10, సెప్టెంబర్ 2023, ఆదివారం

గర్భగుడిలోకి ఎందుకు వెళ్లకూడదు?

 ॐశ్రీవేంకటేశాయ నమః*

💝*ఆలయాలలో గర్భగుడిలోకి ఎందుకు వెళ్లకూడదు?*

💖*కొన్ని ఆలయాల గర్భగుళ్లల్లోకి కొందరిని అనుమతిస్తున్నారు. ముఖ్యంగా జ్యోతిర్లింగాలను అందరూ స్పర్శించవచ్చునని కొందరంటారు.*

💓*కానీ కొన్ని ఆలయాలలో గర్భగుడిలోనికి వెళ్ళక పోవడం నియమం. అది శాస్త్రాలు ఏర్పరచింది. ఏ వర్ణంవారు కూడా గర్భగుడిలోనికి రారు. దానికంటూ నియమించిన అర్చకులు తప్ప.*

❤️ *దీని వెనుక భౌతిక, ధార్మిక కారణాలున్నాయి. మూర్తిని తాకాలన్నా, అర్చించాలన్నా సదాచారం, శాస్త్ర నియమాలు అవసరం. అవి అందరికీ సాధ్యం కావు. “సదాచారం లేనివారు, రజస్వలయైన వారు గుడిలోకి ప్రవేశిస్తే విగ్రహం/లింగంలోని దైవశక్తి ఇంక ఉండదు. వెంటనే ప్రోక్షణాదులు జరపాలి. లేకపోతే క్రమంగా ఆ విగ్రహాదుల్లోకి పిశాచాలు ప్రవేశిస్తాయి. ఆ గ్రామ, నగరాలలో ఉపద్రవాలు వస్తాయి. వ్యాధులతో , శోకాలతో ప్రేతాలు భయాన్ని కలిగిస్తాయి" - అని శాస్త్రం స్పష్టంగా చెప్తోంది.*

💖 *సంప్రోక్షణం ప్రకుర్వీత తద్దోషస్యోపశాంతయే దోషైరుపహతం జ్ఞాత్వా ప్రాసాద ప్రతి మాదికం|| (ఈశ్వర సంహిత)*

💖*విలంబనే తు నిష్కృత్యా వినశ్యేద్దేవ సన్నిధిః| తత్స్థాః ప్రేతా భయం కుర్యుః వ్యాధి శోకాదిభిర్నృణామ్|| (విష్ణు సంహిత)*

*ॐశ్రీవేంకటేశాయ నమః*

💞*ఆలయంలోని విగ్రహంలో దేవుడున్నాడని విశ్వసిస్తే, వీటినీ విశ్వసించాలి. విగ్రహాన్ని దేవతా శక్తిగా మార్చడం ఒక మహా ప్రక్రియ. ప్రతిమాశోధన - అనేది మంత్ర, యజ్ఞాదులతో చేసి, యంత్రాది, ప్రతిష్టాది విధానాలతో ఆ బింబంలో కళాన్యాసం చేసి దేవతని ప్రతిష్ఠిస్తారు. వాటిని స్పర్శించాలన్నా, అర్చించాలన్నా ఆయా నియమాలను అనుష్టించే వారికే అర్హత ఉంటుంది.*

💖*నిజానికి దేవాలయంలోని మూర్తిని తాకవలసిన అవసరమేముంది? నమస్కరిస్తేచాలు. ఆ మూర్తినుండి శక్తి తరంగాలు ప్రసరిస్తాయి.*

💓*ధ్యానిస్తే చాలు. తరించిపోతాం. అందుకే గర్భగుడి, అంతరాలయం, ముఖమండపం-వంటివి అందరూ దర్శించి అనుగ్రహం పొందడానికై ఏర్పాటు చేశారు.*

💓*యుగాలనుండి అందరూ ఆలయానికి వెళ్ళి స్వామిదయను పొందుతున్నారు. భౌతికంగా ఆలోచించినా…గర్భాలయంలోకి జనం ఎక్కు వైనా, అందరూ తాకుతున్నా ప్రశాంతత దెబ్బతినడం, విగ్రహ శిల అరిగిపోవడం వంటివి జరుగుతాయి. కొద్దిమంది నియమితంగా సేవిస్తేనే పదిలంగా ఉంటాయి.*

💞*స్థూలంగా ఆలోచిస్తే అసమంజసంగా అనిపించేవి, సూక్ష్మంగా గమనిస్తే సముచితంగా అనిపిస్తాయి. ఆ సూక్ష్మదృష్టి, తెలివిలేని మూర్ఖులు మన మతాన్ని విపరీత దృష్టితో చూస్తున్నారు. వైద్యచికిత్సా కేంద్రాలలో శస్త్రచికిత్సవంటివి జరిగేచోట వైద్యుడు, రోగి తప్ప ఎవరూ ఉండరు. ఎందుకు? అది ఒక సూక్ష్మ విజ్ఞానం.*

💓*అలాగే దేవతా వ్యవస్థది మరొక సూక్ష్మవిజ్ఞానమే. నమ్మితే ఈ విజ్ఞానాన్నీ నమ్మాలి. సర్వవ్యాపకుడైన పరమేశ్వరునికి ఏ పరిమితులు, నియమాలు ఉండవు. ఎవరైనా, ఎక్కడైనా, ఎలాగైనా స్మరించి, ధ్యానించి, కీర్తించి ధన్యులు కావచ్చు.కానీ ఒక విగ్రహంగా దివ్యశక్తిని కేంద్రీకరించినప్పుడు మాత్రం నియమాలు వర్తించడం తప్పనిసరి అని గ్రహించాలి.


Forwarded message 

కెర్లెపల్లి బాలసుబ్రమణ్యం 


కామెంట్‌లు లేవు: