21, నవంబర్ 2020, శనివారం

రామాయణమ్ 129

 రామాయణమ్ 129

..............

గోదావరిలో స్నానము చేసి సకల దేవతార్చనము పూర్తి చేసి తిరిగి పర్ణశాల చేరుకొని సుఖంగా ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ  ఉన్నారు  .

.

అప్పుడు.

ఒక ముసలి రాక్షస స్త్రీ ,అక్కడకు వచ్చి  దగ్గరగా రాముడిని చూసింది .

.

నయనమనోహరంగా కనబడ్డాడు రాముడు దానికి ,విశాలమైన వక్షస్థలం,బలిష్ఠమైన బాహువులు,విచ్చిన తామరపూవుల వంటి కన్నులు ,నల్లకలువ వంటి శరీర ఛాయ ,మన్మధునివంటి సౌందర్యముతో మహేన్ద్రుడిలాగా ఠీవిగా ఉన్నాడు రాముడు.

.

రాముడిని చూడగానే దాని మనస్సును మన్మధబాణాలు సూటిగా వేగంగా వచ్చి తాకాయి.

.

రాముడి ముఖము చాలా అందముగా ఉన్నది,

దాని ముఖము వికృతము!

.

రాముడి నడుము సింహపు నడుములాగా సన్నగా ఉన్నది దానిది బాన పొట్ట .

.

ఆయన నేత్రాలు విశాలము ,

దాని నేత్రాలు వికారము!

.

ఆయనది నల్లని జుట్టు

,దానిది రాగి జుట్టు

.

చూసేవారి కన్నులకు ఆనందము కలిగించే రూపము ఆయనది,

దానిది భయంకరమైన రూపము.

.

ఆయన కంఠ ధ్వని మధురము ,

దాని పలుకులు కర్ణ కఠోరమైనవి.

.

ఆయన నవయవ్వనుడు

 ఆవిడ వృద్ధురాలు

.

ఆవిడ  పేరు శూర్పణఖ ఆవిడ  రావణుడి చెల్లెలు!  . 

.

రాముడిని సమీపించి రాముడితో ఎవరు నీవు? భార్యా సమేతుడవై,ధనుర్బాణాలు ధరించి ముని వేషముతో ,రాక్షస నివాస ప్రాంతమునకు ఎందుకు వచ్చావు,నీకు ఏమి పని ఇక్కడ అని పలికింది.

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: