26, మార్చి 2020, గురువారం

గుడ్డిలో మెల్ల



ఇప్పుడు మన మున్న ఈ సంక్లిష్ట పరిస్థితి ఎండాకాలంలో రావటం ఒకందుకు ఎంతో మేలు. ఎందుకంటె ఎండాకాలంలో ఎండ వేడికి భూమిమీద వున్నా సూక్ష్మ క్రిములన్ని నశించి పోతాయ్ కాబట్టి మనం చాల వరకు సీజనల్ అనారోగ్యాలకు లోనుగాము. ఇక పోతే ఎండలో తిరిగితే వేడి చేయటం జరుగుతుంది.  కానీ మనం ఇంట్లోనే ఉంటున్నాము, ఫ్యాన్ క్రింద, ఎసిలో ఉంటున్నాము కాబట్టి వేడి చేసే ప్రమాదం లేదు. కేవలం మనం మన తిండి, నిద్ర చూసుకుంటే సరిపోతుంది.  ఎండాకాలంలో వేరే శారీరిక ఎక్సరసైజ్ చేయకుండానే ఎండ వేడికి చెమటతో మన శరీరం అలసిపోతుంది. కాబట్టి మనం తిన్నది అరిగిపోతుంది, మళ్ళి రాత్రి కాగానే ఆకలి వేస్తుంది. ఇదే పరిస్థితి ఏ శీతాకాలంలోనో, లేక వర్షా కాలంలోనో వస్తే అప్పటి స్థితి చాల దారుణంగా ఉండేది. ఏతా వాత తెలిసేది ఏమిటంటే మనం చాలా సేఫ్గా వున్నాము. కేవలం ఇంట్లోంచి బైటకు రావటంలేదనేది తప్ప. ఆశా వాదీ ఎప్పుడు కష్టాలలో సుఖాన్ని, దుఃఖంలోఆనందాన్ని చూసుకోవాలి.  మన సనాతన హిందూ ధర్మము కుడా ఇదే చెప్పుతుంది.  ఈశ్వరార్పణగా కర్మలు చేసే ఈ భారత దేశంలో ఎప్పుడు శాంతి ఉంటుంది.  అందుకే ఇతర దేశాలలో ఎంతో వేగంగా ప్రాకుతున్న ఈ మహారమారి మన దేశంలో చాలా వరకు అదుపులో వుంది. గుడ్డిలో మెల్ల అంటే యిదే. 

మనమంతా ఆ దేవ దేవుడిని ఈ విపత్కర పరిస్థితి నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్ధిద్దాము 
సర్వై జానః సుఖినో భవంతు,  లోకా  సమస్త సుఖినో భవంతు,  
ఓం శాంతి శాంతి శాంతిః 



కామెంట్‌లు లేవు: