18, ఆగస్టు 2020, మంగళవారం

" రామాయణ పఠన మహిమ"

వాల్మీకి మహర్షి విరచిత రామాయణం మహా మహిమాన్వితమైనది.
గో హత్య వంటి ఘోర పాతకాలకు పాల్పడిన వారుగానీ ,  వారితో సహవాసం చేసిన వారుగానీ రామాయణ కావ్యాన్ని చదివినా, విన్నా పవిత్రులు అవుతారు.  దుస్వప్నాలు తొలగుతాయి. దుఃఖం నివారణ అవుతుంది . సకల శుభాలు కలుగుతాయి మోక్షాన్ని సైతం ప్ర" రామాయణ పఠన మహిమ" సాదించే శక్తి రామాయణ కావ్యానికి ఉంది. రామాయణ పఠనం.. శ్రవణం జనన మరణ భీతిని తొలగిస్తుంది.పుణ్యాలను ప్రసాదిస్తుంది. 
రామ కథను ఏకాగ్రచిత్తముతో వింటే మహా పాపాత్ములు కూడా                   పునీతులవుతారు.
రామాయణ ప్రవచనం జరిగే చోట దేవతలు, సిద్ధులు ఉంటారు.
రామ భక్తి పరులు ఉన్న చోట బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు కొలువై ఉంటారు. 
రామాయణ కథను విన్నంతనే సౌదాసుడనే రాక్షసునికి దివ్యత్వం ప్రాప్తించింది.
రామాయణ మహిమ అనంతం.., అనిర్వచనీయం .
రామాయణాన్ని పఠిద్దాం..
శ్రీరాముని సేవలో తరిద్దాం.

( ఏం.వి ఎస్ శాస్త్రి, ధర్మా చార్య, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఒంగోలు 9948409528)
******************

కామెంట్‌లు లేవు: