26, మార్చి 2020, గురువారం

ప్రమాదాన్ని గుర్తించండి



మన ప్రభుత్వం ఎన్నోవిధాలుగా చెపుతున్నా యందరో పెడచెవి పెట్టి రోడ్లమీదికి వస్తున్నారు.  దాని ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న కరోనా కొత్త కేసులు.  మనమంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలిసిన సమయం.  ఏరకమైన భేషజాలకు పోకుండా ప్రతి  కాలనీ వాళ్లంతా ఇంటికే పరితమై ఉండాలని మరి మరి కోరుతున్నా . ఇంకా పని లేకపోయినా తిరిగే వాళ్ళు గుంపులు, గుంపులుగా తిరిగి  పిచ్చాపాటి మాట్లాడే వాళ్ళు, ప్రస్తుత పరిస్థితిని గుర్తించి  వాళ్ళ దినచర్యని మార్చుకొని ఇంటికే పరితం కావాలి.  లేకపోతే ఈ కరోనా వ్యాధి ప్రబలే ప్రమాదం వున్నది.  తప్పకుండ ఇల్లు వదలకుండా వుండండి. తెలియని వాళ్ళకి ఒక సారి చెపితే వింటారు. తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిన పనిలేదు.  కానీ అన్ని తెలుసు అని అనుకునే మూర్కులకు మళ్ళి మళ్ళి చెప్పాల్సి వస్తుంది.  మనం తెలివితో మెలగాలి. మనల్ని మన కాలనీ వాళ్ళని కాపాడుకోవాలి  అని ప్రతివారు భావించాలి. మనం రోజు టివిలో చూస్తున్నాం ముందు మన పోలీసులు మర్యాదగా మందలించారు.  కానీ ఇప్పుడు ప్రతి వారికీ బడితెపూజ  చేస్తున్నారు. దయచేసి ప్రతి కాలనీ వాళ్ళు అటువంటి పరిస్థితి తీసుకో రావద్దు. ఇప్పుడు పోలీసులు రహదారిలో పని చేస్తున్నారు. మన కాలానికి ఎవరు వస్తారు మనం ఏదేశ్చగా తిరగొచ్చు అని కొందరు అనుకో  వచ్చు. ప్రతి కాలనీ వాసికి తనను తాను కాపాడుకోవటం కాకుండా మొత్తం కాలనీని కాపాడ వలసిన భాద్యత వున్నది.  ప్రతి వారు తన కాలానికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. కొత్తవారు ఎవరు ఎవరింటికి వచ్చారు.  ఆ వచ్చినఁ వాళ్ళు మన దేశంలోంచి వచ్చారా లేక విదేశం నుంచి వచ్చారా తెలుసుకొని ఒక వేళ విదేశం నుండి వస్తే వెంటనే ఆ విషయం పోలీసుకు విషయం తెలపాల్సిన భద్యత ప్రతి కాలనీ వాసికి వున్నది. మీరు మిమ్మలిని కాపాడుకోండి, మన కాలనీని కాపాడండి అనే నినాదం ప్రతి వక్కరు చేయాలి. 
మన దేశం సరైన సమయానికి స్పందించి సత్వర నిర్ణయం తీసుకొని లాక్డౌన్ ప్రకటించటంతో మన  దేశంలో కేసుల వృద్ధి చాల తగ్గింది.  మన పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి చుస్తే గుండె జారిపోతుంది.  మన మంతా మన గౌరవ ప్రధాని గారి వెంట ఉండి మన దేశాన్ని కాపాడు కుంటామని ప్రమాణము చేద్దాం. 

కామెంట్‌లు లేవు: