15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సంస్కృత భారతీ* *1*

 *సంస్కృత భారతీ*

            *1*

   *ప్రథమ పాఠః*

అహం = నేను, వయం=మేము/మనము, త్వం  = నీవు, భవాన్ = మీరు(గౌరవవాచకం) యూయం = మీరు, మమ/మదీయ  = నాయొక్క, తవ/త్వదీయ = నీయొక్క, భవదీయ = మీయొక్క, (భవ అనేది గౌరవవాచక సూచకము) యుష్మదీయ = మీయొక్క అస్మత్ = మాయొక్క/మనయొక్క,తస్య = అతని యొక్క

సః  = వాడు, సా= ఆమె, తే  = వారు, తత్  = అది, తాని  = అవి. తైః = వారిని, తేభ్యః = వారి కొరకు, తేషాం = వారియొక్క, తేషు = వారి యందు, తస్మై = వారి కొరకు,


వీటన్నిటికీ ముందు 'ఏ' ను చేర్చినచో మనసమీపములుగా మారును. ఇలా ఉపసర్గ(పదానికి ముందు చేర్చే వర్ణము/అక్షరము) చేర్చినప్పుడు ఒక్కొక్కప్పుడు ఆ పదం లోని ఇతర అక్షరాలలో కూడా కొంత మార్పు వస్తుంది,ఉదాహరణకు  సః, ఏ *షః* గా మారుతుంది.

 *ఉదా* ఏషః = వీడు,ఏషా = ఈమె,ఏతత్ = ఇది...ఇలా


******

అస్మి  = ఉన్నాను, స్మః  = ఉన్నాము, అసి  = ఉన్నావు, అస్తి  = ఉన్నది/ఉన్నాడు, సంతి = ఉన్నారు/ఉన్నాయి. అస్తు = అగుగాక

*****

"క' కారము సంస్కృతమున ప్రశ్నాక్షరము, ఉదాహరణకు కిం = ఏమిటి?, కః = ఎవరు?, కా = ఎవతె?,కాని = ఎన్ని, కస్మై/ కస్యకృతే = ఎవరికొరకు, కైః = ఎవరిని, కేభ్యః = ఎవరి యొక్క, కథం = ఎలా!??, కుత్ర = ఎక్కడ?, కదా?= ఎప్పుడు?, ....‌ఇలా.

అలాగే వా అని చివర లో చేర్చినప్పుడు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.

ఉదాహరణకు త్వం రామః వా!?? అంటే నీవు రాముడవా ? అని అర్థం.


నామం = పేరు, గ్రామం = ఊరు.సమయః / కాలః = కాలము, మరిన్ని పదాలు మనకు వ్యావహారికంగానూ, నిఘంటువు లలోనూలభిస్తాయి. అలాగే ఈ సమూహం లో అడిగిననూ తెలుపగలరు.

 *---* 

*ప్రయోగభాగః*

*ప్రశ్న* :-- తవ నామ కిం  = నీ పేరు ఏమిటి?

*సమాధానం*:--మమ నామ శ్రీనివాస శర్మా,

*ప్ర*:-- తవ గ్రామం కిం ?

*స*:-- మమ గ్రామం రాజమహేంద్రవరం

*ప్ర*:-- తస్య గ్రామం కిమ్?

 *స*:-- భాగ్య నగరమ్,


*శుభం భూయాత్*

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: