_*తిరుప్పావై ప్రవచనం - 4 వ రోజు*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*భగవంతుని నాలుగో స్థానం - అంతర్యామి*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*పాశురము*
*ఆళి మళైక్కణ్ణాః ఒన్ఱు నీ కైకర వేల్*
*ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి*
*ఊళి* *ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు*
*పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్*
*ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ఱ దిర్ న్దు*
*తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్*
*వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్*
*మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.*
మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కల్గితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి. దేవతలంతా సహకరిస్తారు. మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ అని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీసుఖుడు ఇట్లా అంతటా దైవన్ని దర్షించుకొనేవాడట. దేనిపై పెద్దగా వ్యామొహం లేనివాడవటంచే అలా వెల్లి పోతుంటే , పుత్రవ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరుగెత్తేవాడట. పుత్రా అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయే సరికి చెట్లు , పక్షులు ఓయ్ అని పలికేవట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శ్రీసుఖునిలో ఉన్న తత్వమే అన్నిటిలోనూ ఉంది కనకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోను అది ఉండి నిలబెడుతుంది. దాన్ని మనం చూడగలగాలి , కాని కంటికి కనబడదు. కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి.
ఆండాళ్ తల్లి మనిషిలోని మంచి తనాన్ని మేల్కొల్పటానికి ధనుర్మాస వ్రతం చేసింది , మనల్ని అట్లానే ఆచరించమంది. అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది. అందరితో కలిసి చేస్తేనే అనుభవ యోగ్యం అవుతుంది. అందరికి సాముహికంగా క్షేమం కల్గాలని అని మనం చేస్తున్నాం , అలాంటి వాన్ని ముముక్షువు అంటారు. మనం ఒక ముముక్షువుగా బ్రతక గలగాలి. తత్వన్ని అంతటా చూడగలగాలి. తీపికి రుపం ఎమిటి , వివిద పదార్థాల లోనే చూడగలం. అలాగే పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేము కనక , మనవంటి వారికి ఇష్టమయ్యే మనవంటి రూపాన్నే ధరించి మన ఆరాధనలు అందుకోవటానికి చేరుతుంది ఆ బ్రహ్మ తత్వం. కాని అది మాత్రమే ఆయన రూపం కాదు.
సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కల్సి ఉంటాడు , లోకంలో ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిద దేవతలను ఆశ్రయిస్తారు. కాని ఒక్కరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైన సాధన ఉందా అంటే - అది నారాయణుని ఆశ్రయం తప్ప ఏది లేదు ఎందుకంటే సకలఫలప్రదోహి విష్ణు: అనేది మనకు ఋషివాక్కు. మిగతావరంతా *"ఏకైక లభాయ:"* కాని *"సర్వ లాభాయ కేశవ"* అంటారు. ఒక్క పరమాత్మను మనం ప్రసన్నం చేసుకొంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు.
అందరూ భయపడే యముడు చెప్పినమాటలు ఏమిటంటే , విష్ణువు భక్తుల జోలికి తన దూతలను వెల్లవద్దని. భగవత్ ప్రేమ కల్గి విష్ణువుకే అంకితమయ్యే వాల్లంటే యముడు కూడా భయపడుతుంటాడు. నారాయణ స్మరన చేయటంచే యమదూతలు అజామయున్ని వదిలివెళ్ళుతారు. విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు. భారతంలో అజామయుడి సన్నివేషంలో ఇది చెప్పబడి ఉంది. అలాగే ఏదేవతను కొలిచినా , ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చెది నేనే నయా అని భగవద్గీత ఏడవ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకొంటే మిగతాదేవతలు తామంతట తామే సహకరిస్తారు.
అలా వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్ష దేవునికి ఆండాళ్ చేసిన విన్నపం ఇలా ఉంది. *ఆళి మళైక్కణ్ణా! -* సముద్రమ్లో నుండి నీల్లను గ్రహించి నిర్వహించేవాడా - వానదేవా - పర్జన్యా. *ఒన్ఱు నీ కై కరవేల్ -* ఏ మాత్రం నీవు చేయి దాచుకోవద్దు - ఉదారంగా ఇవ్వు , *ఆళి ఉళ్ పుక్కు -* సముద్రం అట్టడుగు లోపలి దాకా వెల్లి , *ముగందు కొడార్ త్తేఱి -* పిల్చుకో , ముందు నీవు తృప్తిగా కడుపు *నిమ్పుకోని -* చాలా ఎత్తుకు వెల్లాలి.
*ఊళి ముదల్వన్ -* సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలి కాంతి తరంగాలు కల్గి ఉంటాడో , *ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు -* అట్లాగే నీ ఆకారాన్ని సరిదిద్దుకో , *పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్ ఆళిపొల్ మిన్ని -* బీటలువారి ఉన్న ఈ భూమికి ఒక్క సారిగా కురవకూడదు , మొదటగా మెరవవలె , తర్వాత ఉరమవలె , తరువాత కురవవలె.
ఆ మెరవడం ఎట్లా అంటే సుదర్షణచక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి. *వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు -* ఎట్లా ఉరమాలి అంటే శ్రీపాంచజన్యంలా - శంఖం ద్వనిలా ఉరుమవలె. ఆ ద్వని ద్వారా భగవంతున్ని ద్వేషించేవాల్లు కూడా భక్తులుగా మారేట్లు గా ఉండాలి. తాళాదే శారుంగం ఉదెత *శరమళైపోల్ వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ -* ఇక కురవడం స్వామి వేసే భాణాలవలె కురవాలి , అందరు సుఖించెందుకు uవర్షించు. ఆంగళుం *మార్గళి నీరాడ మగిళుంద్* - మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి