21, డిసెంబర్ 2023, గురువారం

ఘంట మూడు సార్లే

 🙏దేవాలయానికి వెళ్ళినపుడు ఘంట మూడు సార్లే  ఎందుకు కొట్టాలి. తెలుసా ?🙏


శ్లోకము :


 ఏకతాడే మరణం చైవ

ద్వితాడే వ్యాధి పీడనం!

త్రితాడే సుఖమా ప్నోతి  తత్ఘంటా నాద లక్షణం.


భావం : దేవుని ముందర ఘంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతం .


రెండుసార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింప బడతాము. 


🙏మూడుసార్లు ఘంటానాదం చేయడం చేత శరీరమునకు , మనస్సుకు సుఖము కలుగుతుంది.🙏


ఈ పద్దతిని 💐దేవాలయ ఘంటా నాద లక్షణము💐 గా శాస్త్రం చెప్పబడింది .


( దేవాలయంలో ఘంటానాదం ద్వారా జనించే ఓంకార ధ్వని తరంగాలను మన చెవుల ద్వారా శరీరంలోకి శబ్ద తరంగాలకు అనుసంధానం చేయండి తద్వారా మానసిక ప్రశాంతతను పొందండి.)

కామెంట్‌లు లేవు: