18, ఆగస్టు 2020, మంగళవారం

**దశిక రాము**

**హిందూ ధర్మం** - 19

క్షమించమన్నారు కదా అనీ, అన్ని వేళలా ఇది వర్తించదు. దేశం విషయంలోనూ, ధర్మం విషయంలోనూ మితిమీరిన క్షమా గుణం పనికిరాదు. మాతృదేశంపై ఆక్రమణకు, యుద్ధానికి శత్రుదేశం పాల్పడినప్పుడు, స్వదేశరక్షణ కోసం ఎదుటివాడితో పోరాటం చేయాలి. అక్కడ క్షమించకూడదు, గట్టి సమాధానం చెప్పాలి, తగిన గుణపాఠం నేర్పాలి. అదే ధర్మం.అట్లాగే ధర్మానికి హానీ ఏర్పడినప్పుడు, ధర్మం మీద దాడి జరుగుతునప్పుడూ మౌనం వహించకూడదు, క్షమించకూడదు.

అదే మహాభారతంలో కనిపిస్తుంది. అంతా తన బంధువులేననీ, తనవారిపై పోరాటం చేయడం కంటే రాజ్యాన్ని విడిచిపెట్టడం మేలు అనుకున్న అర్జునుడికి శ్రీ కృష్ణపరమాత్మ గీత భోధించాడు. ధర్మానికి హానీ ఏర్పడప్పుడు, పిరికివాడిలా పారిపోవడం కాదు, నిజమైన క్షత్రియుడులా యుద్ధం చేసి, ధర్మాన్ని పునఃప్రతిష్టించమని చెప్పాడు, గీతను భోధించి అర్జునుడిని మానసికంగా బలవంతుడిని చేసి, యుద్ధం చేయించి, ధర్మరాజుకు రాజ్యం అప్పగించాడు. ధర్మానికి హాని ఏర్పడుతందంటే, బంధుత్వాలు, క్షమాగుణాలు అన్నీ విడిచిపెట్టాలని, ధర్మాన్ని, దేశాన్ని కాపాడడమే ప్రధమ కర్తవ్యం అని తెలియజేశాడు.

వందలమందిని దారుణంగా హతమార్చిన ముష్కరుడిని గట్టిగా దండించడమే రాజు యొక్క ధర్మం. అంతేకానీ, వాడిని క్రూరంగా దండిస్తే, మనకూ వాడికి తేడా ఏముంటుందండీ? వాడిని క్షమించి, విడిచిపెట్టాలి అంటారు కొందరు. అక్కడ క్షమాగుణం చూపవలసిన అవసరమే లేదంటుంది ధర్మం.

తరువాయి భాగం రేపు.......
*************

కామెంట్‌లు లేవు: