఉన్నాడు. రావణుడు గొప్ప యోగి. ఆహరం తీసుకోలేదు, కనీసం లఘు శంక తీర్చుకోవడానికి కూడా పోలేదు, ప్రతి మనిషికీ, సహజమైనవీ, ఆవశ్యకమైనవీ అన్నీ విసర్జించాడు. 


కైలాసం నుండి దాదాపు 3000 కిలోమీటర్లు ఈ విధంగా ప్రయాణించి కర్ణాటకలోని గోకర్ణం చేరుకున్నాడు. అప్పటికి బాగా అలసిపోయి ఉంటాడు. చాలా నీళ్లు తాగి ఉంటాడు. మూత్రాశయం నిండిపోయి ఉంటుంది. ఇక మూత్ర విసర్జన చేయకుండా నిలుపుకోవడం అసాధ్యమైపోయింది. జ్యోతిర్లింగం చేతుల్లో పట్టుకొని ఈ అపవిత్రకార్యం చేయలేడు కదా.


అప్పుడతనికి పశువులను మేపుతున్న ఒక అమాయక గోపాలబాలుడు కనిపించాడు. ఎవడైనా తెలివైన వాడి చేతికి ఏదైనా విలువైన వస్తువును ఇస్తే వాడది తీసుకొని పారిపోవచ్చు. ఈ పిల్లవాడు చాలా అమాయకంగా కనిపించాడు. రావణుడు అతనితో ఇలా అన్నాడు, “కాసేపు ఈ లింగాన్ని పట్టుకో. కిందమాత్రం పెట్టకు. అందుకుగాను, నేను నీకో విలువైన నగ ఇస్తాను”. సరేనన్నాడు బాలుడు.రావణుడు బాలుడి చేతిలో జ్యోతిర్లింగం పెట్టి పక్కకు వెళ్లాడు. ఆ బాలుడెవరో కాదు, గణపతి. గణపతికి జ్యోతిర్లింగం లంకకు చేరడం ఇష్టం లేదు, అది లంకలో ఉంటే రావణుడి శక్తి అపారంగా పెరిగిపోతుంది. అందువల్ల గణపతి ఏం చేశాడు? జ్యోతిర్లింగాన్ని నేలమీద పెట్టాడు. అది అక్కడ దిగబడిపోయి ప్రతిష్ఠితమైపోయింది. ఇప్పుడు కూడా, మీరు గోకర్ణం వెళ్లి చూస్తే, లింగం రాతిలోపలకు ఉంటుంది. సన్న రంధ్రంలో నుండి వేలుపెట్టి లింగాన్ని స్పృశించాలి. అది లోపలకు వెళ్లిందన్నమాట.


రావణుడికి కోపం వచ్చి, గణపతి తలపై గట్టిగా ఒక దెబ్బ వేశాడు. గోకర్ణంలో గణపతి విగ్రహం కూడా ఉంది. దాని తల భాగం పై చిన్న గుంట ఉంటుంది. రావణుడికి మళ్లీ కైలాసం వెళ్లి, శివుణ్ణి మెప్పించి మళ్లీ జ్యోతిర్లింగం తెచ్చే ఓపిక లేకపోయింది. క్రోధంతో తన లంకకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు.


మీరు మంచివాళ్ళైనా, చెడ్డవాళ్ళైనా , మీకు ఇచ్ఛ ఉంటే, దివ్యత్వం మీకెప్పడూ అందుబాటులోనే ఉంటుంది. మీరు కలిగి ఉన్న స్వభావాన్ని బట్టి అది వరంగానో, శాపంగానో పరిణమిస్తుంది. మీరు మీ అస్తిత్వాన్ని ఎలా ఉపయోగించుకుంటారన్నది – మీలో మీరు ఎటుంటి దృక్పథాన్ని, ఎటువంటి మనస్సును వికసింపచేసుకుంటారో- అదే నిర్ణయిస్తుంది..   


హరహర మహాదేవ శంభో శంకర 🙏🏻



✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀

మాఘోస్సన్తి త్రయోగుణాః...

 *ఉపమా కాళిదాసస్య*

*భారవేరర్థగౌరవమ్*

*దండినః పదలాలిత్యమ్*

*మాఘోస్సన్తి త్రయోగుణాః*


ఉపమాలంకారాన్ని ప్రయోగించటంలో కాళిదాసునే చెప్పుకోవాలి. అంతటి గొప్పకవి ఎవరూ లేరు. 


భారవి కవి చెప్పే శ్లోకాలకు చాలా గొప్ప, లోతైన అర్థాలు ఉంటాయి. ఈవిధంగా వ్రాయగల కవి మరొకరు లేరు. 


దండిమహాకవి చక్కని పదాలను ప్రయోగించటంలో దిట్ట. పదసంపద బాగుంటుంది. ఎక్కడ ఏ పదం ఎలా ఉపయోగించాలి? అనేది ఈయనకు బాగా తెలుసు. పదలాలిత్యంలో దండిమహాకవిని మించినవారు లేరు. 


మాఘోస్సన్తి త్రయోగుణాః...

పై ముగ్గురుకవులకూ ఒక్కొక్క లక్షణంలో నైపుణ్యం ఉంటే...  ఈ మాఘుడు పై ముగ్గురిలక్షణాలనూ పుణికిపుచ్చుకొన్న అద్భుతమైన కవి. 



*ఇది భాషావేత్తల ప్రశంస*