6, ఆగస్టు 2020, గురువారం

*మన్వంతరములు*

హిందూపురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నాము. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడింది.

భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరం లోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.

*మన్వంతరముల పేర్లు*

1) స్వాయంభువ మన్వంతరము
2) స్వారోచిష మన్వంతరము
3) ఉత్తమ మన్వంతరము
4) తామస మన్వంతరము
5) రైవత మన్వంతరము
6) చాక్షుష మన్వంతరము
7) వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
8) సూర్య సావర్ణిక మనవు మన్వంతరము
9) దక్షసావర్ణి మన్వంతరము
10) బ్రహ్మసావర్ణి మన్వంతరము
11) ధర్మసావర్ణి మన్వంతరము
12) భద్రసావర్ణి మన్వంతరము
13) దేవసావర్ణి మన్వంతరము
14) ఇంద్రసావర్ణి మన్వంతరము

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
***********************

కామెంట్‌లు లేవు: