10, మే 2025, శనివారం

గోధుమగడ్డి రసం ఉపయోగాలు

 గోధుమగడ్డి రసం ఉపయోగాలు - సంపూర్ణ వివరణ - 2 .


    అంతకు ముందు పోస్టులో గోధుమగడ్డి ఉపయోగాలు మీకు తెలియచేశాను . ఇప్పుడు గోధుమగడ్డిని పెంచేవిధానం , తీసుకునే విధానం తెలియచేస్తాను .


 * గోధుమగడ్డి పెంచే విధానం -


           ఇంటి యందు ఖాళీ ప్రదేశం ఉన్నవారు దానిని ఏడు భాగాలుగా విడగొట్టటం లేదా పెద్ద వెడల్పాటి కుండీలు లేదా చెక్కపెట్టెలలో గోధుమగడ్డిని పెంచాలి. ఎరువు సహజమైనది అయి ఉండాలి. రసాయనిక ఎరువులను వాడరాదు. మనం పెంచే కుండీ లేదా చెక్కపెట్టె పరిమాణం ఒక స్క్వేర్ ఫీట్ ఉండాలి. 100 గ్రాముల గోధుమగింజలను ప్రతి కుండీలో నాటాలి . సాధారణంగా 100 గ్రా నుండి 120 గ్రా గోధుమగడ్డి మనం నాటినదాని నుండి వస్తుంది.


                   గోధుమగింజలను నాటే ముందు 12 గంటలపాటు నానబెట్టాలి. వీటిని నీటినుండి తీసి , తడిగా ఉన్న దళసరిగా ఉన్న గుడ్డలో ఉంచాలి. గట్టిగా గుడ్డను మూటకట్టండి. దాని నుంచి మొలకలు వస్తాయి. మొలచిన గోధుమ గింజలను నాటితే గడ్డి యొక్క ఎత్తు వారం రోజులలో 5 నుండి 7 అంగుళాల ఎత్తు పెరుగును . ప్రతి 24 గంటలకు ఒకసారి నీరు చిలకరించండి. కుండీలలో ఎక్కువ నీరు పోయవద్దు. ఇలా పోయడం వలన వాటి పెరుగుదల అడ్డగించబడును. ఇలా 7 కుండీలలో ఒక్కోరోజు నాటండి. మొదటిరోజు నాటబడిన గోధుమ గింజలు గోధుమగడ్డిగా పెరుగును . ఏడొవరోజు నాటికి 7 ఇంచులు ఎత్తుకి పెరుగును . ఈ గోధుమగడ్డిని కత్తెరతో కోయడం లేదా చేతితో తుంచడం చేయండి . కుండీలలో నుండి తీసిన తరువాత మట్టిని తీసి శుభ్రపరిచి ఎండలో పెట్టాలి . మళ్ళీ గోధుమను నాటేప్పుడు కొంచెం సహజ ఎరువును వేయండి . ఒకేసారి ఏడుకుండీలలో నాటవద్దు. ప్రతిరోజూ ఒకదానిలో నాటుకుంటూ వెళ్ళాలి. ప్రతిరోజు వాడుకొవచ్చు.


 * రసం తీసే విధానం -


            గోధుమగడ్డిని కుండీలలో నుంచి తీసిన తరువాత బాగా కడిగి ఆ తరువాత కొంతనీరు కలిపి బాగా రుబ్బాలి. అలా రుబ్బిన గోధుమగడ్డిని ఒక పరిశుభ్రమైన గుడ్డ యందు ఉంచి పిండాలి. అలా వచ్చిన రసాన్ని తీసుకోవాలి . ఎవరైనా రసాన్ని తాగటం ఇష్టం లేకున్న గడ్డిని నమిలి రసాన్ని తీసుకుని పిప్పిని బయటకి వూయవచ్చు. సాధారణంగా 100 గ్రాముల గోధుమగడ్డి నుండి 5 నుంచి 6 ఔన్సుల స్వచ్చమైన రసం మాత్రమే వస్తుంది. నీరు కలిపి రుబ్బటం వలన కొంత మోతాదు పెరుగుతుంది .


 * గోధుమగడ్డి రసం తీసుకోవలసిన మోతాదు - 


        వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి 100 మి.ల్లీ తీసికొనవలెను. కాని ఒకేసారి తీసుకొకూడదు. మొదట 25 మి మి .లీ నుండి ప్రారంభించి 50 మి.లీ అటు తరువాత 100 మి.లీ వరకు పెంచుకుంటూ వెళ్ళాలి. పాత మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు 250 మి.లీ నుంచి 300 మి.లీ వరకు రోజు మొత్తం తీసుకోవాలి. వేడి చేయు గుణం ఉండటం వలన వేడి శరీరం ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది .


                   గోధుమగడ్డి నుండి రసం తీసినవెంటనే రసాన్ని తీసుకోవాలి . ఒకేసారి మింగకుండా కొంచంకొంచం తీసికొనవలెను . రసాన్ని ఎక్కువసేపు నిలువ ఉంచితే పోషకాలు కోల్పోవును . రసం తాగుటకు గంట ముందు గాని తాగిన గంట వరకు కూడా ఎటువంటివి తినటం గాని తాగటం కాని చేయకూడదు .


 * గోధుమగడ్డి రసాన్ని తీసుకునే ముందు గమనించవలసిన విషయం -


           గోధుమగడ్డి రసాన్ని మాత్రమే తీసుకోవాలి అనుకునే వారు ఒకటి రెండు రోజుల ముందు నుంచి ఉపవాసం చేయడం లేదా కేవలం పళ్లరసాలను మాత్రమే తీసుకొనవలెను . ఉపవాసం చేసినతరువాత తీసుకుంటే ఒంటికి తొందరగా పడుతుంది. మొదట చిన్న మోతాదులో తీసుకొవడం మొదలుపెట్టి మెల్లగా మోతాదు పెంచుకుంటూ వెళ్లవలెను . కొంతమందికి ఈ రసం తీసుకున్నాక డోకు , వాంతులు , జలుబు , విరేచనాలు , జ్వరం రావొచ్చు . ఇలాంటివి అరుదుగా వస్తాయి. భయపడనవసరం లేదు . అటువంటి సమయాలలో రసానికి మరింత మోతాదు నీరు కలిపి పలుచగా చేసి తీసుకోవాలి . పైన చెప్పిన లక్షణాలు అలానే ఉంటే రసం తీసుకోవడం ఆపేసి తగ్గాక మరలా మొదలుపెట్టండి. రుచి కొరకు ఎటువంటి వస్తువులు కలపకూడదు.


  

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: