9, మార్చి 2025, ఆదివారం

భగవంతుడు పూర్ణుడు

 ఓం పూర్ణమిదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయా పూర్ణమేవావశిష్యతే… ఓం శాంతి శాంతి శాంతిహి…ఈ శ్లోక అర్థము చెప్పగలరా?

ఓం పూర్ణమిదః పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే


పూర్ణస్య పూర్ణ మాదాయా పూర్ణమేవావశిష్యతే...


ఓం శాంతి శాంతి శాంతి హి


భగవంతుడు పూర్ణుడు...పూర్ణానికి పూర్ణం కలిపినా....పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా....మిగిలేది పూర్ణమే.


ఇదే శృతి వాక్యం. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే ....జీవితమంతా ఇందులోనే దాగుంది. మోక్ష మార్గం ఇందులోనే దాగుంది....సమస్త సాధనాల సారం ఇందులోనే ఉంది.


0 + 0 = 0....


0౼0 = 0


కానీ...


0+1 = ఎంత అంటే.....


మనం వెంటనే 1 అని సమాధానం ఇస్తాం.....ఇక్కడ సున్నా ...ఒకటితో కలవగానే అది 1 గా మారిపోయింది.


0+2 =2...సున్నా 2 తో కలవగానే సున్న మాయమై....అది రెండుగా మారిపోయింది. అంటే....సున్న దేనితో కలిస్తే అది గా మారిపోతూంది.


గాఢ నిద్రలో మనం పూర్ణమైన భగవంతుడిగా ఉంటాం.మనకప్పుడు ఏ ఎమోషన్స్ ఉండవు. ఎప్పుడైతే సున్నలాంటి మనం నిద్రలేవగానే ప్రకృతితో కలుస్తామో ...మనం ప్రకృతే ఐపోతున్నాం.


మనం దేనితో కలుస్తామో ....దానిగా మారిపోతున్నాం...


బాగా గమనించు....నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు....అతడు గతంలో నీకు ఎంతగానో సహాయం చేసాడు....ఆ వ్యక్తి ని చూడగానే ...నీలో అతనిపట్ల ఆత్మీయత కలుగుతుంది. నువ్వూ అతనికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఆలోచిస్తావ్.


ఒక వ్యక్తి నిన్ను ఎంతగానో బాధించాడు....అతను కనబడగానే నువ్వు కూడా అతన్ని ఎలాగైనా బాధించాలని ఆలోచిస్తావ్....


ఎదుటి వ్యక్తి ప్రేమతో వస్తే....నీకూ అతనిపట్ల ప్రేమ కలుగుతోంది...


ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవిస్తే ...నీకూ అతనిపట్ల గౌరవం కలుగుతుంది...


అంటే....మనం ఎదుటి వ్యక్తిలో ని ఏ గుణాన్నాయితే గమనిస్తున్నామో...మనం మనకు తెలీకుండానే ఆ గుణంతో కలిసిపోయి...ఆ గుణంగానే మారిపోతున్నాం...


" మనం దేనితో కలుస్తున్నామో...అది గా మారిపోతున్నాం. "


మనలో సున్న( 0) లా ఉన్న పరమాత్మ తత్వం....ఎదుటి వ్యక్తీలోని కోపం తో కలవాగానే ....అది కోపంగా మారిపోయి...మనకు కోపం వస్తుంది.


నువ్వు ప్రేమతో...కలిస్తే ప్రేమగా.....ద్వేషం తో కలిస్తే ద్వేషం గా మారిపోతావ్.


ఎదుటివారిలోని అహంకారాన్ని చూస్తే....నీలో కూడా అహంకారం మొలుస్తుంది.


అందుకే....ప్రతి జీవిలోనూ...మనిషిలోనూ...పరమాత్మ ఉన్నాడని గ్రహించి....ఆయనతో అనుసంధానం అవ్వు.


అంటే నీలోని పూర్ణాన్ని....ఎదుటి వ్యక్తీలోని పూర్ణం తో కలుపు....వచ్చేది పూర్ణమే.


ఎదుటి మనిషిని చూడగానే అతనిలోని దోషాలను గుర్తిస్తే...మనం అతనిలో దేన్ని ముందుగా చూస్తామో....మనం అది గా మారిపోతామన్న


మహా సత్యాన్ని గమనించాలి.


అందుకే ఎలాంటి వారిలోనైనా ...భగవంతుణ్ణి చూడగల్గి.... ఆయనతో కలిస్తే...మనం కూడా భగవత్ తత్వంగా మారిపోవాలి.


సదా ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాణు స్వరూపంతో ఉన్న భగవంతునీతో...అనుసంధానమవుతూ....ఆయనలా మారిపోదాం!....

కామెంట్‌లు లేవు: