10, మే 2025, శనివారం

ప్రహ్లాద చరిత్ర -- పోతన

 ప్రహ్లాద చరిత్ర -- పోతన

                       రెండవ భాగం 

హిరణ్య కశిపుడు మండి పడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాధ కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.


క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు.


ఆ హరి ఎక్కడుంటాడు? అని దానవేశ్వరుడు ప్రశ్నించగా


కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్

గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్

గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్

గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? - అన్నాడు బాలుడు.

ఇంకా "చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన నందందే గలడు" అని చెప్పాడు.


హరి సర్వాకృతులన్ గలండనుచు ప్రహ్లాదుండు భాషింప స

త్వరుడై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ

నరసింహాకృతినుండె నచ్యుతుడు నానా జంగమ స్థావరో

త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్ధండ ప్రభావంబుతోన్

ఇలా దైత్యరాజు, అతని సుతుడు వాదించుకొటుండగా శ్రీహరి సకల జడ,చేతన పదార్ధములలో శ్రీ నరసింహాకృతిలో నుండెను (సర్వాంతర్యామిత్వం)


అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు. "బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. "సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.


శ్రీ నరసింహావిర్భావం


బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. "


ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, .......... కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు.


ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు.


ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.

గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు మొసలి చేత పీడింపబడ్డాడు.వేదన చెందుతూ విపరీతమైన బాధ వ్యక్తం చేశాడు కానీ ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుని ఎంత హింసించినా అస్సలు బాధ వ్యక్తం చేయలేదు సరికదా విష్ణువును స్తుతిస్తున్నాడు. పైగా ధైర్యంతో ఉన్నాడు. కారణం ఏమిటి? గజేంద్రుడు మనలాటి సామాన్య వ్యక్తికి ప్రతీక. ప్రహ్లాదుడు మహా జ్ఞాని ఈ శరీరం నేను కాదు అనే స్థాయికి వెళ్లినవాడు.గజేంద్రుని వంటి మనము ప్రహ్లాదుని స్థాయికి చేరుకోవాలి. అప్పుడే మానవ జన్మకు సార్ధకము.

                       స్వస్తి 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

విత్తేన రక్ష్యతే ధర్మో

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝  *విత్తేన రక్ష్యతే ధర్మో* 

 *విద్యా యోగేన రక్ష్యతే|*

        *మృదునా రక్ష్యతే భూపః*

 *సత్క్రియా రక్ష్యతే గృహమ్‌||*


*తా𝕝𝕝 ధనముతో ధర్మము రక్షింపబడును, యమనియమాది యోగము ద్వారా విద్య రక్షింపబడును. కోమలతతో, మధురతతో రాజు రక్షింపబడును. సాధ్వియైన స్త్రీచేత గృహము రక్షింపబడును*.


 ✍️🌹💐🌸🙏

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వము ప్రథమాశ్వాసము*


*372 వ రోజు*


*ధృతరాష్ట్రుని సందేహం*


అది విన్న ధృతరాష్ట్రుడు " సంజయా ! నాకు తెలియక అడుగుతాను. అర్జునుడు కౌరవులను అందరిని చంపదల్చుకుంటే కర్ణుడు అడ్డు వచ్చినా అందరిని ఆరోజే చంపి ఉండేవాడు. దేవేంద్రుడి కొడుకైన అతడికి నాకుమారుల వంటి మానవమాతృలు ఒక లెక్కా ! అతడు సామాన్యుడా ! యాదవ వీరులను ఎదిరించి సుభద్రను వివాహమాడలేదా! ఇంద్రుడిని ఎదిరించి ఖాండవ వన దహనం చేయలేదా ! కిరాతరూపంలో ఉన్న పరమశివునితో యుద్ధము చేయలేదా! కాలకేయులను ఒంటి చేత్తో చంపలేదా! గంధర్వుల చేత చిక్కిన నా కుమారుడిని వారితో పోరి జయించ లేదా ! ఇన్ని చేసిన వాడికి ఈ యుద్ధము ఒక లెక్కా! అర్జునుడి చేతిలో ఓడిపోవడమూ కీర్తే కనుక మన వారిని అర్జునుడి చేతిలో ఓడారని నిందించ పనిలేదు " అన్నాడు. సంజయుడు తిరిగి " సుయోధనుడు ! ముఖ్యులతో ఆ రోజు విశేషములు చర్చిస్తున్నాడు. కర్ణుడు సుయోధనుడితో ఇలా అన్నాడు. " రారాజా ! మనమంతా ఒకటి గుర్తుంచుకోవాలి. అర్జునుడు అత్యంత శక్తి యుక్తులు కలవాడు. అందుకు తోడు అతడికి తగు సమయంలో సలహాలు ఇవ్వడానికి కృష్ణుడు ఉన్నాడు. నేను ఇంద్రప్రసాదిత శక్తిని అర్జునవధ కోసం అట్టిపెడితే దానిని ఘటోత్కచుడి మీద ప్రయోగించేలా చేసి మనలను వంచించి ఘటోత్కచుడిని చంపించి అర్జునుడిని రక్షించాడు. అయినా మన శక్తిని నమ్ముకుంటాము. నా అస్తశస్త్రములతో నేను రేపు కృష్ణార్జునులను రూపుమాపుతాను " అన్నాడు.


*కర్ణసారధ్యంలో రెండవరోజు యుద్ధము*


మరునాడు ఉదయం ఇరు పక్షాలు యుద్ధానికి సిద్ధం అయ్యాయి.ధర్మరాజు పూర్వం బృహస్పతి పన్నిన దుర్జయ వ్యూహము పన్నాడు. అందుకు ప్రతిగా మరొక వ్యూహము కొరకు కౌరవసేనలు కర్ణుని ఆనతి కోసము ఎదురుచూస్తున్నాయి " అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! కర్ణుడు వచ్చి మాత్రం చేసేది ఏముంది. తనను సర్వసైన్యాధ్యక్షునిగా చేసిన మొదటి రోజే సుయోధనుడికి పరాజయం మూటగట్టాడు. రెండవ రోజు మాత్రం ఏమి చేస్తాడు. అయినా నా కుమారుడు బుద్ధిహీనుడు కనుక అలాంటి వారిని నమ్మాడు. కర్ణుడి బాహుబలం, శకుని కపట నీతి గెలిపిస్తాయని నమ్మి ఈ యుద్ధానికి దిగాడు. జూదం ఆడిన రోజు నుండి మనకు దుర్ధశ మొదలైంది. అది ఇప్పటికి పెరిగి నిరంతర దుఃఖంగా మారింది. నేను, నా కుమారుడు కాని పనులు చేసాము ఫలితం అనుభవిస్తున్నాము. సంజయా ! ఇన్ని రోజుల యుద్ధములో పాండవులు ఒక్కరూ మరణించ లేదు. కాని నా కుమారులు అనేక మంది మరణించారు. భీష్మ, ద్రోణులు పడిపోయారు. పాండవులు మన వారి మధ్యలో అంతఃపుర స్త్రీలతో సరసమాడుతున్నట్లు హాయిగా తిరుగుతున్నారు. అంతా విధి విలాసము " అన్నాడు.సంజయుడు " మహారాజా ! జరిగిన దానికి వగచి ప్రయోజనము లేదు. అందుకు నీ కుమారుడైన సుయోధనుడిని మాత్రము నిందించి ప్రయోజనము లేదు. అతడు చెప్పిన దానికి అంతా నువ్వు తల ఊపి ఇంతటి అనర్ధము తీసుకు వచ్చినది నువ్వు కాదా ! నాడు విదురుని మాట విని జూదము ఆపిన ఇంత దూరము రాక పోను. పాండవులకు నీవు చేసిన అపరాధములు నిన్ను కట్టి కుడుపుతున్నాయి. తరువాతి యుద్ధ విశేషములు చెప్తాను విను.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

ఆణిముత్యాలు

 🔔 *ఆణిముత్యాలు* 🔔


   రూపాయి బిళ్లకు రెండు వైపులా ముద్రణ ఉంటేనే దాని కి విలువ ఉంటుంది.. అలానే మన జీవితంలో కష్టం సుఖం ఉంటేనే జీవితం మధురంగా ఉంటుంది .


. డబ్బుకు మనిషిని మార్చే శక్తీ ఉందంటారు.. ఆది నిజంకాదు..డబ్బును చూసి మనసు మార్చుకునే బలహీనత మనిషికి ఉంది.. ఇది నిజం


     ప్రపంచంలో అందరికి సమాన అవకాశం ఇచ్చేది కాలం (సమయం) మాత్రమే.. తెలుసుకొని సద్వినియోగం చేసుకున్నవాడు పైకి ఎదుగుతాడు.. ఉపయోగించుకోలేని వాడు.. ఎదిగిన వాడిని చూసి కుళ్ళుకుంటుంటాడు.


   సంతోషం గా ఉన్నప్పుడు మనకు నచ్చని వాళ్ళకి దూరంగా ఉండాలి.. కోపంగా ఉన్నప్పుడు మనకు నచ్చిన వాళ్లకు దూరంగా ఉండాలి..


       బలం.. బాధ. రెండు మనలోనే ఉంటాయి.. విచిత్రం ఏమిటంటే ఒకటి ముందుస్తే ఇంకోటి కనిపించకుండా మొహం చాటేస్తుంది..


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - త్రయోదశి - చిత్ర -‌‌ స్థిర వాసరే* (10.05.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సిరిధాన్యాలు

 సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ - ఔషధ గుణాలు .


 కొర్రలు యొక్క ఉపయోగాలు -


 * కొర్రలు విరిగిపోయిన అంగములను అత్యంత వేగముగా అతుకొనునట్టు చేయును .


 * శరీరానికి అమితమైన పుష్టిని ఇచ్చును.


 * కొర్రలు నాలుగు రకాలుగా ఉండును. పసుపు, ఎరుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండును. నలుపు , తెలుపు రంగులు శ్రేష్టమైనవి.


 * శరీరం నందు వేడిని కలిగించును.


 * జ్వరమును, కఫమును హరించును .


 * జీర్ణశక్తిని పెంచును.


 * రక్తమును వృద్దిచేయును.


 * నడుముకు మంచి శక్తిని ఇచ్చును.


 * అతిగా తినిన వాతమును పుట్టించును . దీనికి విరుగుళ్లు నెయ్యి, పంచదార.


 * గర్భస్రావం అయిన స్త్రీకి కొర్రగంజి ఇచ్చిన మంచి మేలు చేయును . బలము కలిగించును.


 * కొర్రబియ్యపు అన్నం గేదె పెరుగుతో తినుచున్న ఎప్పటి నుంచొ ఉండి మానని మొండి వ్రణాలు సైతం మానును .


 * కొర్రబియ్యపు అన్నం తినటం వలన రక్తపైత్య రోగం మానును .


 * కొర్రబియ్యముతో పరమాన్నం చేసుకుని తినుచున్న అజీర్ణశూలలు (నొప్పి ) మానును .


 * కొర్ర బియ్యములో 11.2 % తేమ , 12.3 % మాంసకృత్తులు , 4.7% కొవ్వులు , 3.2% సేంద్రియ లవణాలు , 8% పిప్పి పదార్థం , 60.6 % పిండిపదార్ధం ఉండును. ఇందు మాంసకృత్తులు , సేంద్రియ లవణములు, పిప్పి పదార్ధములు , కొవ్వులు ఎక్కువుగా ఉన్నందువల్ల ఆహారవిలువ ఎక్కువుగా ఉన్నది. జిగురు పదార్దాలు అత్యల్పముగా ఉండును.


 * కఫ సంబంధ వ్యాధులు , మధుమేహం కలవారు , ఆరోగ్యవంతులు ఈ ధాన్యముతో వండిన అన్నాన్ని తగినంత కూరలు మరియు మజ్జిగని కలుపుకుని తినవచ్చు.


 * కడుపులో అల్సర్ , జిగట విరేచనాలు , రక్తప్రదరం , శుక్రనష్టం, శ్వేతకుసుమ, కుష్టు , క్షయ మొదలయిన ఉష్ణసంబంధ వ్యాధులతో బాధపడేవారు కొర్రలు ఉపయోగించరాదు.


   సామలు యొక్క ఉపయోగాలు - 


 * సామలు తో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా , తియ్యగా , వగరుగా ఉండును. 


 * చలవ , వాతమును చేయును . 


 * మలమును బంధించును . 


 * శరీరము నందు కఫమును , పైత్యమును హరించును . 


 * ఈ బియ్యముతో పరమాన్నం చేసిన అద్భుతమైన రుచితో ఉండును.


 * గుండెల్లో మంటకు మంచి ఔషదం.


 * కీళ్లనొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం . 


  రాగుల యొక్క ఉపయోగాలు - 


 * వీటికి మరొక్క పేరు తవిదెలు , చోళ్ళు అని కూడా పిలుస్తారు . 


 * రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును. 


 * శరీరంలో పైత్యమును పెంచును. ఎక్కువుగా తీసుకోవడం వలన తలతిప్పుట చేయును . 


 * మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బందిపడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వలన దేహములోని కొవ్వుని బయటకి పంపును . 


 * రాగులను జావలా చేసిన అంబలి అని అంటారు. దీనిని లోపలికి తీసుకోవడం వలన మేహరోగాన్ని అణుచును. 


 * రాగులను లొపలికి తీసుకున్నచో పైత్యమును పెంచును. రాగులను జావలా చేసి తీసుకున్నచో శరీరంలో పైత్యాన్ని హరించును . రాగిజావలో మజ్జిగ కలుపుకుని సేవించినచొ ఎక్కువ ఫలితం ఉండును. 


 * కఫాన్ని పెంచును. చలవ చేయును . 


 * శరీరంలో పైత్యం వలన కలుగు నొప్పులను పొగొట్టును.


 * ఆకలిదప్పికలను అణుచును.


 * విరేచనం చేయును . రక్తంలోవేడిని తీయును. 


 * రాగుల్లో పిండిపదార్ధాలు 72.7 గ్రా , కొవ్వుపదార్ధాలు 1.3 గ్రా , మాంసకృత్తులు 7 గ్రా , క్యాల్షియం 330 మీ.గ్రా , భాస్వరం 270 మి.గ్రా , ఇనుము 5 .4 మి.గ్రా , పొటాషియం 290 మి.గ్రా , పీచుపదార్థం 3.6 మి.గ్రా . శక్తి 331 కేలరీలు .


 * రాగులలో ఇనుము అధికంగా ఉండటం వలన మలమును సాఫీగా బయటకి వెళ్లేవిధముగా చేయును . 


 * మెరకభూముల్లో పండే రాగులు మంచిరుచిని 

కలిగించును. రాగుల్లో ఎరుపు, నలుపు రంగులు కలవు.


 * రాగులు నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి మెత్తగా విసిరి ఆ పిండిని పాలల్లో కలుపుకుని తాగడం గాని లేదా జావలా కాచుకొని తాగుచున్న అతిమూత్రవ్యాధి హరించును . 


 * రాగిజావలో మజ్జిగ కలుపుకుని తాగుచున్న శరీరంలో వేడి పోవడమే కాదు మూత్రబంధన విడుచును.

 

 

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

గోధుమగడ్డి రసం ఉపయోగాలు

 గోధుమగడ్డి రసం ఉపయోగాలు - సంపూర్ణ వివరణ - 2 .


    అంతకు ముందు పోస్టులో గోధుమగడ్డి ఉపయోగాలు మీకు తెలియచేశాను . ఇప్పుడు గోధుమగడ్డిని పెంచేవిధానం , తీసుకునే విధానం తెలియచేస్తాను .


 * గోధుమగడ్డి పెంచే విధానం -


           ఇంటి యందు ఖాళీ ప్రదేశం ఉన్నవారు దానిని ఏడు భాగాలుగా విడగొట్టటం లేదా పెద్ద వెడల్పాటి కుండీలు లేదా చెక్కపెట్టెలలో గోధుమగడ్డిని పెంచాలి. ఎరువు సహజమైనది అయి ఉండాలి. రసాయనిక ఎరువులను వాడరాదు. మనం పెంచే కుండీ లేదా చెక్కపెట్టె పరిమాణం ఒక స్క్వేర్ ఫీట్ ఉండాలి. 100 గ్రాముల గోధుమగింజలను ప్రతి కుండీలో నాటాలి . సాధారణంగా 100 గ్రా నుండి 120 గ్రా గోధుమగడ్డి మనం నాటినదాని నుండి వస్తుంది.


                   గోధుమగింజలను నాటే ముందు 12 గంటలపాటు నానబెట్టాలి. వీటిని నీటినుండి తీసి , తడిగా ఉన్న దళసరిగా ఉన్న గుడ్డలో ఉంచాలి. గట్టిగా గుడ్డను మూటకట్టండి. దాని నుంచి మొలకలు వస్తాయి. మొలచిన గోధుమ గింజలను నాటితే గడ్డి యొక్క ఎత్తు వారం రోజులలో 5 నుండి 7 అంగుళాల ఎత్తు పెరుగును . ప్రతి 24 గంటలకు ఒకసారి నీరు చిలకరించండి. కుండీలలో ఎక్కువ నీరు పోయవద్దు. ఇలా పోయడం వలన వాటి పెరుగుదల అడ్డగించబడును. ఇలా 7 కుండీలలో ఒక్కోరోజు నాటండి. మొదటిరోజు నాటబడిన గోధుమ గింజలు గోధుమగడ్డిగా పెరుగును . ఏడొవరోజు నాటికి 7 ఇంచులు ఎత్తుకి పెరుగును . ఈ గోధుమగడ్డిని కత్తెరతో కోయడం లేదా చేతితో తుంచడం చేయండి . కుండీలలో నుండి తీసిన తరువాత మట్టిని తీసి శుభ్రపరిచి ఎండలో పెట్టాలి . మళ్ళీ గోధుమను నాటేప్పుడు కొంచెం సహజ ఎరువును వేయండి . ఒకేసారి ఏడుకుండీలలో నాటవద్దు. ప్రతిరోజూ ఒకదానిలో నాటుకుంటూ వెళ్ళాలి. ప్రతిరోజు వాడుకొవచ్చు.


 * రసం తీసే విధానం -


            గోధుమగడ్డిని కుండీలలో నుంచి తీసిన తరువాత బాగా కడిగి ఆ తరువాత కొంతనీరు కలిపి బాగా రుబ్బాలి. అలా రుబ్బిన గోధుమగడ్డిని ఒక పరిశుభ్రమైన గుడ్డ యందు ఉంచి పిండాలి. అలా వచ్చిన రసాన్ని తీసుకోవాలి . ఎవరైనా రసాన్ని తాగటం ఇష్టం లేకున్న గడ్డిని నమిలి రసాన్ని తీసుకుని పిప్పిని బయటకి వూయవచ్చు. సాధారణంగా 100 గ్రాముల గోధుమగడ్డి నుండి 5 నుంచి 6 ఔన్సుల స్వచ్చమైన రసం మాత్రమే వస్తుంది. నీరు కలిపి రుబ్బటం వలన కొంత మోతాదు పెరుగుతుంది .


 * గోధుమగడ్డి రసం తీసుకోవలసిన మోతాదు - 


        వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి 100 మి.ల్లీ తీసికొనవలెను. కాని ఒకేసారి తీసుకొకూడదు. మొదట 25 మి మి .లీ నుండి ప్రారంభించి 50 మి.లీ అటు తరువాత 100 మి.లీ వరకు పెంచుకుంటూ వెళ్ళాలి. పాత మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు 250 మి.లీ నుంచి 300 మి.లీ వరకు రోజు మొత్తం తీసుకోవాలి. వేడి చేయు గుణం ఉండటం వలన వేడి శరీరం ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది .


                   గోధుమగడ్డి నుండి రసం తీసినవెంటనే రసాన్ని తీసుకోవాలి . ఒకేసారి మింగకుండా కొంచంకొంచం తీసికొనవలెను . రసాన్ని ఎక్కువసేపు నిలువ ఉంచితే పోషకాలు కోల్పోవును . రసం తాగుటకు గంట ముందు గాని తాగిన గంట వరకు కూడా ఎటువంటివి తినటం గాని తాగటం కాని చేయకూడదు .


 * గోధుమగడ్డి రసాన్ని తీసుకునే ముందు గమనించవలసిన విషయం -


           గోధుమగడ్డి రసాన్ని మాత్రమే తీసుకోవాలి అనుకునే వారు ఒకటి రెండు రోజుల ముందు నుంచి ఉపవాసం చేయడం లేదా కేవలం పళ్లరసాలను మాత్రమే తీసుకొనవలెను . ఉపవాసం చేసినతరువాత తీసుకుంటే ఒంటికి తొందరగా పడుతుంది. మొదట చిన్న మోతాదులో తీసుకొవడం మొదలుపెట్టి మెల్లగా మోతాదు పెంచుకుంటూ వెళ్లవలెను . కొంతమందికి ఈ రసం తీసుకున్నాక డోకు , వాంతులు , జలుబు , విరేచనాలు , జ్వరం రావొచ్చు . ఇలాంటివి అరుదుగా వస్తాయి. భయపడనవసరం లేదు . అటువంటి సమయాలలో రసానికి మరింత మోతాదు నీరు కలిపి పలుచగా చేసి తీసుకోవాలి . పైన చెప్పిన లక్షణాలు అలానే ఉంటే రసం తీసుకోవడం ఆపేసి తగ్గాక మరలా మొదలుపెట్టండి. రుచి కొరకు ఎటువంటి వస్తువులు కలపకూడదు.


  

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034