15, మే 2025, గురువారం

మెదడు రోగాలు

 మెదడు రోగాలు - నివారణా యోగాలు . 

మెదడు చెడిపోవడానికి గల కారణాలు - 

* మత్తు పదార్దాలు ఎక్కువుగా సేవించడం వలన.

* మానసిక శ్రమ ఎక్కువుగా చేయడం వలన.

* ఎక్కువ ఆందోళన , భయం , ఒత్తిడికి గురి అవ్వడం వలన .

* సంవత్సరాల తరబడి తలకు, పాదాలకి నూనె రాయకపోవడం వలన.

* విరుద్ధమైన ఆహారపదార్ధాలు సేవించడం వలన.

* మధువు, మాంసం ఎక్కువ తీసుకొవడం వలన.

మొదలయిన కారణాల వలన మెదడుకు రక్తం తీసుకుని పోయే రక్తనాళాలు అస్వస్థత చెంది మెదడు వ్యాదులు సంక్రమిస్తాయి.

మెదడు వ్యాధుల లక్షణాలు - 

* ఏ పని చేయాలన్న ఉత్సాహం లేక పోవడం.

* తరచుగా తలనొప్పి రావడం.

* తలదిమ్ము,, తలతిప్పు కలగడం.

* జ్ఞాపకశక్తి తగ్గిపోవడం.

* అస్పష్టమైన భావాలు , ఆలోచనలు ఏర్పడటం .

* బుద్ధి మందగించడం.

* నరముల బలహీనత .

* పక్షవాతం రావడం . 

ఇటువంటి లక్షణాలు అన్ని మెదడు వ్యాధి సంబంధ లక్షణాలుగా పేర్కొనవచ్చు. 

నివారణా యోగాలు - 

మెదడు మోద్దుబారితే - 

* సునాముఖి ఆకు చూర్ణం పూటకు అర టీ స్పూన్ మోతాదుగా వెన్నతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి. 

* జాజికాయ చూర్ణం రెండు వేళ్ళకు వచ్చినంత రెండు పూటలా మంచినీళ్ళతో వాడాలి.

* తమలపాకు ల తాంబూలాన్ని రెండు పూటలా వేసుకోవాలి. 

మెదడు లొ అతివేడి అనుగుటకు - 

* ఆవనూనేలో ఉశిరిక పండ్లను ఒక వారం రోజుల పాటు నానబెట్టి తరువాత ఆ నూనేని తలకు మర్దన చేస్తూ ఉంటే మెదడులోని అతివేడి అనిగిపోతుంది.

* బాదం నూనెతో తలకు మర్దన చేసుకుంటూ ఉంటే తలలోని పోటు , వేడి , వికారం తగ్గిపోతాయి 

* పెద్ద బచ్చలి ఆకుని నూరి రెండు కనతలకు పట్టు వేస్తే వెంటనే తలలోని దుష్ట వేడిమి తగ్గిపోయి హయిగా నిద్ర పడుతుంది.

మెదడు శుభ్రపడటానికి - 

* గంజాయి ఆకుని నీడలో ఎండబెట్టి మెత్తటి చూర్ణంగా చేసుకొని కొద్దికొద్దిగా ముక్కు పోడుములాగా పీలుస్తూ ఉంటే మెదడు శుభ్రపడుతుంది.

మరింత విలువైన సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 

గమనిక -

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

.     కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

.          9885030034

కామెంట్‌లు లేవు: