శ్రీమాత్రేనమః
ఈ విషయంలో పూర్వసంప్రదాయాన్ని అనుసరించి చెప్పాలంటే...
స్త్రీలు శివలింగమునకు పూజచేయరాదు. శివుని భార్య అయిన శ్రీ గౌరీదేవికి, ఇంకా ఆమె రూపాలైన అన్నివిధములైన అమ్మవారి రూపాలనూ పూజించాలి.
వివాహంలో కూడా వధువుచేత గౌరీపూజ చేయిస్తారు. ఈ విషయానికి ఇదే ప్రమాణం.
స్త్రీలు తాకకూడనివి/ధరించకూడనివి....
రుద్రాక్షలు
పగడాలు (ముత్యాలు కలపకుండా)
సాలగ్రామాలు
తులసి చెట్టు యొక్క అగ్రాలు
శివాభిషేకం
ఇవన్నీ స్త్రీలకు నిషేధించబడినాయి. వీటి స్పర్శ వలన వైధవ్యం కలుగుతుందని చెబుతారు.
అంతే కాకుండా... స్త్రీపురుషులకు వస్త్రాలను పెట్టే సందర్భాలలో... స్త్రీలు స్త్రీలకు, పురుషులు పురుషులకు బొట్టు పెట్టి వస్త్రాలను పెట్టాలి. ఏవో కారణాల వలన పురుషులే దంపతులిద్దరికీ వస్త్రాలను సంకోచంలేకుండా పెడుతున్నారు. ఇది తప్పు.
కొన్ని చోట్ల నేను గమనించాను. ఆ విధంగా పురుషులు స్త్రీలకు వస్త్రాలను సమర్పించిన తరువాత ఆ ఇంట్లో అనర్థాలు జరిగాయి. నేను గమనించాను.
కాని, నేడు ప్రవచనాలను చెప్పేవారిలో కొందరు... ఈ నిషేధం లేదని, వీటిని ధరించవచ్చని చెబుతున్నారు. ఇది సరైనది కాదని నా అభిప్రాయము.
*~శ్రీశర్మద*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి