6, ఫిబ్రవరి 2022, ఆదివారం

అష్టస్థాన పరీక్ష

 అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 1 . 


     ఆయుర్వేదం నందు వ్యాధుల గురించి తెలుసుకొనుటకు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. ఈ రకమైన పద్ధతులు ద్వారా వ్యాధినిర్ధారణ చేయుటకు అనుభవం కూడా ప్రధానమైంది . ముందు అసలు ఆయా పద్దతుల గురించి మీకు సంపూర్ణముగా వివరిస్తాను . సమస్త వ్యాధుల గురించి తెలుసుకోవడానికి 8 స్థానాలను మొదట పరీక్షించవలెను .  అవి 


 *  నాడి .


 *  స్పర్శ . ( తాకుట ) . 


 *  రూపము . 


 *  శబ్దము . 


 *  నేత్రములు . 


 *  పురీషము . 


 *  మూత్రము . 


 * జిహ్వ ( నాలుక ) . 


       ఈ 8 రకాల స్థానాలను ముందుగా పరీక్షించిన తరువాత మాత్రమే రోగనిర్ధారణ చేయవలెను . ఇప్పుడు మీకు ఒక్కొక్కదాని గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 


 *  నాడి  - 


      దీనిని ఆంగ్లము నందు Pulse అని పిలిచెదరు . చరక , సుశ్రుతాది గ్రంథముల యందు ఎక్కడ కూడా నాడీవిషయము చెప్పబడలేదు . అయినాకూడా రోగములను గుర్తించుటకు కాని , వాటికి చికిత్స చేయుటకు గాని ఈ నాడీపరిక్షే ప్రథమస్థానం ఆక్రమించుచున్నది . మనిషి యొక్క ఒక ఉచ్చ్వాస నిశ్వాసమునకు ( Respiration ) 4 సార్లు నాడి స్పందనము ( Beating of the pulse ) కలుగును . 


  వయస్సును అనుసరించి నాడీ స్పందన - 


 గర్భములో పిండము - నిమిషానికి - 150 - 130 . 


 పుట్టగానే                 - నిమిషానికి - 140 - 130 .


 1 సంవత్సరం లోపు  - నిమిషానికి - 130 - 115 . 


 2 సంవత్సరాల లోపు - నిమిషానికి - 115 - 100 


 3 సంవత్సరాల లోపు - నిమిషానికి - 100 - 90 . 


 7 - 14 సంవత్సరాల వరకు - "       - 90 - 75 . 


 14 - 20 సంవత్సరాల వరకు - "     - 85 - 75 . 


 21 - 60 సంవత్సరాల వరకు -  "    -  75 - 65 . 


 60 సంవత్సరాల పైన           - "     -  85 - 75 . 



      జీర్ణజ్వరము , రక్తక్షీణము , దౌర్బల్యము , భోజనానంతరం , మలవిసర్జన అనంతరం నాడి క్షీణించును . ఎంతవ్యాధి యున్నను వయస్సులో ఉండువానికి 120 కంటే నాడీస్పందన మించరాదు . నాడీస్పందన 150 సంఖ్య సమీపించిన అపాయము . 


       ఈ నాడీ పరీక్ష శరీరంలో 8 ప్రదేశాలలో చేయవలెను . తరవాతి పోస్టు నందు వాటి గురించి తెలియచేస్తాను . 


       మరింత వివరణాత్మక సంపూర్ణ సమచారం మరియు అత్యంత అరుదైన మరియు రహస్య మూలికల ఉపయోగాల గురించి నా గ్రంథాల నందు వివరించడం జరిగింది. నా గ్రంథములు చదివిన సంపూర్ణ సమాచారం అవగతం కాగలదు   


     గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

కామెంట్‌లు లేవు: