శు భో ద యం 🙏
తిరుపతి వైంకట కవుల అవధాన జైత్ర యాత్ర!
తిరుపతి వేంకట కవుల అవధాన జైత్ర యాత్ర సాగిన తీరు తెన్నులను వారీ పద్యంలో ఘనంగా వివరించారు. వినండి యిది మీకోసమే!!
ఉ:
""ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మెచ్చగ నిక్కినాము, స
న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియిమచినార, మె
వ్వానిని లెక్కపెట్టక నివారణ దిగ్విజయమ బొనర్చి ప్ర
జ్ఙా నిధులంచు పేరుగనినారము నీవలనన్ సరస్వతీ!!!
గజారోహణ సన్మానం చాలా విశిష్ట మైనది. వెళ్ళిన ప్రతి యాస్థానంలోను ఘన సన్మానములే! యిదంతా అమ్మా సరస్వతీ నీకృపవల్లనే నమ్మా అంటారు .యెంతవినయం!
కవిత్వం చెప్పటం యెంతకష్టం! అందులో ఆశువు మరీకష్టం!శ్రోతల మనోరంజకంగా, అర్ధవంతంగా ఆశువు చెప్పాలంటే యేమేమి చేయాలో తమనానారాజ సందర్శనంలో వివరించారు.
సీ: " చదువగావలె శబ్ద శాస్త్రాదికమ్మును
వీక్షింపగావలె విద్య లెల్ల;
చూడగావలె రాజచూడా మణుల సభల్
పొందగావలె మహా భోగములను;
తిరుగగావలె దేశ దేశాల వెంబడి
పడవలె పడరాని పాటులెల్ల;
వినగావలెను పూర్వ విద్వత్ చరిత్రముల్
దర్శింపవలెను ఛంధః ప్రశంస;
కవులు కవులన్న మాత్రాన కవులుగారు ,
్ఎంత భారమ్ము గలదొ కవీశ్వరులకు
యింత కృషి జరిపితే అతడు కవియౌతాడట!🙏🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷☝🏻
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి