9, జులై 2020, గురువారం

బొట్టు మేధావి తనానికి చిహ్నమా?

ఎంత పెద్ద బొట్టు పెట్టుకుంటే అంత మేధావులవుతారా?
 బొట్టు అనేది స్త్రీకి ఎంత అందమో మనకందరికీ తెలిసింది. కానీ, ఈ మధ్యలో బొట్టు స్థానంలో రకరకాల స్టిక్కర్లు వచ్చాయి.
అలాగే బొట్టు పరిమాణం కూడా రోజు రోజుకూ తగ్గిపోతోంది. దీనివలన కలిగే నష్టాలేంటి కష్టాలేంటి? అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? దాని వలన ప్రయోజనాలేంటి?
బొట్టు పెట్టుకుంటే మేధావులు అయిపోతారా? అంటే అందుకు గల కారణాలను మన శాస్త్రాలు తెలుపుతున్నాయి. బొట్టు వెనుక ఆరోగ్యం, మేధావితనం రెండూ లభిస్తాయా? పరిశీలిద్దాం.
భృగిటిన బొట్టు పెట్టుకోవడం వెనుక ప్రధాన కారణం శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ చేసుకోవడానికి మాత్రమే. మన సాంప్రదాయాలలో ఇది భాగం అయ్యింది.
బొట్టు శరీరంలో ఉష్ణాన్ని పీల్చీవేస్తుంది. ఎప్పుడైతే శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్దీకరించబడతాయో అప్పుడు మనసు, ఆరోగ్యం పదిలంగా ఉంటాయి.
సాయంత్రం రాత్రి సమయాల్లో కుంకుమకు బదులుగా విభూతిని ధరిస్తే చల్లగా ఉంటుంది. విభూతి వల్ల రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రించ బడుతుంది.
ఓజస్సు వృద్ధి చెంది, చర్మరోగాలు రాకుండా రక్షణ కలుగుతుంది. జఠరశ్వాసకోశాలకు తగినంత ఉష్ణాన్ని అందిస్తుంది.
గంధం బొట్టు శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది
మనం సూర్యుని నేరుగా చూడలేము. అందుకే అద్దాలను వినియోగిస్తాం. సూర్యునిలో ఉష్ణోగ్రత కారణంగా ఏర్పడే రంగులను మన కళ్ళు గ్రహించలేవు.
అదే సమయంలో జ్ఞాననాడి ఉంటుంది. భృకుటి వద్ద బొట్టు పెట్టుకోవడం వలన సూర్య కిరణాల నుంచి జ్ఞాననాడికి హానికలుగకుండా ఉంటుంది.
బొట్టు పెట్టుకోకుండానే మేధావులు అయినవారు లేరా? అంటే ఉన్నారు. కాని వారు బొట్టుపెట్టుకుని ఉంటే మరింత మేధావులుగా మారేవారు అనే వాదన ఉంది.
మహిళలు వైదూహ్యం పొందిన తరువాత కూడా వీబూదీ పెట్టుకోవడం వెనుక కారణం. శరీర ఉష్ణోగ్రతలను అదుపులో పెట్టుకోవడానికే.
మగవారు కూడా కొందరు బొట్టు పెట్టుకుంటారు, అలాగే కొందరు వీబూది పెట్టుకుంటారు. అబ్బా… ! అందమైన మహిళలను చూసినప్పుడు కనీసం మనస్సులోనైనా ఎంతందంగా ఉన్నారు అనుకుంటాం.
ఇది ఒక రకంగా అసూయకు దారితీస్తుంది. ఎవరు ఎవరితో మాట్లాడాలాన్నా ముఖంచూసే మాట్లాడ
గలుగుతారు.
నేరుగా ముఖం చూసే మాట్లాడుతారు కాబట్టి అక్కడ బొట్టు పెట్టుకోవడం వలన ఆ అందంపై కాకుండా నేరుగా దృష్టి బొట్టుపైకి వెళ్ళుతుంది.
బొట్టు ఎర్రగా నిండుగా కళకళలాడుతూ ప్రకాశిస్తూ వుండటం వల్ల ఇతరులు ముఖంలోకి చూడగానే వారిదృష్టిని ముందుగా ఈ బొట్టే ఆకర్షిస్తుంది.

వారెంత ప్రయత్నించినా ముఖంలోని అందమైన ఇతరభాగాల వైపు చూడలేరు. ఇలా దృష్టి దోషం తగ్గుతుంది. బాధ ఏమిటంటే ఆధునీకరణ పెరిగే కొద్ది బొట్టులో మార్పులు వస్తున్నాయి.

రకరకాల స్టిక్కర్లను పెట్టుకొంటూ చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే నిర్ధిష్ట పద్దతిలో తయారు చేసిన బొట్టును మాత్రమే వినియోగించాలి.

#సర్వంశివసంకల్పం

కామెంట్‌లు లేవు: