శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం
సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః (11)
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ (12)
అర్జునా.. దుఃఖించనవసరం లేనివాళ్ళకోసం దుఃఖిస్తున్నావు. పైగా మహావివేకిలాగా మాట్లాడుతునావు. చచ్చిపోయినవాళ్ళ గురించికాని, బ్రతికున్నవాళ్ళ గురించి కాని వివేకులు శోకించరు. నీవూ నేనూ వీళ్ళంతా గతంలోనూ వున్నాము. భవిష్యత్తులో కూడా వుంటాము.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి