6, ఆగస్టు 2020, గురువారం

శబ్ద రూపమైన శక్తి

శబ్ద రూపమైన శక్తికి భాషాపరంగానే లక్షణము తెలియును. భాషను ఎవరూ కనిపెట్టలేదు. శక్తి దాని లక్షణమునుబట్టి దానిని గుర్తించి వాడుకలోనికి ప్రవేశపెట్టారు. ఉదాహరణకు: లం, లంబ, విలంబ, ప్రలంబ, ల అనగా పృధివి అని షోడసి  మంత్రం నుండి ల అక్షరం మునకు పూర్ణ శక్తి చేరిన పృధివి యెక్క లక్ణణముగా ప్రకృతి యని తెలిసినది. విలంబ వి అనే అక్షరముమ చేరి అమితమైన లేక అనగా విశేషమైన అనగా వక నిర్ధిష్టమైన  పదార్ధ లక్షణముగా కాంతి ధాతు పరంగా మారినదని తెలియును. అట్లు మారిన పదార్ధశక్తియైన జీవుడు నారాయణ స్వరూపమైన నీటి తత్వం ప్ర  అనే అక్షరం చేరి ప్రలంబ గా మారినదని శాస్త్రీయంగా పుట్టుక అనగా సమస్త  జీవ  చైతన్య లక్షణముగా తెలిసినది అదియే ఆత్మ యని ఉపనిషత్ సారమైన ప్ర ఙ్ఞానం బ్రహ్మ. ఉపనిషత్ సారమే యీ సమస్త జగత్తుయని ప్రత్యక్ష ప్రమాణంగా తెలియుచున్నది. ఉప నిత్తు మనకు సమీపంలో అనగా ఎంత సమీపంలో అనగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసముల అంత సమీపమున. దానినినప్రాణాయామం ద్వారా చైతన్యపరచుటే గాయత్రీ మంత్ర సాధన యని యిది యే ప్రలంబ ముష్ఠకంచ ఏవ మత్స్యః కూర్మో వరాహకం, సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తధా....సృష్టి చిగిర్చి మార్పుచెందుటకు మూల కారణమని విశ్వమంతా అనగా వామనుని వలె మనకు మహర్షులు  దర్శించి తెలిపారు. అదే మన పోతన భాగవతం ద్వారా తెలిపి యుంటిరి. వేద సారమే భాగవతం. మరుగున పడిన వేద సార విజ్ఞానం సమస్తం భాగవత రూపంలో మనకు అదించియున్నారు. యిప్పుడు కూడా యిది సూక్మంగా తెలియ వలెనన్న సమస్త భాషా పరంగా లేక సాధన అనగా యితిహాస పద్య పఠణ రూపంలో తెలియును. పద్యంలో యున్న అర్ధమును మనసులో సాధన చేయుటయే ఙ్ఞానం.

కామెంట్‌లు లేవు: