శ్రీమద్భగవద్గీత: పదకొండవ అధ్యాయం
విశ్వరూపసందర్శనయోగం:అర్జున ఉవాచ
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసంఘైః
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః (26)
వక్త్రాణి తే త్వరమాణా విశంతి
దంష్ట్రాకరాలాని భయానకాని
కేచిద్విలగ్నా దశనాంతరేషు
సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః (27)
ఎంతోమంది రాజులతోపాటు ఈ ధృతరాష్ట్రుడి పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అలాగే మనపక్షానికి చెందిన ప్రముఖయోధులూ వాడికోరలతో భయంకరాలైన నీ నోళ్ళలోకి వడివడిగా ప్రవేశిస్తున్నారు. వాళ్ళలో కొంతమంది నీ పళ్ళసందులో ఇరుక్కుపోయి పొడి అయిపోతున్న తలలతో కనిపిస్తున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి