12, డిసెంబర్ 2020, శనివారం

నూతన వ్యవసాయ🌾 చట్టాలు

 నూతన వ్యవసాయ🌾 చట్టాలు తెలుగులో చాలా సులభంగా అర్ధమయ్యే రీతిలో చట్టాలు 🌾🇮🇳


మీతో బంద్ ను

సమర్ధించమని కోరేవారిని

నూతన వ్యవసాయ చట్టం

చదివారా?ఎందుకు బంద్ సమర్ధించాలో వివరించగలరా 

అని అడగండి... 


ఈ వ్యాసం 

పూర్తిగా చదివండి...

ఆ తర్వాత మీరు

బంద్ సమర్ధకులో  కాదో

విజ్ఞతతో నిర్ణయించుకోండి.


వ్యవసాయ చట్టాలపై 

గుడ్డి వ్యతిరేకత ...

అసలు చట్టంలో ఏముంది?


ముందుగా 

బిల్లుకి 

చట్టానికి 

తేడా తెలుసుకోవాలి.

పార్లమెంటులో 

ఆమోదం పొందేవరకు,

రాష్ట్రపతి సంతకం 

అయ్యి గెజిట్ నోటిఫికేషన్

వచ్చేవరకు అది బిల్.

నోటిఫికేషన్ వచ్చాక చట్టం. 


"ఈ చట్టం పేరు"


🌹The Farmers

(Empowerment 

And Protection)

Agreement on Price

Assurance And 

Farm Services Act

2020. 

Act 20 of 2020🌹


ఈ బిల్లుని 

లోక్ సభలో 

సెప్టెంబరు 14న,

రాజ్యసభలో 

సెప్టెంబరు 20న

ప్రవేశపెట్టడం జరిగింది.

చర్చలు లోక్ సభలో

17వ తేదీన, 

రాజ్యసభలో 

20వ తేదీన జరిగాయి.


అవి ఆమోదించబడి

రాష్ట్రపతి ఆమోదంపొంది

24వ తేదీన 

గెజెట్ నోటిఫికేషన్

విడుదల అవడంద్వారా

చట్టరూపం పొందింది.


అదే విధంగా 

"The Farmers Produce

Trade and Commerce

(Promotion and

Facilitation) Act 2020

కూడా Act 21 of 2020"


ఈ చట్టాలు 

ఏం చెబుతున్నాయి?


మొదటగా 

20 of 2020

తీసుకుందాం.


ఇది 

retrospective effect తో

అంటే 05-06-2020 నుండి

అమలులోకి వస్తుంది. 

ఆ రోజున ఆర్డినెన్స్

విడుదల చేసింది కేంద్రం.


ముందుగా 

Farm Services

అంటే ఏమేమి వస్తాయి?


విత్తనాల సరఫరా,

 ఫీడ్, 

దాణా, 

ఆగ్రో కెమికల్స్, 

ఆగ్రో మెషినరీ & టెక్నాలజీ,

సలహాలు, 

నాన్ కెమికల్ 

ఆగ్రో ఇన్ పుట్స్ 

మరియు 

ఇతరములైన 

వ్యవసాయ సంబంధిత

ఇన్ పుట్స్... 


రైతు అంటే ఎవరు?


స్వయంగా కానీ, 

కూలీలతో 

చేయించేవారు కానీ, 

కౌలు ద్వారా 

చేయించే వారు, 

Farmer Producer

Organizations.


అంటే వ్యవసాయంమీద

ఆధారపడ్డ అందరూ 

ఈచట్టం పరిధిలోకివస్తారు.


స్పాన్సర్ అంటే ఎవరు?


ఒక వ్యక్తి 

లేదా 

కంపెనీ 

లేదా 

భాగస్వామ్యం 

లేదా

Farm Production

Organization 

లేదా 

లిమిటెడ్ లయబిలిటీ

భాగస్వామ్యం 

లేదా 

కోఆపరేటివ్ సొసైటీ 

లేదా సొసైటీ 

లేదా కేంద్ర, రాష్ట్ర

ప్రభుత్వాల అనుమతితో

ప్రత్యేకంగా ఇందుకోసం

ఏర్పడిన అసొసియేషన్


"Farming Agreement"


అంటే వ్రాతపూర్వకంగా

రైతుకి, స్పాన్సర్ మధ్య

లేదా రైతుకి, స్పాన్సర్ కి,

మూడవ పార్టీకి మధ్య

జరిగే ఒప్పందం.

ఈ అగ్రిమెంటు 

నాట్లువెయ్యడానికిముందు 

లేదా 

rearing of farming

produce 

(In case of Live Stock)

కు ముందు చేసుకోవాలి.

ఈ ఒప్పందంలో 

నిర్ణీతమైన నాణ్యతను

ముందుగానే రాసుకోవాలి.

ఆ ప్రకారం ఒప్పందం

మేరకు స్పాన్సర్ 

రైతు దగ్గర కొని తీరాలి. 

ఈ ధర ప్రభుత్వం ప్రకటించే

మద్దతు ధరకు 

తగ్గకుండా ఉండాలి. 

అలాగే ఫామ్ సర్వీసెస్

కూడా అందించే 

క్లాజులనుకూడా

చేర్చుకోవచ్చు. 

S.2(g)


ఈ 

Farming

Agreement 

మూడు రకాలుగా

విభజించారు


 :Proviso i:


Trade and 

commerce

agreement


ఇందులో ప్రొడక్షన్ 

అంతా రైతు చేతిలోనే

ఉంటుంది. 

ముందుగా కుదుర్చుకున్న

రేటుకి స్పాన్సర్ కు

అమ్మవలసి ఉంటుంది.


 :Proviso ii:


 Production Agreement


ఇందులో స్పాన్సర్ 

అన్ని రకాల లేదా 

కొన్ని రకాల సేవలు 

రైతుకి అందిస్తాడు. 

దీనికి రైతు కొంత రుసుము

చెల్లించవలసి ఉంటుంది.


:Proviso iii: 


పై రెండు రకాలు కాకుండా

ఏ ఇతరమైన అగ్రిమెంట్లు

లేదా పై రెండు కలిపి కానీ

రైతు, స్పాన్సర్ ల మధ్య

కుదర్చుకోవచ్చు.

ఉదాహరణకు... 

సాయిల్ టెస్టింగ్, 

విత్తన సరఫరా, 

ఎరువులు, 

పురుగు మందులు, 

సస్య రక్షణ, 

సస్యరక్షణకు 

తగిన సలహాలు ఇవ్వడం

వంటివి ఉంటాయి.


:Farming Produce:


నూనెలు, 

నూనె గింజల ఉత్పత్తి, 

వరి, గోధుమ, 

పప్పు దినుసులు, 

కూరలు, 

పండ్లు, 

గింజలు 

(వేరుశనగ వంటివి),

మసాలా దినుసులు,

చెఱకు, పౌల్ట్రీ ఉత్పత్తులు,

పందుల పెంపకం, 

మేకలు, గొఱ్ఱెలు! 

చేపల పెంపకం, 

డెయిరీ ...

నేచురల్ లేక 

ప్రాసెస్డ్ రూపంలో కాని.

ఇంకా పశు దాణా, 

కాటన్, 

ginned or unginned,

కాటన్ సీడ్స్, 

జౌళి ఉత్పత్తులు.


ఈ అగ్రిమెంటు 

కనీస కాల వ్యవధి 

ఒక పంట కాలం, 

గరిష్ట వ్యవధి 

ఐదు సంవత్సరాలు. 

పంట కాలం ఐదేళ్ళకన్నా

ఎక్కువ ఉంటే 

రైతు, స్పాన్సర్ 

పరస్పర అంగీకారంతో

అగ్రిమెంటు వ్యవధిని

పెంచుకోవచ్చు.


అందరికీ 

ఉపయోగపడే విధంగా

కేంద్రం ఒక నమూనా

అగ్రిమెంటుని 

తయారు చేసి 

విడుదల చేస్తుంది.


అగ్రిమెంట్ ధర 

మార్కెట్ ధరకన్నా 

తక్కువ ఉంటే 

ఏం చెయ్యాలన్న 

విషయం కూడా 

అగ్రిమెంట్ లోనే

పొందుపరుస్తారు.


స్పాన్సర్ పంటను 

రైతు వద్దనే

తీసుకునేట్లయితే

అగ్రిమెంటులో  

ముందుగానిర్ణయించుకున్న

సమయంలోగా 

రైతువద్దకే వచ్చి

తీసుకోవాలి 

S.6(1)(a)


ఒక వేళ రైతే పంటను

స్పాన్సర్ వద్దకు చేర్చేట్లుగా

ఒప్పందం అయితే 

స్పాన్సర్ ఆ పంటను 

రైతు తీసుకురాగానే

accept చెయ్యాలి. 

ఆ తరువాత 

పంట తాలూకు బాధ్యత

అంతా స్పాన్సర్ దే.

S.6(1)(b).


పంట సొమ్ము రైతుకి

ఎప్పుడు చెల్లించాలి?


S.6(3)(a)

Seed Production

agreement అయితే 

66% డెలివరీ

సమయంలోనూ, 

మిగతా సొమ్ము 

Seed Certification

అయిన తరువాత

చెల్లించాలి. 

అయితే ఈ వ్యవధి 

30 రోజులకు మించరాదు. 


S.6(3)(b) 

మిగతా పంటలు 

లేదా లైవ్ స్టాక్ విషయంలో

డెలివరీ సమయంలోనే

మొత్తం చెల్లించాలి.


ఈ చెల్లించిన 

మొత్తాలకు 

రసీదులు ఇవ్వాలి.


సొమ్ము 

ఏ విధంగా చెల్లించాలి 

అన్న విషయం 

రాష్ట్ర ప్రభుత్వం

నిర్ణయిస్తుంది.


అగ్రిమెంటు 

అమలు విషయంలో

తగాయిదాలు వస్తే

పరిష్కరించడానికి

'కన్సీలియేషన్ బోర్డు'

ఉంటుంది. 

ఇందులో 

రైతులకు, స్పాన్సర్లకు

సమన్యాయం జరిగేలా

ప్రాతినిధ్యం ఉంటుంది. 

ఈ బోర్డు తన నిర్ణయాన్ని

30రోజులలోతీర్మానించాలి.

ఈ బోర్డు నిర్ణయం 

నచ్చని పక్షంలో 

ఏ పార్టీ అయినా 

అపీల్ చేసుకోడానికి 

Sub Divisional

Magistrate (RDO) కు

వెళ్తుంది. 

సదరు RDO 

అప్పిలేట్ బోర్డును

నియమిస్తారు. 

ఇక్కడ కూడా 30 రోజుల

వ్యవధిలోనే తీర్మానం

చెయ్యవలసి ఉంటుంది.


ఈ తీర్మానం 

ఇరు పార్టీలను 

బైండ్ చేస్తుంది.


అగ్రిమెంట్ లో

Conciliation board

ప్రస్థావన లేకపోతే 

RDO బోర్డును 

ఏర్పాటు చేస్తారు. 

ఆ బోర్డు నిర్ణయం ఫైనల్.

ఈ విషయంలో 

కోర్టుల జోక్యం ఉండదు.

కానీ బోర్డుకు సివిల్ కోర్టు

అధికారాలు ఉంటాయి.


బోర్డు తీర్మానం ప్రకారం

స్పాన్సర్  చెల్లించకపోతే

అగ్రిమెంట్ అమౌంటుకు

ఒకటిన్నర రెట్లు 

వసూలు చేసి రైతుకి ఇచ్చే

అధికారం బోర్డుకి ఉన్నది.


ఒకవేళ రైతు 

చెల్లించవలసి వస్తే మాత్రం actual cost 

మాత్రమే చెల్లించాలి.


ఇక్కడ 

మనకు వచ్చే సందేహం ...

force majere అంటే 

మన చేతుల్లో లేని

పరిస్థితుల వల్ల 

నష్టం ఏర్పడితే 

ఏమిటి పరిస్థిత.?


రైతుకు జరిమానా

విధించేందుకు 

ఎవరికీ ఎటువంటి

అధికారం లేదు.


ఒకవేళ రైతు నష్ట పరిహారం

చెల్లించవలసి వస్తే 

అతడి భూములను

స్వాధీనం చేసుకునే

అధికారం ఎవరికీ లేదు.


ఈ చట్టంలోని 

S.3(4) ప్రకారం 

పంట నాణ్యతను, 

లైవ్ స్టాక్ నాణ్యతను

పరిశీలించి 

ధృవీకరణ చెయ్యడానికి

ఇరువురి ఒప్పందం మేరకు

వ్యవసాయంలో 

నిష్ణాతులు అయిన వారిని

నియమించుకోవచ్చు.

(Qualified Assayers)

S.4(4).


కానీ 

కొన్ని నిత్యావసరాలను

Essential

Commodities Act

నుండి తొలగించారు.


ఎందుకు?


పంట బాగా పండిన చోట

ధర తక్కువ ఉంటుంది.

డిమాండ్ ఉన్నచోట 

పంట దొరకదు. 

అక్కడ రేటు విపరీతంగా

ఉంటుంది. 

ఉదాహరణకు...

ఉల్లిపాయలు,

టొమాటోలు, 

బంగాళ దుంపలు. 

వీటి ధరవరలు 

మనం సంవత్సరంలో

ఒకసారైనా చూస్తూనేఉంటాం.

టొమాటో రైతులు పంట

గిట్టుబాటు కాక రోడ్ల మీద

పారబోసిన సందర్భాలు

మనకు ప్రతి సంవత్సరం

కనపడుతూనే ఉంటాయి.

బుట్ట టొమాటోలు వంద

రూపాయలు కూడా 

పలకని స్థితి. 

కానీ వినియోగదారులమైన

మనకు మాత్రం 

కిలో నలభై, యాభైకు

అమ్ముతారు. 

ఆక్కడ బాగుపడుతోంది

ఎవరు? దళారీలు కదా.


మరి స్పాన్సర్లు 

hoarding చెయ్యరా? 

అనే అనుమానం రావచ్చు.


పెట్టుబడి పెట్టి 

లాభం కోసం చూసేవాడు

డిమాండ్ ఉన్నచోట

అమ్ముకుంటాడు. 

మరి రైతే 

డిమాండ్ ఉన్నచోట 

అమ్ముకోవచ్చు కదా?


మన దేశంలో 

చిన్న, మధ్య తరగతి

రైతులకు అంతశక్తిఉండదు. 

Storage capacity

ఉండదు. 

అలాగే holding capacity

ఉండదు. 

అందువల్లనే అయినకాడికి

అమ్ముకుంటున్నారు.


దేశంలోని 

అన్ని మార్కెట్లను

అనుసంధానం చేసి 

సింగిల్ ప్లాట్ ఫామ్ ఏర్పరిచే బాధ్యత 

కేంద్రం తీసుకుంది. 

ఎక్కడ తమ పంటకు

ఎక్కువ డిమాండ్ ఉందో

తెలుస్తుంది.


అలా తెలియడం వల్ల రైతుకి లాభం ఏమిటి?

అగ్రిమెంట్ ప్రకారం రైతుకి

చెల్లించవలసిన సొమ్ము

చెల్లించిన తరువాత 

ఆ పంటతో రైతుకు

సంబంధం లేదు.


కానీ ఎగ్రిమెంట్ లోనే 

ఈ విషయంపై 

ఒక క్లాజు ఉంటుంది. 

(పైన పేర్కొన్నాను).


రేటులో 

మరీ ఎక్కువ వ్యత్యాసం

ఉంటే రైతుకు బోనస్ 

లేదా ప్రీమియమ్

చెల్లించాల్సి ఉంటుంది.

S.5(b)


ఇప్పుడు ఆలోచించండి

వ్యవసాయ చట్టం 

20 of 2020 

రైతుకు మేలు చేస్తుందా? 

చెఱుపు చేస్తుందా?


 డా. బి, ఆర్. అంబేద్కర్ జీ

చెప్పిన విషయం 

గుర్తు చేసుకోండి... 


"Knowledge, 

Unite and Struggle"


ఇప్పుడు జరుగుతున్న

వ్యవసాయ చట్టాల వ్యతిరేక ర్యాలీలలో

పాల్గొనే వారిలో 

ఈ విషయంపై నాలెడ్జ్

ఎంతమందికి ఉంది?

కనీసం ఆత్మ పరిశీలన

చేసుకుంటే బాగుంటుంది. 


పంట చేతికి వచ్చే దశలో

రేటు బాగుంటుంది. 

కానీ మార్కెట్ యార్డుకి

వచ్చే రోజుకి పడిపోతుంది.


రైతులు తమ ఉత్పత్తులను

బళ్ళ మీద వేసుకుని

మార్కెట్ యార్డుల్లో 

రోజుల తరబడి ఎండల్లో,

వానల్లో, రాత్రనక, 

పగలనక తమ సరుకు

ఎప్పుడు కొంటారో, 

ఎంతకు కొంటారో 

తెలియక అయిన కాడికి

అమ్ముకునే పరిస్థితినుండి

రైతుని రక్షించేందుకు 

ఈ చట్టం చేయబడింది. 


వరంగల్ మార్కెట్ యార్డులో 

ఇలాంటి పరిస్థితి 

నా కళ్ళారా చూసాను.

అలా ఆ మిరపకాయల

 టబస్తాల మీద 

తుండు వేసుకుని పడుకునే

రైతులు అనేకమంది. 

పైగా అలాంటి వారికి 

ఉచిత భోజన సౌకర్యం

ఏర్పాటు చేసామనిగొప్పలు. 

రైతుకి మనంపెట్టేవాళ్ళమా? 


ఈ చట్టం వచ్చిన తరువాత

రైతులకు 

ఆ సమస్య ఉండదు. 


ఇకపోతే కార్పొరేట్ సంస్థలు రైతుని దోచేస్తాయని 

గోల చేసేవారికి 

ఒక విషయం గుర్తు చేయదలచుకున్నాను, 


మనం రోజూ వాడే

వస్తువులలో నూటికి 

తొంభై శాతం 

ఆ కార్పొరేట్ సంస్థలు

తయారు చేసినవే. 


ప్రభుత్వాలు ఏ చట్టం చేసిన అంబానీ కోసం అంటారు. 


అంబానీ ఇచ్చిన 

ఉచిత జియో ఫోను 

ఆఫర్ వాడుకోవడంలేదా?

ఉచితంగా వస్తే

వాడుకోడానికి లేని

అభ్యంతరం

వ్యాపారస్థుడైన అంబానీ

ప్రతి అవకాశాన్ని

దొరకబుచ్చుకుని 

పైకి ఎదుగుతుంటే 

బాధ పడటం ఎందుకు?

అదే హిపోక్రసీ. 

వాడి తమ్ముడు 

చతికిల పడ్డాడు. 

మరి కేంద్రం ఇద్దరికీ

సయోధ్య కుదర్చలేదే?


KG Basin విషయంలో

ముఖేష్ అంబానీపై 72,000 వేల కోట్లు 

పెనాల్టీ విధించింది

Directorate of 

Hydro Carbons. 

దాన్ని రద్దు చేయించలేదే?


ఏదైనా సమస్య మీద

స్పందించాలంటే 

విజ్ఞులైనవారు దాన్ని

అధ్యయనం చెయ్యాలి.

అర్ధం చేసుకోవాలి. 

లేకుంటే మౌనంగాఉండాలి.


ఈ చట్టం వల్ల 

వేల కోట్లు నష్టపోతోంది

కమీషన్ ఏజెంట్లు...

పంజాబ్, హర్యానా,

మహారాష్ట్ర వంటి

వ్యవసాయ 

ప్రధాన రాష్ట్రాలలోనే 

ఆది ఎక్కువగా ఉంది.

అకాలీ దళ్ కు చెందిన 

కేంద్ర మంత్రి సిమ్రాన్ జిత్

మాన్ కౌర్ 

ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ

రాజీనామా చేసారు.

ఎందుకంటే వారి 

స్వయానా బావ గారి

ఆదాయం సంవత్సరానికి

2500 కోట్లు. 

కేవలం కమీషన్ల మీదే.


అలాగే కనిమొళి.

వ్యవసాయ భూములు

లేకపోయినా 

వ్యవసాయ ఆదాయం

కింద ఎంత చూపించిందో

తెలిస్తే ముక్కున

వేలేసుకోవడమే కాదు, 

మన ముక్కు కూడా

ఊడిపోతుంది. 

అక్షరాలా పది వేల కోట్లు.


మరింత 

సమాచారం కావాలంటే

loksabha.nic.in

website లోకి వెళ్ళి

Legislations అనే 

పాపప్ లో 

Agriculture ను 

select చేసుకుంటే 

ఈ రెండు చట్టాలు

ఉంటాయి. 

ఓపిక ఉన్న వారు చదువుకోవచ్చు... 


 🙏🇮🇳🙏

Jai Jawan 

Jai Kisan 

Jai Vignan

👏🇮🇳👏

కామెంట్‌లు లేవు: