20, డిసెంబర్ 2022, మంగళవారం

షడైశ్వైర్యాలు

  1) భగ కలిగిన వాడు:  మనము అదృషవంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, బలవంతుడు అనే మాటలు వుంటూ ఉంటాము.  అంటే ఏది ఉంటే వానికి ఉన్నదాని ప్రక్కన వంతుడు అని పెట్టి అది అలిగినవాడుగా మనం పేర్కొంటాము.  ఉదా : ధనం వున్నవానిని ధనవంతుడు అని అదృష్టం వున్నవానిని అదృష్టవంతుడు ఇలా మనం ఉపయోగిస్తూవుంటాము. మరి భగవంతుడు" అంటే ఎవరు? భగ అనే ఆరుగుణాలు వున్నవాడు క్రింది శ్లోకాన్ని చుడండి

"మాహాత్మ్యస్య సమగ్రస్య ధైర్యస్య యశస శ్రియఃజ్ఞాన వైరాగ్యయేశ్చైవ షణాం - భగ, ఇత్యుక్త భగోzస్యాస్తీ తి భగవాన్ " అని శాస్త్ర నిర్వచనం .అంటే

1) మాహాత్మ్యం 2) ధైర్యం 3) యశస్సు4) సంపద5) జ్ఞానం 6) వైరాగ్యం ఈ ఆరింటిని షడైశ్వైర్యాలు అంటారు.వీటికే "భగ" అని పేరు. ఈ ఆరు ఐశ్వైర్యాలను సంపూర్ణంగా కలిగి ఉండడం వల్లనే "భగవంతుడు" అని పేరు.

మన మహర్షులు వారి అత్యంత గొప్ప మేధసుక్తితో మనకు భగవంతుని స్వరూపాన్ని ఆవిష్కరింప చేశారు.  వారు పేర్కొన్న జ్ఞ్యాన బాండాగారం మనకు ఉపనిషత్తుల రూపంలో లభ్యమవుతున్నది. అతి సామాన్యమైన విషయంతో అనన్తమైన బ్రహ్మపదారధాన్ని తెలుసుకోవటం ఒక అసామాన్యమైన జ్ఞ్యానం అనాలి. 

భగవంతుడు: మన మహర్షులు భాగావంతునికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి అని చెప్పారు. 

1) త్రిగుణాతీతుడు. మనుషులమైన మనము సత్వ, రజో తమో గుణాలలో ఏదో ఒక గుణం కలిగి ఉంటాము. కొన్ని సందర్భాలలో ఒక గుణం ఇంకొక గుణంతో మిళితమై లేక అధిగమించి గోచరించవచ్చు. ఏది ఏమైనా గుణాలలో మాత్రమే మనిషి కనపడతాడు.  కానీ భగవంతునికి ఏ రకమైన గుణం ఉండదు అంటే ఆయనకు రాగ ద్వేషాలు వుండవు. 

2) కాలాతీతుడు: ఈ భూమి మీద వున్న ప్రతిదీ అది నిర్జీవమైనది కావచ్చు లేక జీవమైనది కావచ్చు ఒక కాలంలో ఉద్బవించి (జన్మించి) కొంత కాలం వుంది తరువాత నశించి పోతుంది. ఉన్నంతకాలం మార్పు చెందుతూ ఉంటుంది. కానీ భగవంతుడు కాలములో లేడు ఆయన త్రికాలలో ఉంటాడు అంటే భూతకాలంలో వున్నాడు, వర్తమానంములో వున్నాడు భవిష్యత్తులో ఉంటాడు. అందుకే భగవంతుని నిత్యుడు అని అన్నారు. 

3) రూప రహితుడు: మనకు ఈ భూమి మీద ప్రతిదీ ఏదో ఒక రూపంలో కనబడుతూ వున్నది. అందుకే మనం వాటిని గుర్తించగలుగుతున్నాము. కానీ భగవంతుడు ఏ రూపం లేకుండా ఉంటాడు. అందుకే ఆయన కాలంలో లేడు . 

4) నామరహితుడు: అంటే పేరులేని వాడు.  ఏదైనా రూపం ఉంటేనే పేరు ఉంటుంది.  రూపమేలేనప్పుడు ఇక పేరు అనే సమస్యే లేదు. 


_తిరుప్పావై నాల్గవరోజు పాశురం*_

 _తిరుప్పావై నాల్గవరోజు పాశురం*_

 

 

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 

 

*🌴4. వ పాశురము:🌴*


    *ఆళి మళైక్కణ్ణాః ఒన్ఱు నీ కైకర వేల్*

     *ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి*

    *ఊళి* *ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు*

    *పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్*

    *ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ఱ దిర్ న్దు*

    *తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్*

    *వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్*

    *మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.*


*🌳భావము :🌳*


ఓ పర్జన్య దైవమా ! వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపకుము. నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము , అటుపిదప నీవు పైకెగసి , సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము. మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై ఇక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ !


  *☘️అవతారిక :☘️*

   


సర్వవ్యాపాకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని యెరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాశురంలో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని యేమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావలెనన్న ముందు శారీరక శుద్ధి , ఆపై అంతర్ శుద్ధి అవసరం కదా ! అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థంచి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నదీ పాశురంలో.


*🌹4. వ మాలిక🌹*


    (ఉదయరవిచంద్రిక రాగము -ఆదితాళము)


ప.    వెనుదీయబోకుమా ! వర్జన్యమా !

    కనికరముంచుమ ! వర్షాధిదైవతమ !


అ. ప.    పానము చేయుమ ! సాగర జలముల

    ఘనమౌ గర్జన చేయగరమ్మా !


1 చ.    ఆకాశమున కెగసి లోకకారణుని

    పోకడి తిరుమేని నలుపు నలదుకొనుమ


2 చ.    విశాల సుందర భుజ పద్మనాభుని    

    అసదృశమగు చక్రమువలె మెరసి

    ఆశనిపాత శంఖముగ గర్జించి

    ఆ శార్జపు శరములుగ వర్షింపుమా


3 చ.    ఆశల , లోకము సుఖముల నొందగ

    మాస మార్గళిని మాకై వర్షింపుమా

    వెనుదీయబోకుమా ! పర్జన్యమా !





_

తిరుప్పావై ప్రవచనం‎ - 4 వ రోజు*_

 _*తిరుప్పావై ప్రవచనం‎ - 4 వ రోజు*_ 


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*భగవంతుని నాలుగో స్థానం - అంతర్యామి*


 


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*పాశురము*


*ఆళి మళైక్కణ్ణాః ఒన్ఱు నీ కైకర వేల్*

     *ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి*

    *ఊళి* *ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు*

    *పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్*

    *ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ఱ దిర్ న్దు*

    *తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్*

    *వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్*

    *మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.*


మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కల్గితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి. దేవతలంతా సహకరిస్తారు. మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ అని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీసుఖుడు ఇట్లా అంతటా దైవన్ని దర్షించుకొనేవాడట. దేనిపై పెద్దగా వ్యామొహం లేనివాడవటంచే అలా  వెల్లి పోతుంటే , పుత్రవ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరుగెత్తేవాడట. పుత్రా అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయే సరికి చెట్లు , పక్షులు ఓయ్ అని పలికేవట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శ్రీసుఖునిలో ఉన్న తత్వమే అన్నిటిలోనూ ఉంది కనకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోను అది ఉండి నిలబెడుతుంది. దాన్ని మనం చూడగలగాలి , కాని కంటికి కనబడదు. కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి.  


