31, జనవరి 2025, శుక్రవారం

వివాహం గురించి

 🙏వివాహం గురించి సంక్షిప్త వ్యాసం 🙏

వివాహ శబ్ద నిర్వచనము వివాహ శబ్దములో 'వి' అనియు, 'వాహః' అనియు రెండు భాగములున్నవి. 'వి' అనుదానికి విశిష్టత అని యర్థము. 'వాహః' అనుదానికి పొందించుట అని యర్ధము.


ఈ విషయము వీరమిత్రోదయము - సంస్కార కాండలో ఇటుల విస్తరించి చెప్పబడినది.


“వివాహః | వహ ప్రాపణే ఇత్యస్మాద్దాతోః, భావే ఘజీ కృతే వహనం వాహః | విశిష్టో వాహః వివాహః | వైశిష్ట్యం చ ప్రతిగ్రహాద్యష్టవిధో పాయాన్యతమోపాయేన హోమాది సప్తపద నయనాంత కర్మాభి సంస్కృతత్వమ్ | తథా చ వివాహ పదార్డో (ద్విదల) ద్విఫల స్సిద్ధ్యతి |  స్వత్వోత్పాదనం  సంస్కారాధానం చేతి | తదేతత్ స్పష్టీకృతం పారస్కరేణ | పిత్రి ప్రత్తా మాదాయ గృహీత్వా ని మతి  వరం దదాతీత్యంతేన |


అనువఱకు ప్రతిగ్రహము మొదలుకొని చెప్పబడిన బ్రాహ్మాది పైశాచాన్త వివాహము లెనిమిదింటిలో నేవిధముగానైనను స్వీకరించిన కన్యతో హోమము మొదలుకొని సప్తపదివఱకు గల సంస్కారములచే సంస్కరింపబడుట అని వివాహశబ్దమున కర్థము. ఇది వివాహములో ప్రధానమని తాత్పర్యము.

యాజ్ఞవల్క్య స్మృతి ననుసరించి పూర్వీకులు ఎనిమిది విధాలైన వివాహాలను శాస్త్ర సమ్మతం చేసారు. ఈ వివాహాల వలన వదూవరులు సుఖ సంతోషాలు పొందుతారని తెలియజేసారు . అవి


1 బ్రాహ్మ :- విద్య మరియు ఆచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం

2 దైవ :- యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యాదానం చేయడం

3 ఆర్ష :- కన్యాశుల్కంగా వరుడినుంచి ఒక జత ఆవు-ఎద్దులను తీసుకుని పెళ్ళి చేయడం

4 ప్రాజాపత్య :- కట్నమిచ్చి పెళ్ళి చేయడం

ఇంతవరకు చెప్పిన వివాహాలు మాత్రమే ధర్మ శాస్త్రం సమ్మతించినది.

5 ఆసుర :- వరుడు ధనమిచ్చి వధువును కొనడం

6 గాంధర్వ :- ప్రేమ వివాహం ఇది క్షత్రీయులకు మాత్రమే చెప్పబడింది  దుష్యంతుడు -- శకుంతల వివాహం ఇది కేవలం క్షత్రీయులకు ధర్మ సమ్మతమే.

7 రాక్షస :- వధువును ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవడం

8 పైశాచ :- వధువును నిద్రిస్తున్నప్పుడో, మత్తులో ఉన్నప్పుడో ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా అపహరించడం

(వీటిలో మొదటి నాలుగు రకాలు ధర్మశాస్త్రాలు ఆమోదించినవి కాగా చివరి నాలుగు రకాలను ధర్మశాస్త్రాలు ఆమోదించలేదు.)


వివాహము స్త్రీ పురుషులలోని అపూర్ణత్వమును తొలగించి, వారికి పూర్ణత్వ మొసగజాలిన యొక పవిత్ర సంస్కారము, స్త్రీపురుషులిర్వురు దానికి రెండు పక్షములు. ఈ రెంటిని కలిపి - అనగా ఈ యుభయ శక్తులను సమన్విత మొనర్చి, ఈ సమన్వితశక్తిని ఏకలక్ష్యోన్ముఖము సేయుటయే ఈ సంస్కారముయొక్క ముఖ్యోద్దేశ్యము. ఈ సంస్కార ప్రయోజనము కేవలము ఇహలోకమునకే పరిమితముకాక, పరలోకమునకు గూడ ప్రాప్తమై యున్నది. కేవలము శారీర - ఐంద్రియ పరితోషము మాత్రము వివాహమునకు గమ్యముగాక, కర్తవ్యపాలనము, దైవారాధనము, అతిథిపూజ, సంతానప్రాప్తి, అధ్యాత్మికోన్నతి, పారివారిక, సామాజిక శ్రేయము నిశ్రేయము దీనికి గమ్యములు  కావుననే ఇది సర్వసంస్కారములలో నుత్తమ మయినదిగాను పవిత్రమయినదిగాను ఋషులు ప్రతిపాదించినారు.


“విశేషణ వాహయతీతి వివాహః” అనగా వివాహితులయిన దంపతులకు విశేషముగా గృహస్థ ధర్మములను వహింపఁజేయు సంస్కార విశేషమునకు వివాహము అని పేరు (చెప్పినారు). దీనికి పాణిగ్రహణమని వ్యవహారము గలదు. ఈ సంస్కార విశేషము ప్రత్యక్ష ప్రయోజనము, పరోక్ష ప్రయోజనము ఉభయప్రయోజనము నయి యున్నది. ఇట్టి ప్రయోజనములతోగూడిన సంస్కార జనక క్రియా కలాపము వివాహమని సారాంశము.


హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్లి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది

వివాహం కానివారు, వివాహానంతరం అనేక కారణాలతో విడిపోయిన స్త్రీ, పురుషులు సంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించడానికి అనర్హులని హిందూ ధర్మశాస్త్రం వివరిస్తుంది. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధి నిర్వహణకు అర్హులౌతారు. కాబట్టి హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, దేవతామూర్తుల కల్యాణం, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞం, యాగం లాంటివి నిర్వహించాలంటే గృహస్థు ధర్మపత్ని సమేతంగా జరపాలనే నియమం ఉంది. వివిధ కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి కొద్దిపాటి తేడాలున్నప్పటికీ, స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలన్నీ ఒక పద్ధతిలోనే సాగుతాయి.

 సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కోపంతో మాట్లాడితే

 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏               🔥 కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు..అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు..అనవసరంగా మాట్లాడితే అర్ధన్ని  కోల్పోతావు..అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు.. అబద్దాలు మాట్లాడితే పేరును కోల్పోతావు.. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు🔥జీవితంలో ఏదీ కోల్పోయినా పర్వాలేదు కానీ.. ఎదుటి వారు మన మీద పెట్టుకున్న నమ్మకం మాత్రం కోల్పోయేలా చేసుకోవద్దు.. ఎందుకంటే నమ్మకం ఒక్క సారి పొతే ఎంత ప్రయత్నించినా తిరిగి రాదు..జీవితంలో లెక్కలేనన్ని బంధాలు అవసరం లేదు..ఉన్న కొద్ది బంధలలో జీవం ఉంటే చాలు..జీవం లేని ఎన్ని బంధాలున్నా ఒక్కటే లేకపోయినా  ఒక్కటే🔥బియ్యం మరిగే పాలలో వేస్తే పాయసం అవుతుంది.. అదే మరిగే నీటిలో వేస్తే అన్నం అవుతుంది.. అదే బియ్యం బొగ్గుతో కాలిస్తే చేడుకి ఉపయెగించే పదార్థం అవుతుంది.. అదే బియ్యం పసుపులో కలిస్తే శుభానికి ఉపయెగించే అక్షితలు అవుతాయి.. మనం కూడా అంతే.. మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యెగ్యత నిర్ణయించబడుతుంది🔥🔥మీ  *అల్లoరాజు భాస్కరరావు. శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్. D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593. 9182075510* 🙏🙏🙏

మేలిమిఁ గూర్చ,

 ఉ.మేలిమిఁ గూర్చ, జాతి కనిమేషుల వోలె తపించి, పేర్మితో

ఆలనకై కృశించుచు, శ్రమార్జితమౌ ధనధాన్య వృధ్ధికై

తాలిమిఁ దీర్చు కర్షకులు ధన్యులు, వారి సమాదరింపగా

పాలకు లెంచునట్లు పరిపాలన జేయఁ దలంచు భారతీ!!౹౹17


ఉ.భీతిఁ దొఱంగి ధర్మ పరిపీడిత దుష్కృత దుష్ట మార్గపుం

జేతల మించి, ఆప్తుల విశిష్ట మనోరథులైన ధార్మిక

త్రాతల కెంచి చేసిన అధర్మపు కర్మల దైవమెప్పుడే

రీతి సహింప నోర్చు, సమరింపక, భీకర భాతి భారతీ ౹౹ 18

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం  - ద్వితీయ - శతభిషం -‌‌ భృగు వాసరే* (31.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఆహారపు రుచులు

 ఆహారపు రుచులు మరియు వాటివలన మానవ శరీరముకు కలుగు ఉపయోగాలు  - 


    రుచులు మొత్తం 6 రకాలు .  అవి 


  తీపి , పులుపు , ఉప్పు , చేదు , కారము , వగరు  అని 6 రకాలుగా ఉంటాయి. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో ఈ ఆరు రుచులు అంతర్లీనంగా ఉంటాయి. మనుష్య శరీరం నందు రోగాలు పుట్టుటకు మరియు రోగాలు తగ్గుటకు మనకి ఈ ఆరు రుచులు సమ్మిళితమైన ఆహారమే ప్రధాన కారణం .

        ప్రథమంగా ముందు మన ప్రాచీన ఆయుర్వేదం లో మానవ శరీరం గురించి

 మానవశరీరం నందు ఏడు చర్మములు , ఏడు ధాతువులు , ఏడు ఆశయాలు , ఏడు వందల శిరలు , అయిదు వందల పేశిలు , తొమ్మిది వందల స్నాయువులు , మూడు వందల ఎముకలు కాని చరకుడు వివరించిన దానిప్రకారం ఎముకలు మూడువందల ఆరు. పాశ్చాత్త్యా సిద్ధాంతం ప్రకారం రెండువందల పదియే కలవు. రెండు వందల పది సంధులు , నూట ఏడు మర్మస్థానములు , ఇరవైనాలుగు ధమనులు , మూడు దోషములు , మూడు మలములు , తొమ్మిది స్రోతస్సులు , పదహారు కండరములు , పదహారు సన్నని జాలములు అనగా సన్నని నరముల అల్లికలు , ఆరు కూర్చములు అనగా ఎముకల కట్టలు నాలుగు మరియు శిరల కట్టలు రెండు రకాలు . నాలుగు పెద్దతాళ్లు , ఏడు కుట్లు , పదనాలుగు ఎముకల కూటములు , పదనాలుగు సీమంతములు , ఇరువది రెండు శ్రోతస్సులు , రెండు ప్రేవులు , మూడున్నరకోట్ల రోమకూపములు.   ఇంత ఉత్క్రుష్టమైనది మానవశరీరం . నిద్రాహార విహారాలలో మార్పులు మరియు హెచ్చుతగ్గుల వలన శరీరంలో రోగాలు సంభవిస్తాయి.

           కొన్ని రకాల ద్రవ్యములను తినిన యెడల శరీరంలో రోగాలు నశించగలవు. కొన్నిరకాల ఆహారపదార్థాలను తినిన యెడల శరీరం నందు కొత్తకొత్త రోగాలు పుట్టును . అసలు రోగం అంటే ఏంటో మీకు తెలియచేస్తాను .శరీరధారకములు అగు వాత, పిత్త, శ్లేష్మములలో ఉండవలసిన ప్రమాణం కంటే హెచ్చుతగ్గులు ఉండుటయే రోగం . 

          మనం తీసుకునే ప్రతి ఆహారం 6 రకాల రుచులతో సమ్మిళతం అయి ఉంటుంది అని చెప్పాను కదా .  ఇందులో మొదటివగు తీపి , పులుపు , ఉప్పు ఇవి వాత దోషమును పోగొట్టును . చేదు , కారం , వగరు ఇవి కఫాన్ని హరించును . వగరు, చేదు , తీపి రసములు పిత్తదోషమును హరించును . ఆహారం జీర్ణం అయిన తరువాత వేడిచేయుట , చలువచేయుట అను రెండు విధాలుగా మాత్రమే ఉండును.  


  మధురరస గుణములు  - 

   తీపిగా ఉన్న పదార్థాలను తినటం వలన , పుట్టినప్పటి నుండి అలవాటు పడిన సప్త ధాతువులకు బలం కలుగును.

   చిన్నపిల్లలకు , ముసలివారికి , దెబ్బలు తగిలిన వారికి , బలం క్షీణించినవారికి , రక్తమాంసములు క్షీణించినవారికి తీపి పదార్థాలు చాలా హితకరం అయినవి.

   శరీరవర్ణం పెరుగుటకు , వెంట్రుకల వృద్ధికి , ఇంద్రియ బలం పెరుగుటకు , ఓజస్సు వృద్ది చెందుటకు ఈ మధుర రసం ఉపయోగపడును.

   శరీరంకి మంచి పుష్టిని ఇచ్చును.   కంఠస్వరం పెరుగును .   బాలింతలగు స్త్రీలకు ఎండిపోయిన పాలను వృద్ది పరుచును.   ఆయుష్షుకు కారణం , ప్రాణరక్షణకరమైనది .   వాత, పిత్త, విషాలను హరించును . 


  గమనిక  - 

          ఈ మధుర రసమును అధికంగా వాడిన మేధస్సుతో కూడిన కఫ వ్యాధులను పుట్టించును .శరీరం లావెక్కును . అగ్నిబలం తగ్గును అనగా జఠరాగ్ని తగ్గును. ఇరువది అగు మేహరోగాలు జనించును. అర్బుదం అనగా గడ్డతో కూడిన కేన్సర్ వచ్చును.


 ఆమ్లరసం గుణములు  - 

   ఈ ఆమ్లరసం ( పులుపు ) అగ్నిదీప్తి అనగా జఠరాగ్ని పెంచును.   హృదయముకు బలమునిచ్చును.

   ఆహారాన్ని అరిగించును.   రుచిని పుట్టించును .    శరీరం నందు వేడి కలుగచేయును .   మలాన్ని విడిపించును.   తేలికగా జీర్ణం అగును.   కడుపులో బిగిసి ఉన్న వాయువుని బయటకి వెడలించును.


  గమనిక  - 

        దీనిని అధికంగా వాడినచో కఫమును పెంచును , రక్తపిత్త వ్యాది అనగా నోటివెంట రక్తం పడువ్యాధిని పుట్టించును , శరీర అవయవాల పట్టు సడలించును , తిమ్మిరి , భ్రమ , దురదలు , పాండురోగం , విసర్పవ్యాధి , శరీర భాగాల్లో వాపు , దప్పిక, జ్వరం వంటి వ్యాధులను పుట్టించును . 


   లవణ రస గుణాలు  - 

   ఈ లవణ రసం శరీరంలో స్తంభించిన దోషాన్ని విడిపించి బయటకి పంపును .    జఠరాగ్ని పెంచును.

   చమురు కలది.   చెమట పుట్టించును .    తీక్షణమైనది , రుచిని పుట్టించును .    వ్రణములు అనగా గడ్డలు పగిలేలా చేయును .   శరీరం నందు మలినపదార్థాలు విడగొట్టి బయటకి పంపును 


  గమనిక  - 

           ఈ లవణ రసాన్ని అధికంగా వాడటం వలన వాతారక్త వ్యాధిని కలిగించును . బట్టతలను తగ్గించును .  వెంట్రుకలు నెరిసిపోవును , శరీరం ముడతలు పడును. దప్పికను కలిగించును , కుష్టు రోగము కలుగును. విసర్పి రోగం కలుగును. బలమును  హరించును .


   తిక్త ( చేదు ) రస గుణాలు  


ఇది అరుచిని హరించును .   శరీరం నందలి క్రిములను , దప్పిక , విషమును , కుష్టు , మూర్ఛని హరించును .    మూర్చ, జ్వరాలను , శరీరం నందలి మంటలను, వేడిని , కఫాన్ని హరించును .

   శరీరం నందలి వ్రణాల నుండి కారు దుష్టజలాన్ని , మాంసం నందలి కొవ్వుని కరిగించును. ఎముకల్లో మూలుగను , శరీరంలో మలమూత్రాలను హరించును .   తేలికగా జీర్ణం అగును.   బుద్దిని పెంచును.

   చమురు హరించును .   స్త్రీల పాలు యందు మరియు కంఠం నందలి దోషాలు పొగొట్టును.


  గమనిక  - 

          అధికంగా తీసుకున్న ధాతువులను క్షీణింపచేసి వాత రోగాల్ని పుట్టించును .

 

  కటు ( కారం ) రసం గుణాలు  - 

   ఈ కటు రసం కంట రోగం , కుష్టు , వాపు పోగొట్టును .   వ్రణములు తగ్గించును    శరీరం నందలి దుష్ట జలాన్ని , కొవ్వుని హరించును .    జఠరాగ్ని పెంచును.   అన్నమును జీర్ణింపచేయును .   రుచిని పుట్టించును .   సన్నని నరములలోని దోషాలు కూడా శోధించి వ్యర్థాలను బయటకి పంపును .

   నవరంధ్రాలు ను తెరిపించును.   కఫాన్ని హరించును .


  గమనిక  - 

        దీనిని అతిగా తీసుకున్నచో దప్పిక పుట్టించును . శుక్రమును , బలాన్ని నశింపచేయును. మూర్చని కలిగించును. అంగములు ముడుచుకున్నట్లు చేయును . వణుకు పుట్టించును .నడుము , వీపు నందు నొప్పి కలుగచేయును .


  కషాయ ( వగరు ) రస గుణములు  - 

   వగరు పదార్థం పిత్తశ్లేష్మాలని హరించును .   రక్తాన్ని శుద్దిచేయును .   నొప్పిని కలిగించును.   వ్రణాలను మాన్చును.   శరీరం నందలి దుష్ట జలాన్ని తీసివేయును .   ఆమమును స్తంభింపచేయును .   మలాన్ని గట్టిపరుచును.   చర్మాన్ని నిర్మలంగా చేయును .

 

  గమనిక  - 

       దీనిని అతిగా సేవించిన మలబద్దకం , కడుపు ఉబ్బరం , గ్యాస్ , గుండెజబ్బులు , దప్పిక, లివరు చిక్కిపోవుట, సంభోగ శక్తిని నశింపచేయును . మలబద్దకం కలిగించును.

       పైన చెప్పిన విధంగా మనం తీసుకునే ఆహార పదార్థం యొక్క రుచిని బట్టి మన ఆరోగ్యం అధారపడి ఉండును.


30, జనవరి 2025, గురువారం

సవాళ్లపై గెలవడమే.

 డిఫీట్(defeat)అన్న పదమే ఒక ఫీట్!*

```

అప్పటి దాకా విజయంతో విర్రవీగే శాల్తీని ఒక్కసారి పల్టీ కొట్టించి తనెక్కడున్నాడో తెలియజేసే విన్యాసమే ఆపజయం.


విజయకాంక్షకు మంచిచెడుల విచక్షణ ఉండదు. అందుకే జాగ్రత్తగా సానుకూల దృక్పథాన్ని ఎంచుకోవాలి. తత్ఫలితంగా ఉద్భవించే సృజనాత్మక శక్తి ఎన్నో కొత్త ఆవిష్కరణలకు ప్రేరణవుతుంది. 


జపనీయులకు తాజా చేపలంటే ఇష్టం. కానీ జపాన్ సమీప సముద్రజలాల్లో చాలినన్ని చేపలు దొరికేవి కావు. అందుకని మత్స్యకారులు పెద్ద నావల్లో బాగా దూరాలు వెళ్లి చేపలు పట్టేవారు. కానీ, తిరుగు ప్రయాణానికి చాలా సమయం పట్టడంతో వాటిలోని తాజాదనం తగ్గిపోయేది. 


ఈ ఇబ్బందిని అధిగమించే క్రమంలో ఫ్రీజర్ లు ఉనికిలోకి వచ్చాయి. పట్టుకొన్న చేపల్ని అక్కడికక్కడే నావల్లో అమర్చిన ప్రీజర్లలో భద్రం చేసేవాళ్ళు దాంతో మరింత దూరం వెళ్లి ఇంకా ఎక్కువ చేపలు పట్టేవారు. 


ఎంతైనా తాజా చేపలే రుచి అనుకున్న ప్రజలు వాటికే ప్రాధాన్యం ఇవ్వటంతో, ఫ్రీజ్డ్ ఫిష్ మార్కెటింగ్ చేసే కంపెనీలు దివాలా బాటపట్టాయి. 


ఈ సమస్యకూ ఆ కంపెనీలు విరుగుడు కనిపెట్టాయి. నేరుగా నావల్లోనే నీటి ట్యాంకులు ఏర్పాటు చేసుకొన్నాయి. వ్యాపార సంస్థలకు లాభాలు ప్రధానం కాబట్టి తక్కువ సైజు తొట్టెలలో సాధ్యమైనంత ఎక్కువ సరుకు కుక్కుతుండేవి. నీటిలో కదిలేందుకు చాలినంత చోటు లేక నీరసపడిపోయేవి చేపలు. సమస్య మళ్లీ మొదటికొచ్చింది. 


అయినా మత్స్య పరిశ్రమ మొత్తం తలలు పట్టుకు కూర్చోలేదు. జపనీయులు సహజంగానే కార్యసాధకులు. ఆ పట్టుదల కారణంగానే నేటికీ రుచికరమైన తాజా మత్స్యాహార పదార్ధాలకు జపాన్ మార్కెట్ అగ్రస్థానంలో ఉంది. 


చివరికి వారేంచేశారంటే... నీటి ట్యాంకులో చేపలతో పాటు ఒక చిన్న షార్క్ ను కూడా వేసేవారు. ప్రాణభయంతో చేపలు అనుక్షణం కదులుతూ అప్రమత్తంగా ఉండేవి. ఆ కదలికల్లోని చురుకుదనం వాటిని జీవకళతో తాజాగా ఉంచేది.


జగజ్జేతగా ఖ్యాతిగాంచిన అలెగ్జాండర్ జీవితమంతా విజయగాథలతో నిండిలేదు. పెషావర్ యుద్ధంలో 'అశ్వకుల' అనే బలమైన శత్రుజాతిని వీరోచితంగా ఎదుర్కొనే శక్తి చాల్లేదతనికి! దాంతో రాత్రి చీకట్లో కోటలోకి జొరబడి మూకుమ్మడి ఉచకోతలకు తెగబడ్డ ఉదంతాన్ని సుప్రసిద్ధ చరిత్రకారుడు సుధాకర్ చటోపాధ్యాయ'ద అకమీనీడ్స్ అండ్ ఇండియా'లో గ్రంథస్థం చేశారు.


సవాళ్లు అనేవి మనల్ని చురుకుగా ఉంచే షార్కుల్లాంటివి.వాటిమీద పైచేయి సాధించే క్రమంలో తెలియకుండానే మనలో మరింత శక్తి ఉద్భవిస్తుంది. 


గెలుపు కేవలం సంతృప్తినే కాదు.. సంతోషాన్ని అందిస్తుంది. 


సంతోషంగా జీవించడమంటే ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లపై గెలవడమే.

Panchaag


 

వారాలను మొదట తయారు చేసిందెవరో

 *వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?*



*"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః "*  అంటే అర్ధం తెలుసా? 


*సూర్యహోర*


*చంద్రహోర*


*కుజహోర*


*బుధహోర*


*గురుహోర*


*శుక్రహోర*


*శనిహోర - అంటే*


ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగము, ఇవి ఎంతో శాస్త్రీయమైనవి.


ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి! వారము - అంటే 'సారి' అని అర్ధము.


1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!


కాస్త విపులంగా....


భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే.ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.


మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః


అనగా... 

పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి. 


ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి? 


ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?


ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.


భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. 


ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.


ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. 


ఆ భాగాలను వారు "హోర" అన్నారు.


"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది.


దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు. 


ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.


హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.


ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. 


ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది. 


కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.


మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు - మంగళవారం,


ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.


ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.


అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. 


వస్తున్నా... అక్కడికే వస్తున్నా...


ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. 


దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు.


అదే మొదటిరోజు. 


అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.


ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే. 


అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది.

అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.


ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది. ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు. 

అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం! 

అదీ...భారతీయ ఋషుల గొప్పదనం!

ఇరవై ఏడు నక్షత్రాల

 _*భజే శ్రీనివాసమ్*_

*(ఇరవై ఏడు నక్షత్రాల శ్రీనివాస దివ్య వైభవం)*

*రచన.*

*తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్త.*

🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻


 *అశ్వని. --1*


నక్షత్రాలన్నింటిలో మొదటిది అశ్వని. ఈ నక్షత్రానికి అశ్విని దేవతలు అధి దేవతలు. ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మేషరాశికి చెందుతాయి.అశ్వని నక్షత్రం నాడు శ్రీనివాసుని దర్శించడం వలన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. దేవతల వైద్యుడైన ధన్వంతరి శ్రీమన్నారాయణుడే. శ్రీమన్నారాయణుని అశ్వనీ నక్షత్రం రోజున ఎవరు ఆరాధిస్తారో వారికి ఎటువంటి అనారోగ్యం నుంచైనా వెంటనే ఉపశమనం కలుగుతుంది. పూర్వకాలంలో కోసల దేశంలో రేవంతుడనే రాజు ఉండేవాడు.

రేవంతునికి పూర్వ జన్మ కర్మ ఫలితంగా ఒక విచిత్ర రోగం పట్టుకున్నది. పగలు ఎంతో చలాకీగా ఉండే రేవంతునికి సూర్యాస్తమయం కాగానే

కంటిచూపు మందగించేది. చెవులకు ఏమీ వినిపించేది కాదు. తల తిరుగుతున్నట్లుగా ఉండేది. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి తానుఎవరో కూడా మరిచి పోయేవాడు. రాత్రంతా నిద్ర లేక అంత:పురం అంతా పిచ్చి వాడిలా తిరిగేవాడు. తెల్లవారగానే తిరిగి మామూలు మనిషి అయ్యేవాడు. ఈ వ్యాధి ఏమిటో ఎవరికీ అంతు చిక్కలేదు. రాజవైద్యులు

చెయ్యని చికిత్స లేదు. ఈ వ్యాధి అంతు పట్టక రాణి ఎంతో దు:ఖించి ఎన్నో దేవతలకు మొక్కుకున్నది. అయినా ఫలితం లేకపోయినది. రాజు తన ఈ వింత వ్యాధి పోగొట్టినవారికి అర్ధరాజ్యం ఇస్తానని చాటించాడు. దేశం నలుమూలల నుండి ఎందరో గొప్ప వైద్యులు వచ్చి ఎన్నో రకాల వైద్యం చేసినా ఏ మాత్రం ఫలితం లేకపోయింది. ఆ రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు ఆ రాజ్యానికి ఒక సాధువు వచ్చాడు. పగలంతా శిష్యులతో సంచారం చేసి రాత్రికి ఒక పెద్ద చెట్టుకింద

విశ్రమించాడు.అటుగా పోతున్న బాటసారులు కొంతమంది ఆ రాత్రికి ' చెట్టుకిందనే గడుపు దామని వచ్చారు.ఆ బాట సారుల మాటలు కొన్ని సాధువు చెవిన పడ్డాయి. ఆ దేశపు రాజైన రేవంతుడు ఎంతకీ అంతుచిక్కని విచిత్ర వ్యాధితో బాధ పడు తున్నట్లుగా గ్రహించాడు. ఆ రాజు వ్యాధి తగ్గే మార్గం తన దగ్గర ఉన్నదని గ్రహించిన సాధువు మరుసటి రోజు రాజాస్థానానికి చేరుకున్నాడు. తను వచ్చిన సంగతి వివరించాడు.తాను రాజుయొక్క వ్యాధి తప్పక నయం చేయగలనని మంత్రితో చెప్పాడు. అయితే అతని మాటలను ఎవరూ నమ్మలేదు. ఎందరో గొప్ప వైద్యులకు సాధ్యం కానిది ఈ సామాన్య సాధువు వలన అవుతుందా అని తలచారు.కానీ రాణి మాత్రం ఏ పుట్టలో ఏ పాముందోనని తలచి సాధువుతో" స్వామీ!  తమరి రాక మాకెంతో సంతోషం, దయచేసి నా నాథుడి వ్యాధి నయమయ్యే దారి చెప్ప వలసింది" అని వేడుకుంది. అంతట ఆ సాధువు ఒకసారి కళ్ళు మూసుకుని ధ్యానించి 'అమ్మా! నేను చెప్పినట్లుగా చేస్తే ఈవ్యాధి తప్పక నయ మవుతుంది. ఈ వ్యాధే కాదు, ఎంతటివ్యాధైనా సరే తప్పక నయమవుతుంది. నీవు చేయవలసిందల్లా ఒక్కటే! రాజును నీవెంట పెట్టుకుని వేంకటాద్రి చేరి అశ్వనీ నక్షత్రం నాడు పుష్కరిణిలో స్నాన మాచరించి, వరాహ స్వామిని దర్శించి అటు తర్వాత ఆనందనిలయంలోని శ్రీనివాసుని దర్శించవలసింది. ఆ మరుదినమే రాజు పూర్తిఆరోగ్యవంతుడౌతాడు. నేటికి ఏడవరోజునే అశ్వనీ నక్షత్రం. ఇక ఆలస్యంచేయక రేపే ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని తిరుమల యాత్ర చేయవలసింది

అని చెప్పాడు.ఇదంతా సావధానంగా విన్న రాణి ఆ సాధువునికి నమస్కరించి

తగు రీతిన సత్కరించి పంపింది. సాధువు చెప్పినట్లు గానే వెంటనే ప్రయాణపు ఏర్పాట్లు ప్రారంభించి అశ్వనీ నక్షత్రానికి ఒకరోజు ముందుగానే తిరుమలకు చేరుకున్నారు. మరునాడు సూర్యోదయం కాగానే రాజు,రాణి ఇద్దరూ స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి, వరాహ స్వామిని దర్శించి తరువాత ఆనంద నిలయంలో శ్రీ స్వామి వారిని దర్శించారు. స్వామిని తమను అనుగ్రహించ వలసిందిగా అనేక విధాల ప్రార్థించారు.ఆ రోజు రాత్రి కొండమీదనే విశ్రమించ దలచారు. సూర్యాస్తమయం దగ్గర పడుతున్న కొద్ది రాణి మనసులో అలజడి ప్రారంభమైంది. ఈ రాత్రి

తన నాథుడు ఎలా వుంటాడో అని ఎంతో బాధపడింది. ఇంతలోనే సాయంత్రం అయ్యింది. రాజు నవ్వుతూ కులాసాగా వున్నాడు. రాత్రి చీకటి కాసాగింది. రాజులో వ్యాధి లక్షణాలు ఎక్కడా లేవు.

రాజు పూర్తి ఆరోగ్యవంతుడిలా వున్నాడు. రాజు వ్యాధి పూర్తిగా నయమైందని గ్రహించిన దంపతుల ఆనందానికి అవధులు లేవు.తెల్లవార గానే ఆ రాజ దంపతులిద్దరూ ఆలయానికి వెళ్ళారు. వారు ఆనంద నిలయం చేరేటప్పటికి అక్కడ వున్న అర్చకులు ఎంతో కమనీయ స్వరంతో స్వామికి సుప్రభాతసేవ చేస్తున్నారు. ఆ సమయంలో శ్రీనివాసుని ఆ అద్భుత దివ్య మంగళ స్వరూపం చూసిన రాజ దంపతులు ఆనందానికి

అవధులు లేవు. ఈ సృష్టిలోని అందం అంతా ఆ స్వామిదే. ఈ విశ్వంలోని తేజస్సంతా ఆ పరబ్రహ్మమూర్తిదే. ఈ జగత్తులోని ఆనందమంతా స్వామిలోనే వున్నది. ఇలా స్వామి గుణ గణాలను తలుస్తూ రాజ దంపతులిద్దరూ చేతులు జోడించి స్వామికి నమస్కరిస్తూ నిల్చున్నారు. సుప్రభాతసేవ పూర్తికాగానే


అక్కడ వున్న అర్చకులతో రాజుయొక్క అనారోగ్యము, తిరుమల యాత్రతో స్వామి అనుగ్రహంతో రాజు అనారోగ్యం పూర్తిగా నయమవటం తెలిపారు.

అప్పుడు అర్చకులు ఆ రాజుతో మహారాజా! ఈ శ్రీనివాసుడు భక్త వత్సలుడు.తనను నమ్మినవారికి సర్వం అనుగ్రహించే అమృతమూర్తి. ఆ స్వామిని జీవితాంతం కొలచి మీ జన్మను సార్థకం చేసుకొనవలసింది అని అన్నారు. అప్పుడు రాజ దంపతులిద్దరూ “ఓ శ్రీమన్నారాయణా! శ్రీనివాసా!

నీవు భక్త సులభుడవు. నిన్ను నమ్మినవారికి సర్వం అనుగ్రహించే

అమృతమూర్తివి. ఈ సృష్టిలో నిన్ను మించిన దైవం లేదు. నీకివే మానమస్కారాలు”. అని పరిపరివిధాల ప్రార్థించి తిరిగి రాజ్యానికి పయనమై

కలకాలం సుఖంగా జీవించారు.

అశ్వనీ నక్షత్రం నాడు స్వామిని దర్శించినవారికి సంపూర్ణ

ఆరోగ్యంతోపాటు, ఐశ్వర్యమూ కలుగుతుంది. ఎటువంటి అనారోగ్యమైనాక్షణంలో మాయమౌతుంది. ఎంతటి దీర్ఘవ్యాధులైనా అశ్వనీ నక్షత్రంనాడు శ్రీ స్వామిని దర్శించటం వలన వెంటనే నయమవుతాయి.ఓ శ్రీనివాసా! నీకివే మా నమస్కారములు. ఓ శ్రీమన్నారాయణా! నీకివే ప్రణామములు. ఓ జగద్రక్షకా! నీకివే మా నమస్కారములు.

" శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్

శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ”

🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸🫐

మాఘ పురాణం - 1 వ అధ్యాయము*_

 _*మాఘ పురాణం - 1 వ అధ్యాయము*_

🌹🍃🌸🍃🌻🍃🌺🍃🌷


*మాఘ మాస మహిమ*


*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*

*ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||*

*వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |*

*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*

*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |*

*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||*


 ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారత దేశంలో హిమాలయాది  పర్వతములు , గంగాది నదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెంది నాయి. వైశాఖం , ఆషాడం , కార్తీకం , మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయక ములైన కాలములో చేసే స్నానం , జపం , తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.


పూర్వం మహర్షులు శ్రీ మహా విష్ణువు వద్దకు వెళ్లి *'స్వామీ ! స్నానానికీ , ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ పావనమూ  సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా ! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ , అని చెప్పి తన చక్రాన్ని విసిరి నాడట , ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచు కొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతం లోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో , ఆయన కుమారుడు సూతమహర్షియో  అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించు కునేవారు అంటే నైమిశారణ్యం లోని ఆ ఆశ్రమంలో జపహోమా దులూ లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.


ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో *సూతమహర్షి* వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి ! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణ ప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల  సమర్థులు , రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామ ధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరము లైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయ వుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.


సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరు నవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి , పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి , వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత , నాకు తెలిసిన విషయాన్ని , మీ అనుగ్రహం చేత స్పురింప జేసుకొని యధాశక్తి  వినిపించి మీ ఆనందాశీస్సులనీ , భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను , మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు *'సూతమహర్షి లోగడ వైశాఖమాసం , కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని'* కోరారు.

అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షి సత్తములారా ! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్న వారు కొద్దిమంది అయినా , యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే  విషయాన్ని అడిగింది.  గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.


పార్వతీదేవి పరమేశ్వరునితో *"విశ్వాత్మకా ! సర్వలోకేశ్వరా ! సర్వభూతదయానిధీ ! ప్రాణేశ్వరా ! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని"* ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు *"కళ్యాణీ ! జగన్మంగళా ! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢ మైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును ? తప్పక చెప్పెదను ,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాల స్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినొందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగోట్టును.రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయే టట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపల నున్న సరస్సు , నూయి , కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా ,తెలిసికాని , తెలియకకాని , బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైననుసూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.


మాఘస్నానమును మాని , విష్ణువునర్చింపక , దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును ? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు , నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మల నొందుదురు సుమా,దరిద్రులైనను , బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు , అశక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.


ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను , మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింప జేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘ స్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని , భయముచే గాని , బలవంతముగా గాని , మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానము గాని చేసిన స్నానఫలమునొంది పుణ్య వంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని , చేయించిన వారికిని పుణ్యము కల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను , నివారించినను మహాపాపములు కలుగును.


పార్వతీ ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని , ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘ మాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని , నిందించినను , నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వత ముత్తమము. కావున మాఘమాస స్నానమునంత పుణ్యప్రదము సుమా.


దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసి పోయెను. మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సుల నందెను. ఆ బ్రాహ్మణుడు *'మహారాజా ! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండ పోవుచున్నావేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని , సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా ? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.*


దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా ! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్య కార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. మాఘమాసమున ప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములను పోగోట్టి అక్షయములైన పుణ్యఫలముల నిచ్చును. స్నానమే యింత అధికమైన పుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము. 


పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము(వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య - హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు , ప్రభువులు , మునులు , మహర్షులు , పశువులు , పక్షులు , సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి , అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు , కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.


ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగము వలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా ! నాకు భోగ భాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా ! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు , నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.


భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము , దురదృష్టము , పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము , పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము , పూజ , జపము , తపము జీవికి గల పాపమును పోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము , మాఘ మాసములో నదిలోగాని , సముద్రములోగాని , కాలువలోగాని , సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘ స్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘ స్నానమును  యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును  తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై , మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునొంది తన భార్యలో బాటు తనలోకమున కెగెను. దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా ? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను.

🌹🍃🌸🍃🌻🍃🌺🍃🌷

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*అమ్మ చెప్పిన మాట!*


శ్రీ స్వామివారి మందిర ప్రాంగణంలో భక్తులు ప్రదక్షిణ చేయడానికి ఓ ఐదారు అడుగుల వెడల్పుతో కాలిబాట లాగా ఉండేది..మిగిలిన స్థలమంతా గడ్డి మొలచి..అందులో పల్లేరు కాయల ముళ్ళతో నిండిపోయి ఉండేది..ఈ పరిస్థితి 2004 సంవత్సరం నాటిది..అప్పటికి నేను ధర్మకర్త గా బాధ్యతలు తీసుకొని నాలుగు రోజులు కూడా కాలేదు..ఆ ప్రక్క ఆదివారం రోజున..గాలిచేష్ట లతో బాధపడుతున్న భక్తులు..ఆ ముళ్ల మీదే కేకలు వేసుకుంటూ పరిగెడుతున్నారు..వారున్న మానసిక స్థితిలో..వారికి ముళ్ళు గ్రుచ్చుకున్నా పెద్దగా బాధ పడటం లేదు కానీ..చూస్తున్న మా కందరికీ చాలా కష్టంగా అనిపించింది..


ఆ ప్రక్కరోజే మనుషుల ను మాట్లాడి..ఆ స్థలమంతా శుభ్రంగా చేయించాను..మొత్తం ప్రాంగణం మంతా నాపరాయి పరిపించాలని సంకల్పించాను..సుమారు యాభైవేల రూపాయలు అవుతుందని ఒక అంచనాకు వచ్చాము..ఈ మొత్తం ఎక్కడి నుంచి తీసుకు రావాలి?..భక్తుల నుంచి చందాల రూపంలో తీసుకుందామని మా సిబ్బంది సలహా ఇచ్చారు..సలహా బాగుంది కానీ..నాకున్న ఇబ్బంది ఏమిటంటే..నేను గబుక్కున ఎవ్వరినీ ఏదీ అడగలేను..


మొగలిచెర్ల లోని మా ఇంటికి వచ్చి..మా అమ్మగారైన ప్రభావతి గారితో సమస్య చెప్పాను.."అమ్మా..భక్తుల బాధ చూడలేకుండా వున్నాను..దెయ్యం పట్టిన వాళ్ళు..గాలి చేష్ట తో బాధపడేవాళ్లు..ఇతర మానసిక జబ్బులున్న వాళ్లు..అందరూ ఆ ముళ్ల లోనే పొర్లాడుతున్నారు..చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉన్నది..అందుకనే ఈరోజు మొత్తం శుభ్రం చేయించాను..ఇక నాపరాయి పరిపిస్తే..బాగుంటుందని ఆలోచిస్తున్నాను..దేవస్థానం వద్ద అంత డబ్బు లేదు..నేనేమో ఎవ్వరినీ చందాలు కావాలని అడగలేను..నా మొహమాటం నాది..ఏం చెయ్యాలో పాలుపోవటం లేదమ్మా.." అన్నాను..


అమ్మ నన్ను తన దగ్గరగా కూర్చోమని చెప్పి.."నువ్వు ఒక మంచి పని చేద్దామని సంకల్పించావు..అది అందరు భక్తులకూ ఉపయోగకరంగా ఉంటుంది..నువ్వు ఎవ్వరినీ ఏమీ అడగవద్దు..ఒక ముఖ్య సూత్రం చెపుతున్నా విను..నేరుగా ఆ స్వామి సమాధి వద్దకు వెళ్ళు.. నిన్ను నువ్వు ఆయనకు శరణాగతి చేసుకో..ఇప్పుడే కాదు..ఎప్పుడు నీకు సమస్య వచ్చినా..ఆ సమాధి ముందు మోకరిల్లు.. అంతా స్వామివారు చూసుకుంటారు..కాకుంటే ఇందులో ఇంకొక అభ్యంతరం ఉంది..ఏ కోరికా నీ స్వార్ధానికి కోరుకోకు!!.. అలా కోరుకున్నావో..అది జరగదు..నువ్వు మరికాస్త బాధపడటం తప్ప మరేమీ రాదు..రేపుదయాన్నే శుచిగా..నువ్వూ..నీ భార్యా..ఇద్దరూ మందిరానికి వెళ్ళండి..ఆ సమాధి వద్ద మనస్ఫూర్తిగా మీలోని వేదనను చెప్పుకోండి..ఆ తరువాత అంతా ఆ స్వామివారే చూసుకుంటారు.." అన్నది..


ఆ మాటలు తారకమంత్రం లా నా మీద పనిచేసాయి..ప్రక్కరోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా నేనూ మా ఆవిడా ఇద్దరం శ్రీ స్వామివారి మందిరానికి వెళ్ళాము..ఆరోజు మంగళవారం..మందిరం లోని బావి వద్దకు వెళ్లి..ఆ బావిలోని నీళ్లను కొద్దిగా నెత్తిమీద చల్లుకుని..ప్రధాన మంటపం లోకి వచ్చాము..ఇంతలో..

"అయ్యా!..మీకోసం ఉదయం ఆరు గంటల నుంచీ ఒకాయన ఎదురు చూస్తున్నాడు..ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడి వెళ్ళండి.." అని మా సిబ్బందిలో ఒకరు చెప్పారు..


సరే అన్నాను..ముందు మంటపంలో అతను కూర్చుని ఉన్నాడు..రమ్మని పిలవగానే గబ గబా వచ్చాడు..ఒక ఐదు నిమిషాల పాటు పరిచయాలయ్యాక.."అయ్యా..ఈ మొత్తం ప్రాంగణం అంతా రాళ్లు పరిపించాలని అనుకున్నాను..మా వాళ్ళు ఒంగోలు లో వున్నారు..భూములు కొని..అమ్మే వ్యాపారం చేస్తున్నారు..ఇళ్ల స్థలాల వ్యాపారమూ చేస్తున్నారు..మీరొప్పుకుంటే..వాళ్ళతో మాట్లాడి పని మొదలు పెట్టిస్తాను.."అన్నాడు..


ఒక్కక్షణం నోట మాట రాలేదు..మేము ఇంకా శ్రీ స్వామివారి సమాధి వద్దకు కూడా పోలేదు..మా మనసులోని కోరిక అక్కడ చెప్పుకోనూ లేదు..మా అమ్మగారు చెప్పినట్టు శరణాగతి చెందనూ లేదు..కానీ..మా ఆలోచన ఆ స్వామివారు పసిగట్టేశారు..పిలువకముందే స్వామివారు పలుకుతున్నారనిపించింది..


అమ్మ చెప్పిన మాట అక్షర సత్యమై కూర్చుంది.."ఏ కోరికా స్వార్ధానికి కోరుకోకు!!" అని ఆమె హెచ్చరించింది..ఇప్పటి కోరిక భక్తులకు సంబంధించింది..


వచ్చినతను నా అనుమతి కోసం చూస్తున్నట్టు వున్నాడు..నిజానికి మధ్యలో నేను ఎవరిని?..నిమిత్తమాత్రం గా వున్నాను..అంతే!..మా దంపతులము శ్రీ స్వామివారి సమాధికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాము..


"సరే !.. మీరు అనుకున్న విధంగా చేయండి!.." అన్నాను..ఆమాట చెప్పిన వెంటనే..ఆయన సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు..ఆరోజు జరిగిన విషయమంతా అమ్మకు చెప్పాను..ఆవిడ నవ్వింది..మరో మూడు నెలలకు..ప్రాంగణం అంతా నాలుగు లక్షలు ఖర్చుపెట్టి పాలరాయి పరిపించారు..ఎక్కడి యాభై వేలు?..ఎక్కడి నాలుగు లక్షలు?..పల్లేరు కాయల ముళ్ళతో ఉన్న మందిరప్రాంగణం.. పాలరాయి తో నిండిపోయింది..


ఆరోజు నుంచీ ఈనాటిదాకా అమ్మ చెప్పిన ఆ మాటలు మా హృదయాల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114.. సెల్..94402 66380 & 99089 73699).

గురువారం 30 జనవరి 2025

 🌹🌷🪔🛕🪔🌷🌹

*🪷గురువారం 30 జనవరి 2025🪷*

          *_రేపటి నుండి*

   *మాఘమాసం ప్రారంభం* 

*మాఘమాసం విశిష్టత ఏమిటి ?*


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*'మఘం'* అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.


మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. *మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.*


కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.


మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి నీలలోహిత , పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని , వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు.


*ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు.* స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.


*మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని , తటాక స్నానం ద్విగుణం , నదీస్నానం చాతుర్గుణం , మహానదీ స్నానం శతగుణం , గంగాస్నానం సహస్ర గుణం , త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం.*  మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో *'ప్రయాగ'* ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.


మాఘ పూర్ణిమను *'మహామాఘం'* అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.


*🌹మాఘమాసం మహిమ🌹*


అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు.


శివుడైనా , విష్ణువైనా , ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి , సూర్య తదితర దేవతల పూజలు , వ్రతాలు కూడా జరుగుతుంటాయి.


మాఘ విశిష్టతను గురించి , ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది , చెరువు , మడుగు , కొలను , బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే *ప్రయాగలో స్నానం* చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం.


               *తిథులు:-*


1. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన , నువ్వులతో హోమం , నువ్వుల దానం , నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం , ఉప్పు దానం చేయటం మంచిది. 

2. శుద్ధ విదియ 

3. శుద్ధ చవితి 

4. శుద్ధ పంచమి 

5. శుద్ధ షష్టి 

6. శుద్ధ సప్తమి 

7. అష్టమి 

8. నవమి 

9. ఏకాదశి 

10. ద్వాదశి 

11. త్రయోదశి 

12. మాఘ పూర్ణిమ 

13. కృష్ణపాడ్యమి 

14. కృష్ణ సప్తమి 

15. కృష్ణ ఏకాదశి 

16. కృష్ణద్వాదశి 

17. కృష్ణ చతుర్దశి 

18. కృష్ణ అమావాస్య ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు , పర్వదినాలు , వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.


ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి *"శుక్ల పక్ష చవితి"* దీనిని *"తిల చతుర్థి"* అంటారు. దీన్నే *"కుంద చతుర్థి"* అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున *"డుంఢిరాజును"* ఉద్దేశించి , నక్త వ్రతము పూజ చేస్తారు ! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు. *"కుంద చతుర్థి"* నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు , సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి.


మాఘమాసంలో ప్రాతఃకాలంలో చేసే స్నాన , జప , తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు *"దుఃఖ దారిద్ర్య నాశాయ , శ్రీ విష్ణోతోషణాయచ ! ప్రాతఃస్నానం కరోమ్య , మాఘ పాప వినాశనం!"* అని చేసిన తరువాత *"సవిత్రేప్రసవిత్రేచ ! పరంధామజలేమమ ! త్వత్తేజసా పరిబ్రష్టం , పాపం యాతు సస్రదా !"* అని చదవాలి. సూర్య భగవానునికి అర్గ్యమివ్వాలి.


ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ నెలనాళ్ళు ముల్లంగి దుంపను తినరు. ఈ మాసంలో నువ్వులను , పంచదారను కలిపి  తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది. ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. *"మాఘశుద్ద పంచమి"ని శ్రీ పంచమి అంటారు. ఈ పంచమి నాడే "సరస్వతీదేవి" జన్మించిందట. ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.*


ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని , సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. ఆవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వాగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.


అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది.


ఇక మాఘశుద్ద సప్తమి ఇదే *"సూర్య సప్తమి"అని కూడా పిలువబడుతుంది. ఇదే రథసప్తమి సూర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.* ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది. ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.


సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే *"శమంతకమణి"* ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజ్ఞవల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. *ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్* అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. *రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా ! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్‌క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట.*


భీష్మాష్టమి *"మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ !ప్రాజాపత్యేచ నక్షత్రే మద్యఃప్రాప్తే దివాకరే !"* శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్ఛంద మరణం ఆయనకి వరం.


ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందిన శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే. ఈ విధంగా మాఘమాసమంతా *"శివరాత్రి"* వరకూ అన్ని పర్వదినాలే.


                    *సేకరించి*

*🌷భాగస్వామ్యం చేయడమైనది🌷*

     *న్యాయపతి నరసింహారావు🙏*

29, జనవరి 2025, బుధవారం

*కంచి పరమాచార్య వైభవం.180*

 *కంచి పరమాచార్య వైభవం.180* 


*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం* 

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।* 


*🌸గుజరాతీ బ్రాహ్మణుడు - నిప్పుల కొలిమి🌸* 


చాలా ఏళ్ల క్రితం తమిళ సంవత్సరాది అయిన చిత్తిరై నెల మొదటి రోజున శ్రీమఠంలో చాలా రద్దీగా ఉంది. మెల్లిగా కదులుతున్న ఆ వరుసలో మహాస్వామి వారి దర్శనార్థమై ఒక పదహారు సంవత్సరాల పిల్లవాడు కూడా ఉన్నాడు. దాదాపు పది గంటల సమయంలో ఆ అబ్బాయి మహాస్వామి వారు కూర్చున్న వేదిక వద్దకు వచ్చాడు. స్వామి వారు అతన్ని చూసారు. తన అష్ట అంగములు నేలకు తగిలేట్టు స్వామి వారిని సాష్టాంగం చేసాడు కాని ఎంతసేపటికి పైకి లేవలేదు. కొద్దిసేపటి తరువాత మహాస్వామి వారే లెమ్మన్నారు.


అతను లేచినిలబడి తన రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసాడు. కలిగిన అనుభూతి ఇంకా వీడలేదు. కళ్ళ నుండి నీరు కారుతూ ఉంది. స్వామి వారు దగ్గరికి రమ్మన్నారు. అతను అలాగే స్వామి వారి వద్దకు వెళ్ళాడు.


స్వామి వారు అతన్ని “బాబూ నువ్వు ఎవరు? నీ పేరేమి? ఎక్కడినుండి వస్తున్నావు?” అని అడిగారు. ఆ అబ్బాయి చాలా వినయంతో, తన కుడి అరచేతిని నోటి వద్దకు తెచ్చి, “స్వామి నా పేరు బాలకృష్ణ జోషి. నేను మద్రాసు నుండి వచ్చిన గుజరాతీ బ్రాహ్మణున్ని. నా స్వస్థలం గుజరాత్” అని చెప్పాడు.


”మద్రాసులో ఏ ప్రాంతం?”


“హనుమంతనారాయణన్ కోయిల్ వీధి స్వామి” జోషి సమాధానమిచ్చాడు.


”ఎంతదాకా చదువుకున్నావు?”


“ఎనిమిది దాకా పెరియవ” చిన్న స్వరంతో చెప్పాడు.


”సరే!! ఈ రోజు సంవత్సరాది కావున ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాలలో స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చావు కదూ” అని అడిగారు.


”అది కాదు పెరియవ. నేను పెరియవ దర్శనం చేసుకోవడానికి వచ్చాను”


వెంటనే మహాస్వామి వారు “అపచారం అపచారం నువ్వు అలా చెప్పకూడదు. మనం వేరే ప్రదేశం వెళ్ళినప్పుడు అక్కడున్న శివాలయములు, విష్ణ్వాలయములు, అమ్మవారి ఆలయములు దర్శించుకోవాలి. నేను కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొదట దేవాలయ దర్శనం చేసిన తరువాతనే ఏపనైనా అర్థమైందా?” అని స్వామి వారు నవ్వారు.


”ఇప్పుడు అర్థమైంది పెరియవ” జోషి అణుకువగా చెప్పాడు. ”మంచిది. అచార్యులు ప్రసాదం ఇచ్చిన తరువాత నువ్వు అన్ని దేవాలయాలను చూసి మద్రాసు బస్సు ఎక్కాలి. తెలిసిందా?” అని స్వామి వారు చెప్పారు


కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న బాలకృష్ణ జోషి, “నాకు బాగా అర్థమైంది పెరియవ. మీ ఆజ్ఞ ప్రకారం నేను అన్ని దేవాలయాలను చూసిన తరువాత మీ అనుగ్రహం కోసం మఠానికి వస్తాను” అని అన్నాడు.


పరమాచార్య స్వామి వారు నవ్వుతూ, “అదే అదే నేణు చెప్తున్నది. ఇప్పుడే నీకు ప్రసాదం ఇస్తాను. మళ్ళా ఇక్కడికి రావడం ఎందుకు? ఓహో దేవాఅలయ దర్శనానంతరం మఠంలో భోజనం చేసి వెళ్తావా?మంచిది మంచిది అలాగే” అని స్వామి వారు తమ సమ్మతిని తెలిపారు.


జోషి కొద్దిగా సొంకోచిస్తూ నిలబడ్డాడు. అతని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.

“ఏమిటి విషయం?” అని స్వామి వారు ప్రేమతో అడిగారు. జోషి కళ్ళు తుడుచుకుంటూ “నేను ఇక్కడ కొద్దికాలం ఉండాలనుకుంటున్నాను. అందుకని...”

అతను ముగించేలోపలే స్వామి వారు అడ్డుపడుతూ,


“ఇక్కడ అంటే? నాకు అర్థం కాలేదు”


“ఇక్కడే మఠంలో పెరియవ” అని వినయంతో చెప్పాడు. ”ఏంటి మఠంలోనా? ఇది సన్యాసులు ఉండే చోటు. నీలాంటి యువకులకు ఇక్కడేం పని?” కొంచం దృఢమైన స్వరంతో “స్వామి దర్శనం చేసుకుని నీ చోటికి వెళ్ళిపో” అన్నారు.


జోషి కదలలేదు. స్వామి వారికి మళ్ళా సాష్టాంగం చేసి అసలు విషయం బయటపెట్టాడు. “పెరియవ అలా ఆజ్ఞాపించకండి. మఠంలో కొద్దికాలముండి మిమ్మల్ని సేవించుకోవాలని నా కోరిక”


పరమాచార్య స్వామి వారికి పరిస్థితి అర్థమైంది.


జోషి అమ్మయకపు మాటలు, అతని భక్తి తత్పరత మహాస్వామి వారిని ఆకర్శించాయి. కాని అది బయటపడనీయకుండా, “నన్ను సేవించడానికి ఇక్కడ చాల మంది యువకులు ఉన్నారు. చిన్న పిల్లాడివి నీకెందుకు ఇవన్నీ. మద్రాసుకు బయలుదేరు” అన్నారు.


జోషి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాని మఠం నుండి వెళ్ళిపోలేదు. అతను మఠంలోనే భోజనం చేసి, స్వామి వారు విశ్రాంతి తీసుకునే గది ముందు ఒక మూలన కూర్చున్నాడు. సాయింత్రం స్నానం తరువాత మహాస్వామి వారు బయటకు వచ్చి జోషిని చూసారు కాని ఏమి మాట్లాడక వెళ్ళిపోయారు.


నాలుగురోజులపాటు అవకాశం వచ్చినప్పుడల్లా స్వామివారి కనుచూపులో పడుతున్నాడు జోషి. నాలుగు రోజులు వైరాగ్య భక్తితో అక్కడే ఉండిపోయాడు. ఐదవ రోజు ఉదయం పరమాచార్య స్వామి వారు శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్తానం పుష్కరిణిలో కాల స్నానానికి వెళ్ళారు. స్నానం ముగించి వస్తూ జోషిని చూసి, “నువ్వు మద్రాసుకు వెళ్ళలేదా?” అని అడిగారు.


”లేదు పెరియవ. నా సంకల్పం సిద్ధించేవరకు నేను వెళ్ళను” అని బదులిచ్చాడు.


”ఏమిటి నీ సంకల్పం?” అని తెలియనట్టు అడిగారు.


”కొద్దికాలం పాటు మీ పాద కమల చరణ సేవ చేసుకోవాలి” ఆశావహంగా బదులిచ్చాడు జోషి.


”అసాధ్యమైన సంకల్పం చేయరాదు” అని పరమాచార్య స్వమి వారు వెళ్ళిపోయారు.


జోషి పట్టు వీడలేదు. స్వామి వారి గది ముందు నిలబడ్డాడు. స్వామి వారు భక్తుల దర్శనార్థమై బయటకు వచ్చారు. ఆ కుర్రవాని వైరాగ్యానికి స్వామి హృదయం మెత్తబడింది. అతన్ని దగ్గరకు పిలిచారు.


”మీ తండ్రి గారిది ఉద్యోగమా లేక వ్యాపారమా?” అని అడిగారు.


”వ్యాపారం పెరియవా. వజ్రాల వ్యాపారి. వజ్రాలను కొనడం అమ్మడం” జోషి బదులిచ్చాడు.


”నీకు ఉన్న స్వభావం చేత నీవు పెద్ద వ్యాపారి అవుతావు. అప్పుడు నువ్వు మంచి నమ్మకమైన నిజాఅయితీపరుడవైన వజ్రాల వ్యాపారి కావాలి. సరే నీ ఇష్ట ప్రకారం ఇక్కడున్న అబ్బాయిలతో కలిసి కొద్దికాలం నన్ను సేవించుకో” అని చివరికి తమ అమోదాన్ని తెలియజేసారు.


జోషి అక్కడున్న నలుగురైదుగురు యువకులతో స్వామి వారి సేవలో చేరాడు. స్వామి వారి దర్శనం, వారు చెప్పిన పనులు చేయడంతో రెండు రోజులు గడిచిపోయాయి. ఆ రెండు రోజులు పరమాచార్య స్వామి వారు నిద్రపోయే గదిలోనే మిగిలిన యువకులతో పాటు జోషి కూడా నిద్రపోయేవాడు. అది తనకు కలిగిన పరమ అదృష్టంగా భావించేవాడు.


మూడవ రోజు రాత్రి నిద్రపోయే ముందు స్వామి వారు జోషిని పిలిచి, “బాలకృష్ణ జోషి ఇప్పటి నుండి నువ్వు ఒక పని చేయాలి. వీరిలాగే నువ్వు కూడా నాతో ఉండు పగలంతా నా సేవ చేసుకో. కాని రాత్రి పూట నువ్వు ఇక్కడ పడుకోవద్దు” అన్నారు.


జోషి వెంటనే స్వామి వారి మాటలకు అడ్డు పడుతూ, “నా మీద దయ ఉంచి స్వామి వారు అలా ఆజ్ఞాపించవలదు. నేను కూడా ఈ అబ్బయిలతో పాటు ఇక్కడే పడుకునే వరం ఇవ్వండి” అని ఆత్రుతగా అడిగాడు.


”దీని వెనుక ఒక కారణం ఉంది” స్వామి వారు దృఢమైన స్వరంతో అన్నారు.“నువ్వు నా మాట వినాలి”


జోషి స్థాణువైపోయాడు. “అలాగే పెరియవ. మిరు ఏమి చెప్తే అది చేస్తాను”.


పరమాచార్య స్వామి వారు నవ్వి, “అలా చెప్పు. రాత్రి పూట నువ్వు వంటగదిలోకి వెళ్ళు. అక్కడ కట్టెల పొయ్యి వద్ద ఒక చెక్కబల్ల ఉంటుంది. ఆ బల్ల పైన హాయిగా నిద్రపోయి, ఉదయమే లేచి స్నానాదులు ముగించుకొని ఇక్కడకు రా. ఏంటి అర్థమైందా?” అని అన్నారు.


జోషి మరల ఏమి మాట్లాడలేదు. కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ, “మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను పెరియవ” అని వెళ్ళిపోయాడు. అక్కడున్న ఇతర యువకులు ఇదంతా చూసి నవ్వుకుంటున్నారు.


మహాస్వామి వారు ఎందుకు తనని ఒంటరిగా వంటగదిలో కొలిమి దగ్గర పడుకోమన్నారో జోషికి అర్థం కావటం లేదు. జోషి బయటకు రాగానే అక్కడున్న కుర్రవాడితో తనకు ఎప్పుడైనా ఇలా పడుకోమని చెప్పారేమో అని అడిగాడు. అతను లేదు ఎవరికి ఇలా చెప్పలేదన్నాడు.

జోషి ఇది అవమానంగా భావించాడు.


అప్పుడు రాత్రి పదిగంటలైంది. ఏడుస్తూ, నిర్మానుష్యంగా ఉన్న వంటగదిలోకి వెళ్ళి కట్టెల పొయ్యి దగ్గర ఉన్న చెక్కబల్ల పైన పడుకున్నాడు. ఆ రాత్రి అతను ఏమి తినలేదు. మనసంతా ఆందోళనగా ఉండి బాధ, ఏడుపు వల్ల గొంతు తడారిపోయింది. చాలాసేపు నిద్రపట్టలేదు. ఎప్పుడో మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.


తెలతెలవారుతుండగా మఠం మేల్కొంది. వెంటనే మఠంలో వేదపారాయణం భజనలు మొదలయ్యాయి. జోషి లేచి స్నాదులు ముగించుకుని, శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి అక్కడ కూర్చుండి పోయాడు. ఆరోజు స్వామివారి సేవకు వెళ్ళాలనిపించలేదు.


మద్యాహ్నం మఠానికి వచ్చి భోజనం చేసి మళ్ళా అమ్మవారి ఆలయానికి వెళ్ళాడు. రాత్రి వచ్చి వంటగదిలోని నిప్పుల కొలిమి దగ్గర పడుకున్నాడు. స్వామివారి దగ్గరికి అసలు వెళ్ళలేదు.


రెండు రోజులు ఇలాగే గడిచిపోయాయి. మూడవరోజు ఉదయం స్వామివారు ఒక సేవకుణ్ణి పిలిచి కంగారుగా అతణ్ణి అడిగారు “నాలుగు రోజుల క్రితం బాలకృష్ణ జోషి అనే కుర్రవాడు నా సేవకై ఇక్కడికి వచ్చాడు. రెండు రోజులుగా అతను కనపడ్డం లేదు. నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడా?”


ఆ సేవకుడు సంకోచిస్తూ, “లేదు పెరియవ అతను మఠంలోనే ఉన్నాడు” అని చెప్పాడు.


”మరి రెండు రోజులుగా ఎందుకు నా వద్దకు రావడం లేదు?”


“తెలియదు పెరియవ”


అంతలో మరొక సేవకుడు రావడంతో అతణ్ణి ఆ గుజరాతీ అబ్బాయి గురించి అడిగారు. అతనికి కూడా ఏమి తెలియదన్నాడు. ”సరే. జోషి ఎక్కడున్నాడొ వెతికి వెంటనే నేను రమ్మన్నానని తీసుకురండి” అని ఆజ్ఞాపించి వారి గదిలోకి వెళ్ళిపోయారు.


జోషి మహాస్వామి వారిముందు నిలబడ్డాడు. ”రా వత్సా! ఎందుకు రెండు రోజులుగా కనిపించటం లేదు. నీ అరోగ్యం బాఉన్నది కదా?” పరమాచార్యస్వామి వారు అపారమైన వాత్సల్యంతో అడిగారు.


జోషి మౌనంగా ఉన్నాడు.


”ఏదైనా దిగులా? లేక నా పైన కోపమా?” స్వామి వారు చిన్నపిల్లాడిలా అడిగారు.


జోషి చిన్నగా నోరు విప్పాడు. “అపచారం. అపచారం. కోపం ఏమి లేదు పెరియవ. నా మనస్సుకు చిన్న క్లేశం అంతే”


స్వామి వారు జోషి వంక ఆశ్చర్యంగా చూస్తూ, “బాధ. . . నా వల్ల?”. జోషి మౌనంగా ఉన్నాడు. స్వామి వారు వదల లేదు.


“రా ఇటు. ఇప్పుడు చెప్పు. నేను కూడా నీ బాధ ఏమిటో తెలుసుకోవాలి కదా?”

మహాస్వామి వారి ఒత్తిడి వల్ల జోషి నోరు తెరిచాడు. అక్కడున్న మిగిలిన యువకులు చేతులు కట్టుకుని నిలబడ్డారు. స్వామి వారికి సాష్టాంగం చేసి, తన కుడిచేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని, జోషి మాట్లాడడం మొదలుపెట్టాడు.


”ఏమి లేదు పెరియవ. మొదటి రెండు రాత్రులు మీరు అందరి లాగే నన్ను కూడా మీ గదిలో పడుకోనిచ్చారు. నాకు చాలా ఆనందం వేసింది. హఠాత్తుగా నన్ను పిలిచి, వంటింట్లోని కట్టెల పొయ్యి వద్ద పడుకోమన్నారు. నేను గుజరాతీ బ్రాహ్మణుడను కావడం చేత ఇక్కడి వాణ్ణి కాకపోవడం చేత మీరు అలా ఆజ్ఞాపించారు అనే విషయం నన్ను కలచివేసింది. దయచెసి నన్ను క్షమించండి పెరియవ...” జోషి చిన్నపిల్లాడిలా గట్టిగా ఏడుస్తూ, స్వామి వారి పాదములపై పడ్డాడు.


మహాస్వామి వారు పరిస్థితి అర్థం చేసుకున్నారు. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. నిశబ్ధం రాజ్యమేలుతోంది అక్కడ. అతణ్ణి ఒక్కడే వదిలెయ్యమని ఇతర యువకులను పంపించారు.


జోషిని దగ్గరకు పిలిచి పుత్రవాత్సల్యంతో అపారమైన కరుణతో


“అడడా బాలకృష్ణ. . . నేను నిన్ను నిప్పుల కొలిమి వద్ద పడుకోమన్నది నీవు ఇలా అర్థం చేసుకున్నావా? నేను అటువంటి అలోచనలతో నీకు అలా చెప్పలేదు. నీవు చిన్న పిల్లవాడివి అందుకే నన్ను అపార్థం చేసుకున్నావు”. ఈ మాటలు చెప్పి స్వామి వారు జోషిని తన వద్ద కూచోమన్నారు. జోషి సంకోచించి కింద నేలమీద కూచున్నాడు.


స్వామి వారు వాత్సల్య పూరితమైన మాటలతో “నిన్ను వంటింట్లో కట్టెల పొయ్యి వద్ద ఉన్న చెక్క బల్లపై పడుకోమని చెప్పడంలో నాకు అలాంటి ఉద్దేశము లేదు. అందుకు కారణం ఒక్కటే. జోషి ఇక్కడ చూడు” స్వామి వారు వారి వస్త్రాన్ని తొడ భాగం కనపడేలా పైకెత్తారు. స్వామి వారి తెల్లటి చర్మంపై దోమ కాట్ల వల్ల ఏర్పడిన ఎర్రటి దద్దుర్లు.


“వత్సా జోషి! ఇవి రాత్రిపూట నేను పడుకున్నప్పుడు దోమకాటు వల్ల ఏర్పడినవి. నేను సన్యాసిని కాబట్టి తట్టుకోగలను. నువ్వు చిన్న పిల్లాడివి ఆ బాధను నీవు భరించలేవు. మొదటి రెండు రాత్రులు నువ్వు దోమల వల్ల ఇబ్బంది పడడం నేను గమనించాను.


నువ్వు నాలాగే తెల్లగా ఉన్నావు. కనీసం నువ్వైనా మంచి స్థలంలో పడుకోవాలని భావించి అందుకని నిన్ను అక్కడ పడుకోమన్నాను. అక్కడి వేడి వల్ల దోమలు ఉండవు. నీవు హాయిగా నిద్రపోవచ్చు కదా. నిన్ను అలా ఆజ్ఞాపించడానికి కారణం అదొక్కటే. కాని నువ్వు నా మాటలను అపార్థం చేసుకున్నావు” అని స్వామి వారు గట్టిగా నవ్వుతున్నారు.


జోషి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ, కనుల నీరు తుడుచుకుంటూ, వెక్కిళ్ళతో మాట తడబడగా “పెరియవ!!! దయచేసి నన్ను మన్నించానని చెప్పండి. మీ అవ్యాజమైన కరుణని అర్థం చేసుకోలేక నోటికివచ్చినట్టు మాట్లాడాను. నన్ను క్షమించండి” అంటూ సాగిలపడ్డాడు.


ఆ కరుణాస్వరూపులూ ప్రేమస్వరూపులు నవ్వుతూ, రెండు చేతులనూ పైకెత్తి జోషిని ఆశీర్వదించారు.


”జోషి నువ్వు భవిష్యత్తులో మంచి వజ్రాల వ్యాపారివి అవుతావు. న్యాయంగా ధనమార్జిస్తూ ధర్మంగా బ్రతుకు” అని స్వామి వారు మళ్ళా అశీర్వదించారు.


తరువాతి కాలంలో, బాలకృష్ణ జోషి మంచి దక్షత కలిగిన వ్యాపారవేత్తగా స్వామి వారి శిష్యుడుగా మెలిగాడు. స్వమి వారి తరువాత కొంత కాలానికి వారి పాదాలు చేరుకున్నాడు.


 *--- శ్రీ రమణి అణ్ణా, శక్తి వికటన్ ప్రచురణ* 



 *#Kanchiparamacharya vaibhavam* *#కంచిపరమాచార్యవైభవం*

భాగవతావతరణము

 శు భో ద యం 🙏


-భాగవతావతరణము!


"ధాతవు, భారతశ్రుతివిధాతవు, వేదపదార్థజాతవి

జ్ఞాతవు, కామముఖ్యరిపుషట్కవిజేతవు, బ్రహ్మతత్త్వని

ర్ణేతవు, యోగినేతవు, వినీతుఁడ వీవు చలించి చెల్లరే!

కాతరుకైవడిన్ వగవఁ గారణ మేమి? పరాశరాత్మజా!"


టీకా:

ధాతవు = బ్రహ్మ దేవుడివి; భారత = భారతమనే; శ్రుతి = వేదము; విధాతవు = సృష్టించిన వాడివి; వేద = వేదము లందలి; పదార్థ = విషయముల నుండి; జాత = పుట్టిన; విజ్ఞాతవు = విజ్ఞానము కలవాడివి; కామ = కామము {అరిషడ్వర్గములు - 1కామము 2క్రోధము 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు; ముఖ్య = మొదలగు; రిపు = శత్రు; షట్క = షట్కమును (6); విజేతవు = జయించినవాడివి; బ్రహ్మ = బ్రహ్మజ్ఞానము యొక్క; తత్త్వ = స్వభావమును; నిర్ణేతవు = నిర్ణయించిన వాడవు; యోగి = యోగులలో; నేతవు = నాయకుడవు; వినీతుఁడవు = జితేంద్రియుడవు; ఈవు = నీవు; చలించి = చలించి పోయి; చెల్లరే = తగునా; కాతరు = దీనుని; కైవడిన్ = వలె; వగవన్ = దుఃఖ పడుటకు; కారణము = కారణము; ఏమి = ఏమిటి; పరాశరాత్మజా = వ్యాసా {పరాశరాత్మజుడు - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు}.


భావము:

“పరాశరుని పుత్రుడా! వ్యాసమునీంద్రా! నీవు బ్రహ్మదేవుడివి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల్ని జయింనిన వాడివి. పరబ్రహ్మ తత్త్వాన్ని నిర్ణయించిన వాడివి,వేదాలని నాలుగుగా విభజించి వ్రాసినవాడివి. యోగులలో అగ్రేసరుడివి, వినయసంపన్నుడివి. ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాడి లాగ విచారించటం ఆశ్చర్యంగా ఉంది. కారణమేమిటయ్యా?”


హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ

సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుఁగొందుఁ శ్రీ

హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు శ్రీ

కరమై యుండ; దయోగ్యదుర్మదనదత్కాకోల గర్తాకృతిన్.


నీవు శ్రీహరిని స్తుతిస్తూ కావ్యాలను వ్రాస్తే బంగారు హంసలు విహరించే మానస సరోవరం మాదిరి మాహృదయాలు ప్రకాశిస్తాయి. 

   శ్రీహరినామ స్తుతి చేయని కావ్యము ఎంత చిత్రవిచిత్ర ఆర్థాలున్నదైనా శ్రీకరమై వుండదు. అందుకని శ్రీహరి చరిత్రమగు భాగవతమును రచియింపుమని నారదుడు వ్యాసునకు బోధించాడు.


           స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

చొల్లంగి అమావాస్య…

 రేపు మహా పర్వదినం చొల్లంగి అమావాస్య…


పుష్య కృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డు మీద మూడు మైళ్ళ దూరాన ‘చొల్లంగి’ అనే గ్రామం ఉంది. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది.

ఈ రోజు ఇక్కడ గోదావరి నదీ స్నానం అత్యంత పవిత్రమైనదని చెప్తారు.

”ఆద్యాతు గౌతమీ గంగా పశ్చాద్భాగిరధీ

స్మృతా తయోరేకతరా సేవ్యాగౌతమీ తత్రపావనీ ”

గోదావరి గంగా జలాన్ని కూడా పవిత్రం చేయగలదు. అందువలననే కాశీకి పోయిన వారు గంగా జలము తెచ్చి గోదావరిలో కలిపే ఆచార ము అనాదిగా ఆచరిస్తున్న సాంప్ర దాయమై ఉంది.

జీవనదియైన గోదా వరి పాయల్లో ఒకటి సా గరాన్ని సంగమించే చోటు కావడంవల్ల చొల్లం గి సమీపాన స్నానం చేస్తే, నదిలోను, సము ద్రంలోనూ ఏకకాలం లో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ దినా న జీవనది గోదావరి, సముద్రం లో కలిసే చోటు వద్ద స్నానమాచరించి, పితృ తర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరక లోక యాతనల నుండి విముక్తులు కాగలరని, తత్ఫలితంగా స్వర్గ లోక… స్వర్ణలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు. గౌతము డు కొని తెచ్చిన గోదావరి జలాలను ఏడుగురు ఋషులు ఏడు పాయలుగా తీసుకొనిపోయి ఏడు స్థలాలలో సంగమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ ”గౌతమి” నామాంకితయై గోదావరి అగ్రము వద్ద మాసా నితిప్ప చోట సముద్రంలో  కలుస్తుంది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికు డు, జమదగ్ని వసిష్ఠుడు ఆరుగురు ఋషులు కొనిపోయిన శాఖలు వారివారి పేర్లతో పరమగు తున్నాయి. తుల్యుడు కొనిపోయిన శాఖ చొల్లంగి చెంత, ఆత్రేయ శాఖ కోరంగి సమీపాన, భరద్వాజ భైరవపాలెం/తీర్థాల మొండి వద్ద, కౌశిక నత్తల నడక సమీపాన, జమదగ్ని కుండలేశ్వరం వద్ద, వశిష్ఠ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్నాయి.


”రేవా తీరే తప: కుర్యాత్‌ మరణం జాహ్నవి తటే

దానం దద్యాత్‌ కురుక్షేత్రే గౌతమీ మ్యాంత్రిత యం పరం”

”రేవా నది తీరాన తపస్సు చేస్తే ముక్తి. గంగా తీరాన మరణం ముక్తి. కురుక్షేత్రంలో దానం ముక్తి. గోదావరిలో స్నానం చేస్తే ఈ మూడు పుణ్యాలు లభిస్తాయి.” అని పై శ్లోకానికి అర్థం.

గోదావరి నదీమ తల్లి వల్ల మూడు వరాలు ప్రాప్తిస్తాయి కనుక ఏడు స్థలాలకు వెళ్ళి స్నానాలు ఆచరించి రావడాన్ని ‘సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర” లేదా ”సప్త సాగర యాత్ర” అం టారు. సంతానం, తదితర కోరికలు ఈడేర డానికి సప్తసాగర యాత్ర చేయడం సంప్రదాయ సిద్ధం గా వస్తున్నది. సప్త సాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి స్నానంతో ప్రారంభం అవుతుంది.

ఏడు తావులు చూసుకుని, ప్రాయ కంగా మాఘ శుక్ల ఏకాదశి నాటి కి వశిష్టా సాగర సంగమ స్థానమైన ”అంతర్వేది చేర తారు. ఆ దినం అక్కడ గొప్ప తీర్థం. ఆ ఏకాదశి ని ఆ ప్రాంతంలో ”అంతర్వేది ఏకాదశి” అని పిలవడం పరిపాటి. ఇలా సప్త సాగర యాత్రకు ఆది, తుది దినాలు పర్వదినాలుగా పరిగణింపబడతాయి. చొల్లంగి అమావాస్య అనే పేరు రావడానికి మహత్తు గల చొల్లంగికి ప్రసిద్ధి, తుల్యభాగ వల్ల కలుగు తున్నది.


”మహోదయ నామాలభ్య యోగ పుణ్యకా ల:

అమావాస్యా సోమ వాసర వ్రతమత: పద్మ యోగ పుణ్యకాల”మని పేర్కొనబడింది.

రవి శ్రవణ వ్యతీపాతము ఈనాడు జరిగితే అది మహోదయ యోగము, పద్మయోగ పుణ్య కాలము కలుగుతుంది. పుష్యమాసంలో వచ్చిన అమావాస్య మహోదయ అమావాస్య. అమావాస్య, ఆదివారం, శ్రవణా నక్షత్రం మూడు కలిసి వస్తే దానిని అర్ధోదయ అమావాస్య అంటారు. ఈ మూడింటిలో ఏదో ఒకటి లోపించి మిగిలిన రెండు కలిస్తే దానిని మహోదయం అంటారు.  పుష్య బహుళ అమావాస్య పర్వకాలం, మహత్తర దినం.  పుణ్యప్రద మైనందున సమస్త దోష నివారణకై నదీ స్నానం, పితృ తర్పణం, పిండ ప్రదానం, శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు, శివారాధన చేయాలని, తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రం చెబుతోంది.

ధర్మసూత్రములు

 పశుసంబంధమైన ధర్మసూత్రములు  -


 *  పశువుల కాపరికి యజమాని కూలి ఇవ్వనిచో యజమానికి పది ఆవుల పాలు పిండి ఇచ్చి తానొక్క ఆవుపాలు కూలికింద తీసుకొనవచ్చు . జీతము లేనప్పడుదియే కూలి .


 *  కంటికి కనపడనిది , పురుగులచే , కుక్కలచే తినబడినది , పల్లపు గుంటలు మొదలగు వానిలో పడి చచ్చినది , కాపరి లేనప్పుడు పారిపోయినది అయిన పశువులకు పశుకాపరిదే భాద్యత. కాపరి తెచ్చి ఇవ్వవలెను.


 *  దొంగలు దొమ్మిచేసి పశువులను అపహరించుకు పోయిన విషయము కాపరి వెంటనే యజమానికి దగ్గరలో ఉన్నప్పుడే చెప్పినచో కాపరి యజమానికి పశువులను ఇచ్చుకోవాల్సిన బాధ్యత లేదు .


 *  చచ్చిన పశువు చెవులు , చర్మం , తోక , వెంట్రుకలు , గోరోచనము వీటిని యజమానికి ఇవ్వవలెను. తక్కిన గిట్టలు , కొమ్ములు మున్నగునవి అన్నియు యజమానికి చూపించి మరలా తాను తీసికొనవలెను.


 *  దారిలోను , బూడిదలోను , గోవుల మందలోను మలమూత్రాలను విసర్జించరాదు . గోవుకి ఎదురుగా మలమూత్రాలను విసర్జించరాదు.


 *  నీరు తాగుచున్న ఆవును గాని , పాలు తాగుచున్న దూడను గాని నివారించరాదు. పాలు తీయునప్పుడు మూత్రం పోయుటను నివారించవచ్చు. ఇతరుల దూడలు పాలు తాగుచున్నప్పుడు వారికి చెప్పకూడదు. ఇంద్రధనుస్సును ఆకాశమున చూచి ఆ దోషమును ఎరిగిన వాడై ఉండి ఇతరులకు చూపరాదు.


 *  తుంటరివి , ఆకలిరోగములు గలవి , కొమ్ములు లేనివి , గుడ్డివి , గిట్టలు లేనివి , తోకలేనివి అగు వృషభములను కట్టిన బండ్లలో ప్రయాణం చేయరాదు .


 *  మచ్చికపడినవి , వడిగా నడుచునవి , శుభలక్షణాలు కలిగినవి , వన్నెయు , ఆకారం కలిగి ఉండునవి అగు ఎద్దులను గట్టిన బండ్లలో మునికోలతో పొడవవలెను.


 *  చతుష్పాద జంతువు విషయమై అపద్ధం చెప్పినవాడు అయిదుగురు బంధువులను , గోవు విషయమై అపద్ధం చెప్పినవాడు పదిమందిని, గుఱ్ఱముల విషయమై అపద్ధం చెప్పినవాడు వంద మందిని , మానవుల విషయమై అపద్ధం చెప్పినవాడు వెయ్యిమంది బంధువులకు చంపిన పాపమును పొంది నరకమునకు పోవును .


 *  ఈని పది దినములు గూడ గడవని గోవులను , చక్రము , శూలము మొదలగు గుర్తులు వేసి విడిచిన ఎద్దులను , హరిహరాదుల ముద్రలు వేసి ఉన్న ఎద్దులను , కాపరులతో ఉన్నను లేక పొలము నందు ప్రవేశించి నస్యములను తినుచున్నను వానిని దండింపరాదు.


 *  గోవుల పైన కూర్చుని స్వారి చేయరాదు . కాని బండికి కట్టవచ్చు.


 *  ఎవడు జంతువులను కట్టుట, చంపుట, వంచుట చేయుటకు ఇష్టపడడో అతడు సకల భూతములకు హితము గోరువాడు ఎల్లప్పుడూ తరగని మోక్షరూపం అగు ఆనందమును పొందును.


 *  బ్రాహ్మణుల గోవులను అపహరించినప్పుడు , గొడ్డుటావులతో బరువులు మోయించుటకై ముక్కుత్రాడు వేసినప్పుడు , యాగముల కొరకు పశువులను అపహరించినప్పుడు వెంటనే అపహరించినవాని కాలు సగము నరికివేయవలెను .


 *  మార్గములో గ్రామ సమీపేతర ప్రదేశమునందలి పొలములలో గోవులు మేసినచో  కాపరి కి జరిమానా వేయవలెను . తరువాత గోవులు తినిన మేతఫలమును కాపరి గాని , యజమానిగాని పొలము యజమాని కి ఇవ్వవలెను.


 *  వెంటనే ఊడ్చుట, గోమయముతో అలుకుట , గోమూత్రము మున్నగునవి చల్లుట , పైమట్టి ఎత్తి తవ్వి ఎత్తిపోయుట , గోవుని ఒక రాత్రి , ఒక పగలు కట్టివేయుట  ఈ అయిదింటిచేత భూమి పరిశుద్ధతనొందును.


 *  వర్షం కురియుట వలన నేలను చేరునవి , పశువుల తాగగానే దప్పిక తీరునవి , గంధము , రసము , రంగు వానితో కూడిన ఉదకములు అనగా నీళ్లు పరిశుద్ధములు.


 *  సకల జంతువుల ప్రాణ సంరక్షణార్థమై రాత్రిగాని , పగలుగాని ఎల్లప్పుడూ తన శరీరముకు కష్టం కలిగినను భూమిని చూచుచు  నడవవలెను .


 *  ఒక గ్రామము చుట్టును నూరు ధనువులంతా ( ధనువు అనగా నాలుగు మూరలు ) ప్రదేశము పశువుల మేతకును , గాలి మొదలగు వీచుటకు భూమి బీడుగా వదలవలెను. పట్టణం అయినచో దీనికి మూడురెట్లు ప్రదేశం బీడుగా వదలవలెను .


 *  పైన చెప్పిన బీడు భూమి చుట్టూ ఆవరణ లేక పైరు సరిగ్గా లేని స్థలము నందు గోవు మేసిన యెడల ఆ కాపరిని గాని , యజమానిని గాని దండించరాదు.


 *  పశువుల మేయు బీడు భూమి చుట్టు నుండు ఆవరణ ఒంటెలు తలయెత్తి చూచిన లోపలి ప్రదేశము కనపడని యంతఎత్తున చుట్టూ రక్షణ ఏర్పరచవలెను . కుక్కలు , పందులు లోపల దూరకుండా కిందవైపు సందులను మూయవలెను .


 *  గ్రామసమీపాన దారికి దగ్గరగా ఉండు చుట్టూ వేసిన ఆవరణలో గోవులు దూరి మేసినచో ఆ గోవుని దండింపక గోపాలకునికి జరిమానా విధించవలెను .


 *  ఎండకాయుచున్నను , వర్షం కురియుచున్నను , ముందుగా శక్తికొలది గోవులను సంరక్షించిన తరువాతయే తన్ను రక్షించుకొనవలెను .


 *  గోవును దర్భ తాళ్లతో , రెల్లు తాళ్లతో దక్షిణాభిముఖముగా కట్టివేయవలెను . ఈ తాళ్లకు నిప్పు అంటుకొని కాలిపోయినను గోవు చిన్న గాయాలతో బయటపడును . కట్టివేసినప్పుడు గోవు అగ్నిచేత దగ్ధం అయినపుడు ప్రాయశ్చిత్తం ఏమియును లేదు .


 *  రాజ్యము నందు గోవులు దీనంగా ఉన్నయెడల రాజులకు అశుభం. కాళ్లతో భూమిని గోకిన రోగములు సంభవించును . కనుల నుంచి నీరు కార్చుచున్న మృత్యువు కలుగును. యజమాని చూచి భయపడి అరిచినచో దొంగలు వస్తారు.


 *  కారణం లేకుండా గోవు అరుచుచున్న అనర్థం కలుగును. రాత్రివేళ అయినచో భయం కొరకగును. ఎద్దు అరిచినచొ శుభం కలుగును. ఈగలచే గాని , కుక్కలచేగాని మిక్కిలి విరుద్ధమై అరిచినచో వెంటనే వర్షం కురియును.


 *  గోవులు అంబా అనుచూ ఇంటికి వచ్చిన గోశాల వృద్ది అగును. గోవులను సేవించుచూ వచ్చిననను గోశాల వృద్ది అగును. తడిసిన అవయవములతో గాని , నిక్కబొడిచిన వెంట్రుకలతో గాని సంతసించుచూ వచ్చిన గోవులు మంచివి. ఈ రీతినే గేదెలు కూడా ఉండును .


 *  చూలుతో ఉన్నట్టియు, తగిన వెలకు దొరికినట్టియు , దానము వలన దొరికినట్టియు , కూలి సొమ్ముల వలన దొరికినట్టియు , యుద్ధాదులలో గెలిచి తెచ్చినవియు , ఇంటబుట్టినవియు , ఏదేని వ్యాధిచే యజమాని వలన విడకాబడినవియు , తానుపోషించునవియగు గోవులు మిక్కిలి మంచివి.


 *  దూడలేని ఆవుపాలు , గర్భముతో ఉన్న గోవుని పితకరాదు. ఈనిన పది దినముల వరకు పాలు పితికినవాడు నరకమునకు పోవును .


 *  బలం లేనిదియు , వ్యాధిగ్రస్తం అయినదియు , పొర్లినదియు , కవల దూడలు పెట్టినదియు అగు గోవు పాలు పితకరాదు .


 *  పుట్టిన రెండు నెలల వరకు దూడను తీయకుండానే పాలు పితకవలెను . మూడొవ నెలలో రెండు చన్నులు దూడకు వదిలి రెండు చన్నులు పితకవలెను. నాలుగొవ నెలలో మూఁడు భాగములు యజమాని తీసుకుని ఒక భాగము దూడకు విడిచిపెట్టవలెను . అటు తరువాత పశువు యొక్క బలాబలాలను బట్టి పాలు తీసుకొనుట మంచిది .


 *  ఆషాడ పౌర్ణమి, ఆశ్వయుజ పౌర్ణమి, పుష్యపౌర్ణమి , మాఘపౌర్ణముల యందు పాలు పితకక దూడలకు వదలవలెను .


                            సమాప్తం 



ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034


   

భవిష్యపురాణం నుంచి సేకరించటం

 *ఈ కథను భవిష్యపురాణం నుంచి సేకరించటం జరిగింది.*


*ఒక ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మేడలో రుద్రాక్ష హారం ధరించాడు.*


*ఈ "ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడుని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్ర శబ్దం అని చుట్టూ చూడసాగాడు.*


*గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటరు దూరంలో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో అస్సలు అర్దం కాలేదు, కాసేపయ్యకా చుస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు.*


*పట్టుకోబోతే ఈసారి మరింత దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. ఇతను చుస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు, కాని పట్టుకుందామనుకొంటే నేను ఎక్కడో పడిపోతున్నాను.*


*ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ''వేదవ్యాసుడు'' కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి "మహానుభావ, సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి" అన్నాడు.*


*వేదవ్యాసుడు నవ్వి "ఇది నీరాజ్యం,  ఈ కలికాలం నీది, నీకేసందేహమా? ఇక్కడ ఏ ఇద్దరిని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా!" అని అడిగాడు.*


*"కుశలమే! నా రాజ్యంలో నేను కాకా, నువ్వు అయితే పాలించవు కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి" అని వేడుకున్నాడు.*


*వేదవ్యాసుడు నవ్వి "ఓహో అదా, నీ సందేహం అర్దమయింది, ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వటం లేదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు.*


*త్రికరణ శుద్దిగా నిత్యం ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు. కనుక ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో, లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు" అని చెప్పి వెళ్ళిపోయాడు.*


*ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.*


*ఓం నమో భగవతే వాసుదేవాయ.*

ప్రాణ శక్తి

 .🙏ప్రాణ శక్తి -- శాస్త్ర పరిశీలన🙏 

ఇది ఒక అద్భుతమైన వ్యాసం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి.

భారతావనిపై జన్మించినందుకు గర్వపడాలి. భారతదేశంలో హిందువుగా జన్మించడం పూర్వ జన్మ సుకృతం.అందులోనూ ఆధ్యాత్మికత పొందడం ఇంకా అదృష్టం.

భారతీయ వేద శాస్త్రాలలో మాత్రమే చెప్పబడిన అద్భుతమైన విషయం ప్రాణ శక్తి. ఇది ఏ ఇతర మత గ్రంథాలలోనూ లేదు. ఇదే హిందూ మత ప్రత్యేకత.పంచ ప్రాణముల గురించి, ఉప ప్రాణముల గురించి సుస్పష్టంగా వేదాలు వివరించాయి.అసలు ప్రాణం అంటే ఏమిటి? దాని విశృతి ఏమిటి? ఈ వ్యాసంలో చూద్దాము.

ప్రాణ" అనే పదానికి సంస్కృత మూలపదం "అన్". "ప్రా"అనే ఉపసర్గ జోడించబడింది. "అన్" అంటే ఊపిరి పీల్చుకోవడం. "ప్రా" ఉపసర్గను జోడించినప్పుడు ప్రాణం కేవలం శ్వాసతో పాటు చాలా విస్తృతమైన అర్థాన్ని పొందుతుంది. ప్రాణం అంటే విశ్వ జీవశక్తి లేదా వ్యక్తిగత ప్రాణశక్తి అని అర్థం. ఇది మనల్ని "సజీవం గా" ఉంచే ప్రాణశక్తి.

ప్రాణమంటే జీవులు బ్రతకడానికి కావలసిన చైతన్య శక్తి. ప్రాణమనే దాన్ని అర్ధం చేసుకోడానికి, ప్రాణ శక్తిని గురించి తెలుసుకుందాం. జ్ఞానేంద్రియాలు బయటనుండి విషయాలని తెస్తే వాటిని గ్రహించాలంటే, అవి మనస్సుతో సంబంధపడి పడి ఉండాలి. గాఢ నిద్రలో ఉన్నపుడు మనస్సు, జ్ఞానేంద్రియాలూ పనిచెయ్యవు. అప్పుడు మనలను జీవింప జేసే శక్తి ఒకటి ఉంటుంది. అది శ్వాస రూపంలో ప్రాణమని చెప్పబడుతుంది. జీవానికి, శరీరానికీ, ప్రాణానికి పరస్పరం సంబంధం ఉంటుంది. ప్రాణం యొక్క చైతన్యశక్తి వల్లనే మనస్సు బాహ్య విషయాలను గ్రహిస్తుంది. శరీరానికి కండర చలనం ద్వారా చైతన్యాన్ని కల్గించేది ఈ ప్రాణమే. ప్రాణం బ్రహ్మము యొక్క ప్రకాశం చేత ప్రవర్తిస్తుంది. శరీరంలో ఈ ప్రాణశక్తి 5భాగాలుగా విభజించ బడింది ముఖ్య ప్రాణం, చేసే పనుల భేదాన్ని బట్టి ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానమని చెబుతారు.


1) ప్రాణము – ఇది ముక్కు రంధ్రాల నుండి హృదయం వరకు వ్యాపించిఉన్న శ్వాశకోశాన్ని జ్ఞానేంద్రియాలని నియంత్రిస్తుంది. మన వాక్కును, మ్రింగటాన్ని శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతుంది. ఇది శరీరంలో ఊర్ధ్వచలనం కల్గి ఉంటుందని చెప్పబడింది.


2) అపానము - ఇది నాభి నుండి అరికాళ్ళ వరకు వ్యాప్తిచెంది అధోచలనం కల్గి విసర్జన కార్యకలాపాలకు తోడ్పడుతుంది. ఉదాహరణకు మల మూత్ర విసర్జన, వీర్యము, బహిష్టు మరియు శిశు జననము మొదలైన వాటిని నిర్వర్తిస్తుంది.


3) సమానము - నాభి నుంచి హృదయం వరకు వ్యాప్తిచెంది, మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేటట్లు చేసి, ఒంటబట్టడానికి సహకరిస్తుంది. దాని ద్వారా అవయవాలకు శక్తి కల్గుతుంది.


4) ఉదానము - ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి, శరీరాన్ని ఊర్ధ్వ ముఖంగా పయనింప జేయడానికి ఉపకరిస్తుంది. అంటే మనలోనుండి శబ్దం కలగడానికీ, వాంతులు చేసుకునేటపుడు బహిర్గతమవడానికీ, మన దైనందిత కార్యాల్లో తూలి పడిపోకుండా సమతులనంగా ఉండటానికి దోహదం చేస్తుంది.


5) వ్యానము - ఇది ప్రాణ, అపానాలను కలిపి ఉంచి, శరీరంలో ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. నాడీమండలం మొత్తం పనులను నడిపిస్తుంది. మన ప్రాణమయ కోశంలో సుమారు 72,000 సూక్ష్మ నాడులున్నట్లుగాను, అవిగాక వాటిని నియంత్రించే నాడీ కేంద్రాలూ (చక్రములు) ఉన్నట్లు పెద్దలు చెబుతారు.


హృదయమున ప్రాణము, గుద స్థానమున అపానము, నాభి ప్రదేశమున సమానము, కంఠ మధ్యమునందు ఉదానము, సర్వశరీరము నందు వ్యానము ఉన్నట్లు పంచ ప్రాణముల స్థాన నిర్ణయం చెప్పబడింది. ఈ ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములనే పంచ ప్రాణములు ; నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయము లనెడి పంచ ఉపప్రాణములు కలసి నాడీ మండల మంతా వ్యాపించి, దేహవ్యాపారములకు కారణమవుతోంది. నాగమను ఉపవాయువు వల్ల కక్కుకొనుట ; కూర్మమను ఉపవాయువు వల్ల కను రెప్పలు విచ్చుట, మూయుట ; కృకర మను ఉపవాయువు వల్ల తుమ్ముట, దగ్గుట ; దేవదత్తమను ఉపవాయువు వల్ల ఆవులింత చెప్పబడ్డాయి. ధనుంజయ మనే ఉపవాయువు శరీరమంతా వ్యాప్తించి, మరణానంతరం శరీరం లావెక్కడానికి తోడ్పడుతుంది. ఇలా దశవిధ వాయువులు దశేంద్రియ సంబంధము కల్గి, రాగ ద్వేషాది అనుభవాలకు అధోముఖమవు తున్నాయి.


 మనస్సును సాధనముగా చేసుకొని, దశ విధ వాయువుల చివర నుండేది, కర్తృత్వ భోక్త్రుత్వ గుణములను కల్గి ఉండేది బుధ్ధి అనే చిద్బిందువు. ఇదే సర్వ కార్య కారణాలకూ ఆశ్రయమై , వాసనలతో ఇంద్రియములతోను స్థూల సూక్ష్మ కారణ శరీరములనే ఉపాధుల సంబంధం కల్గి, విషయానుసారముగా సంచరిస్తుంటుంది. ఇలా పంచ ప్రాణములు పంచ కర్మేంద్రియాలు కలసి క్రియాశక్తి బలము కల్గి ఉన్నాయి. పంచ ఉపప్రాణములు పంచ జ్ఞానేంద్రియాలు కలసి జ్ఞాన శక్తి బలం కల్గి ఉన్నాయి. దశవిధ ప్రాణములు; మనస్సు బుధ్ధి చిత్తము అహంకారములనే అంతః కరణ చతుష్టయంతో కలసి ఇచ్ఛాశక్తి బలం కల్గి సమస్త ఇంద్రియ వ్యాపారాలకూ కారణంగా ఉన్నాయి.

ప్రాణాయామంలో కుంభకం వల్ల శరీరంలో నాడులన్నీ వాయువుచే పూరించబడి, ఈ దశవిధ వాయువుల యొక్క చలనం వేగవంత మవుతుందని తద్వారా హృదయ కమలం వికసిస్తుందనీ చెప్పబడింది. పంచ ప్రాణాలు, పంచ ఉప వాయువులు కలిపి దశవిధ వాయువులుగా చెప్పబడ్డాయి. 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

మహాభారతం

 🙏మహాభారతం శాంతి పర్వం 🙏

                      పదవ భాగం 

 వంధిమాగదులు ధర్మరాజు గుణగణాలను కురువంశ చరిత్రను కీర్తిస్తున్నారు. వేదపండితులు వేదపాఠాలను భోధిస్తుండగా ధర్మరాజు హస్థినాపుర ప్రవేశం చేస్తున్నాడు.

ధర్మరాజు వచ్చేవేళకు హస్థినాపురప్రజలు నగరమంతా పచ్చనితోరణాలు కట్టి, గుమ్మాలకు అరటిచెట్లు కట్టి, పూర్ణకళశాలను ఇంటి ముందు అలంకరించి, వాకిట కళ్ళాపిచల్లి ముత్యాలముగ్గులు పెట్టారు. ఆ బాలగోపాలం కొత్తబట్టలు కట్టుకున్నారు. అంతటా పండుగవాతావరణం నెలకొంది. ధర్మరాజు రాజవీధిలో ప్రవేశించాడు. హస్థినాపుర వాసులు తమలోతాము " నలుదిక్కులా రాజులను జయించిన అజాతశత్రువు ఇతడే. రాజసూయయాగము చేసి బ్రాహ్మణులకు ధన, కనక, రత్నములను దానంగా ఇచ్చినది ఇతడే. ధర్మనిరతుడు అని చెప్పతగిన వాడు, శత్రురాజులను జయించి, విజయలక్ష్మిని వరించినది ఇతడే " అని ధర్మరాజును పొగడసాగారు. మరి కొందరు భీమార్జున నకులసహదేవులను పొగడుతున్నారు. వ్రతములు ఆచరించుటలోనూ, అదృష్టంలోను, పాతివ్రత్యంలోనూ ద్రౌపదికి సాటి ద్రౌపదియే నని పాండవసతిని పొగడుతున్నారు. ధర్మరాజు రాజమందిర ముఖద్వారం వద్దకు రాగానే బ్రాహ్మణులు, పుణ్యస్త్రీలు శోభనద్రవ్యములు తీసుకుని ఎదురువచ్చారు. వారు ఇచ్చినవి పుచ్చుకుంటూ ధర్మరాజు గజశాల వద్ద తనరధమును దిగాడు. పురోహితుడైన ధౌమ్యుడు పెదనాన ధృతరాష్ట్రుడు మున్నగు వారితో సహా అంతఃపురప్రవేశం చేసాడు. గృహదేవతలకు పూజచేసాడు. బ్రాహ్మణ సంఘములను పిలిచి వారికి బంగారం గోవులను దానంగా ఇచ్చాడు. వారి ఆశీస్సులు తీసుకున్నాడు.


ఆ సమయంలో దుర్యోధనుడి మిత్రుడైన చార్వాకుడు అనే రాక్షసుడు బ్రాహ్మణవేషంలో వచ్చి మిగిలిన బ్రాహ్మణులతో కలిసాడు. అతడు ధర్మరాజుతో " ఓ ధర్మరాజా ! సకలబ్రాహ్మణులు నన్ను తమ ప్రతినిధిగాపంపారు. వారిసందేశం విను. మహాపాపములు చేసిన వాడు ఇతడు ఎలా రాజౌతాడు. తండ్రులను, అన్నలను, పుత్రులను శంకలేకుండా చంపాడు. విద్యనేర్పిన గురువు అని చూడక ద్రోణుడిని చంపాడు. వీడిజన్మ ఎందుకు కాల్చనా ! ఈ విధంగా అందరూ నిన్ను అసహ్యించుకుంటున్నారు. ఇంకా నీకీ రాజ్యమెందుకు ? బంధువులను అందరినీ చంపి రాజ్యభోగాలు అనుభవిస్తున్నావు. నీకు మహాపాపం చుట్టుకుంటుంది " అని పలికాడు. చార్వాకుడి మాటలను విన్న బ్రాహ్మణులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ధర్మరాజు వారివంక చూసి చేతులుజోడించి " బ్రాహ్మణోత్తములారా ! నేను మీకు మొక్కి వేడుకుంటున్నాను. నన్ను మీరు నిందించకండి. ఆదరించండి వ్యాసుడు నారదుడు మొదలగు మహా మునులు నన్ను ఆజ్ఞాపిస్తేనే నేను ఈ రాజ్యపాలనకు ఒప్పుకున్నాను " అని ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు " మహారాజా ! ఈ మాటలు మావి కాదు. ఇవి ఎలా వచ్చాయో మాకు తెలియడం లేదు. నీవు ఉత్తమక్షత్రియ ధర్మంతో సముపార్జించిన ఈ రాజ్యలక్ష్మి సుస్థిరతను పొందుతుంది " అని ఆశీర్వదించాడు. వెంటనే చార్వాకుని వంక చూసి దివ్యదృష్టితో అతడు సుయోధనుడి అనుయాయుడు అని తెలుసుకున్నారు. " మహారాజా ! వీడు బ్రాహ్మణుడు కాదు. సుయోధనుడి అనుయాయుడు అయిన రాక్షసుడు. కపటసన్యాసివేషంలో వచ్చి మిమ్మలిని అనరానిమాటలు అన్నాడు. వీడు కుక్కలాగా మొరిగినంత మాత్రాన మీ కీర్తికి కళంకంరాదు. ధర్మాత్ములైన నీ తమ్ముల సాయంతో మీరు రాజ్యలక్ష్మిని చేపట్టవచ్చు " అని పలికారు. వెంటనే బ్రాహ్మణులంతా చార్వాకుడిని చూసి ఒక్కసారి హుంకరించారు. ఆ హూంకారానికి భయకంపితుడై చార్వాకుడు నిజస్వరూపం ధరించి భస్మం అయ్యాడు. ధర్మరాజు ఆ బ్రాహ్మణులందరిని ఆదరించి పంపాడు.


అప్పుడు శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! కృతయుగంలో చార్వకుడు అనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపమాచరించాడు. బ్రహ్మ ప్రత్యక్షం కాగానే తనకు సకల భూతములవలన భయంలేకుండా వరం ఇమ్మని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు " నీవు బ్రాహ్మణులకు ఇష్టంలేని పనులు చేయకు. వారికి కోపంతెచ్చినప్పుడు మాత్రమే నీకు మరణం సంభవించగలదు " అని అన్నాడు. ఆ ప్రకారం బ్రహ్మ వరంపొంది చార్వాకుడు దేవతలను పీడించ సాగాడు. దేవతలంతా బ్రహ్మ వద్దకు వెళ్ళి చార్వాకుడి నుండి రక్షణ కల్పించమని ప్రార్ధించాడు. బ్రహ్మదేవుడు దేవతలతో " ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకని నేను తగినఏర్పాటు ముందే చేసాను. ద్వాపరయుగంలో చార్వాకుడు సుయోధనుడు అనే రాజుకు మిత్రుడుగా ఉంటాడు. సుయోధనుడి మరణం తరువాత ఈ చార్వాకుడు బ్రాహ్మణులకు మనోవ్యధ కలిగించే పనులు చేసి ఆకారణంగా వారి ఆగ్రహానికి గురి అయి భస్మంఔతాడు " అని చెప్పాడు. శ్రీకృష్ణుడు తరువాత " ధర్మరాజా ! నిన్ను ఎదిరించిన వారిని నాశనం చెయ్యి. ప్రజలను కన్నబిడ్డలవలె కాపాడు. బ్రాహ్మణులను ఆదరించు. బంధుమిత్రులను సుఖంగా ఉండేలాచేయి. కురుసామ్రాజ్యముకు పట్టాభిషిక్తుడివి కమ్ము " అని పలికాడు.

పట్టాభిషేకముకు తగు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కురుమహాసభలో ఎత్తైన బంగారు సింహాసనం ఏర్పాటు చేసారు. పెద్దలకు, మంత్రులకు, సామంతులకు సైన్యాద్యక్షులకు ఎవరికి తగిన ఆసనములు వారికి ఏర్పాటు చేసారు. ఒక శుభముహూర్తాన ధర్మరాజు మనసులోని బాధను దిగమింగుకుని బంగారుసింహానం మీద తూర్పుముఖంగా కూర్చున్నాడు. అతడికి ఎదురుగా బంగారు ఆసనమున శ్రీకృష్ణుడు సాత్యకి సమేతంగా కూర్చున్నాడు. ధర్మరాజు ఇరు పక్కలా మణిమయ పీఠముల మీద భీమార్జునులు కూర్చున్నారు. వెనుక పక్క బంగారు పీటముల మీద నకులసహదేవులు కూర్చున్నారు. వారిపక్కన ఉచితాసనం మీద కుంతీదేవి కూర్చుంది. శ్రీకృష్ణుడి దక్షిణభాగంలో ఒక ఉజ్వలమైన ఆసనంమీద ధృతరాష్ట్రుడు కూర్చుని ఉన్నాడు. అతడికి తూర్పు పడమర దిక్కున విదురుడు, ధౌమ్యుడు కూర్చుని ఉన్నారు. ధృతరాష్ట్రుని వెనుక భాగాన అర్హమైన ఆసనముల మీద గాంధారి, యుయుత్సుడు, సంజయుడు కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన కృపాచార్యుడికి ధర్మరాజు ధౌమ్యుడి పక్కన ఉచితాసనాన్ని ఇచ్చి సత్కరించాడు. ధర్మరాజు తెల్లని పూలతోను, అక్షితలతోను, బంగారుతోను, వెండితోను భూదేవిని పూజించి ఆమెను తాకాడు. పండితులు, వివిధ దేశాధీశులు, మంత్రులు, ఉన్నతోద్యోగులు, వ్యాపారవేత్తలు, పరిచర్యలు చేసే సేవకులు, వైశ్య ప్రముఖులు, పౌర సంఘాలు, కర్షకులు, జానపదులు, గాయకులు, విదూషకులు, వేశ్యలు మున్నగు వారంతా ధర్మరాజుని సందర్శించారు. ధర్మరాజు వారికి ఉచితమైన కానుకలు ఇచ్చి సత్కరించాడు. ఇంతలో అభిషేకద్రవ్యములు సిద్ధం అయ్యాయి. శ్రీకృష్ణుడి అనుమతితో ధౌమ్యుడు ఈశాన్య దిక్కుగా ఉన్న వేదికను అలంకరించాడు. అందు నవరత్నఖచిత సింహాసనమును ప్రతిష్టించాడు. దానిమీద పులితోలు కప్పాడు. శంఖమును స్థాపించి పూజించాడు. దాని చుట్టు గంగాజలం నింపి వాటిని మంత్రసహితంగా ఆవుపెరుగు, ఆవునెయ్యి, ఆవుపంచితం, గోమయము మొదలగు పంచగవ్యములతో శుద్ధి చేసాడు. ధర్మరాజు చుట్టూ బ్రాహ్మణులు మంత్రపఠనం చేస్తున్నారు. ధౌమ్యుడు ధర్మరాజును తీసుకు వెళ్ళి సింహాసనం మీద కూర్చుండ చేసాడు. ఎదురుగా అగ్నినివేల్చి దేవతాయజ్ఞం చేసాడు. ఇంతలో శుభముహూర్తం సమీపించగానే శ్రీకృష్ణుడు ధర్మరాజును సమీపించి శంఖం పైకెత్తి" ధర్మజా ! నీవు ఈ కురుసామ్రాజ్యానికి అధిపతివి కమ్ము " అని అభిషేకించాడు. ఆ సమయంలో ప్రశాంత చిత్తుడై ధౌమ్యుడు అందించిన బంగారుకలశం లోని గంగాజలాన్ని ధృతరాష్ట్రుడు ధర్మరాజు మీద అభిషేకించాడు. ఆ తరువాత వారి వారి ప్రాధాన్యతను అనుసరించి అందరూ ధర్మరాజును అభిషేకించారు. శంఖములు, భేరీ మృదంగ నాదములు మిన్నంటేలా మ్రోగాయి. ఇలా ధర్మరాజు కురు సామ్రాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు.

                      సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

లక్ష్మీనాథుడు

 *లక్ష్మీనాథుడు నంది వాహనముపై లంకాపురిం జేరెcబో*

ఈ సమస్యకు నాపూరణ. 


*శకారుడు*

ఈ క్ష్మా నేలుదు నేను శ్యాలకుడనే నేనుంగు పైనెక్కుదున్


పక్ష్మం బింతయు  మూయకే తిరిగెదన్ పండింతు నే పంటలన్


లక్ష్మీనాథుడు నంది వాహనముపై  లంకాపురిం జేరెcబో


సూక్ష్మంబున్ గ్రహియించి స్వాగతమనన్ చూపింతు నా ప్రజ్ఞలన్.



అల్వాల లక్ష్మణ మూర్తి

సమస్య పూరణ.

 *అర్ధాంగీ! కృతి వ్యర్థమై చనియె లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ*

ఈ సమస్యకు నాపూరణ. 


దుర్ధర్షంబయి  మేలు బంతి యయినన్ దుర్నీతిగా పాదుషా


ఆర్ధం బర్ధము కూడ నీయడయె యన్యాయంబె ఫిర్దౌసికిన్


గర్ధంబెంతయొ కృంగదీసె - కినిసెన్ - గర్హించుచున్ చెప్పె నో


"అర్ధాంగీ! కృతి వ్యర్థమై చనియె  లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ".


(దుర్దర్షం= తిరస్కరింప దగనిది

ఆర్ధము =సొత్తు

గర్ధం =పేరాస)


అల్వాల లక్ష్మణ మూర్తి

28, జనవరి 2025, మంగళవారం

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(34వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

           *చిత్రకేతువు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *వృత్రాసురుడు రాక్షసుడు కదా, అతన్ని సంహరిస్తే ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోవడం ఏమిటి? అన్న సందేహం రాక మానదు.*


*దానికి సమాధానం ఏమిటంటే వృత్రుడు తపస్స్వభావుడు. బ్రహ్మవంశసంజాతుడు. గొప్ప విష్ణుభక్తుడు. అదెలా అంటే అతని పూర్వజన్మ గురించి తెలుసుకోక తప్పదు.*


*పూర్వం శూరసేన దేశాన్ని చిత్రకేతువు పాలించేవాడు. అతనికి కోటి మంది భార్యలు. అంతమంది భార్యలు ఉన్నప్పటికీ అతనికి పిల్లలు లేరు. దాంతో చిత్రకేతువు చెప్పలేనంత దుఃఖాన్ని అనుభవించసాగాడు. ఆ సమయంలో లోకసంచారం చేస్తూ బ్రహ్మర్షి అంగిరసుడు శూరసేనదేశాన్ని సందర్శించాడు. అంగిరసునికి సకల మర్యాదలూ చేశాడు చిత్రకేతువు. పూజించాడతన్ని. తన మనోదుఃఖాన్ని కూడా విడమరచి చెప్పాడు. సంతతి కలిగే మార్గం చెప్పమని ప్రాథేయపడ్డాడు. జాలి చెందాడు అంగిరసుడు. వెంటనే అతని చేత త్వష్టృయాగం చేయించాడు. యజ్ఞఫలాన్ని చిత్రకేతు పెద్దభార్య కృతద్యుతికి అందజేసి, త్వరలోనే ఆమె ఓ కొడుకుని ప్రసాదిస్తుందని చెప్పి, అక్కణ్ణుంచి నిష్క్రమించాడతను.*


*కృతద్యుతి గర్భవతి అయింది. నవమాసాలూ నిండి ఓ కుమారుణ్ణి ప్రసవించింది. ఆ కుమారుణ్ణి చూసి చిత్రకేతువు ఆనందించాడు. రాజ్యం అంతటా పండుగ చేశాడు. ప్రజలకు అనేక కానుకలిచ్చాడు. బ్రాహ్మణులకూ, మునులకూ భూరిదానాలిచ్చాడు. అందరినీ సంతృప్తి పరిచాడు.*


*ఇంత వరకూ బాగానే ఉంది. పెద్ద భార్య కృతద్యుతికి తప్ప తామెవ్వరికీ సంతానం లేదని, చిత్రకేతువు మిగిలిన భార్యలంతా దుఃఖించసాగారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

సరస్వతి ఆలయాలు

 ⑴ సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

కాశ్మీర్.. *బాసరా (తెలంగాణ)..*

⑵ బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో... 

పుష్కర్ (రాజస్థాన్).. *ధర్మపురి (తెలంగాణ)..* 

⑶ త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. *కాలేశ్వరం (తెలంగాణ)*

⑷ ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు.. 

నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)

*గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)*


*ధర్మపురి:-*

యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే.. 

(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా)

బ్రహ్మదేవుడు (సృష్టి)

నరసింహుడు, (స్థితి)

శివుడు, (లయం)

యముడు, (కాలం)

అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది


*కాళేశ్వరం:-*

ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. 

గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. 

సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే.. 


*వేములవాడ:-*

అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)


*మెదక్:-*

సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది.. 


*యాదగిరి:-*

అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం.. 


*కొండగట్టు:-*

శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం.. 


*బాసర (వ్యాసపురి):-*

వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం.. 


*భద్రాచలం:-*

శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం. 


*చెన్నూర్:-*

గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం. 


*మంథని:-*

మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహాముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే. 


*బోదన్:-*

బోధనపురి అసలు పేరు. మంతనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే.!!


🙏 *మన తెలంగాణ ఘన కీర్తి గల తెలుగు నేల* హిందువుగా గర్వించు.! హిందూవుగా జీవించు.!!🙏

చీరల క్విజ్

 చీరల క్విజ్


1. గోవిందుని తలపించే చీర ?


2. ప్రసిద్ధి చెందిన కోట గల వూరి పేరే ఈ చీర పేరు.


3. శ్రీరామనవమి ప్రసాదం, ఈ స్వామి కోవెల గల ఉరే ఈ చీర పేరు.


4. ప్రసిద్ధ హాస్య నటుడి ఇంటి పేరు ఈ చీర పేరు.


5. ఏడుకొండల స్వామిని తలపించే ఈ చీర పేరు?


6. భూదానోద్యమాన్ని తలపించే ఈ చీర పేరు?


7. చందమామను చూడు, నన్ను చూడు... అంటుంది ఈ చీర.


8. కోడికూరను తలపించే చీర?


9. ఇంగ్లీష్ లో అరటిపండు రసాన్ని తలపించే చీర?


10. దక్షిణభారతం లోనే కాదు, ప్రపంచప్రఖ్యాతి ఈ చీరది..


11. మైసూర్ ప్యాలెస్ ను గుర్తు చేసే చీర?


12. పంజాబీ ఫుల్కాను గుర్తు చేసే చీర?


13. ఇంగ్లీష్ కొండ చిలువను తలపించే చీర?


14. ఈ చీర పేరు చెప్తేతెలుగు కోట గుర్తు వస్తుంది.


15. లోన లొటారం పైన పటారంలా ధ్వనించే చీర?


16. తెలుగులో పెన్ను ను గుర్తు చేసే చీర?


17. కాశ్మీర్ లో శాలువలతో పాటు ఈ చీరలు కూడా ప్రసిద్ధి.


18. జామకాయను గుర్తు చేసే చీర?


19. హిందీ జాగ్రత ఈ చీరలో వినిపిస్తుంది..


20. ఒకప్పటి రష్యా అధ్యక్షుడి పేరు ఈ చీరది..


21. లవణాన్ని స్ఫురింపచేసే ఈ చీర?


22. మన పక్క దేశం రాజధాని పేరు ఈ చీర..


23. మన దేశంలో ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం పేరు ఈ చీరది.

బుధవారం🪷* *🌷29, జనవరి, 2025🌷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🪷బుధవారం🪷*

*🌷29, జనవరి, 2025🌷*

    *దృగ్గణిత పంచాంగం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - కృష్ణపక్షం*


*తిథి     : అమావాస్య* సా 06.05 వరకు

*వారం  :బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : ఉత్తరాషాఢ* ఉ 08.20 వరకు ఉపరి *శ్రవణం*


*యోగం  : సిద్ధి* రా 09.22 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం : నాగ* సా 06.05 *కింస్తుఘ్న* రా 05.10 తె ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు* 

                 *-ఈరోజు లేవు-*

అమృత కాలం  : *రా 09.19 - 10.51*

అభిజిత్ కాలం  :  *ఈరోజు లేదు*


*వర్జ్యం             : మ 12.09 - 01.41*

*దుర్ముహూర్తం  : ప 11.58 - 12.43*

*రాహు కాలం   : మ 12.21 - 01.46*

గుళికకాళం       : *ఉ 10.55 - 12.21*

యమగండం     : *ఉ 08.04 - 09.30*

సూర్యరాశి : *మకరం* 

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 06.39*

సూర్యాస్తమయం :*సా 06.02*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.39 - 08.56*

సంగవ కాలం        :      *08.56 - 11.12*

మధ్యాహ్న కాలం    :      *11.12 - 01.29*

అపరాహ్న కాలం    : *మ 01.29 - 03.46*


*ఆబ్ధికం తిధి    :పుష్య అమావాస్య*

సాయంకాలం        :  *సా 03.46 - 06.02*

ప్రదోష కాలం         :  *సా 06.02 - 08.34*

రాత్రి కాలం            :  *రా 08.34 - 11.55*

నిశీధి కాలం          :*రా 11.55 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం:*తె 04.58- 05.48*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 *🪷శ్రీ సరస్వతి స్తోత్రం🪷*     

        *(అగస్త్య కృతం)*


*సరస్వతి నమస్తుభ్యం* 

*సర్వదేవి నమో నమః*

*శాంతరూపే శశిధరే* 

*సర్వయోగే నమో నమః* 


 *🌷ఓం సరస్వత్యై  నమః🌷* 


🌷🪷🌹🌷🛕🌷🌹🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

 🌹🌷🪷🪷🪷🪷🌷🌹

Panchaag


 

🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::

 🕉 108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::


     59వ దివ్యదేశము 🕉


🙏శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం 🙏


తిరువనంతపురం. ( Trivandrum). కేరళ.


💠 ప్రధాన దైవం పేరు : శ్రీ అనంత పద్మనాభస్వామి 

💠 ప్రధాన దేవత :శ్రీహరిలక్ష్మీతాయార్

💠 పుష్కరిణి : మత్స్య పుష్కరిణి 

💠 విమానం : హేమకూట విమానము .


🌀  స్థలపురాణం 🌀


💠అనంతునిపై శయనించిన పెరుమాళ్ నాభిలో చతుర్ముఖ బ్రహ్మతో , పద్మము యొక్క రేకుల వంటి నేత్రములతో మహా శోభాయమానముగా దర్శనమిచ్చు చుండుటచే అనంత పద్మనాభ స్వామిగా ప్రసిద్ధి నొందెను . 

పెరుమాళ్ మూర్తి నిడివి 18 అడుగులు .

 

💠 బిళ్వ మంగళ స్వామి అను ఒక నంబూద్రి బ్రాహ్మణుడు గొప్ప విష్ణుభక్తుడై యుండెను . అతని భక్తికి సంతసించిన శ్రీమన్నారాయణుడు అనంతశయన రూపము ప్రత్యక్షమునిచ్చెను.

అంతట ఆ బ్రాహ్మణుడు సంతోషాతిరేకమున ఏమయినా పెరుమాళ్ కు నివేదించ వలయునన్న తపనతో ఇటునటు చూచి , పచ్చి మామిడికాయలు కోసి పాత్ర ఏమియు లేక పోయినందు వలన ప్రక్కన ఉండిన ఒక కొబ్బరి చిప్ప పెంకులో ఆ ముక్కలనుంచి స్వామికి అర్పించెను .

 ఈ ఆలయమున ఇప్పటికినీ అది ఆచారముగా కొనసాగించుచున్నారు . 

కాని పచ్చి మామిడి కాయల ముక్కలను ఒక బంగారు కొబ్బరి చిప్పలో ఉంచి నివేదించుచున్నారు . నంబూద్రి బ్రాహ్మణులే ఈనాటికినీ సుప్రభాత సేవ చేయుదురు . 


💠 ఈ ఆలయంలోనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి.  అందరు సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి.


💠ఈ మధ్యనే ఈ దేవాలయం లోని నేలమాళిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. 


💠 అతి పెద్ద చెరువు పక్కన ఉండటం వలన ఆలయ సౌందర్యం రెట్టింపయ్యింది. ఈ చెరువును పద్మతీర్థం (తామరల కొలను) అంటారు. ఈ దేవాలయం పేరుమీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. ‘తిరు’ ‘అనంత’ ‘పురం’ అంటే ‘అనంతపద్మనాభునికి నెలవైన ప్రదేశం’ అని అర్థం.

 ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారుచేశారు. 

 

💠 నేపాల్‌లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది. ఈ విగ్రహానికి అభిషేకం చేయరు. కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు. 

 

💠ఇక్కడ భగవంతుడు మూడు ద్వారాల గుండా దర్శనమిస్తాడు. మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతికిందుగా ఉన్న శివుని ముఖం, రెండవ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ, ఉత్సవమూర్తులు, శ్రీదేవిభూదేవులు, మూడవ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాదపద్మాలు దర్శనమిస్తాయి.


🙏జై శ్రీమన్నారాయణ 🙏