ఆండాళ్ తల్లి మనిషిలోని మంచి తనాన్ని మేల్కొల్పటానికి ధనుర్మాస వ్రతం చేసింది , మనల్ని అట్లానే ఆచరించమంది.  అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది. అందరితో కలిసి చేస్తేనే అనుభవ యోగ్యం అవుతుంది. అందరికి సాముహికంగా క్షేమం కల్గాలని అని మనం చేస్తున్నాం , అలాంటి వాన్ని ముముక్షువు అంటారు. మనం ఒక ముముక్షువుగా బ్రతక గలగాలి. తత్వన్ని అంతటా చూడగలగాలి. తీపికి రుపం ఎమిటి , వివిద పదార్థాల లోనే చూడగలం. అలాగే పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేము కనక , మనవంటి వారికి ఇష్టమయ్యే మనవంటి రూపాన్నే ధరించి మన ఆరాధనలు అందుకోవటానికి చేరుతుంది ఆ బ్రహ్మ తత్వం. కాని అది మాత్రమే ఆయన రూపం కాదు. 


సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కల్సి ఉంటాడు , లోకంలో ఒక్కొక్క  ప్రయోజనం కోసం వివిద దేవతలను ఆశ్రయిస్తారు. కాని ఒక్కరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైన సాధన ఉందా అంటే - అది నారాయణుని ఆశ్రయం తప్ప ఏది లేదు ఎందుకంటే సకలఫలప్రదోహి విష్ణు:  అనేది మనకు ఋషివాక్కు. మిగతావరంతా *"ఏకైక లభాయ:"* కాని  *"సర్వ లాభాయ కేశవ"* అంటారు.  ఒక్క పరమాత్మను మనం ప్రసన్నం చేసుకొంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు. 


అందరూ భయపడే యముడు చెప్పినమాటలు ఏమిటంటే , విష్ణువు భక్తుల జోలికి తన దూతలను వెల్లవద్దని. భగవత్ ప్రేమ కల్గి విష్ణువుకే అంకితమయ్యే వాల్లంటే యముడు కూడా భయపడుతుంటాడు. నారాయణ స్మరన చేయటంచే యమదూతలు అజామయున్ని వదిలివెళ్ళుతారు. విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు. భారతంలో అజామయుడి సన్నివేషంలో  ఇది చెప్పబడి ఉంది. అలాగే ఏదేవతను కొలిచినా , ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చెది నేనే నయా అని  భగవద్గీత ఏడవ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకొంటే మిగతాదేవతలు తామంతట తామే సహకరిస్తారు.


అలా వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్ష దేవునికి ఆండాళ్ చేసిన విన్నపం ఇలా ఉంది. *ఆళి మళైక్కణ్ణా! -* సముద్రమ్లో నుండి నీల్లను గ్రహించి నిర్వహించేవాడా - వానదేవా - పర్జన్యా. *ఒన్ఱు నీ కై కరవేల్ -* ఏ మాత్రం నీవు చేయి దాచుకోవద్దు - ఉదారంగా ఇవ్వు , *ఆళి ఉళ్ పుక్కు -* సముద్రం అట్టడుగు లోపలి దాకా వెల్లి , *ముగందు కొడార్ త్తేఱి -*  పిల్చుకో , ముందు నీవు తృప్తిగా కడుపు *నిమ్పుకోని -* చాలా ఎత్తుకు వెల్లాలి. 


*ఊళి ముదల్వన్ -* సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలి కాంతి తరంగాలు కల్గి ఉంటాడో , *ఊరువం పోళ్  మెయ్ కఱుత్తు -* అట్లాగే  నీ  ఆకారాన్ని సరిదిద్దుకో , *పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్  ఆళిపొల్ మిన్ని -* బీటలువారి ఉన్న ఈ భూమికి ఒక్క సారిగా కురవకూడదు ,  మొదటగా మెరవవలె , తర్వాత ఉరమవలె , తరువాత కురవవలె. 


ఆ  మెరవడం ఎట్లా అంటే సుదర్షణచక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి. *వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు -* ఎట్లా ఉరమాలి అంటే శ్రీపాంచజన్యంలా - శంఖం ద్వనిలా  ఉరుమవలె. ఆ ద్వని ద్వారా భగవంతున్ని ద్వేషించేవాల్లు కూడా భక్తులుగా మారేట్లు గా ఉండాలి. తాళాదే శారుంగం ఉదెత *శరమళైపోల్ వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ -* ఇక కురవడం స్వామి వేసే భాణాలవలె కురవాలి , అందరు సుఖించెందుకు uవర్షించు. ఆంగళుం *మార్గళి నీరాడ మగిళుంద్* - మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు.

అన్నకోశం – అష్టాదశ పురాణాలు

 అన్నకోశం – అష్టాదశ పురాణాలు


పరమాచార్య స్వామివారు చెన్నైలో కొన్ని నెలలపాటు మకాం చేసారు. అక్కడినుండి బయలుదేరి వారు పూనమల్లె రోడ్డులో ఉన్న నూమ్బల్ లో ని ఇటుక పెంకుల తయారి కర్మాగరంలో మకాం చేస్తున్నారు. ఒకరోజు సాయింత్రం నేను కలకత్తా నుండి వచ్చిన ఒక సేఠ్ తో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళాను. అతను కలకత్తాలో పెద్ద ధనవంతుడు మరియు పరోపకార బుద్ధి కలవాడు. మామూలుగా నేను స్వామివారికి సాష్టాంగం చేసాను. ఆ సేఠ్ కూడా అలాగే చేసాడు. ఇద్దరము స్వామివారికి నమస్కరిస్తూ నిలబడ్దాము. 


స్వామివారు ఒక్కసారిగా మావైపు చూసి తలెత్తి నాతో, “అప్పుడు నాకు ఒకసారి చెప్పావు. . . అది ఇతని గురించేనా?” అని అడిగారు. జ్ఞాపకం ఉంచుకోవడంలో అంచనా వెయ్యడంలో స్వామివారి శక్తి అమోఘం. నేను వారు అడిగినదానికి ఏకీభవిస్తూ “చాలాకాలంగా ఇతడు నన్ను ఒత్తిడి చేస్తుండడం వల్ల ఇక్కడికి తీసుకుని వచ్చాను” అని వినయంగా బదులిచ్చాను. 


ఇతని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ సేఠ్ చాలా ధార్మికుడు. కలకత్తాలో ప్రతిరోజు నేను చెప్పే రామయాణ, మహాభారత ఉపన్యాసాలకు వచ్చేవాడు. నేను హిందీలో కూడా వ్యాఖ్యానించడం వల్ల చాలామంది ఉపన్యాసాలకు వచ్చేవారు. ఉపన్యాసం ప్రారంభించి ప్రార్థనా శ్లోకాల తరువాత కంచి పరమాచార్య స్వామి వారి గురించి చెప్తూ, వారి తపశ్శక్తి, వారి అపారమైన మేధస్సు గురించి ఉదాహరణలతో సహా చెప్పేవాడిని. తరువాతే అసలు ప్రవచనం చెప్పేవాడిని. ఇలా చాలా సంవత్సరాలనుండి పాటిస్తున్నాను. 


భగవంతుడు ఆ సేఠ్ కు అన్నిరకాల భోగభాగ్యాలను ఇచ్చాడు కానిఇ వాటితో పాటు ఒక పెద్ద బాధను ఇచ్చాడు. అతడు నోటి ద్వారా ఆహారం స్వీకరించలేకపోవడం అతడి దురదృష్టం. అతని అన్ననాళం (నోటి నుండి కడుపుకి ఆహారం వెళ్ళే మార్గం) పనిచెయ్యదు. కడుపు పైన ఒక రంధ్రం చేసి దాని గుండా ఆహారాన్ని కడుపులోకి పంపాలి. ఎంతటి నరకం అది. దాన్ని అనుభవిస్తూ రోజులు వెళ్ళదీస్తున్నాడు. 


ఆ సమస్యను నివారించుకోవడానికి అతను చెయ్యని పని లేదు. వైద్యశాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వారిని కూడా కలిసాడు. వెళ్ళని దేవాలయం లేదు. మొక్కని దేవాలయం లేదు. ప్రార్థనలు, పూజలు, యంత్రాలు, తంత్రాలు అన్నిటిని చేసాడు. కాని ఏ ఒక్కదాని వల్ల ప్రయోజనం లేదు. నేను చెప్పే ఉపన్యాసాల్లో కంచి పరమాచార్య స్వామి వారి గురించి విని ఒక్కసారి వారిని కలవాలని చివరైకి వారైనా తనకు ఈ బాధనుండి విముక్తి కలిగిస్తారేమోనని అతని ఆశ. 


ఒకసారి నాతో ఇద్దరము కలిసి చెన్నై వెళ్ళవలసిందే అని పట్టుబట్టాడు. కాని పరమాచార్య స్వామివారి అనుమతి లేకుండా అతణ్ణి తీసుకుని వెళ్ళడం నాకు చాలా ఇబ్బంది. నేను చెన్నై వెళ్ళి స్వామివారిని అడిగి చెప్తాను అని చెప్పాను. వెంటనే నాకు చెన్నైకి విమానం టికెట్ తిసిచ్చాడు. నేను చెన్నై వెళ్ళగానే పరమాచార్య స్వామి వారికి విషయమంతా చెప్పి అతణ్ణి తీసుకుని రావడానికి వారి అనుమతి కోరాను. నా ప్రవచనాల గురించి అడిగారు కాని దాని గురించి ఏ విషయము చెప్పలేదు. ఆ విషయం మళ్ళా గుర్తుచెయ్యగా ఖండితంగా “ఇప్పుడు కాదు” అని అన్నారు. ఈ విషయం ఆ సేఠ్ కి చెప్తే బాధపడతాడని నా ప్రవచనాలు అయిపోయాక తీసుకుని వెళ్తానని చెప్పాను. 


స్వామివారి అనుమతి లేకున్న ఇప్పుడు అతణ్ణి తీసుకుని రావాడం నా తప్పే, కాని సేవాభావంతో అతణ్ణి తీసుకుని వచ్చాను. మనకు జరిగి ప్రతి మంచి చెడు మన పూర్వజన్మ పాప పుణ్యాల ఫలమే. ప్రతి మనిషి వాటిని అనుభవించవలసిందే. వాటి ఫలితాన్ని అనుభవిస్తేనే పాపం తగ్గుతుంది. అలా వరుస కష్టాలు అనుభవిస్తున్నమంటే మన పాపం అంతా పోతున్నట్టే. వాటిని భగవంతుడిపై విశ్వాసంతో అనుభవిస్తే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇటువంటి మంచిచెడ్డల విషయంలో పరమాచార్య స్వామివారి వివరణలు చాలా స్పష్టంగా ఉంటాయి. 


మనుషులు వాటిని ఖచ్చితంగా అనుభవించాలి అనే స్పృహ లేకుండా వాటిని పరిహరించమని కోరుకుంటారు. అందుకే వారిని కలావడానికి స్వామివారు ఇష్టపడరు. నేను స్వామికి కొంచం దూరంగా నిలబడి వారికి పదే పదే గుర్తుచేస్తున్నాను. కాని స్వామివారు ఏమి చెప్పలేదు. రాత్రి అయ్యేటప్పటికి సెలవు తీసుకుని ఉదయం రావడానికి వారిని సమీపించాను. వారు నా భావన గ్రహించి “అతని విషయంలో ఏమి చెయ్యలేము. అతణ్ణి తీసుకుని వెళ్ళు. దేవునిపై భక్తితో, మంచి పనులు చేస్తూ ఉండమను. ఆ దైవమే అతణ్ణి రక్షించగలదు” అని చెప్పారు.


నేను కొంచం సాహసించి స్వామివారితో, “చలా ఏళ్ళుగా అతను ఎన్నో మంచిపనులు చేస్తున్నాడు. దీనికి పరిహారమే లేదా? ప్రతిదానికి ఒక పరిహారం అంటూ ఉంటుంది కదా? శాపగ్రస్తులకి, పాపాత్ములకి మన ధర్మశాస్త్రాలు విమోచనం చెప్పలేదా? భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి పరిహారం ఉండదా? మీరు దయతో అతణ్ణి అనుగ్రహించండి” అని ఆ సేఠ్ పరుపున వాదించాను. 


పరమాచార్య స్వామివారు అంతావిని కొద్దిసేపు మౌనంగా ఉండి నన్ను దగ్గరకు రమ్మని చెప్పారు. “నేను ఏమి చెప్తే అది అతను చేస్తాడా?” అని అడిగారు. 


”ఖచ్చితంగా చేస్తాడు. చెయ్యమని నేను చెప్తాను”


“ఒకవేళ అతను చెయ్యకపోతే?”


“చేస్తే మంచి జరుగుతుంది, లేకపోతే అనుభవిస్తాడు” అన్నాను. ”నేను చెప్పేది చెయ్యలంటే చాలా ధనం ఖర్చు అవుతుంది. అంత ఖర్చు చెయ్యగలడా?”


“అతను కోటీశ్వరుడు. మొత్తం ఆస్తి అంతా ఖర్చుపెడతాడు ఆరోగ్యం కోసం” అన్నాను నేను. 


”సరే. అలాగైతే మన వేదశాస్త్రాల్లోని మొత్తం పద్దెనిమిది పురాణాలను మంచి పేపరుపై, మంచి అచ్చుతో సంస్కృతంలో భాగాలుగా అచ్చువేయించి, అన్ని భాగాలను అర్హులైన వేదపండితులకు ఉచితంగా ఇవ్వాలి. అతను చేస్తాడా? చెయ్యగలడా?” అని అడిగారు. 


”చెయ్యగలడు. చెయ్యమని నేను చెప్తాను” అని అన్నాను. 


”పద్దెనిమిది పురాణాలు నీకు తెలుసా? ఏవి పేర్లు చెప్పు”


నేను వాటిని “1.మత్స్య పురాణం, 2.మార్కండేయ పురాణం, 3.భవిష్య పురాణం, 4.భాగవత పురాణం, 5.బ్రహ్మాండ పురాణం, 6.బ్రహ్మ వైవర్త పురాణం, 7.బ్రహ్మ పురాణం, 8.వామన పురాణం, 9.వరాహ పురాణం, 10.విష్ణు పురాణం, 11.వాయు పురాణం, 12.అగ్ని పురాణం, 13.నారదీయ పురాణం, 14.పద్మ పురాణం, 15.లింగ పురాణం, 16.గరుడ పురాణం, 17.కూర్మ పురాణం, 18.స్కంద పురాణం” అని చెప్పి నా వాదన వల్ల మంచి జరిగినందుకు సాంతోషించాను.


నేను సేఠ్ ని పిలిచి విషయం అంతా వివరించాను. అతను చాలా సంతోషంతో “అవును నేను చేస్తాను” అని కన్నీళ్ళతో పరమాచార్య స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించాడు. మహాస్వామి వారు ఆశీర్వదించి ప్రసాదం ఇవ్వమని శిష్యులకు చెప్పారు. 


అతను తన స్వస్థానం చేరగానే మొదట ఈ పని మొదలుపెట్టాడు. అతని పెద్ద కార్యాలయ భవంతిలో ఒక అంతస్థు మొత్తం ఈ కార్యక్రమానికి వినియోగించాడు. చాలా రాష్ట్రాల నుండి వైదిక పండితులను, పురాణాలాలో నిష్ణాతులను పిలిపించాడు. అందరిని సంప్రదించి వారి సలహాలు సూచనల మేరకు మంచి కాగితంపై, మంచి నాణ్యతతో పెద్ద పుస్తకాలను అచ్చువేయించి స్వామి వారి ఆజ్ఞమేరకు అర్హులైన పండితులకు పంచాడు. ధర వేసే చోట “ప్రేమతో” అని రాయించాడు. 


అతని అనారోగ్యం తగ్గుతోందా? అసలు తగ్గుతుందా లేదా? అన్నది కూడా పట్టించుకోకుండా, కనీసం ఇసుమంతైనా అనుమానం లేకుండా పూర్తిగా ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు. మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం పదిహేడు పురాణాలు గ్రంధాలుగా వచ్చాయి. కాని అతను అనారోగ్యం మాత్రం సరిపోలేదు. ఇంత మహత్కార్యం జరగుతున్నప్పుడు కూడా మునుపటి లానే ఆహారం తీసుకునేవాడు. 


ఇక చివరగా స్కాంద పురాణం పని మొదలుపెట్టగానే హఠాత్తుగా అందరిలాగే నోటితో తినడం మొదలుపెట్టాడు. అతని నాలుకకు రుచి తెలుసుకునే శక్తి వచ్చింది. ఈ జన్మలో జరగదు అనుకున్న వింత జరిగింది. ప్రతిరోజూ ప్రతిక్షణం అనుభవించిన బాధ స్వామి వారి అనుగ్రహంతో పోయింది.


నాకు ఆ విషయం తెలియగానే స్వామివారిని కలిసి, “స్వామివారి శక్తియే శక్తి. మీరు అనుగ్రహించిన వరం వల్ల సేఠ్ కి మళ్ళా పునర్జన్మ లభించింది. ఇది కేవలం మీ అనుగ్రహమే. మీరే అతణ్ణి కాపాడారు. మీరే భగవంతుడు” అని వారిముందు నిలబడి కన్నీళ్ళు కారుస్తున్నాను. 


అప్పుడు ఆ మహాశక్తి నాతో పలికిన మాటలు విని నాకు కళ్ళ ముందు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నాను అని అనిపించింది. "మన దేశ ధర్మశాస్త్రాలకు ఉన్న శక్తి అతణ్ణి కాపాడింది. కాదా?" అని అన్నారు. 


నేను కాని, ఇంకెవ్వరూ కాని ఈ సంఘటనకు నేనే కారణం అని స్వామివారు చెప్పుకున్నట్టు ఎవరూ వినలేదు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన విన్నతరువాత పాశ్చాత్యులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు.


[పద్దెనిమిది పురాణాలను సులభంగా గుర్తు పెట్టుకోవడానికి ఈ శ్లోకం 


”మ” ద్వయం ”భ” ద్వయం చైవ “బ్ర” త్రయం “వ” చతుష్టయం |

“అ” “నా” “ప” “లిం” “గ” “కూ” “స్కా” ని పురాణాని ప్రచక్షతే || 


‘మ’ ద్వయం – ‘మ’ తో రెండు మత్స్య, మార్కండేయ

‘భ’ ద్వయం – ‘భ’ తో రెండు భవిష్య, భాగవతం 

’బ్ర’ త్రయం – ‘బ్ర’ తో మూడు బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త

‘వ’ చతుష్టయం – ‘వ’ తో నాలుగు వాయు, విష్ణు, వామన, వరాహ


‘అ’ ‘నా’ ‘ప’ ‘లిం’ ‘గ’ ‘కూ’ ‘స్కా’ – ఒక్కొక్కటి అగ్ని, నారదీయ, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణాలు] 


--- ముక్కూర్ శ్రీనివాస వరదాచార్యర్ స్వామిగళ్, అష్టలక్ష్మి దేవస్థానం, చెన్నై. “పరమాచార్యర్” పుస్తకం నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

telugu word Daily

 Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింపబడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

12వ దినము (19-12-2022):

ఆకాశము:

తెలుగు: అంతరిక్షము,అంబరము, అక్షరము, అనంగము, అనంతము, అభ్రపథము, ఆకసము, ఉడుపథము, ఖంబు, ఖము, గగనము, చరాచరము, చుక్కలత్రోవ, తారాపథము, దివము, దివి, ధత్రము, ధృవము నభము, నాకము, నింగి, నిరాకారము పుణ్యము, పుష్కరము, బర్హిస్సు, భగము, భువనము, మిన్ను, మేఘద్వారము, రోదసి, వాయువర్తనము, విభువు,విష్ణుపదము, వ్యోమము, శబ్దగుణము, శుషిరము, శూన్యము, సంపూర్ణము, సత్పథము, సన్మార్గము, సర్వతోముఖము, సోమధార, స్పర్శము, హరిపదము. 


ఆంగ్లము: SPACE

తిరుప్పావైపాశురము :4/30*

 *ॐ              తిరుప్పావై* 



                    *పాశురము :4/30* 


*భావము* 


*ఓ పర్జన్య దైవమా!*  

    *వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపకుము.* 

    *నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము.* 

    *అటుపిదప నీవు పైకెగసి, సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము.*  

    *స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము.* 

    *మేమందరము యీ వర్షధారలలో స్నానమాడెదము.* 

    *లోకము సుఖించునట్లు వర్షించుము.* 

    *మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై యిక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ!*  



*పాశురము* 


    *ఆళి మళైక్కణ్ణాః ఒన్ఱు నీ కైకర వేల్* 

    *ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి* 

    *ఊళి ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు* 

    *పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్* 

    *ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ఱ దిర్ న్దు* 

    *తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్* 

    *వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్* 

    *మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్* 


https://youtu.be/QWUp5NQodXY

కర్కోటకుడు - మంచివాడు

 కర్కోటకుడు - మంచివాడు


శ్రీమఠంతో చిరకాలంగా సంబంధం ఉన్న ఒక భక్తుడు. ఒకసారి పరమాచార్య స్వామివారితో మాట్లాడుతుండగా మరొక వ్యక్తి గురించి నింద చేస్తూ సంభాషించే అవకాశం లభించింది. “ఆ వ్యక్తి పరమ కర్కోటకుడు!” అని అన్నాడు.


ఒక నిముషం తరువాత స్వామివారు, “అతను మంచివాడు అని అంటున్నావా?” అని అడిగారు.


స్వామివారి మాటలు ఆ భక్తునికి అర్థం కాలేదు. “అతణ్ణి నేను భయంకరమైన విషం కలిగిన కర్కోటకుడు అని అన్నాను. . .”


“నీకు ప్రాతఃస్మరణ శ్లోకం తెలుసా?” అని అడిగారు స్వామివారు.


కర్కోటకస్య నాగస్య దమయన్త్యా నలస్య చ,

ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనమ్.


“కర్కోటక నాగుడు, దమయంతి, నల, ఋతుపర్ణుడు - వీరిని తలచినంతనే పాపాలు పోతాయి. వారందరూ అంతటి పుణ్యవంతులు”


అప్పటిదాకా దూషించిన ఆ భక్తుడు ఇప్పుడు సంకటంలో పడ్డాడు. అంటే ఇప్పటిదాకా అతని గురించి చెడుగా మాట్లాడాలి అనుకున్నప్పటికీ చెడుగా మాట్లాడలేదు అన్నమాట.


“నువ్వే అతడు మంచివాడు అని చెబుతున్నావు. అవును కదా?”

పరమాచార్య స్వామివారి దృష్టిలో అందరూ మంచివారే. అద్వైత ప్రతిష్టాపనాచార్యులైన శంకరులు అధిష్టించిన పీఠానికి పీఠాధిపతులు కదా మన స్వామివారు!


--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం